ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు గ్రీసు ప్రజలపై రుద్దుతున్న పొదుపు చర్యలు ఇవే

గత బుధవారం ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు గ్రీసుకు రెండవ బెయిలౌట్ ప్యాకేజి ఇవ్వడానికి అంగీకారం కుదిరినట్లు ప్రకటించాయి. అందుకు ప్రతిగా గ్రీసు కఠినమైన పొదుపు విధానాలను అమలు చేయాల్సిందేనని షరతు విధించాయి. తాను అమలు చేయనున్న పొదుపు చర్యలను గ్రీసు ఇప్పటికే సిద్ధం చేసుకుంది. వీటిని రానున్న బుధ, గురువారాల్లో గ్రీసు పార్లమెంటు ఆమోదించాలి. ఐతే ఐర్లండు, పోర్చుగల్ దేశాల మాదిరిగా గ్రీసు ప్రతిపక్షాలు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పొదుపు చర్యలకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించాయి. ప్రతిపక్షాలే కాదు,…

యూరప్‌లో విస్తరిస్తున్న చైనా ప్రాబల్యం

యూరప్‌లో చైనా వ్యాపారాలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఆఫ్రికా, లాటిన్ అమెరికా లలో విస్తారమైన సహజ వనరులను వెలిలి తీయడంలోనూ, వెలికి తీసిన వనరులలో అధిక భాగాన్ని చైనాకి తరలించుకు వెళ్ళడంలోనూ చైనా చురుకుగా వ్యవహరిస్తోంది. అలాగే యూరప్‌లో సైతం చైనా తన ప్రాబల్యాన్ని విస్తరించుకుంటోంది. చైనా కంపెనీలు యూరప్‌లో కార్యకలాపాలను నిర్వహించడం పెరిగింది. చైనా వద్ద అత్యధిక మొత్తంలో నిలవ ఉన్న విదేశీమారక ద్రవ్యం తమ దేశాల్లో పెట్టుబడిగా పెట్టాలని ఇంగ్లండ్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు…

గ్రీసు బెయిలౌట్‌తో పట్టపగ్గాలు లేని ఇండియా షేర్‌మార్కెట్లు

అప్పు సంక్షోభంతో సతమతమవుతున్న గ్రీసు దేశానికి రెండో బెయిలౌట్ ఇవ్వనున్నట్లు ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ప్రకటించడంతో భారత షేర్ మార్కెట్లకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. బి.ఎస్.ఇ సెన్సెక్స్, ఎన్.ఎస్.ఇ నిఫ్టీలు ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా మూడు శాతం వరకూ లాభాలను నమోదు చేశాయి. అమెరికా ఆర్ధిక వృద్ధి నెమ్మదించడం, యూరప్ అప్పు సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతుండడంతో ప్రపంచ వ్యాపితంగా మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది. ఇండియా ఫ్యాక్టరీ ఉత్పత్తి ఏప్రిల్ నెలలో మందగించినట్లు…

గ్రీసు రెండో బెయిలౌట్‌కి ఇ.యు+ఐ.ఎం.ఎఫ్ అంగీకారం, గ్రీకులపై నడ్డి విరిగే భారం

“ఎద్దు పుండు కాకికి ముద్దు” అని సామెత. గ్రీసు అప్పు సంక్షోభం యూరప్‌లోని ధనిక దేశాల ప్రైవేటు బహుళజాతి గుత్త సంస్ధలకు సిరులు కురిపించబోతోంది. అదే సమయంలో గ్రీసు ప్రజలకు “పెనం మీదినుండి పొయ్యిలోకి జారిన” పరిస్ధితి దాపురిస్తోంది. గ్రీసు మరిన్ని పొదుపు చర్యలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, లేనట్లయితే రెండో బెయిలౌట్ ప్యాకేజి ఇచ్చేది లేదని నెలరోజుల నుండి బెదిరిస్తూ వచ్చిన ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు తాము కోరింది సాధించుకుని రెండో బెయిలౌట్‌ ఇవ్వడానికి…

గూగుల్‌పై యాంటీ-ట్రస్ట్ కేసు నమోదు చేస్తాం -అమెరికా ఎఫ్.టి.సి

యాంటీట్రస్ట్ చట్టం కింద గూగుల్ నేరానికి పాల్పడినట్లుగా అమెరికా “ఫెడరల్ ట్రేడ్ కమిషన్” భావిస్తోంది. ఈ చట్టం కింద గూగుల్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించడానికి నిర్ణయించినట్లు ఎఫ్.టి.సి తెలిపింది. మరికొద్ది రోజుల్లో గూగుల్‌కి కోర్టు ఆర్డర్లు అందనున్నాయి. తన సెర్చి ఇంజన్ వ్యాపారం ద్వారా తన వెబ్‌సైట్లకు, తాను అందిస్తున్న ఇంటర్నెట్ సేవలకు వినియోగదారులను ఆకర్షిస్తున్నదని గూగుల్ పై అనేక ఇంటర్నెట్ సంస్ధలు చాలా కాలం నుండి ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఆరోపణల నేపధ్యంలో…

