ప్రపంచ ఆహార పంపిణీ వ్యవస్ధే రైతులకు నష్టాల్నీ పేదలకు ఆకలి చావుల్నీ సృష్టిస్తోంది -ఆక్స్‌ఫాం

ప్రపంచ దేశాల్లొ ప్రస్తుతం కొనసాగుతున్న ఆహార పంపిణీ వ్యవస్ధలే పేదల్ని ఆకలి చావులకు గురి చేస్తున్నదని చారిటీ సంస్ధ ఆక్స్‌ఫాం కుండ బద్దలు కొట్టింది. ప్రపంచ ఆహార వ్యవస్ధ కేవల కొద్దిమంది కోసమే పని చేస్తున్నదని, మిగిలిన వారందరికీ అది విఫల వ్యవస్ధగా మారిందనీ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆక్స్‌ఫాం పేర్కొంది. ప్రపంచ ఆహార పంపిణీ వ్యవస్ధ, ఆహారాన్ని వినియోగించే బిలియన్ల మంది ప్రజలకు తాము ఏమి కొంటున్నదీ, ఏమి తింటున్నదీ అన్న అంశాలపై సరిపోయినంత…

చైనా కరెన్సీ యువాన్ విలువపై మాట మార్చిన అమెరికా ట్రెజరీ

చైనా తన కరెన్సీ యువాన్ విలువను కృత్రిమంగా తక్కువ స్ధాయిలో ఉంచుతున్నదంటూ గత రెండు, మూడు సంవత్సరాలనుండీ వాదిస్తూ వచ్చిన అమెరిక ట్రెజరీ డిపార్టుమెంటు ఇప్పుడు “అబ్బే, అదేం లేదు” అంటోంది. యువాన్ విలువ అమెరికా, చైనాల మధ్య ఒక వివాదాంశంగా చాలాకాలం నుండి ఉంది. ముఖ్యంగా గత రెండు, మూడు సంవత్సరాల నుండి, ఇంకా చెప్పాలంటే ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తలెత్తినప్పటి నుండి యువాన్ విలువను తగ్గించాలని అమెరికా, ఐరోపా దేశాలతో పాటు ఇండియా, జపాన్‌లు…

ద్వవ్యోల్బణం అరికట్టే పేరుతో లక్షల కుటుంబాల జీవనోపాధికి ప్రభుత్వం ఎసరు

అనుకున్నదే జరగబోతోంది. భారత దేశంలోని లక్షల కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీయడానికి భారత ప్రభుత్వం రెండో అడుగు వేసింది. ద్రవ్యోల్బణాన్ని అరి కట్టడమే తమ ప్రధమ కర్తవ్యం అంటూ రెండేళ్ళనుండి ఆందోళన వ్యక్తం జేస్తూ కూడా ఆ దిశలో ఏ చర్యా తీసుకోని ప్రభుత్వం ఇప్పుడు తన ఆందోళన వెనక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని బైటపెట్టుకుంది. ప్రధాన మంత్రి ఆర్ధిక సలహాదారుల బృందానికి అధిపతి అయిన కౌశిక్ బసు శుక్రవారం ప్రభుత్వ ఉద్దేశ్యాలను మెల్లగా బైటపెట్టాడు. భారత దేశ…

ఐ.ఎం.ఎఫ్ పదవికి దేశం కాదు, ఏకాభిప్రాయమే ప్రాతిపదిక -ఇండియా

ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ప్రతిభ, ఏకాభిప్రాయమే ప్రాతిపదికగా ఉండాలి తప్ప జాతీయత, దేశం కాదని ఇండియా ప్రకటించింది. యూరోపియన్ దేశం నుండి మాత్రమే ఆ పదవికి ఎన్నుకోవాలని యూరోపియన్ యూనియన్ ప్రకటించడం పట్ల ఇండియా తో పాటు ఇతర బ్రిక్స్ దేశాలైన చైనా, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. ఫ్రాన్సు ఆర్ధిక మంత్రి క్రిస్టీన్ లాగార్డే తాను ఐ.ఎం.ఎఫ్ అత్యున్నత పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇ.యు ఆమెకు పూర్తి…

ఐ.ఎం.ఎఫ్ పదవికోసం పశ్చిమ దేశాలు, బ్రిక్స్ దేశాలకు మధ్య పోటీ

ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న డొమినిక్ స్ట్రాస్ కాన్ లైంగిక ఆరోపణలతో పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడా పదవి కోసం పశ్చిమ దేశాలూ, ఎమర్జింగ్ దేశాలూ పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా బ్రిక్స్ (BRICS) గ్రూపుకి చెందిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ అఫ్రికా దేశాలు ఈసారి ఎమర్జింగ్ దేశాలకు చెందినవారిని ఐ.ఎంఎఫ్ పదవికి నియమించాలని కోరుతున్నాయి. కానీ యూరప్ అప్పు సంక్షోభంలో మరిన్ని దేశాలు జారిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్నందున, సంక్షోభాన్ని సమర్ధవంతంగా…

