గడ్డాఫీ చేజారుతున్న లిబియా, లిబియానుండి వెళ్ళిపోతున్న విదేశీయులు

  65 లక్షల జనాభా గల ఎడారి దేశం లిబియా క్రమంగా గడ్డాఫీ చేజారుతోంది. విదేశాల్లో లిబియా తరపున నియమించబడిన రాయబారులు ఒక్కొక్కరు గడ్డాఫీకి ఎదురు తిరుగుతున్నారు. సైనికులు గడ్డాఫీకి వ్యతిరేకంగా ఆందోళనకారుల్లో చేరిపోతున్నారు. వ్యతిరేకులుగా మారిన సైనిక బ్యారక్ లపై ప్రభుత్వ దళాలు విమానాలనుండి బాంబు దాడులు చేస్తున్నారు. హింసాత్మకంగా మారుతున్న లిబియానుండి విదేశీయులు తమ తమ స్వస్ధలాలకు వెళ్ళిపోతున్నారు. వివిధ దేశాల ప్రభుత్వాలు విమానాల ద్వారా, ఓడల ద్వారా తమ దేశీయులను వెనక్కి రప్పించుకుంటున్నాయి.…

బలహీన పడుతున్న గడ్డాఫీ, వదిలి వెళ్తున్న మద్దతుదారులు

  42 సంవత్సరాల నుండి లిబియాను ఏకచ్ఛత్రాధిపత్యంతో ఏలిన కల్నల్ మహమ్మద్ గడ్డాఫీని మద్దతుదారులు ఒక్కొక్కరు వదిలి ఆందోళనకారులకు మద్దతు తెలుపుతుండడంతో క్రమంగా బలహీన పడుతున్నాడు. రెండు తెగలు కూడా ఆందోళనకారులకు మద్దతు తెలిపాయి. ఆందోళనకారులపై హింసను ప్రయోగించడాన్ని ఆ తెగల పెద్దలు తప్పు పట్టారు. లిబియాలో అది పెద్ద తెగ “వార్ఫ్లా” కూడా ఆ తెగల్లో ఉండటం గమనార్హం. లిబియా తరపున ఇండియా కు రాయబారిగా ఉన్న అలీ అల్-ఎస్సావీ భద్రతా దళాల దాడులను, కాల్పులను…

మొరాకోలో రాజకీయ సంస్కరణలు కోరుతూ ప్రదర్శనలు

గత డిసెంబరులో ట్యునీషియాలో ప్రారంభమై అక్కడి అధ్యక్షుడిని జనవరికల్లా దేశం నుండి పారిపోయేలా చేసిన అరబ్ ప్రజా ఉద్యమ తుఫాను కొద్దో గొప్పో ధనిక దేశమైన మొరాకోను సైతం తాకింది. మొరాకో రాజు మొహమ్మద్ VI, తన అధికారాల్లో కొన్నింటిని వదులుకొని ప్రజాస్వామిక పరిపాలనకు మార్గం సుగమం చేయాలని డిమాండ్ చేస్తూ మొరాకో ప్రజలు దేశం లోని వివిధ పట్టణాలలో ప్రదర్శనలు నిర్వహించారు. రాజధాని “రాబత్” లో ప్రదర్శన పార్లమెంటు వరకు వెళ్ళటానికి పోలీసులు అనుమతించారు. “బానిసలకోసం…