సంక్షుభిత యూరోజోన్ దేశాల జాబితాలో నెదర్లాండ్స్ -ఐ.ఎం.ఎఫ్

యూరోజోన్ లోని బలహీన దేశాలు తీవ్ర అప్పు సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నాయి. గ్రీసు, ఐర్లండులు గత సంవత్సరమే సంక్షోభంలో ఉన్నట్లు తేలిపోగా, ఈ సంవత్సరం పోర్చుగల్ కూడా సంక్షోభ దేశంగా బైటపడి, ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లనుండి బెయిలౌట్ ప్యాకేజి పొందింది. పోర్చుగల్ తర్వాత స్పెయిన్, ఇటలీ దేశాలు తదుపరి సంక్షోభ దేశాలుగా మార్కెట్ పండితులు అంచనా వేస్తుండగా, ఈ జాబితాకి తాజాగా నెదర్లాండ్స్‌ను కూడా ఐ.ఎం.ఎఫ్ జత చేసింది. స్పెయిన్, ఇటలీలు గ్రీసు, ఐర్లండ్, పోర్చుగల్‌లతో పోలిస్తే…

గ్లోబల్ ఆయిల్ ధరల తగ్గుదల ప్రజలకు అందకుండా అడ్డుపడుతున్న భారత ప్రభుత్వం

భారత ప్రభుత్వం సంవత్సరం క్రితం పెట్రోల్ ధరలను డీకంట్రోల్ చేసింది. అంటే పెట్రోల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణను ఎత్తివేసింది. ఫలితంగా గ్లోబల్ మార్కెట్‌లో ఆయిల్ ధరలు పెరిగినప్పుడల్లా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. డీకంట్రోల్ చేశాక ఇప్పటివరకు పెట్రోల్ ధర 23 శాతం పెరిగింది. ప్రభుత్వం ఇంతకుముందు సబ్సిడీ రూపంలో ఆయిల్ ధరలో కొంత భారం భరించడం వలన ప్రజలకు ప్రభుత్వం భరించినంతమేరకు తక్కువ ధరకు ప్రజలకు ఆయిల్ లభించేది. నిజానికి పెట్రోల్‌ను దిగుమతి ధరలకే ప్రజలకు ఇచ్చినట్లయితే…

చైనా ఫ్యాక్టరీ సెక్టార్‌లో అభివృద్ధి ముందుకు సాగడం లేదు

చైనా ఫ్యాక్టరీ రంగ అభివృద్ధి కుంటుబడిందని పి.ఎమ్.ఐ సర్వేలో తేలింది. పర్ఛేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ను (Purchasing Managers’ Index) కుదించి పి.ఎం.ఐ గా పిలుస్తారు. ఈ ఇండెక్స్‌లో 50 ఉన్నట్లయితే అటు అభివృద్ధి గానీ ఇటు తిరోభివృద్ధి (contraction) గానీ ఏమీ లేదని భావిస్తారు. 50 కంటె ఎక్కువగా ఉన్నట్లయితే అది విస్తరణ లేదా అభివృద్ధిగా భావిస్తారు. అంతకంటే తక్కువగా ఉన్నట్లయితే ఆ రంగం కుచించుకు పోతున్నట్లుగా లేదా తిరోభివృద్ధిని నమోదు చేస్తున్నట్లుగా భావిస్తారు. గురువారం…

మౌలిక కారణాల వల్లనే ఆహార ధరలు పెరుగుతున్నాయ్! -ఆర్.బి.ఐ

గత మూడు, నాలుగు సంవత్సరాలుగా ఆహార ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. తాజాగా జూన్ 11 తేదీతో ముగిసే సంవత్సరంలో ఆహార ధరల సూచిక 9.13 శాతానికీ, ఇంధన ధరలు 12.84 శాతానికీ పెరిగాయి. దానికి కారణాలు చెప్పమంటే వర్షాలు కురవక అని ఒక సారీ, సరఫరా ఆటంకాల వలన అని ఇంకొకసారీ, డిమాండ్ సైడ్ ఫ్యాక్టర్స్ అని మరొక సారీ అని చెబుతూ వచ్చారు. ముఖ్యంగా భారత దేశ ఆర్ధిక పండితులు, మంత్రులు ఈవిధంగా…

సింగూరు భూమి పునః స్వాధీనంపై కోర్టుకెళ్తాం -టాటా మోటార్స్

లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ సుదీర్ఘ పాలనకు చరమగీతం పాడి అధికారంలోకి వచ్చిన త్రిణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల కూటమి సింగూరు భూమిని తిరిగి రైతులకు ఇచ్చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసింది. చెప్పినట్లుగానే సింగూరులో రైతులనుండి బలవంతంగా సేకరించిన భూమిని తిరిగి రైతులకు స్వాధీనం చేయడానికి వీలుగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి చట్టం కూడా ఆమోదించింది. అయితే లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ద్వారా సింగూరు భూమిని వశం చేసుకున్న టాటా మోటార్స్ సంస్ధ…

