ఇండియా మాకు మిలట్రీ సాయం చెయ్యాలి -ఆఫ్ఘన్

భారత దేశం తమకు మిలట్రీ సహాయం చేయాలని ఆఫ్ఘనిస్తాన్ మరోసారి గట్టిగా కోరింది. పాకిస్ధాన్ ఏమన్నా అనుకుంటుందేమో అన్న శంకతో తమకు సాయం చేయకుండా వెనక్కి తగ్గడం భావ్యం కాదని, ఆఫ్ఘనిస్ధాన్ భద్రత సక్రమంగా ఉంటే అది భారత దేశానికి కూడా భద్రత అవుతుందని గుర్తించాలని ఇండియాలో ఆఫ్ఘన్ రాయబారి షాయిదా అబ్దాలి స్పష్టం చేశారు. ది హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్దాలి ఈ మేరకు ఆఫ్ఘన్ కోరికను పునరుద్ధరించారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో…

2వేల ఆఫ్ఘన్లను సమాధి చేసిన రాక్షస భూపాతం -ఫోటోలు

నీళ్ళు ఎత్తైన ప్రదేశం నుండి కిందకు జారిపడితే జలపాతం. ఏకంగా భూమే ఎత్తైన చోటి నుండి జారిపడితే! భూపాతం? గాంధార దేశంలో ఈశాన్య మూలన ఎత్తైన కొండ వాలుల్లో నివసించే గ్రామాల్లో ఓ చిన్న గ్రామాన్ని అలాంటి భూపాతం తాకింది. కొండ వాలులు తప్ప నివశించడానికి మరో చోటే లేని ఈ ప్రాంతంపై కొండ చరియలు విరిగి పడడం, ప్రాణ నష్టం సంభవించడం కొత్త కాదు. కానీ ఈసారి జరిగిన దుర్ఘటనలో 2,000 మందికి పైగా మరణించారని…

నాటో దళాలపై తిరగబడ్డ ఆఫ్ఘన్ సైనికుడు, దాడిలో ఇద్దరి మరణం

ఆఫ్ఘనిస్ధాన్‌లో దురాక్రమణ సేనలపైన వారు శిక్షణ ఇస్తున్నామని చెబుతున్న ఆఫ్ఘన్ సైనికులే తిరగబడడం కొనసాగుతోంది. నాటో బలగాలను ఠారెత్తిస్తున్న ఇలాంటి దాడులు 2011 సంవత్సరంలో అమెరికా బలగాలకు తీవ్రం నష్టం చేకూర్చాయి. ఆఫ్ఘనిస్ధాన్‌లో అమెరికా తదితర నాటో దేశాల సైనికులకు అత్యంత భద్రత కలిగిన ప్రాంతం అని చెప్పుకుంటున్న ప్రాంతాల్లోనే ఇటువంటి ఘటనలు జరగడం విశేషం. ఆఫ్ఘనిస్ధాన్ రాజధాని నగరమైన కాబూల్, పష్తూనేతరులు నివసించే ఉత్తర రాష్ట్రాలు మిలిటెన్సీ తక్కువగా ఉన్న ప్రాంతాలనీ, భద్రమైన ప్రాంతాలనీ నాటో…