సామ్రాజ్యవాదుల ఆధ్వర్యంలో లిబియా విప్లవం

విక్టర్ నీటో వెనిజులాకి చెందిన కార్టూనిస్టు. ఈ కార్టూను మొదట ఆయన బ్లాగులోనూ, తర్వాత మంత్లీ రివ్యూ పత్రిక ఇండియా ఎడిషన్ లోనూ ప్రచురితమయ్యింది. సాధారణంగా ఏదైనా దేశంలో విప్లవాలు సంభవిస్తే వాటికి ప్రజల చొరవ ప్రధానంగా ఉంటుంది. అలా ప్రజల చొరవ ఉంటేనే ఏ విప్లవమైనా విప్లవం అనిపించుకుంటుంది. కానీ లిబియాలో గడ్డాఫీకి వ్యతిరేకంగా చెలరేగిందని చెబుతున్న విప్లవానికి సామ్రాజ్యవాద దేశాలయిన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు నాయకత్వం వహిస్తున్నాయి. లిబియా అధ్యక్షుడు గడ్డాఫీ సేనలు…

లిబియాపై దాడులు మరింత తీవ్రం చేయాలి -ఫ్రాన్సు, ఇంగ్లండ్

లిబియాపై నాటో ప్రస్తుతం చేస్తున్న దాడులు సరిపోలేదనీ, దాడుల తీవ్రత పెంచాలనీ ఫ్రాన్సు, బ్రిటన్ ప్రభుత్వాలు డిమాండ్ చేశాయి. ఫ్రాన్సు, ఇంగ్లండ్ లు కూడా నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) లో సభ్యులే. లిబియాపై నో-ఫ్లై జోన్ అమలు చేయడానికి నాయకత్వం వహించడానికి అమెరికా తిరస్కరించడంతో నాటో నాయకత్వ పాత్ర నిర్వహిస్తోంది. గడ్డాఫీ విమానదాడులనుండి లిబియా పౌరులను రక్షించడానికి నో-వ్లై జోన్ అమలు చేయాలనీ, లిబియా పౌరులను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలనూ తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి…

ఇద్దరు పుత్రులతో సహా ముబారక్ ను అరెస్టు చేసిన ఈజిప్టు మిలట్రీ ప్రభుత్వం

ఈజిప్టు ప్రజల ఉద్యమం దెబ్బకు గద్దె దిగిన ఈజిప్టు నియంత ముబారక్, అతని ఇద్దరు పుత్రులను ఈజిప్టు తాత్కాలిక సైనిక ప్రభుత్వం బుధవారం నిర్బంధంలోకి తీసుకుంది. ముబారక్ తో పాటు, అతని కుటుంబ సభ్యులు తమ పాలనలో తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారనీ, వారితో కుమ్మక్కైన సైనిక ప్రభుత్వం విచారణ జరగకుండా కాలం గడుపుతోందనీ ఆరోపిస్తూ ఈజిప్టు ప్రజలు మళ్ళీ తాహ్రిరి కూడలి వద్ద బైఠాయింపు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మళ్ళీ ప్రజా ఉద్యమం ప్రారంభమైనాక సైనికుల కాల్పుల్లో…

సి.ఐ.ఏ హద్దు మీరుతోంది -అమెరికాకు పాకిస్తాన్ హెచ్చరిక

ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్, ఆల్-ఖైదా లపై యుద్ధానికి పాకిస్తాన్ పైనే పూర్తిగా ఆధారపడ్డ అమెరికా, ఇటీవలి కాలంలో పాకిస్తాన్ నుండి ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా పాకిస్తాన్ లో సి.ఐ.ఏ కార్యకలాపాల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం, మిలట్రీ, ఐ.ఎస్.ఐ లు ఆగ్రహంతో ఉన్నాయి. సి.ఐ.ఏ ఆధ్వర్యంలో నడిచే డ్రోన్ విమానాల దాడుల్లో వందలమంది పాకిస్తాన్ పౌరులు చనిపోతుండడంతో పాకిస్తాన్ ప్రజల్లో అమెరికా పట్ల విపరీతమైన ద్వేషం పెరిగింది. పాకిస్తాన్ అణ్వస్త్రాలను నిర్వీర్యం చేయడమే అమెరికా`ప్రభుత్వ అసలు ఉద్దేశమని కూడా…