అమెరికా, గ్రీసు దేశాలు సమయానికి అప్పు చెల్లించలేక పోవచ్చు -ఫిచ్ రేటింగ్స్

అమెరికా, గ్రీసు దేశాల అప్పు చెల్లింపుల సామర్ధ్యం పైన ఫిచ్ రేటింగ్స్ సంస్ధ మరొకసారి ఆందోళన వ్యక్తం చేసింది. ఆగస్టు నెలలో రెండు దేశాలు తాము జారీ చేసిన సావరిన్ అప్పు బాండ్లపై వడ్డీ చెల్లింపులతో పాటు కొన్నింటికి మెచ్యూరిటీ చెల్లింపులు చేయవలసి ఉంది. అమెరికా అప్పుపై ఉన్న గరిష్ట పరిమితికి ఇప్పటికే చేరుకున్నందునా, గ్రీసు మరో విడత పొదుపు బడ్జెట్‌ను ప్రజల తీవ్ర వ్యతిరేకత వలన ఆమోదించలేక పోతున్నందున ఐ.ఎం.ఎఫ్, ఇ.యులు ఆ దేశానికి ఇవ్వవలసిన…

మారిషస్, ఐ.టి రేటింగ్ లతో నాలుగు నెలల కనిష్ట స్ధాయికి చేరిన ఇండియా షేర్ మార్కెట్లు

సోమవారం ఇండియా షేర్ మార్కెట్లు రెండు శాతం పైగా పతనమైనాయి. మారిషస్‌తొ పన్నుల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం సమీక్షనున్నదన్న భయాలు, ఇండియా ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగం రేటింగ్‌ని తగ్గించడం షేర్ల పతనానికి కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా మారిందని కూడా వీరు భావిస్తున్నారు. సోమవారం పతనంతో భారత్ షేర్ మార్కెట్లు కొన్నాళ్ళపాటు కోలుకోవడం కష్టమనీ, సెంటిమెంట్ బలహీనపడ్డం వలన మరింత పతనం చవిచూడనున్నాయని కొందరు విశ్లేషకులు భావిస్తుండగా, మరికొందరు సోమవారం నాటి భారీ పతనాన్ని…

మెరుగైన సేవలు కావాలంటే ప్రైవేటు కంపెనీలకి పట్టణ ప్రజలు మరింత చెల్లించుకోవాల్సిందే -కేంద్ర మంత్రి

భారత దేశ ప్రజలకు ఇప్పటివరకూ అన్నీ ఉచితంగా వాడుకోవడం అలవాటయ్యిందనీ, కానీ రోడ్లు, నీరు, విద్యుత్ లాంటి సేవలు మెరుగుపడాలంటే మరింతగా చెల్లించడానికి సిద్ధమైతే తప్ప సాధ్యం కాదనీ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కమల్ నాధ్ తెగేసి చెబుతున్నాడు. రాయిటర్స్ వార్తా సంస్ధకి నాలుగు రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పట్టణాల్లొ సేవలను మెరుగుపరచడం కోసం ఇప్పటివరకూ ప్రభుత్వం ఒక్కటే బాధ్యత తీసుకున్నదనీ, ఇకనుండి ప్రైవేటు కంపెనీలకు పట్టణాల్లో మౌలిక సౌకర్యాల నిర్మాణానికి భాగస్వామ్యం…

న్యాయ సలహాలను పెడచెవిన పెట్టి లిబియా యుద్ధానికి దిగిన ఒబామా

తనను అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైన్యాన్ని వెనక్కి రప్పిస్తానని వాగ్దానం చేసి అధికారానికి వచ్చిన ఒబామా ఆఫ్ఘనిస్ధాన్‌కి మరింతమంది సైనికుల్ని పంపడమే కాకుండా, కొత్తగా లిబియా యుద్ధానికి గూడా తెగబడ్దాడు. ఈ రెండు చర్యలతో ఒబామా అమెరికా ప్రజల్ని ఘోరంగా మోసం చేశాడు. అయితే ఆయన ప్రజల్ని మోసం చేయడమే కాకుండా అమెరికా చట్టాల్ని కూడా ఉల్లంఘించి లిబియాపై యుద్ధం కొనసాగిస్తున్నాడని అమెరికా కాంగ్రెస్ సభ్యులు అనేకులు, ప్రతినిధుల సభలోని రిపబ్లికన్ పార్టీ నాయకుడు…

మహిళలకు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో పాక్ మూడోది, ఇండియా నాలుగోది

ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలు ఏవి? రాయిటర్స్ వార్తా సంస్ధ అనుబంధంగా ఉండే ట్రస్ట్‌లా అనే సంస్ధ ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడానికి సర్వే చేసింది. ఇది అవినీతి వ్యతిరేక అంశాలు (anti-corruption issues), సమర్ధ పాలన (good governance), మహిళల హక్కుల (women rights) అంశాలపై ప్రపంచ స్ధాయిలో ఉచితంగా వార్తలు, సమాచారం, న్యాయ సలహాలు అందించే సంస్ధ. ధామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ దీన్ని నడుపుతోంది. మహిళలకు సంబంధించిన ఆరు అంశాలపై ఇది ప్రపంచ…