ఆగష్టు 16 దీక్షపై గుబులు? అన్నా హజారే పై కాంగ్రెస్ ముప్పేట దాడి!

ఆగష్టు 16 న లోక్‌పాల్ బిల్లుపై హజారే చేస్తానంటున్న నిరవధిక నిరాహార దీక్ష తేదీ దగ్గరు పడుతున్నకొద్దీ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పాటు, సచివులలో కూడా గుబులు పుట్టిస్తోంది. ఇన్నాళ్ళూ సామ, భేదో పాయాల్లో హజారేతో వ్యవహరిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాలు అంతిమంగా దండోపాయానికి దిగిన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వంలో రాజకీయ నాయకులు, అధికారులు పాల్పడే అవినీతిని విచారించడానికి సమర్ధవంతమైన లోక్‌పాల్ వ్యవస్ధను ఏర్పాటు చేయాలని అన్నా హాజారే నేతృత్వంలోని సామాజిక కార్యకర్తల బృందం…