ఆశిష్ నంది దళిత వ్యతిరేక వ్యాఖ్యలు, ఒక పరిశీలన

ఎస్.సి, ఎస్.టి, ఒ.బి.సి కులాలనుండి అత్యధికంగా అవినీతిపరులు వస్తున్నారని ఆశిష్ నంది చేసిన వ్యాఖ్యలు పెను దుమారం లేపాయి. దేశ వ్యాపితంగా ఆయనకి వ్యతిరేకంగా ఎస్.సి, ఎస్.టి అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు కావడంతో సదరు ఎఫ్ఐఆర్ లను కొట్టివేయాలని కోరుతూ ఆశిష్ నంది సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. భావోద్వేగాలు మిన్ను ముట్టిన వాతావరణంలో తనపై దాడి జరగవచ్చని ఆయన కోర్టుకి విన్నవించాడు. ఆశిష్ నంది విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆయన అరెస్టుపై…

అవినీతిని వదిలి ప్రజాస్వామిక చట్టాలపై ప్రధాని పోరాటం -కార్టూన్

ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ మధ్య కాలంలో చేస్తున్న ప్రకటనలు అత్యంత హాస్యాస్పదంగా ఉంటున్నాయి. అవినీతి నిర్మూలనకి చట్టం తెమ్మంటే అలా అడిగినవాడికి అవినీతిని అంటగడతారు. లోక్ పాల్ చట్టం తెమ్మంటే ప్రభుత్వాన్ని ప్రవేటు సంస్ధలు బ్లాక్ మెయిల్ చేయడాన్ని సహించనంటూ లక్షలాది కోట్ల అవినీతిపై పల్లెత్తు మాట మాట్లాడడు. పాలకుల, కంపెనీల అవినీతిని కొద్దో గొప్పో వెల్లడిస్తున్న సమాచార హక్కు చట్టం వల్ల ప్రవేటు వ్యక్తుల ప్రైవసీ హక్కులకి భంగం కనుక సవరిస్తానని హుంకరిస్తున్నాడు. సమాచార…

కమలమే హస్తమా? -కార్టూన్

‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ (ఐ.ఎ.సి) నేత అరవింద్ కేజ్రీవాల్, రాబర్ట్ వాద్రా అక్రమాస్తులపై ఆరోపణలు సంధించాక కాంగ్రెస్, బి.జె.పి ప్రతినిధుల మాటల్లో తేడా మసకబారింది. డి.ఎల్.ఎఫ్, వాద్రా కంపెనీల లావాదేవీల్లో తప్పేమీ లేదని కాంగ్రెస్ నాయకులు, మంత్రులు వెనకేసుకొస్తుంటే, వాద్రాపై అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలకు సాక్షాలు లేవని బి.జె.పి అధ్యక్షుడు నితిన్ గడ్కారీ వారికి వంతపాడాడు. లోక్ సభ ప్రతిపక్ష నాయకురాలు వాద్రా అవినీతిపై అసలు గొంతే ఎత్తలేదు. బి.జె.పి అధికార ప్రతినిధులు విలేఖరుల సమావేశాల్లో…

కాంగ్రెస్ మార్కు అవినీతి వ్యతిరేక పోరాటం -కార్టూన్

అన్నా హజారే, ఆయన బృందం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టాక వాళ్ళకి మద్దతు ఇవ్వని రాజకీయ పార్టీ లేదు. జాతీయ పార్టీలతో పాటు అనేకానేక ప్రాంతీయ పార్టీలు కూడా అన్నా పోరాటానికి మద్దతు ఇచ్చేందుకు క్యూలు కట్టారు. బి.జె.పి లాంటి పార్టీలు కార్యకర్తలను సరఫరా చేసి తెరవెనుక మద్దతు అందించాయి. అవినీతి సామ్రాట్టులుగా పేరుబడ్డవారు కూడా పత్రికా ప్రకటనలతో యధాశక్తి మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అయితే ఏకంగా పార్లమెంటులోనే అన్నాకి మద్దతుగా గొప్ప గొప్ప…

2జి స్పెక్ట్రం: జనవరి 11 లోపు వేలం వేయండి, లేదా… -సుప్రీం కోర్టు

2జి స్పెక్ట్రమ్ వేలం వేయడాన్ని పదే పదే వాయిదా వేయడం పట్ల సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆగస్టు 31 తో వేలం పూర్తి కావాలని సుప్రీం కోర్టు విధించిన గడువును వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కోర్టు మన్నిస్తూ జనవరి 11, 2013 లోపు వేలం ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించింది. జనవరి 18 కల్లా వేలంలో విజయం సాధించిన కంపెనీల జాబితా తనకు సమర్పించాలని కోరింది. లేనట్లయితే సంబంధిత అధికారులపై…

