స్పెయిన్ ఆయిల్ కంపెనీని జాతీయ చేసిన అర్జెంటీనా

– “ఇప్పటి నుండి మన ఆయిల్ రెస్పోల్ కంపెనీ అమ్ముకునే కమోడిటీ గా ఉనికిని ముగించుకుని దేశ అభివృద్ధి కోసం మౌలిక సరుకుగా ఉపయోగపడుతుంది”      -అర్జెంటీనా పాలక పార్టీ పార్లమెంటు సభ్యుడు ఆగస్టిన్ రొస్సీ అర్జెంటీనాలో అతి పెద్ద ఆయిల్ కంపెనీ వై.పి.ఎఫ్ ను ప్రభుత్వం జాతీయ చేసింది. వాణిజ్య ఆంక్షలు విధిస్తామన్న యూరోపియన్ యూనియన్ హెచ్చరికలను పెడచెవిన పెడుతూ, అర్జెంటీనా పార్లమెంటు అత్యధిక మెజారిటీతో వై.పి.ఎఫ్ జాతీయ కరణను ఆమోదించింది. వై.పి.ఎఫ్ లో స్పెయిన్ బహుళజాతి…

క్లుప్తంగా… 02.05.2012

జాతీయం   రిలయన్స్ ని అధిగమించిన టాటా కన్సల్టెన్సీ బుధవారం షేర్ మార్కెట్లు ముగిసేనాటికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ (టి.సి.ఎస్) అత్యధిక విలువ గల కంపెనీగా అవతరించింది. ‘మార్కెట్ క్యాపిటలైజేషన్’ ప్రకారం ఇప్పుడు టి.సి.ఎస్ అతి పెద్ద కంపెనీ. గత అయియిదేళ్లుగా రిలయన్స్ కంపెనీ ఈ స్ధానంలో కొనసాగుతూ వచ్చింది. బుధవారం ట్రేడ్ ముగిసేనాటికి టి.సి.ఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రు. 2,48,116 కోట్లు కాగా, రిలయన్స్ మార్కెట్ క్యాప్ రు. 2,43,413 కోట్లు. బుధవారం ఆర్.ఐ.ఎల్…

సంక్షోభాల్లో సైతం పెట్టుబడిదారుల లాభాలకు కొదవలేదు

2008 ఆర్ధిక సంక్షోభం నుండి ప్రపంచం ఇంకా కోలుకోనే లేదు. సంక్షోభం పేరు చెప్పి ఓ పక్క కార్మికులు, ఉద్యోగుల వేతనాల్లో విపరీతమైన కోతలు విధిస్తుంటే మరో పక్క కంపెనీనీలు మాత్రం ఎప్పటిలాగా లాభాలు పోగేసుకుంటూనే ఉన్నాయి. బ్రిటన్ లోని టాప్ వెయ్యి మంది ధనికులు రికార్డు స్ధాయిలో 414 బిలియన్ పౌండ్లు కూడ బెట్టారని ‘ది డెయిలీ మోర్నింగ్ స్టార్’ పత్రిక నివేదించింది. ధనికుల సంపాదన పెరగడంతో పాటు, ధనికుల సంఖ్య కూడా పెరిగిందని పత్రిక…

స్విస్ ఖాతాల సమాచారం పొందడానికి నిబంధనలు సరళతరం

స్విస్ బ్యాంకుల్లో దొంగ సొమ్ము దాచిన భారతీయుల సమాచారం పొందడానికి ఇప్పటివరకూ ఉన్న నిబంధనలు మరింత సరళతరం అయ్యాయని భారత ప్రభుత్వం తెలియజేసింది. ‘బ్లాక్ మనీ’ పై భారత ప్రభుత్వం తలపెట్టిన పోరాటం తాజా పరిణామంతో ఊపందుకుంటుందని భావిస్తున్నట్లు ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. రహస్య ఖాతాలున్న వ్యక్తుల సమాచారం స్విస్ ప్రభుత్వం మనకు ఇవ్వడానికి ఇకనుండి పేరు, చిరునామా పూర్తిగా ఇవ్వకపోయినా ఫర్వాలేదనీ, సమీప సమాచారం ఇస్తే సరిపోయే విధంగా నిబంధనలు సడలించారనీ ప్రభుత్వం తెలిపింది.…

