జి7, యూరోజోన్‌ల వైఫల్యంతో ప్రపంచ స్ధాయిలో షేర్ల పతనం

శుక్రవారం జరిగిన జి7 గ్రూపు దేశాల సమావేశం యూరోజోన్ సంక్షోభం పరిష్కారానికి ఏ విధంగానూ ప్రయత్నించకపోవడంతో దాని ప్రభావం స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. యూరోజోన్ దేశాల్లో, ముఖ్యంగా జర్మనీకీ ఇతర దేశాలకీ మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తడం కూడా షేర్ మార్కెట్లపై ప్రపంచ స్ధాయి ప్రభావం పడుతోంది. జపాన్ షేర్ మార్కెట్ నిక్కీ గత రెండున్నర సంవత్సరాలలోనే అత్యల్ప స్ధాయికి పడిపోయింది. భారత షేర్ మార్కెట్లలో సెన్సెక్స్ సూచి మళ్ళీ పదాహారు వేల పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా,…

ఘోరంగా పడిపోయిన పారిశ్రామిక వృద్ధి, షాక్‌లో మార్కెట్లు

అసలే అమెరికా, యూరప్ ల రుణ సంక్షోభాలతో, అమెరికా ఆర్ధిక వృద్ధి నత్త నడకతోనూ నష్టాలతో ప్రారంభమైన ఇండియా స్టాక్ మర్కెట్లకు పారిశ్రామిక వృద్ధి సూచిక గణాంకాలు షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చాయి. పారిశ్రామిక వృద్ధి సూచిక (ఐఐపి – ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్) మార్కెట్ అంచనాలను మించి క్షీణించడంతో సెన్సెక్స్, నిఫ్టీలు పెద్ద ఎత్తున నష్టాలను రికార్డు చేశాయి. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి సెన్సెక్స్ రెండు శాతం పైగా 390 పాయింట్లు కోల్పోయి 16485…

అమెరికా, యూరప్ సంక్షోభాలకు పరిష్కారం చూపని జి7 సమావేశాలు

శుక్రవారం జరిగిన జి7 సమావేశాలు చప్పగా ముగిశాయి. ప్రపంచ ఆర్ధికవ్యవస్ధ మరొక మాంద్యం ముంగిట నిలబడి ఉన్నప్పటికీ ఇతమిద్ధమైన పరిష్కారారాన్నేదీ చూపలేకపోయింది. అందరం కలిసి ఉమ్మడి సహకారంతో సంక్షోభానికి స్పందించాలన్న మొక్కుబడి ప్రకటన తప్ప సమావేశాలు ఏమీ సాధించలేకపోయాయి. పైగా యూరప్ రుణ సంక్షోభంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసి నిరాశపరిచాయి. యూరప్ రుణ సంక్షోభం పరిష్కారానికి యూరోప్ కి చెందిన శక్తివంతమైన దేశాలు యూరోజోన్ లోని బలహీన దేశాలకు ద్రవ్య మద్దతు ఇవ్వాలని అమెరికా నొక్కి చెప్పగా,…

అమెరికా ఆర్ధికవృద్ధి మందగమనం + బడా బ్యాంకులు = జీరో ఆర్ధిక వృద్ధి -కార్టూన్

న్యూయార్క్‌లోని వాల్‌స్ట్రీట్‌లో ఉన్న “టూ బిగ్ టు ఫెయిల్” బడా బ్యాంకులే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను గొప్ప మాంద్యం (ది గ్రేట్ రిసెషన్) లోకి జారడానికి దోహదపడ్డాయి. సబ్ ప్రైమరీ హౌసింగ్ రుణాలను అతిగా సెక్యూరిటైజేషన్ చేసి తాజా కేకులుగా ప్రపంచం అంతా అమ్మి ద్రవ్య సంక్షోభంలోకి ప్రపంచాన్ని తోశాయి. అందుకు వారికి శిక్షకు బదులు ట్రిలియన్ల కొద్దీ బెయిలౌట్ల రూపంలో నజరానాలు అందాయి. అవి అందుకున్న బెయిలౌట్లు, రెండు యుద్ధాలు కలిసిన అమెరికా అప్పు, హిమాలయాలతో…

