అమెరికా శాసిస్తుంది, ఇండియా పాటిస్తుంది!?

బిజెపి-ఆర్ఎస్ఎస్ పాలనలో, నరేంద్ర మోడి, అమిత్ షా ద్వయం హయాం లో ఇండియా పైన అమెరికా దాష్టీకం, పెత్తనం, కంట్రోల్ పెరిగిపోయిందన్న సూచనలు అమెరికా అధ్యక్షుడు, మంత్రులు, అధికారులు వరుసగా ఇస్తూనే ఉన్నారు. ఇండియా పైన తమ పెత్తనం సంపూర్ణం అన్న నమ్మకాన్ని వాళ్ళు తమ మాటల ద్వారా, ప్రకటనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా ఇవ్వటం కొనసాగుతూనే ఉన్నది. వారి సూచనల్లో ఎలాంటి తడబాటు లేకపోవటమే అత్యంత ఆందోళన కలిగిస్తున్న విషయం! రైసీనా డైలాగ్ పేరుతో భారత…