ఇటలీ, స్పెయిన్ ల రేటింగ్ తగ్గించిన ‘ఫిచ్ రేటింగ్స్’

ఫిచ్ క్రెడిట్ రేటింగ్ సంస్ధ ఇటలీ, స్పెయిన్ దేశాల క్రెడిట్ రేటింగ్ తగ్గించింది. ఇటలీ, స్పెయిన్ దేశాలు యూరో జోన్ లో వరుసగా మూడవ, నాల్గవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధలున్న దేశాలు కావడం గమనార్హం. ఇటలీ రేటింగ్ ఎ+ నుండి ఎఎ- కు ఒక మెట్టు తగ్గించగా, స్పెయిన్ రేటింగ్ ను ఎఎ+ నుండి ఎఎ- కు (‘ఎఎ+’ నుండి ‘ఎఎ’ ను వదిలి ‘ఎఎ-‘ కు తగ్గించడం) రెండు మెట్లు తగ్గించింది. రెండింటి ఔట్‌లుక్…

సంక్షోభ పరిస్ధితుల్లో దిక్కు తోచని సంపన్నులు

యూరప్ రుణ సంక్షోభం, అమెరికా ఆర్ధిక వృద్ధి స్తంభనలు ప్రపంచ సంపన్నులను గుక్క తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. తమ సంపదలను ఎక్కడ మదుపు చేస్తే క్షేమంగా ఉంటుందో అంచనా వేయలేక సతమతమవుతున్నారు. ఎల్లప్పుడూ తమ సంపదలను వృద్ధి చేసుకోవడానికి ఎత్తులు పైఎత్తులలో మునిగి తేలుతూ ఉండే వాళ్ళు ఇప్పుడు వృద్ధి సంగతి అటుంచి అవి తరిగిపోకుండా ఉండడానికి గల మార్గాలను వెతుక్కుంటున్నారు. కొందరు అప్పుడే వినాశకకర పరిస్ధితులో పెట్టుబడులను ఎక్కడికి తరలిస్తారో గమనించి అటువంటి చోట్లను వెతుకులాడుతున్నారు. డబ్బు…

ఆ చట్టం ఆమోదిస్తే ‘వాణిజ్య యుద్ధం’ తప్పదు, అమెరికాకి చైనా హెచ్చరిక

చైనా కరెన్సీ విలువ పెంపుదలపై అమెరికా కాంగ్రెస్ చట్టం చేయాలని పూనుకోవడాన్ని చైనా తీవ్రంగా ఖంచించింది. చైనా కృత్రిమంగా తన కరెన్సీ యువాన్ విలువను అతి తక్కువ స్ధాయిలో ఉంచుతున్నదని అమెరికా గత రెండు సంవత్సరాలుగా ఆరోపిస్తోంది. యూరప్, ఇండియాలు కూడా చైనాపైన ఇదే ఆరోపణలు చేస్తున్నప్పటికీ అమెరికా అంత దూకుడుగా వ్యవహరించడం లేదు. చైనా కరెన్సీ యువాన్ విలువను తక్కువ విలువ వద్ద ఉంచడం వలన చైనా సరుకుల ధరలు తక్కువగా ఉంటున్నాయని దానితో అది…

ఎస్.బి.ఐ డౌన్ గ్రేడ్ తో భారత షేర్ల పతనం

ఇండియా షెర్ మార్కెట్ సూచి బి.ఎస్.ఇ సెన్సెక్స్, గత ఐదు వారాల్లో మరోసారి 16,000 పాయింట్ల దిగువకు చేరుకుంది. మూడీస్ ఇన్‌వెస్టర్స్ సర్వీస్ సంస్ధ, దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేటింగ్ తగ్గించడంతో దాని ప్రభావం షేర్లపై పడింది. వరుసగా మూడవరోజు పతనమైన సెన్సెక్స్ మంగళవారం 286.59 పాయింట్లు (1.77 శాతం) నష్టపోయి 15745.43 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్.ఎస్.ఇ నిఫ్టీ 1.6 శాతం నష్టపోయి 4772.15 పాయింట్ల వద్ద ముగిసింది.…

రోజుకి రు.32/- లతో కుక్కలు, జంతువులు మాత్రమే బతగ్గలవు

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ఇటీవల సుప్రీం కోర్టుకి దారిద్ర్య రేఖ ప్రమాణాలపై సమర్పించిన అఫిడవిట్ ప్రకంపనలు సృష్టించడం కొనసాగుతోంది. సోనియా గాంధి నేతృత్వంలోని జాతీయ సలహా కమిటీ సభ్యుడు ఎన్.సి.సక్సేనా అహ్లూవాలియా, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిని లెక్కించడానికి విధించిన ప్రమాణంపై నిరసనపూరితమైన వ్యాఖ్యలు చేశాడు. “రోజుకి 32 రూపాయల ఆదాయంతో కుక్కలు, జంతువులు మాత్రమే బతగ్గలవని ఆయన ‘మెయిల్ టుడే’ పత్రికతో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. “మనిషనేవాడెవ్వడూ రోజుకు రు.32/-తో బతకడం అసాధ్యమని…

