నేను అన్నాను కాలేను -అరుంధతీ రాయ్ (అనువాద వ్యాసం) -2

‘ప్రజలు’ అంటే జన్ లోక్ పాల్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆమోదించకుంటే చివరికంటా నిరాహార దీక్ష చేసి చనిపోతానని ఒక 74 ఏళ్ళ వ్యక్తి కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరిస్తున్న దృశ్యాన్ని వీక్షించడానికి జమ కూడినవారు మాత్రమే. ఆకలిగొన్నవారికోసం చేపలు, రొట్టెలను యేసు క్రీస్తు అనేక రెట్లు పెంచిన పద్ధతిలో, టి.వి ఛానెళ్ళు తమ అద్భుత మాయాజాలంతో మిలియన్లకు పెంచగలిగన పదుల వేల మంది మాత్రమే ప్రజలు. “ఒక బిలియన్ మంది (వంద కోట్లు) ఒకే గొంతుకతో ‘ఇండియాయే…

మా మూడు డిమాండ్లు ఒప్పుకుంటే దీక్ష విరమిస్తా -ప్రధానికి అన్నా లేఖ

శుక్రవారం అన్నా హజారే ప్రధానికి మరొక లేఖ రాశాడు. తమ మూడు కీలక డిమాండ్లను అంగీకరిస్తే దీక్ష విరమిస్తానని ప్రకటించాడు. సివిల్ సర్వెంట్లు అంతా లోక్ పాల్ చట్టం పరిధిలోకి తేవాలి; అన్ని ప్రభుత్వ కార్యాలయాలలోనూ ‘సిటిజన్ చార్టర్’ ను ప్రదర్శించాలి; అన్ని రాష్ట్రాలూ లోకాయుక్త ను నియమించుకోవాలి. ఈ మూడు డిమాండ్ల తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదించాలని అన్నా కోరాడు. డిమాండ్లు అంగీకరించడంతో సరిపెట్టకుండా ఆ మేరకు చట్టాన్ని ఆమోదిస్తేనే దీక్ష విరమిస్తానని అన్నా తెలిపాడు. “ఈ…

జన్‌లోక్ పాల్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ప్రధాని అంగీకారం, దీక్ష మానాలని వినతి

అన్నా బృందం డిమాండ్ చేస్తున్నట్లుగా “జన్ లోక్ పాల్ బిల్లు” ని పార్లమెంటు ముందు ప్రవేశపెట్టడానికి అంగీకరిస్తున్నట్లు ప్రధాని మన్మోహన్ అన్నాకు రాసిన ఉత్తరంలో ప్రకటించాడు. ఎనిమిది రోజుల నిరాహార దీక్షను ఇంతటితో ఆపివేయాలని ప్రధాని తన లేఖలో కోరాడు. నెల రోజుల పాటు దేశంలోని ఇతర ప్రధాన సమస్యలనుండి పత్రిల కేంద్రీకరణను తనవైపుకు తిప్పుకున్న అన్నా హజారే అవినీతి వ్యతిరేక నిరవధిక నిరాహార దీక్ష మరి కొన్ని గంటల్లో ముగిసే అవకాశం కనిపిస్తోంది. అన్నా హజారే…

అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం సంపూర్ణమైనదేనా?

భారత దేశానికి స్వాతంత్రం తేవడానికి ఏర్పడిందంటున్న కాంగ్రెస్ పార్టీ నిజానికి 1920 ల వరకూ సంపూర్ణ స్వాతంత్ర్యం అన్న నినాదం ఇవ్వలేదు. అంటే అప్పటివరకూ జరిగిన ఉద్యమం కొన్ని రాయితీల కోసమే జరిగింది. నామమాత్ర ఎన్నికలు నిర్వహించడం, పాలనలో భారత లెజిస్లేచర్ల అభిప్రాయాలు కూడా పరిగణించడం (అమలు చేయాలని రూలేమీ లేదు) ఇత్యాధి రాయితీల కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ (గాంధీతో సహా) ఉద్యమించింది. ఆ తర్వాత అతివాదుల ప్రాబల్యం, కమ్యూనిస్టు విప్లవకారుల ఉద్యమ వ్యాప్తి అన్నీ…

