కేంద్రానికి సుప్రీం కోర్టు ఝలక్, నల్లడబ్బు విచారణ పర్యవేక్షణకు ‘సిట్’ నియామకం

సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి గట్టి సవాలే విసిరింది. నల్ల డబ్బు వెలికి తీయడానికి కేంద్రం నియమించిన ‘హై లెవల్ కమిటీ’ (హెచ్.ఎల్.సి) పై పర్యవేక్షణకు “స్పెషల్ ఇన్‌వెష్టిగేషన్ టీం” (ఎస్.ఐ.టి – సిట్) ని ఏర్పాటు చేసింది. సుప్రీం నియమించిన సిట్ కు ఛైర్మన్‌గా రిటైరైన జస్టిస్ బి.పి.జీవన్ రెడ్డిని నియమించింది. డిప్యుటీ ఛైర్మన్ గా మరొక రిటైర్డ్ జస్టిస్ ఎం.బి.షా ను నియమించింది. ప్రభుత్వం నియమించిన హెచ్.ఎల్.సి ఇకనుండి సిట్ లో భాగంగా పనిచేస్తుంది.…

అమెరికాలో ఆరు బ్యాంకుల అధికారులకు చెల్లించిన జీతాలూ, బోనస్ ల మొత్తం కాన్సాస్ రాష్ట్ర జీడీపీ కి సమానం

అమెరికాలో ఫైనాన్స్ సంస్ధలు దోపిడీకి పెట్టింది పేరు. వాళ్ళు ఎన్ని నేరాలు చేసినా అది అమెరికా ఆర్ధిక వృద్ధి కోసమే. వాళ్ళవలన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించి అమెరికా, యూరప్ లు అతలాకుతలమైనా అది ప్రపంచ ఆర్ధిక వృద్ధికీ, ప్రపంచ ప్రజల సంతోషం కోసమే. ప్రపంచ ప్రజల సంతోషం కోసం అహోరాత్రాలూ కష్టపడుతున్న బ్యాంకు ఎగ్జిక్యూటివ్ సిబ్బంధికి బ్యాంకులు ఇచ్చే జీతాలూ, బోనస్^లూ, వివిధ సదుపాయాల మొత్తం ఎంతో రాయిటర్స్ సంస్ధ లెక్కేసింది. వాల్ స్ట్రీట్ బ్యాంకుల్లో…

ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్‌లకు ఇరాన్ ఆయుధాల సరఫరా -అమెరికా

ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్‌లలో అమెరికా సైనికులపై పోరాటం చేస్తున్న వారికి ఇరాన్‌కి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ (ఐ.ఆర్.జి.సి) ఆయుధాలు, మందుగుండు సరఫరా చేస్తున్నదని అమెరికా శనివారం వెల్లడించింది. ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లనుండి అమెరికా సేనలు త్వరగా వెళ్ళిపోవడానికి ఇరాన్ ఈ విధంగా చేస్తున్నదని అమెరికా అధికారులు చెప్పారు. అయితే ఇరాన్ ఈ సమాచారాన్ని కొట్టిపారేసింది. అమెరికా సైనికులను సుదీర్ఘకాలం పాటు ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లలో కొనసాగించాలని, అమెరికా భావిస్తోంది. దానికోసమే ఇరాన్‌పై ఇలాంటి కధలు ప్రచారం…

ఇండియా విదేశీ మారక ద్రవ్య నిల్వలు $309.02 బిలియన్లు

భారత దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు జూన్ 24 తో ముగిసిన వారంలో అంతకు ముందు వారం కంటె తగ్గిపోయాయని రిజర్వు బ్యాంకు తెలిపింది. జూన్ 17 నాటికి భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు 310.562 బిలియన్ డాలర్లు ఉండగా జూన్ 24 నాటికి 309.020 బిలియన్ డాలర్లకు తగ్గాయని ఆర్.బి.ఐ శుక్రవారం తెలిపింది. విదేశీ మారక ద్రవ్యంలో ఐ.ఎం.ఎఫ్ లో ఇండియాకు ఉండే ఎస్.డి.ఆర్ హోల్డింగ్స్ కూడా కలిసి ఉంటాయి. విదేశీ మారక…

అమెరికా ఒత్తిడి ఫలితం: ఇరాన్ ఆయిల్ ఇండియాకిక దుర్లభమేనా?