క్లుప్తంగా… 27.04.2012

ఇరాన్ అణు బాంబు కి సాక్ష్యం లేదు –పెనెట్టా ఇరాన్ ‘అణు బాంబు’ నిర్మిస్తోందని ఖచ్చితమైన సాక్ష్యం ఏదీ దొరకలేదని అమెరికా రక్షణ కార్యదర్శి లియోన్ పెనెట్టా అన్నాడని ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ తెలిపింది. “ఇరానియన్లు అణుబాంబు తయారీకి నిర్ణయించినట్లు నిర్ధిష్ట సమాచారం ఏదీ నా వద్ద లేదు” అని పెనెట్టా అన్నాడు. చిలీ రక్షణ మంత్రితో సమావేశం అయిన అనంతరం విలేఖరులతో పెనెట్టా మాట్లాడాడు. ఇరాన్ అణు బాంబుకి ప్రయత్నిస్తున్నదంటూ అమెరికా, యూరప్ లు ఒత్తిడి…

అవినీతి కేసులో బి.జె.పి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ దోషి -సి.బి.ఐ కోర్టు

బి.జె.పి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ ను అవినీతి కేసులో దోషిగా సి.బి.ఐ కోర్టు నిర్ధారించింది. తెహెల్కా పత్రిక నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో కంపెనీ ప్రతినిధులుగా నాటకమాడిన తెహెల్కా విలేఖరుల వద్ద నుండి లక్ష రూపాయల నోట్ల కట్లను తీసుకుంటూ బంగారు లక్ష్మణ్ వీడియో కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. 2001 లో జరిగిన ఈ సంఘటనలోని వీడియో దేశ వ్యాపితంగా అన్నీ చానెళ్లలోనూ ప్రసారం అయింది. పార్టీ కోసం చందా తీసుకున్నానని లక్ష్మణ్ అప్పట్లో వివరణ…

మాంద్యం (recession) లో స్పెయిన్

డబుల్ డీప్ రిసెషన్ జాబితాలో స్పెయిన్ కూడా చేరింది. 2012 మొదటి క్వార్టర్ లో స్పెయిన్ జి.డి.పి క్షీణించింది. 2011 చివరి క్వార్టర్ లో కూడా స్పెయిన్ జి.డి.పి తగ్గుదల నమోదు చేయడంతో స్పెయిన్ కూడా మాంద్యం లో ఉన్నట్లయింది. రెండు క్వార్టర్లు వరుసగా ప్రతికూల వృద్ధి నమోదు చేసినట్లయితే అలాంటి ఆర్ధిక వ్యవస్ధ గల దేశం మాంద్యం ఎదుర్కొంటున్నట్లుగా పరిగణిస్తారు. 2008 నాటి సుదీర్ఘ మాంద్యం నుండి కోలుకోక మునుపే రెండవ సారి రిసెషన్ లోకి…

బుద్ధిలేనితనం, అత్యాశ, నిర్లక్ష్యం… ఇవే ఆర్ధిక సంక్షోభాలకు కారణం -గీధనర్

బుద్ధిలేనితనం (stupidity), అత్యాశ (greed), నిర్లక్ష్యం (recklesness) వల్లనే ఆర్ధిక సంక్షోభాలు సంభవిస్తున్నాయని అమెరికా ట్రెజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ స్పష్టం చేశాడు. ఆర్ధిక ప్రమాదాలను అవలీలగా తీసుకోవడం తగదని హెచ్చరించాడు. మోసాలనూ, చట్టాల దుర్వినియోగాన్నీ అడ్డుకోవడానికి కఠినమైన చట్టాలు తప్పనిసరని గీధనర్ నొక్కి చెప్పాడు. పోర్ట్ లాండ్ సిటీ క్లబ్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గీధనర్ బుధవారం ఈ మాటలన్నాడు. వాల్ స్ట్రీట్ లోని బడా బడా ద్రవ్య కంపెనీలు లాభాల పేరాశతో ప్రమాదకరమైన…

