స్విస్ నల్ల ధనం అను ఒక ప్రహసనం -కార్టూన్

“ఆగండాగండి, ఇదిగో లేఖ జారవిడుస్తున్నా, ఇక తెరుచుకోవడమే తరువాయి.” *** అధికారంలోకి వచ్చీ రావడంతోనే విదేశాల్లో భారతీయులు దాచిన నల్ల డబ్బును వెనక్కి తేవడానికి అని చెబుతూ మోడి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. జస్టిస్ ఎం.బి.షా నేతృత్వంలో ఏర్పాటయిన ఈ కమిటీ వాస్తవానికి సుప్రీం కోర్టు ఆదేశాలకు ఏర్పాటు చేశారన్న వాస్తవాన్ని చెప్పిన పత్రికలు చాలా తక్కువ. ఈ కమిటీ పని ఎంతవరకు వచ్చిందో తెలియదు గానీ కొద్ది రోజుల తేడాలోనే పరస్పర…

ప్రశ్న: వలసవాదం, సామ్రాజ్యవాదం ఒకటేనా?

రాకేష్: వలసవాదం, సామ్రాజ్యవాదం ఒకదానికొకటి పర్యాయపదాలా? వలసవాదం కంటే సామ్రాజ్యవాదం విశాలమైనది కావచ్చు, కానీ రెండింటి మధ్య నిర్దిష్ట తేడా ఏమిటి? వలసలు లేకుండా సామ్రాజ్యవాదం పని చేస్తుందా? పని చేస్తే ఉదాహరణలు ఏమిటి? సమాధానం: వలసవాదం, సామ్రాజ్యవాదం పర్యాయపదాలు కాదు. మీ ప్రశ్నలోనే ఉన్నట్లుగా సామ్రాజ్యవాదం విస్తృతమైన భావాన్ని, నిర్మాణాలను, వ్యవస్ధలను తెలియజేస్తుంది. వలసవాదం నిర్దిష్టమైన వ్యవస్ధాగత నిర్మాణం, పరిపాలనలను తెలియజేస్తుంది. వలసవాదం సామ్రాజ్యవాదంలో భాగంగా పరిగణించవచ్చు. కానీ సామ్రాజ్యవాదంలో ఉన్నదంతా వలసవాదంగా చెప్పలేము. వలసవాదం…

అమిత్ షా: ఓడ అవుతున్న బండి!

‘ఓడలు బండ్లగును, బండ్లు ఓడలగును’ అని సామెత! బి.జె.పి జనరల్ సెక్రటరీ అమిత్ షా ఈ సామెతలో రెండో భాగాన్ని రుజువు చేసే క్రమంలో దూసుకుపోతూ ఉన్నారు. షోరాబుద్దీన్ షేక్, తులసీరాం ప్రజాపతి బూటకపు ఎన్ కౌంటర్ కేసుల్లో జైలు పాలై ఒక దశలో ‘ఇక పోలిటికల్ కెరీర్ ముగిసినట్లే’ అని పలువురు చేత భావించబడిన అమిత్ షా మరికొద్ది రోజుల్లో బి.జె.పి అధ్యక్ష పదవిని అధిష్టించనున్నట్లు వార్తలు వస్తున్నాయంటే… నేటి వ్యవస్ధ ఏ శక్తులను నెత్తిన…

రష్యా: మానవ రహిత డ్రోన్ లో పిజ్జా డెలివరీ

మనిషి స్వయంగా నడపకుండా రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపే విమానాలను డ్రోన్ విమానాలు అంటున్న సంగతి విదితమే. ఇలాంటి డ్రోన్ విమానం ద్వారా ప్రపంచంలోనే మొదటిసారిగా ఓ వినియోగదారుడికి పిజ్జా అందజేశామని రష్యా పిజ్జా కంపెనీ డోడో పిజ్జా ప్రకటించింది. గత నెలలో ముంబైలో ‘ఫ్రాన్సెస్కో పిజ్జరియా’ అనే కంపెనీ డ్రోన్ ద్వారా పిజ్జా అందజేసినట్లు వార్త వచ్చినందున ‘మేమే ఫస్ట్’ అన్న రష్యా కంపెనీ వాదనపై అనుమానం కలుగుతోంది. కాగా, వ్యాపార నిర్వహణలో మానవ శ్రమ…

ప్రశ్న: పదహారణాల తెలుగమ్మాయి అంటే?