రాజకీయం దృష్టిలో ‘అవినీతి వ్యతిరేక ఉద్యమం’ -కార్టూన్

సంవత్సరం క్రితం అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం  దేశ వ్యాపితంగా ప్రకంపనలు సృష్టించింది. ఆయనకి మద్దతు ఇవ్వడానికి రాజకీయ నాయకులు పోటీలు పడ్డారు. ప్రతి రాష్ట్రంలోనూ పార్టీలకు అతీతంగా సీనియర్ల నుండి ఛోటా మోటా నాయకుల వరకూ అవినీతిపై ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తూ అన్నా ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న యెడ్యూరప్ప లాంటి వారు సైతం అప్పట్లో ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక మిగిలింది గాలి జనార్ధన రెడ్డి, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి లాంటివారేనని…

ఇండియాకి ఒలింపిక్స్ మెడళ్ళు ఎందుకు రావు? -కార్టూన్

ఒలింపిక్స్ సంరంభం ప్రారంభమై ఐదు రోజులు గడిచిపోయాయి పొరుగు దేశం చైనా 13 బంగారు పతకాలతో అగ్ర స్ధానంలో ఉండగా ఇండియా ఇంకా బంగారు ఖాతా తెరవనే లేదు. బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా, షూటర్ గగన్ నారంగ్, బాక్సర్ విజేందర్ సింగ్ ల పై బంగారు ఆశలు ఉన్నా అవి మినుకు మినుకు మంటున్నవే. గగన్ ఇప్పటికైతే ఒక తామ్ర పతకాన్ని మాత్రం అందించాడు. గతంలో హాకీ లో బంగారు పతాకం గ్యారంటీ అన్నట్లు ఉండేది. ఇప్పుడలాంటి…

అవినీతి నిర్లక్ష్యాల మూల్యం, స్కూల్ బస్సు రంధ్రంలోంచి జారి బాలిక మృతి

చెన్నైలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. స్కూలు బస్సులోపల ఉన్న రంధ్రంలోంచి జారిపడి రెండో తరగతి చదువుతున్న బాలిక చనిపోయింది. బస్సు వెనక చక్రాల కింద పడి నలిగిపోవడంతో ఆరేళ్ళ శృతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రవాణా అధికారుల వద్ద నెల క్రితమే స్కూలు బస్సు ఫిట్ నెస్ సర్టిఫికేట్ పొందినట్లు తెలుస్తోంది. బుధవారం జరిగిన ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించగా, ప్రజలు ఆగ్రహంతో బస్సుని తగలబెట్టారు. బస్సు డ్రైవర్ తో పాటు…

కర్ణాటకలో తెగిపడిన మరో తల -కార్టూన్

తమది భిన్నమైన పార్టీ (party with a difference) గా బి.జె.పి చెప్పుకుంటుంది. ఆచరణలో మాత్రం అంతేలేని విభేదాల పార్టీగా (party with unending differences) అనేకసార్లు రుజువు చేసుకుంది. బి.ఎస్.యెడ్యూరప్ప ఆశీస్సులతో సదానంద గౌడ కర్ణాటక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన పదకొండు నెలలకే అదే యెడ్యూరప్ప ఆగ్రహానికి గురై పదవి కోల్పోవడం అందుకు నిదర్శనం. సదానంద గౌడ పదవీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని 45 మంది ఎం.ఎల్.ఎ లతో సహా ఎగ్గొట్టిన జగదీష్ షెట్టర్,  యెడ్యూరప్ప అనుగ్రహం…

మాయావతి అవినీతి కేసు కొట్టివేత, సి.బి.ఐ అతి చేసిందని సుప్రీం వ్యాఖ్య

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి పై సి.బి.ఐ దాఖలు చేసిన అవినీతి కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. కోర్టు నుండి నిర్దిష్ట ఆదేశాలు లేకుండానే సి.బి.ఐ తనంతట తాను మాయావతి కోసమే ప్రత్యేకంగా ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేయడాన్ని తప్పు పట్టింది. తాజ్ కారిడార్ అవినీతి కేసులో అధికారుల అవినీతిని విచారించాలని కోర్టు చెపితే దాన్ని వదిలి మాయావతి పై ప్రత్యేకంగా కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించింది. సి.బి.ఐ తన అధికార పరిధిని అతిక్రమించి మాయావతి పై…

