ఆపరేషన్ గ్లాడియో: పశ్చిమ దేశాల ముసుగు టెర్రరిజమే గురుద్వారా హత్యాకాండ?
ఆగస్టు 6 తేదీన అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో గురుద్వారా పై జరిగిన టెర్రరిస్టు దాడిలో ఆరుగురు సిక్కులు హతులైన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు అమెరికా పౌరులు కాగా నలుగురు భారత పౌరులు. ఈ హత్యాకాండలో పాల్గొన్నది ఒకే ఒక్క ‘దేశీయ టెర్రరిస్టు’ అని పశ్చిమ దేశాల పత్రికలు ముక్తకంఠంతో తెలిపాయి. ఆర్మీలో పని చేసి రిటైర్ అయిన ‘వేడ్ మైఖేల్ పేజ్’ ఈ దారుణానికి పాల్పడ్డాడనీ, అతను వైట్ సూపర్ మాసిస్టు సంస్ధలో చురుకైన కార్యకర్త…