నిఖిల్: ఈ ప్రశ్న అడగచ్చో లేదో తెలీదు, కానీ మీకు తెలుసనుకుంటున్నాను. తెలుగు సాంప్రదాయంలో ఉన్న ఆడపిల్లని పదహారణాల తెలుగమ్మాయి అని అంటాం కదా, అంటే ఏమిటి? మనం తెలుగు వాళ్ళం, తెలుగులో మాట్లాడటానికి నామోషి ఎందుకు? సమాధానం: తెలుగు సంస్కృతిని అచ్చంగా, కల్తీ లేకుండా, ఇతర సంస్కృతుల ప్రభావం లేకుండా ప్రతిబింబించే అమ్మాయిని ఊహించుకుని ఆమెకు పదహారణాల విలువ కట్టారు. మీరు చెబుతున్నదే ఆ విలువ. అణ విలువ భిన్నంలో (1/16) ఉంటుంది. కానీ పదహారు…

విదేశీ మందులోడికి మోడీ షాక్?!

“నెత్తిన పేనుకు పెత్తనమిస్తే నెత్తి గొరుగురా ఒరే ఒరే” అని విదేశీ మందులోడు పాడుకుంటాడేమో ఇక! లేకపోతే నమ్మి, బ్రాండ్ ఇమేజి పెంచి, అధికారంలోకి రావడానికి సహకరిస్తే మరిన్ని మందులని ‘నియంత్రిత ధరల’ జాబితాలోకి మోడి ప్రభుత్వం తేవడాన్ని విదేశీ బహుళజాతి కంపెనీలు ఎలా అర్ధం చేసుకోగలవు? భారత దేశంలో అమ్ముడయ్యే ఔషధాలలో మరిన్ని ‘ధరల నియంత్రిత జాబితా’ (price control) లోకి చేర్చాలని నరేంద్ర మోడి ప్రభుత్వం యోచిస్తోందని ప్రభుత్వ వర్గాలు కొన్ని పత్రికలకు ఉప్పందించాయి.…

రైలు ఛార్జీలు కాదు విమాన ఛార్జీలు -కార్టూన్

“… చెన్నై, బెంగుళూరు, భోపాల్, లక్నో, పాట్నా మరియు చండీఘర్ ల మీదుగా ఢిల్లీ పోవు తదుపరి విమానం 11వ నంబర్ ప్లాట్ ఫారం నుండి బయలుదేరును…” *** రైల్వే ఛార్జీల పెంపుదలను కార్టూనిస్టు ఇలా వ్యంగ్యీకరించారు. గత ప్రభుత్వ హయాంలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే రైల్వే సరుకు రవాణా చార్జీలను పెంచడాన్ని తప్పు పట్టిన అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, తాను ప్రధాని అయ్యాక అదే తరహాలో ఛార్జీలు పెంచడానికి ఏ మాత్రం వెనకాడలేదు.…

ఇండియా మాకు మిలట్రీ సాయం చెయ్యాలి -ఆఫ్ఘన్

భారత దేశం తమకు మిలట్రీ సహాయం చేయాలని ఆఫ్ఘనిస్తాన్ మరోసారి గట్టిగా కోరింది. పాకిస్ధాన్ ఏమన్నా అనుకుంటుందేమో అన్న శంకతో తమకు సాయం చేయకుండా వెనక్కి తగ్గడం భావ్యం కాదని, ఆఫ్ఘనిస్ధాన్ భద్రత సక్రమంగా ఉంటే అది భారత దేశానికి కూడా భద్రత అవుతుందని గుర్తించాలని ఇండియాలో ఆఫ్ఘన్ రాయబారి షాయిదా అబ్దాలి స్పష్టం చేశారు. ది హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్దాలి ఈ మేరకు ఆఫ్ఘన్ కోరికను పునరుద్ధరించారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో…

ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐల నిర్వచనం: సిఫారసులు ఆమోదం

ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐ పెట్టుబడుల నిర్వచనానికి సంబంధించి మాయారాం కమిటీ చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ), విదేశీ సంస్ధాగత పెట్టుబడులు (ఎఫ్.ఐ.ఐ)… ఈ పదబంధాల నిర్వచనాలను హేతుబద్ధం చేయడానికి ఆర్ధిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారాం నేతృత్వంలో ఒక కమిటీని నియమించగా అది శనివారం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. సదరు నివేదిక చేసిన సిఫారసులను ఆమోదిస్తున్నట్లుగా కేంద్రం ఈ రోజు (సోమవారం, జూన్ 23) ప్రకటించింది. ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐ లను…

ఆఫ్ఘన్ యుద్ధంలో నాటో కుక్కలు -ఫోటోలు

మానవ సమాజానికి మొదటి సారి మచ్చికయిన పాపానికి కుక్కలు సైతం మనిషి చేసే అనేక పాపాల్లో భాగం పంచుకోవలసి వస్తోంది. వ్యాపారం పెంపుదల కోసం, ప్రత్యర్ధి వ్యాపారాన్ని కూల్చడం కోసం యుద్ధాలకు తెగబడడానికి మించిన పాపం ఏముంటుంది? అలాంటి మహా పాపంలో అమెరికా, ఐరోపా కుక్కలు భాగం పంచుకుంటూ తమకు తెలియకుండానే బహుశా నరక లోకానికి చేరుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ను దురాక్రమించిన అమెరికా, నాటో బలగాలు తమతో పాటు సుశిక్షిత కుక్కలను తెచ్చుకుని అనేక కార్యకలాపాల్లో వాటిని…

ప్రశ్న: ప్రతిపక్ష హోదా కోసం పాకులాట ఎందుకు?

