నేను అన్నాను కాలేను -అరుంధతీ రాయ్ (అనువాద వ్యాసం) -2
‘ప్రజలు’ అంటే జన్ లోక్ పాల్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆమోదించకుంటే చివరికంటా నిరాహార దీక్ష చేసి చనిపోతానని ఒక 74 ఏళ్ళ వ్యక్తి కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరిస్తున్న దృశ్యాన్ని వీక్షించడానికి జమ కూడినవారు మాత్రమే. ఆకలిగొన్నవారికోసం చేపలు, రొట్టెలను యేసు క్రీస్తు అనేక రెట్లు పెంచిన పద్ధతిలో, టి.వి ఛానెళ్ళు తమ అద్భుత మాయాజాలంతో మిలియన్లకు పెంచగలిగన పదుల వేల మంది మాత్రమే ప్రజలు. “ఒక బిలియన్ మంది (వంద కోట్లు) ఒకే గొంతుకతో ‘ఇండియాయే…