యూరోజోన్ సంక్షొభం భయాలతో కుప్పకూలిన భారత షేర్‌మార్కెట్లు

యూరప్ అప్పు సంక్షోభం భయాలు విస్తరించడంతో ప్రపంచ వ్యాపితంగా సోమవారం నాడు షేర్ మార్కెట్లు వణికిపోతున్నాయి. భారత షేర్ మార్కెట్లు దాదాపు రెండు శాతం నష్టపోయాయి. గ్రీసు అప్పు రేటింగ్‌ను ఫిచ్ రేటింగ్ సంస్ధ బాగా తగ్గించడం, ఇటలీ అప్పు రేటింగ్‌ను ఎస్ & పి రేటీంగ్ సంస్ధ నెగిటివ్ కి తగ్గించడంతో షేర్ మార్కెట్లలో అమ్మకాల వత్తిడి పెరిగింది. రేటింగ్ సంస్ధల చర్యలతో యూరో విలువ తగ్గింది. ఇప్పటికే గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ దేశాలు అప్పు…

అమెరికా అప్పు ఎంతో తెలుసా?

ప్రపంచం లోని దేశాలన్నింటికంటే అమెరికాకి అప్పు ఎక్కువ ఉందని బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఆ అప్పు ఇంత అని అంకెల్లో చెప్పేయడం కంటే వివిధ కోణాల్లో వివిధ అంశాలతో పోల్చి చూస్తే దాని పరిణామం ఇంకా బాగా అర్ధం అయ్యే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ 1,000 డాలర్ల బిల్లుల్ని ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ పోతే అది 67 మైళ్ళ ఎత్తు ఉంటుందని అంచనా వేశాడు. అప్పట్లో అది ఫేమస్ పోలిక.…

పొదుపు చర్యలపై ఈజిప్టు తరహాలో ఉద్యమిస్తున్న స్పెయిన్ యువత

ఇప్పటికే మూడు దేశాలను, గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్, బలితీసుకున్న యూరప్ అప్పు సంక్షోభం స్పెయిన్‌ను అతలాకుతలం చేస్తోంది. బడ్జెట్ లోటు తగ్గించడానికి స్పెయిన్ ప్రభుత్వం వరుసగా ప్రవేశపెడుతున్న పొదుపు చర్యలు స్పెయిన్ ప్రజలను వీదులపాలు చేస్తున్నది. యూరోపియన్ యూనియన్‌లోనే అత్యధికంగా స్పెయిన్‌లో 21.3 శాతం నిరుద్యోగం ఉంది. పొదుపు విధానాల పుణ్యమాని ఇది ఇంకా పెరుగుతోంది. యువతలో నూటికి 45 మంది నిరుద్యోగులుగా ఉన్నారు. పరిస్ధితి ఇలా ఉంటే ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును పెంచి నిరుద్యోగుల…

ఎంత పేదరికం ఉంటే పేదలైనట్లు?

భారత దేశంలో పేదలుగా పరిగణింపబడడానికి ఎంత పేదరికం ఉండాలి? ఈ ప్రశ్నకి సాధారణంగా ఎవరైనా చెప్పే సమాధానం, ఉండటానికి ఇల్లు, కడుపునిండా తిండి, వైద్యం చేయించుకోగల స్తోమత, గౌరవనీయంగా కనపడడానికి అవసరమైన బట్టి లేని వారు పేదవారని. కాని మార్కెట్ ఎకానమీ మిత్రుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా నాయకత్వంలోని ప్రణాళికా సంఘం దృష్టిలో భారత దేశంలోని పేదల లక్షణాలు అంతకంటే ఘోరంగా ఉండాలి. భారత దేశంలో ఇప్పటికీ అనేక మంది ఆకలి బారినపడి చనిపోతున్నారు. మలేరియా లాంటి…

పాకిస్ధాన్‌కి 50 ఫైటర్ జెట్స్ సరఫరాకు చైనా అంగీకారం

పాకిస్ధాన్ కు గతంలో హామీ ఇచ్చిన దాని కంటే ఎక్కువ ఫైటర్ జెట్లను సరఫరా చేయడానికి చైనా అంగీకరించినట్లు తెలుస్తోంది. పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలాని ప్రస్తుతం చైనా పర్యటిస్తున్న సంగతి విదితమే. లాడెన్ ను అబ్బోత్తాబాద్ లో అమెరికా కమెండోలు చంపిన తర్వాత పాక్ అమెరికా ల మధ్య సంబంధాలు బెడిసి కొట్టినట్లు పత్రికలు కోడై కూస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే అమెరికా కాకుంటే తమకు చైనా మిత్ర దేశం అండగా ఉండగలదన్న సూచనలు ఇవ్వడానికి…

అమెరికా ఇప్పుడు టాప్‌లో ఉన్న 1 శాతం ధనికులదే -నోబెల్ గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్జ్ -2