నిఖిల్: 1. లోక్ సభలో అధికార ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏమిటి? ఆ హోదా కోసం కాంగ్రెస్ ఎందుకు పిచ్చిగా ప్రాకులాడుతోంది? సమాధానం: “లోక్ సభలో అధికార ప్రతిపక్ష హోదా” అంటే మీ ఉద్దేశ్యం “అధికారికంగా గుర్తించబడిన ప్రతిపక్ష హోదా” అయి ఉండాలి. బి.జె.పి పాలక పక్షం గనుక కాంగ్రెస్ ఎలాగూ ప్రతిపక్షమే. కానీ లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా పొందడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఎందుకా పాకులాట అన్నది మీ అనుమానం. లోక్ సభలో…

మోడి సుపరిపాలనా సూత్రాలు -కార్టూన్

“యెస్, సర్…” “గవర్నర్లు…” “ఎన్.జి.ఓ లు…” “… ఇంకా, హిందీలో రాయాలి!” “మరిన్ని స్టిక్-ఆన్ నోట్ లా, సర్?” “గరిష్ట (సు)పరిపాలన కోసం కాసిన్ని చిన్న చిన్న సవరణలు… అంతే…” *** ప్రధాని నరేంద్ర మోడి ఎన్నికల నినాదాల్లో ‘సుపరిపాలన’ (Good Governance) ఒకటి. యు.పి.ఏ ప్రభుత్వం మా చెడ్డదనీ తాను ప్రధాని అయ్యాక దేశ ప్రజలకు ‘సుపరిపాలన’ అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తానని ఆయన ప్రచారం చేశారు. గుజరాత్ ప్రజలకు రుచి చూపించిన సుపరిపాలన…

పనస పండు దొంగ కోసం పోలీసుల ఉరుకులు

‘రాజు గారు తలచుకుంటే దెబ్బలకు కొదవా’ అని సామెత. మన ఎం.పిలు, ఎమ్మేల్యేలు ఆధునిక రాజులు కదా, వారు తలచుకున్నా అదే పరిస్ధితి సంభవించగలదు. లేకపోతే ఎం.పి గారి ఇంటి ఆవరణలోని పనస చెట్టు నుండి పనస పండ్లను దొంగిలించిన దొంగ కోసం పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టడం, ఆధునిక అపరాధ పరిశోధన పద్ధతులన్నీ ప్రయోగించడం… ఎలా అర్ధం చేసుకోవాలి? ఎఎపి ప్రభుత్వం విదేశీ వ్యభిచార గృహాలపై దాడులు చేయమన్నా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు తిరిగిన…

రైల్వే ఛార్జీలు: మంచి రోజులా, ముంచే రోజులా?

‘మంచి రోజులు ముందున్నాయి’ అని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన ప్రధాని మోడి, అధికారంలోకి వచ్చాక, ‘ముందుంది ముసళ్ళ పండగ’ అని చాటుతున్నారు. సరుకు రవాణా ఛార్జీలతో పాటు ప్రయాణీకుల ఛార్జీలు కూడా వడ్డించిన మోడి ప్రభుత్వం ‘కఠిన నిర్ణయాలకు’ అర్ధం ఏమిటో చెప్పేశారు. రెండేళ్ల క్రితం రైలు సరుకు రవాణా ఛార్జీలు పెంచినపుడు అప్పటి ప్రధానికి లేఖ రాసి నిరసించిన మోడి ఇప్పుడు ఎవరి లేఖకు లొంగుతారు? ప్రయాణీకులపై 14.2 శాతం ఛార్జీల మోత మోగించిన మోడి…

కాంగ్రెస్ గవర్నర్ల గెంటివేత -కార్టూన్

“రాజీనామా? అబ్బే కాదు. గెంటేశారు!!” *** కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పాత ప్రభుత్వం తాలూకు వాసనలను వదిలించుకోవాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా వివిధ రాష్ట్రాల గవర్నర్ లను మార్చడానికి మోడి ప్రభుత్వం పావులు కదుపుతోంది. అయితే కొందరు గవర్నర్ లు అందుకు సహకరించడానికి సిద్ధంగా లేరు. దానితో బి.జె.పి మండిపడుతోంది. ముఖ్యంగా కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహా రాష్ట్ర రాష్ట్రాల గవర్నర్లు తమకు రాజీనామా చేసే ఉద్దేశ్యం ఏమీ లేదని స్పష్టం చేయడంతో…