పాక్‌తో సంబంధాల మెరుగుకు అమెరికా ప్రయత్నాలు

సి.ఐ.ఏ ఏజెంట్ డేవిస్ అప్పగింత, ఒసామా బిన్ లాడెన్ హత్య లతో పాక్, అమెరికాల మధ్య అడుగంటిన సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. దాన్లో భాగంగా సెనేటర్ జాన్ కెర్రీ ఆఫ్ఘన్, పాక్ లలో పర్యటిస్తున్నాడు. వచ్చింది సంబంధాల మెరుగుకే అయినా పాక్ పై నిందలు మోపడం మానలేదు. ఒసామా బిన్ లాడెన్ ఆరు సంవత్సరాల పాటు పాక్ లో ఉండటానికి పాక్ సంస్ధల సాయం ఉందన్న విషయం నమ్మకాన్ని చెదరగోట్టేదని కెర్రీ ఆఫ్ఘనిస్ధాన్ లో…

లాడెన్ హత్య చట్టబద్ధమేనని నిరూపించుకోవడానికి అమెరికా తంటాలు

నిరాయుధుడుగా ఉన్న లాడెన్‌ను పట్టుకుని న్యాయస్ధానం ముందు నిలబెట్టకుండా హత్య చేసినందుకు అమెరికాపై నిరసనలు మెల్లగానైనా ఊపందుకుంటున్నాయి. లాడెన్ హత్య “హత్య” కాదనీ అమెరికా కమెండోలు చట్టబద్దంగానే అతన్ని చంపారని సమర్ధించుకోవడానికి అమెరికా తంటాలు పడుతోంది. తాజాగా అమెరికా అటార్నీ జనరల్ ఎరిక్ హోల్డర్ లాడేన్ హత్య చట్టబద్ధమేనని చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. లాడెన్ విషయంలో జరిగిన ఆపరేషన్ “కిల్ ఆర్ కేప్చర్” (చంపు లేదా పట్టుకో) ఆపరేషనే ననీ లాడెన్ లొంగుబాటుకు అంగీకరించినట్లయితే పట్టుకునేవారని…

పాకిస్ధాన్ సైనికాధికారులను “మోస్ట్ వాంటెడ్” జాబితాలో చేర్చిన ఇండియా

భారత ప్రభుత్వం గత మార్చి నెలలో పాకిస్ధాన్ ప్రభుత్వానికి సమర్పించిన వాంటెడ్ వ్యక్తుల జాబితాలో ప్రస్తుతం సైన్యంలో అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారి పేర్లు ఉన్న సంగతి వెల్లడయ్యింది. ఇండియా తన భూభాగంపై జరిగిన టెర్రరిస్టు దాడుల వెనక పాకిస్ధాన్ సైనికాధికారులు, మిలట్రీ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ పాత్ర ఉందని చాలా కాలంనుండి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇండియా హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి జి.కె.పిళ్ళై మార్చి నెలలో పాకిస్ధాన్ హోమ్ కార్యదర్శి ఖమర్ జమాన్ చౌదరితో…

అమెరికా వెతికిందెక్కడ? లాడెన్ దొరికిందెక్కడ?

సెప్టెంబర్ 11, 2001 న న్యూయార్కు నగరంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కార్యాలయం ఉన్న జంట టవర్లను ముస్లిం టెర్రరిస్టులుగా చెప్పబడుతున్నవారు అమెరికా విమానాలతో ఢీ కొట్టారు. విమానాలు ఢీకొట్టాక రెండు టవర్లు ఒక పద్ధతి ప్రకారం కూలిపోయిన దృశ్యాన్ని ప్రపంచం అంతా వీక్షించింది. కొన్ని గంటల్లోనే టవర్లను ఢీకొన్న విమానాలను నడిపినవారిని ఆ పనికి పురమాయించిందెవరో అమెరికా కనిపెట్టి ప్రకటించింది. ఆఫ్ఘనిస్ధాన్‌లో తాలిబాన్ ప్రభుత్వ రక్షణలొ ఉన్న ఒసామా బిన్ లాడెన్ ఆదేశాల ప్రకారమే టవర్లను…

