కేంద్ర ప్రభుత్వాన్ని పరుగెత్తిస్తున్న స్వామీజీ బంగారం కల

‘ఎద్దు ఈనింది అంటే దూడను కట్టెయ్యి’ అన్నాట్ట. మన జియోలాజికల్ సర్వే, ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళ తీరు చూడబోతే అలాగే ఉంది. ఒక ఆలయ పూజారి తనకు రాజు కలలో కనిపించి ఫలానా చోట బంగారం దాచి పెట్టానని చెప్పాడని చెప్పడంతోటే పలుగూ, పారా పట్టుకుని బయలుదేరిన జి.ఎస్.ఐ, ఎ.ఎస్.ఐ శాస్త్రవేత్తలను ఎలా అర్ధం చేసుకోవాలో అర్ధం కాకుండా ఉంది. ‘ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ కు దాదాపు 150 యేళ్ళ ఘన చరిత్ర ఉన్నది. చరిత్ర…