సైనిక ప్రభుత్వంపై పెరుగుతున్న ఈజిప్టు ప్రజల ఆగ్రహం

ఈజిప్టు ప్రజల్లొ సైనిక ప్రభుత్వంపై రోజు రోజుకీ ఆగ్రహం పెరుగుతోంది. తాము మూడు వారాల పాటు ఉద్యమించి నియంత ముబారక్ ను గద్దె దింపినప్పటికీ ముబారక్ పాలన అంతం కాలేదన్న అసంతృప్తి వారి ఆగ్రహానికి కారణం. ముబారక్ పాలనలో వ్యవహారాలు నడిపినవారే ముబారక్ ను సాగనంపిన తర్వాత కూడా కొనసాగుతుండడం, వారే ఇంకా నిర్ణయాలు తీసుకునే స్ధానంలొ కొనసాగడం వారికి మింగుడుపడడం లేదు. తాము సాధించామనుకున్న విప్లవం, మార్పు నామమాత్రంగా మిగిలిపోతున్న సూచనలు కనిపిస్తుండడంతో ఈజిప్టు ప్రజల్లో…

పశ్చిమదేశాల విమాన దాడుల్లో లిబియా పౌరుల దుర్మరణం

పశ్చిమ దేశాల రక్తదాహానికి అంతులేకుండా పోతోంది. ఇరాక్ పై దాడికి ముందుగానే ఆంక్షల పేరుతో లక్షలాది ఇరాకీ పసిపిల్లల ఉసురు పోసుకున్నాయి. పసిపిల్లల పాల డబ్బాల రవాణాపై కూడా ఆంక్షలు విధించడంతో పోషకార లోపంవలన లక్షలాదిమంది ఇరాకీ పిల్లలు చనిపోయారు. సంవత్సరాల తరబడి విచక్షణా రహితంగా బాంబు దాడులు చేసి లక్షలమంది రక్తమాంసాల్ని ఆరగించాయి. ఆఫ్ఘనిస్తాన్ పై దురాక్రమణ దాడి చేసి మిలియన్లమంది పౌరులను చంపిన సంగతి వికీలీక్స్ బైట పెట్టిన ఆఫ్ఘన్ యుద్ధ పత్రాల ద్వారా…

లిబియా తిరుగుబాటుదారులకు రహస్య ఆయుధ సాయానికి ఒబామా ఆదేశం

అనుకున్నంతా అయ్యింది. అమెరికా ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని అతిక్రమిస్తూ లిబియా తిరుగుబాటుదారులకు రహస్యంగా ఆయుధాలు అందించడానికి నిర్ణయించాడు. అమెరికా ప్రభుత్వ అధికారులు కొందరిని ఉటంకిస్తూ రాయిటర్స్ సంస్ధ ఈ వార్త ప్రచురించింది. తిరుగుబాటుదారులకు రహస్యంగా ఆయుధాలు అందించే రహస్య ఉత్తర్వుపై ఒబామా సంతకం చేశాడని ఆ సంస్ధ తెలిపింది. గత కొద్ది వారాల్లో “ప్రెసిడెన్షియల్ ఫైండింగ్’ అని పిలవబడే ఆదేశంపై ఒబామా సంతకం చేశాడు. సీఇఏ చేపట్టే అటువంటి రహస్య కార్యకలాపాలకు చట్టపర ఇబ్బందులు ఎదురు కాకుండ…

ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలో అమెరికా ఆయుధ పోటీ -చైనా శ్వేతపత్రం

ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలొ అమెరికా ఆయుధ పోటీ పెంచుతున్నదని చైనా అభిప్రాయపడింది. చైనా ప్రభుత్వం జారీ చేసిన ‘జాతీయ రక్షణ శ్వేత పత్రం’ లో చైనా, దాని చుట్టూ ఉన్న రక్షణ పరిస్ధితులను విశ్లేషించింది. ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలో అమెరికా మిలట్రీ ఉనికి పెరుగుతున్నదని శ్వేత పత్రం తెలిపింది. ఈ ప్రాంతంలోని సైనిక చర్యలు అంతిమంగా చైనాకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడి ఉన్నాయని పత్రం తెలిపింది. భద్రతాంశాలపై చైనా దృక్పధాన్నీ, తన రక్షణ బలగాల గురించిన సమగ్ర దృక్పధాన్ని శ్వేత పత్రం…

మళ్ళీ పురోగమిస్తున్న గడ్డాఫీ బలగాలు, ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని అతిక్రమించే దిశలో పశ్చిమ దేశాలు

గడ్డాఫీ బలగాల ధాటికి లిబియా తిరుగుబాటు బలగాలు మళ్ళీ వెనక్కి పారిపోతున్నాయి. పశ్చిమ దేశాల వైమానిక దాడుల మద్దతు లేకుండా తిరుగుబాటు బలగాలు పురోగమించడం అసాధ్యమని స్పష్టమై పోయింది. గడ్డాఫీకి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టిన పౌర సైన్యానికి శిక్షణ కొరవడడంతో తాము స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్ని నిలబెట్టుకోలేక పోతున్నాయి. పశ్చిమ దేశాల వైమానిక దాడులతో స్వాధీనం చేసుకున్న పట్టణాలను తిరుగుబాటు దారులు వదిలిపెట్టి తూర్పువైపుకు పారిపోతున్నాయి. దీనితో ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని అతిక్రమిస్తూ తిరుగుబాటు బలగాలకు ఆయుధ సాయం…

అమెరికాతో ‘ఎస్.ఒ.ఎఫ్.ఏ’ ఒప్పందం కుదుర్చుకోవాలని ఇండియాపై అమెరికా ఒత్తిడి

అమెరికాతో ఇండియా “సోఫా” ఒప్పందం (ఎస్.ఓ.ఎఫ్.ఏ) ఒప్పందం కుదుర్చుకోవాలని ఇండియాపై తీవ్ర ఒత్తిడి తెచ్చిన సంగతి వికీలీక్స్ వెల్లడించిన కేబుల్ ద్వారా బయటపడింది. అమెరికా రాయబార కార్యాలయానికి చెందిన ఉప ప్రధానాధికారి ఆగష్టు 16, 2005 తేదీన రాసిన కేబుల్ నెం. 38759 ద్వారా ఈ విషయం వెల్లడయ్యింది. మిలట్రీ డ్రిల్లు నిమిత్తం ఇండియా వచ్చే మిలట్రీ అధికారులకు, రాజకీయ, రాయబార అధికారులకు ఇచ్చిన విధాంగానే “డిప్లోమేటిక్ ఇమ్యూనిటీ” (రాయబార కార్యాలయ ఉద్యోగులకు వారు నియమించబడిన దేశాల…

పశ్చిమ దేశాల దాడుల్లో వందకు పైగా లిబియన్ల మరణం, కొనసాగుతున్న దురాక్రమణ దాడులు

లిబియాపై నో-ఫ్లై జోన్ అమలు చేసే పేరుతో పశ్చిమ దేశాల యుద్ద విమానాలు విచక్షణా రహితంగా చేస్తున్న దాడుల్లొ ఇప్పటికి వందకు పైగా లిబియా పౌరులు మరణించినట్లు లిబియా ప్రభుత్వం ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి తీర్మానం గడ్డాఫీకి చెందిన భూతల సైనిక దళాలపై దాడులకు అనుమతి ఇవ్వలేదనీ, అయినా పశ్చిమ దేశాలు గడ్డాఫీ సైనికులపై వైమానిక దాడులు చేస్తుండడం ఆమోదనీయం కాదనీ రష్యా విదేశాంగ మంత్రి “సెర్గీ లావరోవ్” రాయిటర్స్ వార్తా సంస్ధతో మట్లాడుతూ అన్నాడు. గడ్డాఫీ…

