కుప్ప కూలిన షేర్లు, బ్లూఛిప్స్తో సహా ఒక్క రోజులోనే 2.15 లక్షల కోట్లు నష్టం
గురువారం షేర్ మార్కెట్లు మదుపుదారులకు చుక్కలు చూపించాయి. మూడు సంవత్సరాల క్రితం నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం రోజులను ఒకసారి గుర్తుకు తెచ్చాయి. గత 26 నెలల్లోనే ఎన్నడూ లేనంతగా సెన్సెక్స్ సూచి 704 పాయింట్లు నష్టపోయింది. మొత్తం షేర్ల విలువలో చూసినట్లయితే షేర్లలో ఉన్న మదుపుదారుల సొమ్ము రు.2.15 లక్షల కోట్లు ఒక్కరోజులో అదృశ్యమైంది. చిన్న కంపెనీల షేర్ల కంటే బ్లూచిప్ కంపెనీల షేర్లు ఉన్నవారే అత్యధికంగా నష్టపోవడం విశేషం. లిస్టెడ్ షేర్ల విలువ బుధవారం…