ఆసియా ఆర్ధిక వ్యవస్ధలని కిందికి లాగుతున్న అమెరికా, యూరప్‌ల సంక్షోభాలు

ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మరోసారి మాంద్యంలోకి జారే అవకాశాలు కనిపిస్తున్నాయని సింగపూర్ ఆర్ధిక మంత్రి మంగళవారం జోస్యం చెప్పాడు. మాంద్యం సంభవించకుండా ఉండడం కంటే సంభవించడానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నాడు. చైనా ఆర్ధిక వృద్ధి (జిడిపి వృద్ధి రేటు) గత పది సంవత్సరాలలోనే అత్యంత తక్కువ నమోదు చేయవచ్చని చైనా అధికారి ఒకరు వేరే సందర్భంలో తెలిపాడు. ఏసియాన్ దేశాల కూటమి ద్రవ్య విధానం సమీక్ష కోసం రానున్న శుక్రవారం సమావేశం కానున్నాయి. అమెరికా,…

యు.ఎస్ ఆర్ధిక సంక్షోభం పోనేలేదు, రుణ సంక్షోభం చుట్టుముడుతోంది – కార్టూన్

అమెరికాలో ఉన్న “టూ బిగ్ టు ఫెయిల్” కంపెనీలు ప్రజల పన్నులు, ప్రభుత్వ అప్పులు మెక్కి సంక్షోభం నుండి కోలుకున్నప్పటికీ అమెరికా ఆర్ధిక వ్యవస్ధ, సంక్షోభం నుండి ఇంకా కోలుకోలేదు. బడా కంపెనీలు, ముఖ్యంగా ప్రవేటు ఇన్‌వెస్ట్‌మెంటు బ్యాంకులు, ఇన్సూరెన్సు సంస్ధలు బెయిలౌట్లుగా ప్రభుత్వ అప్పులను భోంచేయడంతో అమెరికా ప్రభుత్వానికి అది పెనుభారమై కూర్చుంది. కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో నిరుద్యోగం పెరిగి అధిక ఉత్పత్తి సంక్షోభానికి దారి తీస్తున్నది. ఆర్ధిక వ్యవస్ధ వైఫల్యం పైన అనుమానాలు, అప్పు…

బంగ్లాదేశ్‌కు రు.3375 కోట్ల రుణం మంజూరు చేసిన ఇండియా

ఓ వైపు బడ్జెట్ లోటు తగ్గించడానికి ప్రభుత్వ రంగ సంస్ధలను తెగనమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం తగుదునమ్మా అని తనకు మాలిన ధర్మాన్ని అనుసరిస్తోంది. భారత దేశంలో రోడ్లు, రైల్వేలు లాంటి మౌలిక రంగాల నిర్మాణం ఆధినిక సౌకర్యాలతో లేనందున సరఫరా నష్టాలు ఏర్పడి ధరలు పెరుగుతున్నాయనీ, దానితో ద్రవ్యోల్బణం అదుపు తప్పుతున్నదనీ ప్రధాని మన్మోహన్, మాంటెక్ సింగ్ అహ్లూవాలియా చెబుతున్నారు. ఆ పేరుతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాల కోసం నిధులు సంపాదించడానికి కేంద్ర ప్రభుత్వం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండులను గత…

అక్రమ మైనింగ్‌పై సి.బి.ఐ కొరడా, గాలి జనార్ధన్, మరొకరి అరెస్టు

గాలి బ్రదర్స్‌లో నాయకత్వ పాత్రలో కనిపించే గాలి జనార్ధన రెడ్డి, ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓ.ఎం.సి) ఎం.డి బి.శ్రీనివాస రెడ్డిలను సి.బి.ఐ సోమవారం అరెస్టు చేసింది. సి.బి.ఐ డెప్యుటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ వి.వి.లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బృందం బళ్ళారి చేరుకుని స్వయంగా గాలి జనార్ధన రెడ్డి, బి.శ్రీనివాస రెడ్డిలను అరెస్టు చేసి రోడ్డు మార్గంలో హైద్రాబాద్ కి తీసుకువచ్చారు. ఇద్దరిని అరెస్టు చేశామని సాయంత్రంలోగా సి.బి.ఐ ప్రత్యేక కోర్టులో హాజరు పరుస్తామనీ సి.బి.ఐ ప్రతినిదులు తెలిపారు. గాలి జనార్ధన…