రెండో రోజూ కొనసాగుతున్న తాలిబాన్ల కాందహార్ దాడి

కాందహార్‌లో తాలిబాన్ల దాడి రెండో రోజూ కొనసాగుతోంది.14 మంది తాలిబాన్లను చంపినట్లు ప్రభుత్వ బలగాలు చెబుతున్నాయి. చనిపోయిన తాలిబాన్లలో కొద్దిమంది పాకిస్తానీయులు ఉన్నారని ప్రభుత్వం తెలిపింది.  దాడి ఒసామా హత్యకు ప్రతీకరంగా చెప్పడాన్ని తాలిబాన్లు తోసిపుచ్చారు. దాడీ ముందే వేసుకున్న పధకం ప్రకారం జరిగిందని తాలిబాన్ చెప్పినట్లుగా బిబిసి తెలిపీంది. ఇద్దరు భద్రతాధికారులు, ముగ్గురు పౌరులు, శనివారం తాలిబాన్లు ఆత్మాహుతి బాంబులు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లతో ప్రభుత్వ భవనాలపై దాడులు చేశారు. అప్పటినుండీ కాల్పులు కొనసాగుతున్నాయి. మే…

అమెరికా అబద్ధాలకు నిలువెత్తు సాక్ష్యాలు: జెస్సికా లించ్, పేట్ టిల్‌మేన్, లిండా నార్గ్రోవ్

ఒసామా బిన్ లాడెన్ హత్య విషయంలో పొంతనలేని కధనాలు చెబుతున్న అమెరికాకి అబద్ధాలు చెప్పడం కొత్త కాదు. ఇరాక్‌పై దాడి చేయడానికి కారణంగా ఆ దేశంలో సామూహిక విధ్వంసక మారణాయుధాలు ఉన్నాయనీ, వాటి వలన అమెరికా భద్రతకు ముప్పు అనీ అబద్ధాలు చెప్పింది. దానితో పాటు ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌కీ, ఒసామా బిన్ లాడెన్‌కీ సంబంధాలున్నాయని పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేసింది. కానీ లాడెన్‌ను చంపానని చెప్పిన తర్వాత అమెరికా అధ్యక్షుడు గానీ, అధికారులు గానీ…

నిరాయుధుడు లాడెన్‌ను హత్య చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం

కమెండోలు దిగుతుండగానే లాడెన్ భవంతి నుండి కాల్పులు ఎదురయ్యాయనీ, లాడెన్ సాయుధంగా ప్రతిఘటించడంతోనే కాల్చి చంపామనీ మొదట చెప్పిన అమెరికా అధికారులు మెల్ల మెల్లగా నిజాలను ఒక్కొక్కటీ వెల్లడిస్తున్నారు. లాడెన్ భార్య దాడి చేయడంతో అమెనూ కాల్చి చంపామని చెప్పినవారు ఇప్పుడు ఆమె లాడెన్‌కు అడ్డుగా రావడంతో కాలిపై కాల్చామనీ, అమె బతికే ఉందనీ ఇప్పుడు చెబుతున్నారు. హెలికాప్టర్లపై కాల్పులు జరిగాయన్నవారు ఇప్పుడు దానిగురించి మాట్లాడ్డం లేదు. లాడెన్ సాయుధంగా ప్రతిఘటించాడన్న వారు ఇప్పుడు అతను నిరాయుధంగానే…

ప్రపంచ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన లాడెన్ మృతి, పైశాచికానందంలో దురాక్రమణ గుంపు