అమెరికాలో పెరుగుతున్న అసమానతలను పూర్తిగా ఎలా వివరించాలో ఆర్ధిక పండితులకు అర్ధం కావడం లేదు. సరఫరా డిమాండ్ లకు సంబంధించిన సాధారణ అంశాలు పని చేశాయన్నది నిజమే. శ్రామికులు అవసరంలేని సాంకేతిక పరిజ్ఞానం “మంచి” మధ్యతరగతి వారికి, బ్లూ కాలర్ ఉద్యోగాలకు ఉన్న డిమాండ్‌ను బాగా తగ్గించివేశాయి. ప్రపంచీకరణ ప్రపంచ వ్యాపిత మార్కెట్ ను సాధ్యం చేసింది. ఫలితంగా అమెరికాలోని ఖరీదైన నైపుణ్య రహిత కార్మికుల బదులు తక్కువ వేతనాలకు లభ్యమయ్యే విదేశీ నైపుణ్య రహిత కార్మికులు…

అమెరికా ఇప్పుడు టాప్‌లో ఉన్న 1 శాతం ధనికులదే -నోబెల్ గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్జ్ -1

“Of the 1%, by the 1%, for the 1%” ఇది ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన అమెరికా ఆర్ధిక శాస్త్రవేత్త జోసెఫ్ స్టిగ్లిట్జ్ అమెరికా ప్రజల ఆర్ధిక స్ధితిగతులను వివరిస్తూ రాసిన వ్యాసానికి పెట్టిన హెడ్డింగ్. “డెమొక్రసీ ఆఫ్ ది ప్యూపుల్, బై ది ప్యూపుల్, ఫర్ ది ప్యూపుల్” అంటూ ప్రజాస్వామ్యాన్ని నిర్వచించిన దేశంలోని సంపద, ఆదాయాలు రెండూ అత్యున్నత స్ధానంలో ఉన్న ఒక శాతానికి మాత్రమే చేరుతున్నాయనీ, మధ్య తరగతివారు…

ఇండియాలో దరిద్రుల సంఖ్య లెక్కింపుకు ప్రభుత్వ నిర్ణయం

భారత దేశంలోని 120 కోట్లమంది ప్రజల్లో దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నవారు ఎంతమంది? ఈ ప్రశ్నకు అనేక జవాబులు ఉన్నాయి. ప్రభుత్వం 37 శాతం మంది దరిద్రులని చెబుతుంటే స్వతంత్ర అధ్యయనాల్లో ఒకటి 77 శాతం అని తెలిపింది. ఓ వ్యక్తి దరిద్రంలో ఉన్నాడు అని నిర్ధారించడానికి ఏర్పరిచిన ప్రాతిపదికల వలన ఇన్ని తేడాలు. ప్రభుత్వాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి జీవనాధారాలు కల్పించి వారి పరిస్ధితులను మెరుగుపరచడం ద్వారా దరిద్రుల సంఖ్యని తగ్గించడానికి బదులు…

భూకంపం దెబ్బకి మళ్ళీ ఆర్ధిక మాంద్యంలోకి జారుకున్న జపాన్

ఊహించినంతా జరిగింది. సంవత్సరాలపాటు డిఫ్లేషన్‌తో తీసుకున్న జపాన్ ఆర్ధిక వ్యవస్ధ భూకంపం, సునామిల ధాటికి మరోసారి ఆర్ధిక మాంద్యం (రిసెషన్) లోకి జారిపోయింది. వినియోగదారుల డిమాండ్ ఘోరంగా పడిపోవడం, రేడియేషన్ భయాలతో ఎగుమతులు కూడా పడిపోవడంతో ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ అయిన జపాన్ జిడిపి కుచించుకుపోయింది. ఆర్ధిక నియమాల ప్రకారం వరుసగా రెండు క్వార్టర్ల పాటు జిడిపి తగ్గుదల నమోదు చేసినట్లయితే ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ రిసెషన్ ఎదుర్కొంటున్నట్లు…

కటకటాల కాన్

డొమినిక్ స్ట్రాస్ కాన్. మొన్నటివరకూ సంక్షోభాల్లో ఉన్న అర్ధిక వ్యవస్ధలకు బిలియన్ల డాలర్ల అప్పుల సాయం ఇవ్వడానికి నిర్ణయాలు తీసుకోగలిగిన శక్తివంతుడు. ప్రపంచ ఆర్ధిక సంక్షొభం పరిష్కారానికి జి-20 దేశాల కూటమితో కలిసి నిరంతరం కృషి చేసి సంక్షోభంలో ఉన్న మహా మహా దేశాలను ఓ ఒడ్డుకి చేర్చడానికి దోహద పడిన మేధావి. చైనా కరెన్సీ యువాన్ విలువ పెంచాల్సిందేనని ఒత్తిడి తెచ్చి పశ్చిమ దేశాల వాదనలకు దన్నుగా నిలబడిన ధ్వజ స్తంభం. అప్పు సంక్షోభంలో కూరుకుపోయిన…