Q1 జిడిపి వృద్ధిలో చైనా, ఇండియాలను కిందికి తోసిన టర్కీ, అర్జెంటీనా

2011 క్యాలెండర్ సంవత్సరంలో మొదటి క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) లో చైనా, ఇండియాలు జిడిపి వృద్ధికి సంబంధించి తమ స్ధానాలను కోల్పోయాయి. వాటి స్ధానాలను టర్కీ, అర్జెంటీనాలు ఆక్రమించాయి. ఇప్పటివరకూ చైనా, ఇండియాలో జిడిపి వృద్ధి రేటులో ప్రపంచంలో మొదటి రెండు స్ధానాల్లో కొనసాగుతున్నాయి. ఆర్ధిక సంక్షోభం తర్వాత ఇంతవరకూ అవి తమ స్ధానాలను కాపాడుకుంటూ వచ్చాయి. మొదటి క్వార్టర్ జిడిపి వృద్ధి రేటులో మొదటి ఐదు స్ధానాల్లో ఉన్న దేశాలను కింది పట్టికలో చూడవచ్చు.…

ఆగష్టులో ఒక్క ఉద్యోగమూ ఇవ్వని అమెరికా, ముసురుకుంటున్న డబుల్ డిప్ భయాలు

ఘనత వహించిన అమెరికా ఆర్ధిక వ్యవస్ధ ఆగష్టులో ఒక్క ఉద్యోగమూ కల్పించలేకపోయింది. ముప్ఫై కోట్ల జనాభాలో ముప్ఫై రోజుల్లో కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా నికరంగా ఉద్యోగం ఇవ్వలేకపోయింది. ప్రభుత్వానికి రక్షణ బాధ్యత, పాలన బాధ్యత తప్ప మిగిలినవి ఏవీ ఉండకూడదు. ఇతర అన్ని కార్యకలాపాలనూ మార్కెట్‌కే అప్పజెప్పాలని ప్రపంచానికి నిత్యం బోధలు చేసే కార్పొరేట్ అమెరికా ఉద్యోగాలు ఇవ్వకుండా లాభాలను మాత్రం బిలియన్ల కొద్దీ డాలర్లు ప్రకటిస్తోంది. ఉద్యోగాలివ్వని లాభాలవి. ఉద్యోగాలివ్వని వ్యాపారమది. ఉద్యోగాలివ్వని ఉత్పత్తి…

క్షీణించిన ఇండియా ఫ్యాక్టరీల ఉత్పత్తి సూచిక, గ్లోబల్ అనిశ్చితే కారణం

ముఖ్యమైన ఎగుమతి మార్కెట్ అయిన అమెరికా వినియోగదారుల కొనుగోలు శక్తి క్షీణిస్తుండం, అంతులేని యూరప్ రుణ సంక్షోభం తమ ప్రభావం చూపడంతో ఇండియా ఫ్యాక్టరీ ఉత్పత్తి ఆగస్టు నెలలో తీవ్రంగా పడిపోయినట్లుగా హెచ్.ఎస్.బి.సి మార్కిట్ సర్వే లో తేలింది. ఇండియా మాన్యుఫాక్చరింగ్ రంగంలోని ఉత్పత్తి తీరుతెన్నులను సూచించే హెచ్.ఎస్.బి.సి పి.ఎం.ఐ (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) ఆగస్టు నెలలో 52.6 గా నమోదయ్యింది. మార్కెట్ విశ్లేషకులు 52.9 ఉండగలదని అంచనావేయగా దాని కంటే తక్కువ స్ధాయి 52.6 నమోదైనట్లుగా…

