సాహస కేరళ నర్సులకు కన్నీటి వీడ్కోలు -ఫొటోలు

ఈ ఇద్దరు నర్సుల పేర్లు పి.కె.వినీత, రేమ్యా రంజన్. కోల్‌కతా లో అగ్ని ప్రమాదానికి గురైన ఎ.ఎం.ఆర్.ఐ ఆసుపత్రిలో వీరిరువురూ ప్రాణాలు కోల్పోయారు. వీరు నిజానికి చనిపోవలసిన అవసరం లేదు. ఆసుపత్రి యాజమాన్యం లాగానే తమ దారి తాము చూసుకున్నట్లయితే వీరు ఇప్పటికి శుభ్రంగా బతికి ఉండేవాళ్ళు. కాని వీరు తమ వృత్తి ధర్మాన్ని పాటించడానికే నిర్ణయించుకోవడంతో అగ్నిప్రమాదం వల్ల ఏర్పడిన దట్టమైన పొగ వల్ల ఊపిరాడక చనిపోయారు. ఎ.ఎం.ఆర్.ఐ అగ్నిప్రమాదంలో చనిపోయినవారిలో కాలిన గాయాలకంటే ఊపిరాడక…

అగ్నిమాపక విభాగం ముందే హెచ్చరించినా ఆసుపత్రి వాళ్ళు విన్లేదు -మమత

ఎ.ఎం.ఆర్.ఐ ఆసుపత్రి బేస్‌మెంట్ ను ఖాళీ చేయాలని పశ్చిమ బెంగాల్ అగ్నిమాపక విభాగం వాళ్ళు జులైలోనే హెచ్చరించారనీ, అయినా ఆసుపత్రి వాళ్ళు ఆ పని చేయలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పత్రికలకు తెలిపింది. రెండు నెలల్లో బేస్‌మెంట్ ఖాళీ చేస్తామని అఫిడవిట్ సమర్పించిన ఆసుపత్రి యాజమాన్యం అది చేయలేదని ఆమే తెలిపింది. ఆసుపత్రి యాజమాన్యం లాభాపేక్ష, నిర్లక్ష్యంగా ఫలితంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని నిస్సందేహంగా భావించవచ్చు. ప్రమాదంలో మరణించినవారి సంఖ్య 88 కి…

కోల్‌కతా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, 73 మంది దుర్మరణం

కోల్‌కతా లో ఒక ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 73 మంది దుర్మరణ పాలయ్యారు. చనిపోయినవారిలో అధికులు రోగులే. ప్రమాదం జరిగినపుడు రోగులు నిద్రలో ఉండడంతో అధికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఏడంతస్ధుల భవనంలో పొగ దట్టంగా అలుముకోవడంతో అనేకమందికి ఊపిరాడలేదు. అగ్నిమాపక సిబ్బంది కిటికీలు బద్దలు కొట్టి నిచ్చెనలు ఉపయోగించి రోగులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి కొందరు రోగులను స్ట్రెచర్లలో ఉంచి బైటికి తెస్తున్నారు. బేస్‌మెంట్ లో మంటలు బయలుదేరి ఎ/సి షాఫ్టుల ద్వారా భవనం అంతా వ్యాపించినట్లు…