‘అంబేద్కర్ కార్టూన్’ గొడవ ‘అంబేద్కర్’ కే అవమానం -దళిత సంఘాలు

‘అంబేద్కర్ కార్టూన్’ పై పార్లమెంటులో జరిగిన రగడ రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కే తీవ్ర అవమానమనీ, భావ ప్రకటనా స్వేచ్ఛ పైన దాడి అనీ దళిత సంఘాలు, పౌర హక్కుల సంఘాలు ప్రకటించాయి. “నెహ్రూ-అంబేద్కర్ కార్టూన్ గానీ, దానితో ఉన్న పాఠ్యం గానీ దానంతట అదే అభ్యంతరకరం కాదని స్పష్టంగా చెబుతున్నాం. నిజానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నాయకత్వంలో ‘రాజ్యాంగ అసెంబ్లీ’ నిర్వహించిన కష్టమైన పనిని అది సమున్నతంగా అభినందించేదిగా ఉంది” అని వివిధ హక్కుల…

పాఠ్య గ్రంధాల్లో 200 కార్టూన్ల సమీక్షకు నిర్ణయం

ఎన్.సి.ఇ.ఆర్.టి (National Council of Educational Research and Training) రూపొందించిన పాఠ్య గ్రంధాల్లో ఉన్న కార్టూన్లు అన్నింటినీ సమీక్షించి తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంబేడ్కర్, నెహ్రూ లతో ఉన్న కార్టూన్ పై చెలరేగిన అనవసర వివాదం స్కూల్ పిల్లలకు వివిధ అంశాలపై సాపేక్షికంగా తేలిక పద్ధతిలో అవగాహన కల్పించే ఒక బోధనా పద్ధతి ని దెబ్బ కొట్టింది. కార్టూన్ల ద్వారా వివిధ రాజకీయ శాస్త్రాంశాలను బోధించే పద్ధతి స్కూల్ పాఠ్య గ్రంధాల నుండి మాయం…

అంబేడ్కర్ కార్టూన్ పై సిబాల్ ‘సారీ’, ఇద్దరు ప్రొఫెసర్లు రాజీనామా

ఎన్.సి.ఇ.ఆర్.టి టెక్స్ట్ బుక్ లో అంబేడ్కర్, నెహ్రూ లపై ముద్రించబడిన కార్టూన్ పై పార్లమెంటులో గొడవ జరగడంతో ఇద్దరు ప్రొఫెసర్లు తమ సలహాదారు పదవులకు రాజీనామా చేశారు. యోగేంద్ర యాదవ్, సుహాస్ పాల్శికర్ లు సలహా దారుల కౌన్సిల్ నుండి తప్పుకున్నారని మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. అంబేడ్కర్ కార్టూన్ పై లోక్ సభలో దళిత ఎం.పిలతో పాటు పలువురు ఎం.పి లు ఆందోళన చేయడంతో మానవ వనరుల మంత్రి కపిల్ సిబాల్ క్షమాపణ…