పాక్ ద్వేషులకు దుర్వార్త, భారత్ పాక్‌లు వాణిజ్య బంధం పటిష్టం చేసుకుంటున్నాయి

ఇది మన పొరుగు దేశం పాకిస్ధాన్‌ను అకారణంగా ద్వేషించేవారికి నిజంగా దుర్వార్తే. భారత్, పాకిస్ధాన్ దేశాలు తమ మధ్య వాణిజ్య బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. వాణిజ్య బంధాలను పటిష్టం చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకున్నట్లయితే అటువంటి చర్యలు ఇరు దేశాలు భవిష్యత్తులో మరింత సమీప సంబంధాలను అభివృద్ధి కావడానికి దోహదపడతాయని రెండు దేశాలు భావిస్తున్నాయి. పాకిస్ధాన్ వాణిజ్య మంత్రి ‘మక్దూమ్ అమిన్ ఫాహిమ్’ ప్రస్తుతం ఆరు రోజుల ఇండియా పర్యటనలో ఉన్నాడు.…

మూడు సంవత్సరాల్లో అత్యధిక షేర్ నష్టాలను చవిచూసిన రెండో క్వార్టర్

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలోని రెండవ క్వార్టర్ (జులై, ఆగస్టు, సెప్టెంబరు 2011) గత మూడు సంవత్సరాలలోనే అత్యధికంగా నష్టాలను చవిచూసిన క్వార్టర్ గా రికార్డయ్యింది. 2008 లో సెప్టెంబర్ లో లేమేన్ బ్రదర్స్ కంపెనీ దివాలా తీసినట్లు ప్రకటించాక అక్టోబర్, నవంబరు డిసెంబరు నెలలతో కూడిన క్వార్టర్ అత్యధిక స్ధాయిలో సెన్సెక్స్ 25 శాతం నష్టపోయింది. దాని తర్వాత మళ్లీ ఇప్పుడు జులై, ఆగస్టు, సెప్టెంబరు (2011) లతో కూడిన క్వార్టర్ లో సెన్సెక్స్ 12.8 శాతం…

ఇండియా అణుపరిహార చట్టం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదు -అమెరికా

గత సంవత్సరం భారత పార్లమెంటు ఆమోదించిన “అణు ప్రమాద నష్టపరిహార చట్టం” అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదని అమెరికా పెదవి విరిచింది. అంతర్జాతీయ ప్రమాణంగా చెబుతున్న “కన్వెన్షన్ ఆన్ సప్లిమెంటరీ కాంపెన్సేషన్” (సి.ఎస్.సి) కు అనుగుణంగా భారత చట్టం లేదనీ, ఈ విషయంలో ఇండియా తన నిర్ణయాలను స్పష్టం చేయడానికి ఐ.ఎ.ఇ.ఎ ను వేదికగా ఎంచుకోవాలని అమెరికా హిత బోధ చేసింది. మూడేళ్ళ క్రితం అమెరికా భారత్ ల మధ్య “పౌర అణు ఒప్పందం” కుదిరింది. ఇందిరాగాంధి…

కనుమరుగవుతున్న డాలర్ ఆధిపత్యం -కార్టూన్

ఇన్నాళ్లూ ప్రపంచ ఆర్ధిక సామ్రాజ్యాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుకున్న డాలర్ క్రమంగా తన ఆధిపత్యాన్ని కోల్పోతున్నది. రెండు దురాక్రమణ యుద్ధాలు, వాటి కారణంగా వేగంగా సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం లు డాలర్ బలాన్ని నేలమట్టం చేస్తున్నాయి. ఏ ‘ఎదురులేని ప్రపంచాధిపత్యం’ కోసమైతే అమెరికా దురాక్రమణ యుద్ధాలకు తెగబడిందో అదే ఆధిపత్యాన్ని అమెరికా ఇప్పుడు కోల్పోతున్నది. సంక్షోభంలో బడా కంపెనీలకు ట్రిలియన్ల డాలర్ల బెయిలౌట్లు మంజూరు చేసి కొండంత అప్పును అమెరికా మూటగట్టుకుంది. ఆ అప్పుల భారాన్ని ఇప్పుడు…

రిటైల్ రంగాన్ని త్వరలోనే మీకు అప్పజెపుతాం, విదేశీ ప్రవేటు కంపెనీలకు ఇండియా హామీ

కోట్లాది డాలర్ల విలువ గల భారత రిటైల్ రంగాన్ని విదేశీ బహుళజాతి కంపెనీలకు అప్పజెపడానికి భారత ప్రభుత్వం చాలా వేగంగా చర్యలు తీసుకుంటున్నదని పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆర్.పి.సింగ్ హామీ ఇచ్చాడు. 450 బిలియన్ డాలర్ల (రు. 20 లక్షల కోట్లు) విలువ గల భారత రిటైల్ రంగం వాల్ మార్ట్ లాంటి ప్రపంచ స్ధాయి కంపెనీలకు అప్పగిస్తామని భారత ప్రభుత్వం చాలా కాలంగా హామీ ఇస్తున్నప్పటికీ దానిని అమలు చేయడం లేదని పశ్చిమ దేశాల ప్రభుత్వాలు,…