ఇండియా ఆయిల్ అవసరాలలో 12 శాతం తీర్చే ఇరాన్, ఇకనుండి ఇండియాకి ఆయిల్ సరఫరా చేయడం మానేస్తుందా? అంతర్జాతీయ రాజకీయాలలో భాగంగా అమెరికా ఒత్తిడికి గురైన భారత ప్రభుత్వం ఇరాన్ నుండి దిగుమతి చేసుకున్న ఆయిల్‌కి ఇంకా చెల్లింపులు చేయకపోవడంతో భారత దేశానికి ఆయిల్ సరఫరా చేయడం కష్టమేనని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ సరఫరా చేసిన ఆయిల్ కి గాను, ఇండియా ఆ దేశానికి 12 బిలియన్ డాలర్లు (రు.54,000 కోట్లు) చెల్లించవలసి ఉండగా ఒకటిన్నర సంవత్సరాలుగా…

మరింత క్షీణించిన భారత మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి

ఇండియా మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి జూన్ నెలలో కూడా క్షీణించడం కొనసాగింది. జూన్ నెలలో మాన్యుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి తొమ్మిద నెలల కనిష్టస్ధాయిలో నమోదైందని పి.ఎమ్.ఐ సర్వేలో తేలింది. రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు పెంచుతుండడం వలన అప్పు సేకరణ ఖరీదు పెరగడంతో దాని ప్రభావం మాన్యుఫాక్చరింగ్ రంగంపై పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. హెచ్.ఎస్.బి.సి బ్యాంకు నిర్వహించే పి.ఎమ్.ఐ సూచిక (Purchasing Managers’ Index) ప్రకారం మే నెలలో పి.ఎమ్.ఐ సూచి 57.5 నమోదు చేయగా జూన్ నెలలో అది…

ధాన్యం ఎగుమతికి పచ్చ జెండా ఊపిన కేంద్రం?

ధాన్యం ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపిందని వాల్‌స్ట్రీట్ జర్నల్పత్రిక రాసింది. గోదాముల్లో ఖాళీ లేక ఆరుబైట నిలవ చేయవలసి వస్తున్నదనీ, ఆరుబైట ఉంచడంతో ఎండా వానలకు చెడిపోతున్నాయనీ చెబుతూ కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శరద్ పవార్ దాదాపు సంవత్సరం నుండీ ఎగుమతి చేద్దాం అని పోరుతూ వచ్చాడు. మిల్లర్లతో ఉన్న గాఢమైన అనుబంధం ఆయన్ను దేశంలో జనాలకి ధాన్యం అవసరం ఉందన్న స్పృహ కంటే విదేశాల్లో ధరలు ఎక్కువగా ఉన్నాయి, ఎగుమతులకు ఇదే…

ప్రజాందోళనల నడుమ కోతలు, రద్దుల బిల్లుని ఆమోదించిన గ్రీసు పార్లమెంటు

గ్రీసు ప్రభుత్వం తన ప్రజలపై ఆమానుషంగా ఆర్ధిక దాడులకు తెగబడే బిల్లుని ఆమోదించింది. ప్రవేటు, ప్రభుత్వ రంగాలలోని కార్మికులు, ఉద్యోగులు మంగళ, బుధవారాల్లో 48 గంటల సమ్మెను నిర్వహించినా, పార్లమెంటు బయట విరసనకారులు పోలీసులతో తలపడినా గ్రీసు ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకు పోయింది. 155 – 138 ఓట్ల తేడాతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పొదుపు చర్యల బిల్ల ను పార్లమెంటు ఆమోదంచింది. ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు అప్పు ఇస్తున్న సందర్భంగా విధించిన…

ఇంధన ద్రవ్యోల్బణం పైపైకి, మళ్ళీ రెండంకెలకు చేరనున్న ప్రధాన ద్రవ్యోల్బణం?