క్లుప్తంగా… 26.04.2012

అంతర్జాతీయం హెచ్.ఎస్.బి.సి బ్యాంకు యు.కె శాఖల్లో 2,200 ఉద్యోగాలు రద్దు ఇంగ్లాండులో హెచ్.ఎస్.బి.సి బ్యాంకు మరో 2,200 ఉద్యోగాలు రద్దు చేసింది. వాస్తవంగా రద్దు చేసినవి 3,100 ఉద్యోగాలు కాగా, కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు పోను నికరంగా 2,217 ఉద్యోగాలు రద్దు చేసినట్లయింది. ఖర్చు తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఉద్యోగాలు రద్దు చేస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. హెచ్.ఎస్.బి.సి గత సంవత్సరం 7,000 ఉద్యోగాలు రద్దు చేసింది. 2013 లోపు ప్రపంచ వ్యాపితంగా 30,000 ఉద్యోగాలు రద్దు చేస్తానని…

‘డబుల్ డిప్ రిసెషన్’ లో ఇంగ్లండ్

ఇంగ్లండ్ ‘డబుల్ డీప్ రిసెషన్’ లోకి జారుకుంది. 2012 లో మొదటి క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) లో బ్రిటన్ జి.డి.పి (గ్రాస్ డోమెస్టిక్ ప్రోడక్ట్) 0.2 శాతం మేరకు కుదించుకుపోయింది. అంటే జి.డి.పి వృద్ధి చెందడానికి బదులు తగ్గిపోయింది. 2011 చివరి క్వార్టర్ లో (అక్టోబరు, నవంబరు, డిసెంబరు) ఇంగ్లండ్ జి.డి.పి 0.3 శాతం క్షీణించింది. వరుసగా రెండు క్వార్టర్ల పాటు నెగిటివ్ జి.డి.పి వృద్ధి నమోదయితే ఆ దేశం మాంద్యం (రిసెషన్) లో ఉన్నట్లు…

ఇండియా రేటింగ్ తగ్గించిన ఎస్&పి

స్టాండర్డ్ & పూర్ రేటింగ్ సంస్ధ ఇండియా రేటింగ్ ‘ఔట్ లుక్’ ని తగ్గించింది. ఇండియా అప్పు రేటింగ్ ఇప్పటివరకూ BBB+ గా ఉండగా ఇప్పుడు దానిని BBB- కి తగ్గించింది. BBB+ ‘స్ధిర’ (stable) రేటింగ్ ని సూచిస్తుంది. BBB- రేటింగు సమీప భవిష్యత్తులో రేటింగ్ మరింత తగ్గించే అవకాశం ఉందన్న హెచ్చరికను సూచిస్తుంది. ఎస్&పి కేటాయించే ఇన్వెస్ట్ మెంట్ గ్రేడ్లలో BBB- అత్యంత తక్కువ రేటింగ్. AAA, AA, A, BBB తర్వాత BBB-…

