కుదంకుళం ‘అణు వ్యతిరేక’ ఆందోళనలు, నాలుగు ఎన్.జి.ఓ లపై కేసులు

రష్యా సహాయంతో నిర్మించిన తమిళనాడు, కుదంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేకంగా జరుగుతున్నా ప్రజాందోళనలకు ఆర్ధిక సహాయం చేసి రెచ్చగొడుతున్నాయన్న ఆరోపణలతో నాలుగు ఎన్.జి.ఓ (నాన్-గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్) సంస్ధలపైన కేసులు నమోదు చేయడానికి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రెండు సంస్ధలపై సి.బి.ఐ కేసు నమోదు చేయగా, మరో రెండింటిపైన తమిళనాడు పోలీసులు కేసులు పెట్టారని కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి ఆర్.కె.సింగ్ మంగళవారం విలేఖరులకు తెలిపాడు. కుదంకుళం కర్మాగారానికి వ్యతిరేకంగా అమెరికా, స్కాండినేవియా దేశాలు ఆందోళనకు రెచ్చగొడుతున్నాయని ప్రధాని ఆరోపించిన…

కుదంకుళం ఆందోళనల అనుమానంతో జర్మన్ దేశీయుడిని గెంటేసిన భారత ప్రభుత్వం

తమిళనాడు కుదంకుళం అణు కర్మాగారం కి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల వెనుక ఉన్నాడన్న అనుమానంతో ఓ జర్మన్ దేశీయుడిని భారత ప్రభుత్వం దేశం నుండి వెళ్ళగోట్టింది. ఆదివారం అర్ధ రాత్రి నాగర్ కోయిల్ లోని ఒక ప్రవేటు లాడ్జి పైన రాష్ట్ర, కేంద్ర గూఢచార సంస్ధల అధికారులు, స్ధానిక పోలీసుల సహాయంతో దాడి చేసి ఈ జర్మన్ దేశీయుడిని అరెస్టు చేశారు. తదుపరి విచారణం కోసం చెన్నై తీసుకెళ్ళిన పోలీసులు, అతనిని చెన్నై విమానాశ్రయం నుండి వెనక్కి…

ఫుకుషిమా అణు ప్రమాదాన్ని తక్కువ చేసి చూపడానికి బ్రిటిష్ అధికారుల రహస్య ప్రయత్నాలు

బహుళజాతి కంపెనీలు, వారితో కుమ్మక్కైన ప్రభుత్వాలు ప్రజలను మోసం చేయడానికి, వారికి సరైన సమాచారం అందకుండా చుడ్డానికి ఎంతకైనా తెగిస్తారు. అది ఇండియా కావచ్చు, అమెరికా కావచ్చు లేదా బ్రిటన్ కావచ్చు. ప్రజల భవిష్యత్తు నాశనమైపోయినా సరే వారికి మాత్రం లాభాలు నిరంతరాయంగా వస్తూ ఉండవలసిందే. ఫుకుషిమా దైచి అణు ప్రమాదం వలన కొత్తగా నెలకొల్పే న్యూక్లియర్ కర్మాగారాలను ప్రజలు వ్యతిరేకిస్తారని భయపడిన బ్రిటిష్ అధీకారులు ఆ ప్రమాదం వలన ఏర్పడపోయే ప్రతికూల పరిణామాలను తక్కువ చేసి…