డీజెల్, కిరోసిన్, గ్యాసు ధరలు పెంచకముందే ఇంధన ధ్రవ్యోల్బణం పెరగి కూర్చుంది. పెరిగిన ధరలు తోడైతే ప్రధాన ద్రవ్యోల్బణం మళ్ళీ రెండంకెలకు చేరుకోవచ్చని మార్కెట్లు విశ్లేషకు అంచనా వేస్తున్నారు. వెరసి భారత ప్రజలు భరించలేక సతమతమవుతున్న అధిక ధరలు మరింతగా పెరుగనున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గడమే ఒకింత ఓదార్పు. కానీ తగ్గిన అంశాలకంటె పెరిగిన అంశాలు మరీ ఎక్కువగా ఉండటంతో ద్రవ్యోల్బణం పెరుగుదల అనివార్యంగా కనిపిస్తోంది. జూన్ 18 తో ముగిసే వారంతో అంతమైన సంవత్సరానికి…

ఆయిల్ రేట్ల భారాన్ని ప్రభుత్వం ప్రజలపై వేయాల్సిందే -అహ్లూవాలియా

ధనిక స్కూళ్ళలో చదివి, ఆక్స్‌ఫర్డ్ లోనో, హార్వర్డ్ లోనో ఉన్నత చదువులు పూర్తి చేసి, ఐ.ఎం.ఎఫ్ లాంటి ప్రపంచ వడ్డీ వ్యాపార సంస్ధల్లో ఉద్యోగం చేసినవాళ్ళని ప్రభుత్వంలో కూర్చోబెడితే ఏమవుతుంది? “నెత్తిన పేనుకు పెత్తనమిస్తే నెత్తి గొరుగురా ఒరే, ఒరే” అని ఓ కవి పాడినట్లుగానే అవుతుంది. భారత దేశ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా పరిస్ధితి కూడా అలాంటిదే. “ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినపుడు ఆ భారం ప్రజలమీద మోపడానికి…

జులై 5 నుండి రానున్న 5 సంవత్సరాల వరకూ క్రిస్టీన్ లాగార్డే ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్

అంతా ఊహించినట్లే ఫ్రాన్సు ఆర్ధిక మంత్రి క్రిస్టిన్ లాగార్డే ని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ (International Monetary Fund) “మేనేజింగ్ డైరెక్టర్‌” గా ఏకాభిప్రాయంతో ఎంపిక చేసుకుంది. క్రిస్టిన్ లాగార్డే, ఆమె పోటీదారు అగస్టీన్ కార్‌స్టెన్స్ లకు అందిన మద్దతును, ఆమోదాలను (endorsements) సమీక్షించిన ఐ.ఎం.ఎఫ్ బోర్డు క్రిస్టిన్ లాగార్డే కి అధిక మద్దతు ఉన్నట్లు భావించి ఆమెను ఎంపిక చేసినట్లుగా ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఐ.ఎం.ఎఫ్ ఉన్నత పదవికి పోటీ ఏర్పడింది. ఎమర్జింగ్ మార్కెట్…

