మీ ఇష్టారీతిన జోక్యం చేసుకుంటే ప్రజాస్వామ్యం ఉంటుందా? -సుప్రీం కోర్టు

బిజెపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏఏపి ఆధ్వర్యం లోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ని ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను ఈ రోజు సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రంగా అభిశంచింది. (అభిశంసన అన్న పదాన్ని టెక్నికల్ అర్ధంలో రాయలేదు. పాఠకులు గమనించగలరు.) మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసిడి) కి చెందిన స్టాండింగ్ కమిటీ లో 6వ…

నల్ల డబ్బుపై సిట్ నియామకం సుప్రీం కోర్టు అతి -రివ్యూ పిటిషన్‌లో కేంద్రం

సుప్రీం కోర్టు అతిగా వ్వవహరిస్తోందని కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. విదేశాల్లో దాచిన నల్లడబ్బును వెనక్కి తెప్పించడానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో “స్పెషల్ ఇన్‌వెస్టిగేషన్ టీం” ను నియమించడంలో సుప్రీం కోర్టు తన పరిధికి మించి వ్యవహరించిందని ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. సిట్ నియామకంపై జారీ చేసిన ఉత్తర్వును సమీక్షించాలని తన పిటిషన్‌లో కోరింది. ఇది “న్యాయవ్యవస్ధ అతి” అని పిటిషన్ లో కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది. రిటైర్డ్ సుప్రీం…