‘స్పామ్ ఈ మెయిల్స్’ లో ఇండియాదే అగ్ర స్ధానం

పనికిరాని ‘స్పామ్ ఈ మెయిల్స్’ పంపడంలో భారత దేశం అగ్ర స్ధానం ఆక్రమించిందని కంప్యూటర్ సెక్యూరిటీ సంస్ధ ‘సోఫోస్’ తెలిపింది. అమెరికాని రెండో స్ధానంలోకి నెట్టి భారత దేశం అగ్ర స్ధానానికి చేరిందని ఆ సంస్ధ తెలిపింది. అయితే ఇందులో భారతీయుల తప్పేమీ లేదు. మొదటిసారి ఇంటర్నెట్ వినియోగిస్తున్న భారతీయులకు ఈ మెయిల్ వినియోగంలో అనుభవం లేకపోవడమే దీనికి కారణమని ‘సోఫోస్’ తెలిపింది. సోఫోస్ సంస్ధ స్పామ్ మెయిళ్ళు అధికంగా వచ్చే కంప్యూటర్ల సంఖ్య ఆధారంగా వివిధ…

ఆరు నెలల్లో మరిన్ని సంస్కరణలు -ప్రధాని ఆర్ధిక సలహాదారు

వచ్చే ఆరునెలల్లో భారత దేశంలో ముఖ్యమైన ఆర్ధిక సంస్కరణలు  మరిన్ని అమలు  చేయనున్నామని ప్రధాని ప్రధాన ఆర్ధిక సలహాదారు కౌశిక్ బసు ప్రకటించాడు. 2014 వరకూ ‘బిగ్ టికెట్’ సంస్కరణలేవీ సాధ్యం కాదని ప్రకటించి రాజకీయ, ఆర్ధిక వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన కౌశిక్ బసు బి.జె.పి తో పాటు ప్రవేటు కంపెనీలు ఆందోళన వ్యక్తం చేయడంతో తన గొంతు సవరించుకున్నాడు. సబ్సిడీలను తగ్గించే చర్యలను ప్రభుత్వం చేపడుతుందని ఆయన సూచించాడు. డీజెల్ ధర్లపై నియంత్రణ, రిటైల్ రంగంలో…

ద్ర్యవ్యోల్బణం: హోల్ సేల్ 6.89%, రిటైల్ 9.47%

మార్చి నెలలో హోల్ సేల్ ధరలపై ఆధారపడి లెక్కించిన ద్రవ్యోల్బణం 6.89 శాతానికి తగ్గితే, రిటైల్ ధరలపై ఆధారపడి లెక్కించిన ద్రవ్యోల్బణం 9.47 శాతానికి పెరిగింది. రిటైల్ వ్యాపారులకి మాత్రమే అందుబాటులో ఉండే హోల్ సేల్ ధరలకీ, వినియోగదారులకి అందుబాటులో ఉండే రిటైల్ ధరలకీ ఉన్న వ్యత్యాసాన్ని ఈ గణాంకాలు ఎత్తి చూపుతున్నాయి. పాలు, కూరగాయలు, ప్రోటీన్ ఆధారిత ఆహార ఉత్పత్తులు, వంటనూనె ఉత్పత్తులు… వీటి ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిందని ప్రభుత్వ గణాంకాలను ఉటంకిస్తూ…

ఆర్.బి.ఐ వడ్డీ రేటు తగ్గింపు, గృహ ఆటో కార్పొరేట్ రుణాలు చౌక

భారత రిజర్వ్ బ్యాంకు తన స్వల్ప కాలిక వడ్డీ రేట్లను తగ్గించింది. ద్రవ్య విధానాన్ని సమీక్షిస్తూ ఆర్.బి.ఐ ఈ నిర్ణయం తీసుకుంది. 8.5 శాతంగా ఉన్న వడ్డీ రేటును 8 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు వల్ల ప్రధానంగా కార్పొరేటు కంపెనీలు లబ్ది పొందుతాయి. నూతన పెట్టుబడుల కోసం, కంపెనీలు వ్యాపారాల విస్తరణ కోసం బ్యాంకులు మరిన్ని రుణాలను సమకూరుస్తాయి. తద్వారా నెమ్మదించిన ఆర్ధిక వృద్ధిని వేగవంతం చేయాలన్నది ఆర్.బి.ఐ లక్ష్యం. గృహ రుణాలపై కూడా వడ్డీ…