అవినీతి సహచరులను కాపాడుతున్నందుకు సోనియాపై యెడ్యూరప్ప ప్రశంసలు

కర్ణాటక మాజీ ముఖ్య మంత్రి యెడ్యూరప్ప కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పై ప్రశంసలు కురిపించాడు. సోనియా తో పాటు ఆమె పార్టీని కూడా యెడ్యూరప్ప ప్రశంసించాడు. బి.జె.పి లాగా కాకుండా కష్టాల్లో ఉన్న పార్టీ మంత్రులకు కాంగ్రెస్ గానీ, ఆ పార్టీ నాయకురాలు గానీ తోడు నిలుస్తారనీ, మద్దతునిచ్చి కాపాడుకుంటారని ఆయన పొగడ్తలు కురిపించాడు. కర్ణాటక ముఖ్య మంత్రి సదానంద గౌడ ను ‘మోసగాడి’ గా ఆయన తిట్టిపోసాడు. ఆరు నెలల తర్వాత తన ముఖ్య…

ఆడలేక ‘మద్దెల ఓడు’ అంటున్న సోనియా

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి సరైన అభ్యర్ధులను నిలబెట్టక పోవడమే కారణమని సోనియా గాంధీ చెపుతోంది. ఓటమి వల్ల యు.పి.ఏ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని విశ్వాసం వ్యక్తం చేసింది. యు.పి ఎన్నికల్లో పార్టీ బలహీనం కావడం వల్లే ఓట్లు పడలేదని తేల్చేసింది. ‘అధిక ధరలు’ పార్టీ అభ్యర్ధుల ఎన్నికల అవకాశాలను దెబ్బ తీసి ఉండవచ్చని కూడా ఆమె అంగీకరించింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేయవలసి ఉందని…

సంక్షోభంలో ‘అన్నా బృందం’, ఇద్దరు సభ్యులు దూరం

అన్నా బృందం ఐక్యత సంక్షోభంలో పడింది. ఇటీవల జరిగిన పరిణామాల పర్యవసానంగా బృందంలో ఇద్దరు ప్రముఖ సభ్యులు బృందం కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకోవడంతో బృందం బలహీనపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పి.వి.రాజగోపాల్, ‘వాటర్ మేన్’ రాజీందర్ సింగ్ లి మంగళవారం కోర్ గ్రూపునుండి తప్పుకోవాలన్న తమ ఉద్దేశ్యాన్ని బహిరంగపరిచారు. అన్నా బృందం రాజకీయ లక్షణాలను సంతరించుకుంటున్నదని వీరు భావిస్తుండడంతో వీరీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కోర్ సభ్యులతో సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకోవడంతో తమవి కాని నిర్ణయాలకు బాధ్యత…

పట్టేవాడుంటే యు.పి.ఎ అవినీతి పుట్టలో బోలెడు అవినీతి “నోట్”లు

మంత్రుల మధ్య “నోట్”ల రూపంలో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రధానమంత్రి కార్యాలయానికి వివిధ మంత్రులు పంపిన “నోట్”లు ఇప్పుడు 2జి కుంభకోణంలో కొత్త పాత్రధారులను వెలికి తెస్తున్నాయి. ఆర్.టి.ఐ చట్టాన్ని ఉపయోగిస్తూ ఆర్.టి.ఐ కార్యకర్తలు ఈ నోట్ లను వెల్లడి చేయడంతో అప్పటి ఆర్ధిక మంత్రి పి.చిదంబరం, ప్రధాని మన్మోహన్ లు కూడా తెలిసీ 2జి కుంభకోణాన్ని అడ్డుకోలేదని వెల్లడయ్యింది. ఎ.రాజా, దయానిధి మారన్ లు అడ్డంగా అవినీతికి పాల్పడుతుంటే, అడ్డుకుని దేశ సంపదను కాపాడవలసింది పోయి,…

2జి స్పెక్ట్రం కేటాయింపులపై చిదంబరం ప్రధానికి రాసిన నోట్ ఇదే

2జి స్పెక్ట్రం కేటాయిస్తూ అప్పటి టెలికం మంత్రి ఎ.రాజా 122 లైసెన్సులు జారీ చేయడానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ లు జారీ చేసిన ఐదు రోజుల తర్వాత చిదంబరం ప్రధానికి ఈ నోట్ పంపాడు. దానిలో జరిగింది వదిలేద్దామని, ఇక ముందు జాగ్రత్తపడదామనీ చిదంబరం, ప్రధానికి సూచించాడు. వాస్తవానికి అప్పటికి ప్రధాని, ఆర్ధిక మంత్రి తలచుకున్నట్లయితే ఎ.రాజా లైసెన్సులు జారీ చేయకుండా అడ్డుకోగల అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. జనవరి 10 నాటికి లెటర్ ఆఫ్ ఇంటెంట్…