ఒసామా బిన్ లాడెన్‌ను ఎట్టకేలకు దురాక్రమణదారులు చంపగలిగారు. రెండు అగ్ర రాజ్యాల దురాక్రమణలను ఎదిరించి పోరాడిన బిన్ లాడేన్ హీరోచిత మరణం పొందాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి చెందిన జంట టవర్లపై విమానాలతో డీకొట్టి కూల్చడం వెనక బిన్ లాడేన్ పధకం ఉందని యుద్ధోన్మాదుల మానస పు(ప)త్రికలు చేసిన ప్రచారంతో రెండు మదపుటేనుగులతో కలబడిన లాడెన్ ప్రతిష్ట తాత్కాలికంగా మసకబారవచ్చు. అచ్చోసిన ఆంబోతుల్లా ప్రపంచంపై బడి దేశాల సంపదలనన్నింటినీ కొల్లగొట్టే దుష్టబుద్ధితో వెంపర్లాడే అమెరికా నాయకత్వంలోని…

గడ్దాఫీని చంపడానికి మళ్ళీ నాటో దాడి, కొడుకు ముగ్గురు మనవళ్ళు మృతి

గడ్డాఫీని చంపడానికే కంకణం కట్టుకున్న నాటో దేశాలు మరోసారి లిబియా అధ్యక్షుడు గడ్డాఫీ నివాస సముదాయంపై మిసైళ్ళతో దాడి చేశాయి. దాడినుండి గడ్డాఫీ తప్పించుకున్నప్పటికీ చిన్న కొడుకు సైఫ్ ఆల్-అరబ్ తో పాటు ముగ్గురు మనవళ్ళు చనిపోయినట్టు లిబియా ప్రభుత్వం తెలిపింది. భవనంపై కనీసం మూడు మిసైళ్ళు ప్రయోగించారనీ, దాడిలో భవనం పూర్తిగా దెబ్బతిన్నదనీ లిబియా ప్రభుత్వ ప్రతినిధి మౌసా ఇబ్రహీం తెలిపాడు. దాడి జరిగిన కొద్ది గంటల్లోనే నాటో ప్రతినిధి ఛార్లెస్ బౌచర్డ్ వివరణ ఇవ్వడానికి…

దురాక్రమణ సేనలపై వేసవి దాడులు మొదలుపెడతాం -తాలిబాన్

ఆఫ్ఘనిస్ధాన్‌ని ఆక్రమించిన అమెరికా, తదితర పశ్చిమ దేశాల దురాక్రమణ సేనలపై ఆదివారం నుండి తాజా దాడులు ప్రారంభిస్తున్నామని తాలిబాన్ ప్రకటించింది. దురాక్రమణ సేనలు, వారి గూఢచారులు, దురాక్రమణ దేశాల తొత్తు ప్రభుత్వ అధికారులు, వారి సైనికులపై దాడులు చేస్తామని తాలిబాన్ ప్రకటించింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ జోడు టవర్లను విమానాలతో కూల్చింది ఆల్-ఖైదా మిలిటెంట్లేనని నిశ్చయించుకున్న అమెరికా ఆల్-ఖైదాని అంతమొందించే పేరుతో ఆఫ్ఘనిస్ధాన్ పై దురాక్రమణదాడి చేసిన సంగతి విదితమే. ఆల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్…

బాంబుదాడిలో ఆఫ్ఘన్ ఆల్-ఖైదా నెం.2 మరణం -నాటో దురాక్రమణ సేనలు

అమెరికా నాయకత్వంలోని దురాక్రమణ సేనలు ఆఫ్ఘనిస్ధాన్ ఆల్-ఖైదా నెం.2 నాయకుడిని బాంబు దాడిలో చంపేశామని ప్రకటించాయి. ఆఫ్ఘనిస్ధాన్ లోని కూనార్ రాష్ట్రంలో రెండు వారాల క్రితం జరిపిన బాంబు దాడిలో ఆఫ్ఘనిస్ధాన్‌కి చెందిన ఆల్-ఖైదా సంస్ధకు నెం.2 నాయకుడిగా పేర్కొనదగ్గ “అబ్దుల్ ఘనీ” చనిపోయాడని అమెరికా నాయకత్వంలోని నాటో సేనలు తెలిపాయి. ఇతనిని అబు హాఫ్స్ ఆల్-నజ్ది అన్న పేరుతో కూడా సంబోధిస్తారు. సౌదీ అరేబియా దేశానికి చెందిన ఘనీ అనేక మంది అమెరికా సైనిక అధికారుల…