‘ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం’పై అమెరికాకు ప్రోగ్రెస్ రిపోర్టు సమర్పించుకున్న భారత ప్రభుత్వం -వికీలీక్స్ – 1

శ్రీశ్రీ గారి మహా ప్రస్ధానం రచనకు గుడిపాటి చలం ముందుమాట రాశారు. అందులో ఆయన “కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచం బాధ శ్రీశ్రీ కి బాధ” అని చమత్కరించారు. అది చమత్కారమే అయినా వాస్తవం కూడా ఉంది, అది వేరే సంగతి. అమెరికా విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. అమెరికాకి ఏ భాధ వచ్చినా దాన్ని ప్రపంచానికి అంటగడుతుంది. ఎయిడ్స్ జబ్బుని అలాగే అంటగట్టింది. “టెర్రరిజం పై సమరా”న్ని కూడా అలాగే అంటగట్టింది. తాజాగా ఆర్ధిక…

సంకీర్ణ సేనల దాడుల సాయంతో కీలక పట్టణం తిరుగుబాటుదారుల స్వాధీనం

పశ్చిమ దేశాల సంకీర్ణ సేనల భారీగా దాడులు చేస్తుండడంతో గడ్డాఫీ బలగాలు కీలకమైన అజ్దాబియా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. లిబియా తూర్పు ప్రాంతానికి ముఖ ద్వారంగా చెప్పుకునే అజ్దాబియా కోల్పోవడంతో గడ్డాఫీ బలగాల పురోగమనం ఆగిపోయినట్లే. దాదాపు రెండు వారాలనుండి తిరుగుబాటుదారుల నుండి ఒక్కొక్క పట్టణాన్నీ స్వాధీనం చేసుకుంటూ వెళ్తున్న గడ్డాఫీ బలగాలకు పశ్చిమ దేశాల సైనిక చర్య గట్టి దెబ్బ తీసింది. తిరుగుబాటుదారుల ప్రతిఘటన కారణంగా కాకుండా పశ్చిమ దేశాల దాడుల వలన అజ్దాబియాని చేజిక్కించుకున్న…

లిబియా దాడులతో స్పష్టమైన అమెరికా బలహీనత -న్యూ డెమొక్రసీ నాయకుడు

లిబియా పై పశ్చిమ దేశాలు తలపెట్టిన దాడుల ద్వారా అమెరికా బలహీన పడిందని రుజువైందని సి.పి.ఐ (ఎం.ఎల్ – న్యూ డెమొక్రసీ) నాయకులు పి. ప్రసాద్ అన్నారు. లిబియాపై పశ్చిమ దేశాలు జరుపుతున్న దుర్మార్గ దాడులకు నాయకత్వం వహించడానికి అమెరికా సంసిద్ధంగా లేదని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ రాబర్ట్ గేట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ల దురాక్రమణ యుద్ధాల్లో పీకల దాకా కూరుకు పోయి బైట పడలేక సంగతి మన కళ్ళ ముందున్నదనీ,…

లిబియా – ఓవైపు అంతర్యుద్ధం, మరోవైపు పశ్చిమ దేశాల దాడులు

లిబియాపై పశ్చిమ దేశాలు అధునాతన యుద్ధ విమానాలతో క్షిపణి దాడులు జరుపుతుండగా, మరోవైపు గడ్డాఫీ బలగాలు, తిరుగుబాటు బలగాల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమ దేశాల దాడులపై అంతర్జాతీయంగా వ్యతిరేకత పెరుగుతున్నది. ఆఫ్రికన్ యూనియన్ దేశాలు పశ్చిమ దేశాల దాడులను ఖండించాయి. నో-ఫ్లై జొన్ అమలు చేయడానికి మద్దతిచ్చిన అరబ్ లీగ్ సైతం భారీ దాడులు జరపడం పట్లా, పౌరులు చనిపోవడం పట్లా అసంతృప్తి వ్యక్తం చేసింది. పశ్చిమ దేశాల ఉద్దేశాల పట్ల అనుమానాలు వ్యక్త…