నేనున్నా లేకున్నా ఈ జ్యోతిని ఆరనివ్వకండి -తీహార్ వద్ద అన్నా

“నేనిక్కడ ఉన్నా లేకున్నా మండుతున్న ఈ జ్యోతిని మాత్రం ఆర్పకండి. భారత దేశం అవినీతి బంధనాలను తెంచుకునేవరకూ ఈ జ్యోతి మండుతూనే ఉండాలి” తీహార్ జైలునుండి బైటికి వచ్చిన అనంతరం తనను చూడడానికి, ఉద్యమంలో పాల్గొనడానికి వచ్చిన వేలమంది మద్దతుదారులను చూసి, ఉద్వేగభరితుడైన అన్నా హజారే అన్న మాటలివి. ఇంతకుమున్నెన్నడూ లేని రీతిలో ప్రజానీకం అన్నా హజారేను జైలునుండి వెలుపలికీ ఆహ్వానించడానికి పెద్ద సంఖ్యలో హాజరైనారు. మూడు రోజుల పాటు జైలులో గడిపిన హజారే, శక్తివంతమైన లోక్…

తమ ఆరు షరతులను ఉపసంహరించుకున్న పోలీసులు, రాంలీలా మైదాన్లో దీక్ష

అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్షకు ఢిల్లీ పోలీసులు మంగళవారం 22 షరతులు విధించారు. అందులో 16 షరతులను అంగీకరించిన అన్నా హజారే బృందం మిగిలిన 6 షరతులను తిరస్కరించింది. ఆ షరతులను ఇక్కడ చూడవచ్చు. షరతులను ఆమోదించనందున అన్నా బృందాన్ని అరెస్టు చేసిన పోలీసులు వారిని కోర్టుకు హాజరు పరచడంతో తీహారు జైలులో వారం రోజుల రిమాండ్ కు కోర్టు తరలించింది. అక్కడి నుండి ఢిల్లీ పోలీసులకు, కేంద్ర ప్రభుత్వానికి కష్టాలు మొదలయ్యాయి. తీహార్ జైలుకి…

తలొగ్గిన ప్రభుత్వం, అన్నా హజారే దీక్షకు అనుమతి, జె.పి.పార్క్‌లో దీక్ష (అప్‌డేట్స్ తో)

అప్ డేట్ (2): యోగా గురు రాందేవ్, ఆర్ట్ ఆఫ్ లిగింగ్ ఫౌండేషన్ శ్రీ శ్రీ రవి శంకర్ లు కూడా తీహార్ జైలు బయట ఉన్న నిరసనకారులతో జత కలిసారు. రవి శంకర్, జైలు లోపలకి వెళ్ళి హజారేని కలిసినట్లు తెలుస్తోంది. అంతకుముందు బాబా రాందేవ్ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ని కలిసి హజారే అరెస్టుకి వ్యతిరేకంగా మెమొరాండం ఇచ్చాడు. నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాందేవ్, ప్రజాస్వామ్యం పేరుతో ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించాడు. అప్…

అన్నా హజారే అరెస్టుపై దేశ వ్యాపిత స్పందన -ఫోటోలు

సమర్ధవంతమైన లోక్ పాల్ బిల్లును పార్లమెంటు ముందు ప్రవేశపెట్టాలనీ, లోక్ పాల్ పరిధిలోనికి ప్రధాని, ఛీఫ్ జస్టిస్ లను తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పౌర సమాజ కార్యకర్త అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్షకు తలపెట్టడంతో పోలీసులు ముందుగానే అరెస్టు చేశారు. బెయిల్ కోసం పోలీసులు విధించిన షరతులను నిరాకరించడంతో అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్, శాంతి భూషణ్, కిరణ్ బేడీ లను కోర్టు ఏడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ పరిణామాల క్రమంలొ దేశవ్యాపితంగా…

ఆగష్టు 15 న రాజ్‌ఘాట్ వద్ద అన్నా హజారే దీక్ష -ఫొటోలు

ఆగష్టు 15, 2011 తేదీన అన్నా హజారే తలవని తలంపుగా గాంధీ సమాధి వద్ద ప్రత్యక్షమయ్యారు. ముందుగా సమాచారం లేని సందర్శన కావడంతో పోలీసులు తొలుతు హడావుడి పడినా తర్వాత సర్దుకున్నారు. నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటానని చాలా రోజుల్నిండి హెచ్చరిస్తూ వస్తున్న అన్నా హజారే రాజ్ ఘాట్ వద్ద ఆపని చేయడానికి వచ్చాడేమో నని పోలీసులు కంగారు పడ్డారని తెలిసింది. స్వతంత్రం భారతంలో నాయకుల అవినీతి పెచ్చుమీరడం పట్ల తన ప్రార్ధనలో ఆవేదన చెందానని ఆయన…