ది గ్రేట్ ఎస్కేప్: అమెరికా భద్రతా వ్యవస్ధను హేళన చేస్తూ 488 తాలిబాన్ ఖైదీల పరారీ

ఆఫ్ఘనిస్ధాన్‌లో అమెరికా సైన్యం, దాని తొత్తు ప్రభుత్వం ఖైదు చేసిన కాందహార్ జైలునుండి 488 మంది తాలిబన్ ఖైదీలు పరారయ్యారు. ఐదు నెలలపాటు తవ్వీన్ సొరంగం ద్వారా, డూప్లికేట్ తాళాలను ఉపయోగించి వీరు పరారయ్యారు. సర్పోజా జైలుగా పిలిచే ఈ జైలునుండి తాలిబాన్లు పరారు కావడం ఇది రెండో సారి. 2008 సంవత్సరంలో వెయ్యిమందికి పైగా ఖైదీలు ప్రధాన ద్వారం నుండే పరారయ్యారు. ఆ సంఘటన తర్వాత అమెరికా కాందహార్ జైలుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది.…

టెర్రరిస్టులకు ఐ.ఎస్.ఐ మద్దతునిస్తోంది -అమెరికా మిలట్రీ ఛీఫ్

ఆఫ్ఘనిస్ధాన్ టెర్రరిస్టులకు పాకిస్తాన్ గూఢచారి సంస్ధ ఐ.ఎస్.ఐ రహస్యంగా మద్దతునిస్తోందని అమెరికా మిలట్రీ ఉన్నతాధికారి “మైక్ ముల్లెన్” సంచలనాత్మక ఆరోపణ చేశాడు. మైక్ ముల్లెన్ పాకిస్తాన్ మిలట్రీ అధికారులతో చర్చల నిమిత్తం ఇస్లామాబాద్ లో ఉన్నాడు. ఆఫ్ఘనిస్ధాన్ మిలిటెంట్ల నాయకుడు జలాలుద్దీన్ హఖానీ నడుపుతున్న సంస్ధతో ఐ.ఎస్.ఐకి దీర్ఘకాలింగా గట్టి సంబంధాలు ఉన్నాయనీ ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికులను చంపడంలో ఈ సంస్ధ నిమగ్నమై ఉందనీ ఆరోపించాడు. ఆఫ్ఘనిస్ధాన్ లో టెర్రరిస్టు సంస్ధలుగా అమెరికా పరిగణించే సంస్ధలను…

సి.ఐ.ఏ హద్దు మీరుతోంది -అమెరికాకు పాకిస్తాన్ హెచ్చరిక

ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్, ఆల్-ఖైదా లపై యుద్ధానికి పాకిస్తాన్ పైనే పూర్తిగా ఆధారపడ్డ అమెరికా, ఇటీవలి కాలంలో పాకిస్తాన్ నుండి ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా పాకిస్తాన్ లో సి.ఐ.ఏ కార్యకలాపాల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం, మిలట్రీ, ఐ.ఎస్.ఐ లు ఆగ్రహంతో ఉన్నాయి. సి.ఐ.ఏ ఆధ్వర్యంలో నడిచే డ్రోన్ విమానాల దాడుల్లో వందలమంది పాకిస్తాన్ పౌరులు చనిపోతుండడంతో పాకిస్తాన్ ప్రజల్లో అమెరికా పట్ల విపరీతమైన ద్వేషం పెరిగింది. పాకిస్తాన్ అణ్వస్త్రాలను నిర్వీర్యం చేయడమే అమెరికా`ప్రభుత్వ అసలు ఉద్దేశమని కూడా…