ఐ.ఎం.ఎఫ్ ఉపాధ్యక్ష పదవికోసం బ్రిక్స్ కూటమి తీర్మానానికి పాతరేసిన చైనా

బ్రిక్స్ నిర్ణయానికి పాతరేస్తూ చైనా ఫ్రాన్సు అభ్యర్ధి క్రిస్టిన్ లాగార్డేకి ఐ.ఎం.ఎఫ్ అధ్యక్షురాలుగా ఉండడానికి మద్దతు ప్రకటించింది. బ్రిక్స్ (BRICS) అనేది ఐదు లీడింగ్ ఎమర్జింగ్ దేశాల కూటమి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా లు ఇందులో సభ్య దేశాలు. ఐ.ఎం.ఎఫ్ అధ్యక్ష పదవి ఖాళీ అయ్యాక యూరప్ దేశాలు యూరప్ అభ్యర్ధిని ఆ పదవిలో నియమించాలని కోరింది. యూరప్ అప్పు సంక్షోభం ఎదుర్కొంటున్నందున అది న్యాయమని చెప్పింది. ఆత్రుతగా ఫ్రాన్సు ఆర్ధిమ మంత్రి…

అవినీతి బైటపెట్టినందుకు ప్రాణ భయంతో పారిపోయిన ఆఫ్ఘన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్

ఆఫ్ఘనిస్ధాన్ సెంట్రల్ బ్యాంకు గవర్నర్ అబ్దుల్ కదీర్ ఫిట్రాట్ ప్రాణ భయంతో దేశం విడిచి పారిపోవడం ఇక్కడ సంచలనం సృష్టించింది. గవర్నరు పదవికి రాజీనామా చేసి మరీ పారిపోయిన కదీర్ అమెరికాలో తేలాడు. ఆయనకి అమెరికాలో నివాస గృహం ఉందని తెలుస్తోంది. కాబూల్ బ్యాంక్ అనే ప్రవేటు బ్యాంకులో జరిగిన అవినీతిపై అబ్దుల్ కదీర్ దర్యాప్తు జరిపాడు. అవినీతికి పాల్పడినవారి పేర్లను పార్లమెంటులో బహిర్గతం చేశాడు. ఆయన బైటపెట్టిన పేర్లలో అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సోదరుడు మహమూద్…

త్వరగా సంస్కరణలు ఆమోదించండి, మాకోసం మీ మార్కెట్లు పూర్తిగా తెరవండి -అమెరికా

ఇండియా సంస్కరణల అమలు వేగవంతం చెయ్యాలనీ, తద్వారా భారత మార్కెట్లను అమెరికా ప్రవేశించడానికి వీలుగా మరింత బార్లా గేటులు తెరవాలని అమెరికా కోరింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ వాషింగ్టన్‌లో జరుగుతున్న ఇండియా అమెరికా బిజినెస్ ఫోరంలో మాట్లాడుతూ ఇండియా ఫైనాన్షియల్ మార్కెట్‌ను బాగా అభివృద్ధి చేసుకుందని సర్టిఫికెట్ ఇచ్చాడు. మరిన్ని సంస్కరణలు ప్రవేశ పెట్టినట్లయితే ఇండియాలో కాపిటల్ మార్కెట్లు అభివృద్ధి చెంది అమెరికా కంపెనీలు స్వేచ్ఛగా ప్రవేశించడానికి వీలు కలుగుతుందని గీధనర్ తెలిపాడు. సమావేశానికి…

ఇంగ్లండు పర్యటనలో చైనా ప్రధాని, వ్యాపారం పెంపుకు హామీ

ఐదు రోజుల పర్యటన నిమిత్తం యూరప్ వచ్చిన చైనా ప్రధాని వెన్ జియాహావో సోమవారం నుండి ఇంగ్లండు లో పర్యటిస్తున్నాడు. తన పర్యటన సందర్భంగా వెన్ “ఇంగ్లండుతో ద్వైపాక్షిక వ్యాపారం మరింతగా పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. మరిన్ని బ్రిటన్ ఉత్పత్తులు చైనాకు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఇంగ్లండులోని చైనా కార్ల కంపెనీ ఎం.జి కార్ ప్లాంటు తయారు చేస్తున్న మోడల్‌ని మరిన్ని ఎంటర్‌ప్రైజ్‌లు ఆధారంగా చేసుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచాడు. సంక్షోభంలో యూరోజోన్ దేశాలకు మద్దతు కొనసాగిస్తామని…