అంతా దయానిధి మారన్ వల్లనే -2జి పై ప్రధాని మన్మోహన్

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 2జి కుంభకోణంపై నోరు విప్పాడు. తమ బాధ్యత గురించి మాట్లాడకుండా నేరాన్ని టెలికం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్ పైకి నెట్టేశాడు. దయానిధి రాసిన ఉత్తరంతోటే తాను 2జి స్పెక్ట్రం విషయాన్ని మంత్రుల బృందం పరిశీలననుండి తప్పించి పూర్తిగా టెలికం శాఖ నిర్ణయానికి అప్పజెప్పానని చెప్పాడు. అమెరికా నుండి ఇండియా వస్తూ విమానంలోనే మన్మోహన్ సింగ్ పత్రికా విలేఖరులకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన ఇండియాలో విమానం దిగే నాటికి ఇంటర్వ్యూ…

దరిద్రులకోసం పైసల్లేని అమెరికా సర్కార్ -కార్టూన్

ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ లపై దురాక్రమణ యుద్ధాల కోసం ఏడు ట్రిలియన్ డాలర్లు, ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి కారణభూతులైన బడా బహుళజాతి సంస్ధలకు బెయిలౌట్లు ఇవ్వడం కోసం 14 ట్రిలియన్ డాలర్లకు పైగా ఖర్చు పెట్టిన అమెరికా ప్రభుత్వం, దరిద్రులకు విదిలించడానికి నాణేల కోసం వెతుక్కుంటోంది. – కార్టూన్: హెంగ్, సింగపూర్ —

ఇంటికి 323 టెలిఫోన్ లైన్లు వేసుకున్న మాజీ టెలికం మంత్రి దయానిధి మారన్

డి.ఎం.కె మంత్రులు టెలికం మంత్రిత్వ శాఖను తమ సొంత సొమ్ము కింద జమకట్టి వాడుకున్న విషయాలు ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. స్పెక్ట్రం కేటాయింపుల విషయాన్ని మంత్రుల బృందం పరిశీలనకు అప్పగించకుండా మొత్తం టెలికం శాఖకే వదిలిపెట్టాలని ప్రధాని మన్మోహన్ కు లేఖ రాసిన దయానిధి మారన్ గారి మరొక నిర్వాకాన్ని సి.బి.ఐ విచారణ చేయడానికి నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. దయానిధి మారన్ టెలికం మంత్రిగా ఉన్న కాలంలో ఆయన తన చెన్నై నివాసానికి 323 టెలిఫోన్ లైన్లు వేయించుకున్న…

రాజీనామాకు సిద్ధపడిన హోం మంత్రి పి.చిదంబరం

2జి స్పెక్ట్రం కుంభకోణంపై జరుగుతునన్ విచారణ కాంగ్రెస్ పునాదులను పెకలిస్తోంది. కేంద్ర కేబినెట్‌లో అత్యంత ఉన్నత స్ధానాన్ని పొంది ఉన్న హోం మంత్రి పి.చిదంబరం తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాడు. తమ నాయకురాలు సోనియా గాంధిని కలిసిన పి.చిదంబరం తన పదవికి రాజీనామా చేస్తానని కోరినట్లుగా తెలుస్తొంది. టి.వి ఛానెళ్ళు ఈ వార్తను ప్రముఖంగా ప్రసారం చేస్తున్నాయి. సోనియాతో జరిగిన 20 నిమిషాల సమావేశంలో చిదంబరం రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లుగా అవి ప్రసారం చేస్తున్నాయి. అయితే…

జి20 సమావేశాలు మొదలు, రేపటికల్లా శుష్క వాగ్దానాల వరద

జి20 గ్రూపు దేశాల ఆర్ధిక మంత్రుల సమావేశం వాషింగ్టన్‌లో ప్రారంభమయ్యింది. అమెరికా, యూరప్‌ల రుణ సంక్షోభాలు ప్రపంచ వ్యాపితంగా ఆర్ధిక వ్యవస్ధలను, షేర్ మార్కెట్లను వణికిస్తున్న నేపధ్యంలో జి20 సమావేశాలు జరుగుతున్నాయి. 1990ల చివర్లో జి20 గ్రూపు ఏర్పడినప్పటికీ మూడు సంవత్సరాల క్రితం సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభంతో దాని ప్రాధాన్యత పెరిగింది. సంక్షోభం ప్రారంభంలో వరుసగా సమావేశాలు జరిపిన జి20 గ్రూపు, ట్రిలియన్ల కొద్దీ డాలర్ల స్టిములస్ ప్యాకేజీలు ప్రకటించి ఆర్ధిక వ్యవస్ధలు మాంద్యం నుండి…