గత ఆరు క్వార్టర్‌లలో అతి తక్కువ నమోదైన భారత జిడిపి

2011-12 ఆర్ధిక సంవత్సరంలో మొదటి క్వార్టర్ లో (ఏప్రిల్, మే, జూన్ నెలలు) భారత దేశ జి.డి.పి నిరాశపరిచింది. గత ఆరు క్వార్టర్లలో, అంటే గత సంవత్సరం న్నర కాలంలో అత్యంత తక్కువగా 7.7 శాతం వృద్ధి రేటుని నమోదు చేసింది. అయితే ఆర్ధిక పరిశీలకులు, భారత జిడిపి మొదటి క్వార్టర్ లో ఇంతకంటే తక్కువగా ఉంటుందని అంచనా వేయడం గమనార్హం. కనుక మార్కెట్ అంచనాలను అధిగమించిందన్న సంతోషాన్ని ఈ అంకెలు మిగిలించాయి. గత మార్చి క్వార్టర్…

గ్లోబల్ రికవరీకి ప్రమాదం పొంచి ఉంది, వెంటనే చర్యలు తీసుకొండి -ఐ.ఎం.ఎఫ్

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ ఐ.ఎం.ఎఫ్ ప్రపంచ దేశాలను మరోసారి హెచ్చరించింది. మూడు సంవత్సరాల క్రితం ఏర్పడిన తీవ్ర ఆర్ధిక సంక్షోభం నుండి కుంటుతూ కోలుకుంటున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మరోసారి సంక్షోభంలో జారిపోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. వెంటనే చర్యలు తీసుకుంటే తప్ప దాన్ని అరికట్టలేమని ఐ.ఎం.ఎఫ్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్ట్రీన్ లాగార్డే తెలియజేసింది. “ఈ వేసవిలో జరిగిన పరిణమాలు, మనం ప్రమాదకరమైన కొత్త దశలో ఉన్నమాని సూచిస్తున్నాయి. బలహీనంగా ఉన్న ఆర్ధిక రికవరీ…

మా మూడు డిమాండ్లు ఒప్పుకుంటే దీక్ష విరమిస్తా -ప్రధానికి అన్నా లేఖ

శుక్రవారం అన్నా హజారే ప్రధానికి మరొక లేఖ రాశాడు. తమ మూడు కీలక డిమాండ్లను అంగీకరిస్తే దీక్ష విరమిస్తానని ప్రకటించాడు. సివిల్ సర్వెంట్లు అంతా లోక్ పాల్ చట్టం పరిధిలోకి తేవాలి; అన్ని ప్రభుత్వ కార్యాలయాలలోనూ ‘సిటిజన్ చార్టర్’ ను ప్రదర్శించాలి; అన్ని రాష్ట్రాలూ లోకాయుక్త ను నియమించుకోవాలి. ఈ మూడు డిమాండ్ల తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదించాలని అన్నా కోరాడు. డిమాండ్లు అంగీకరించడంతో సరిపెట్టకుండా ఆ మేరకు చట్టాన్ని ఆమోదిస్తేనే దీక్ష విరమిస్తానని అన్నా తెలిపాడు. “ఈ…

చుక్కల్లో ఆహార ద్రవ్యోల్బణం

ఆహార ద్రవ్యోల్బణం చుక్కల్లో విహరిస్తోంది. రెండంకెల సంఖ్యను చేరువగా వెళుతోంది. అంటే దేశంలో ఆహార ధరలు కూడా చుక్కల్లో విహరిస్తున్నాయని అర్ధం. ఆహార భద్రత గురించి గుర్తొచ్చినప్పుడల్లా ఉపన్యాసాలు దంచే ప్రధాని మన్మోహన్ అది సాధించడానికి ఏ చర్యా తీసుకోడు. మంత్రులు, అధికారుల అవినీతి జన్ లోక్ పాల్ బిల్లువలన ఎక్కడ బయటపడుతుందోనన్న ఆందోళన తప్ప దేశంలో ప్రజానీకానికి తిండిని అందుబాటులో ఉంచాలన్న ధ్యాస లేదు. ఆగస్టు 13 తో ముగిసిన వారానికి ఆహార ద్రవ్యోల్బణం 9.8…