2జి కేసుకు దూరంగా ఉండండి -సుప్రీం కోర్టు

భారత దేశంలో హై ప్రొఫైల్ కేసులను విచారించే హై ప్రొఫైల్ విచారణాధికారులు సైతం విచారణకు ఎలా తూట్లు పొడుస్తారో తెలిపే ఉదంతాలు ఇప్పటికే అనేకం వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా 2జి కేసులోనే ఇలాంటి ఉదాంతాలు నాలుగైదు వెలుగులోకి రాగా సి.బి.ఐ అధిపతి రంజిత్ సిన్హా ఉదంతం మరొకటిగా వచ్చి చేరింది. 2జి కేసు విచారణ నుండి దూరంగా ఉండాలని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ రోజు (నవంబర్ 20) సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను ఆదేశించింది. చీఫ్…

కార్మికుల సమ్మెకు మోడి పరిష్కారం: విభజించు-పాలించు

కార్మికుడిని “శ్రమ యోగి” గా ప్రధాని నరేంద్ర మోడి అభివర్ణించారు. కార్మికులను ఆకాశానికి ఎత్తుతూ ‘శ్రమయేవ జయతే” అని నినాదం ఇచ్చారు. ఆయన అభివర్ణన, నినాదం కేవలం అలంకార ప్రాయమే అని కార్మికులకు తెలియడానికి నెల రోజులు కూడా పట్టలేదు. గత అరవై యేళ్లుగా భారత దేశ ప్రజల ఇంధనం అవసరాలను కోల్ ఇండియా కంపెనీ తీరుస్తోంది. అలాంటి కంపెనీలో వాటాలను మోడి ప్రభుత్వం ప్రైవేటు బహుళజాతి కంపెనీలకు అమ్మేయడానికి నిరసనగా కార్మికులు సమ్మె బాట పట్టారు.…

బానిసల రాజధానిగా ఇండియా -కత్తిరింపు

భారత దేశం పెట్టుబడిదారీ వ్యవస్ధగా మారిపోతోందని కొందరు, మారిపోయిందని మరి కొందరు అనేక యేళ్లుగా వాదిస్తున్నారు. వారిలో కొన్ని విప్లవ కమ్యూనిస్టు సంస్ధలు, ఆ సంస్ధల్లోని నాయకులు కూడా ఉన్నారు. ఈ కారణం చేతనే చీలికలకు గురి గాకుండా స్ధిరంగా పని చేస్తున్నాయని భావించిన కొన్ని విప్లవ సంస్ధల్లోనూ చీలికలు తప్పలేదు. ఇటీవల మావోయిస్టు పార్టీ నుండి సవ్యచాచి పాండా లాంటివారు బైటికి వచ్చి వేరే సంస్ధను ఏర్పాటు చేస్తూ భారత దేశంలో భూస్వామ్య వ్యవస్ధ అంతరించిన…

మోడి హయాం: జాత్యహంకార ఇజ్రాయెల్ తో వాణిజ్య వృద్ధి

భారత ప్రభుత్వం పగ్గాలను ఎన్.డి.ఏ నేత నరేంద్ర మోడి చేపట్టిననాటి నుండి జాత్యహంకార ఇజ్రాయెల్ తో మన వాణిజ్యం కొత్త పుంతలు తొక్కుతోంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగానే ఇజ్రాయెల్ తో సన్నిహిత సంబంధాలు పెంచుకుని వాణిజ్య స్నేహాలను ఏర్పాటు చేసుకున్నా నరేంద్ర మోడి, ప్రధాన మంత్రి పీఠం అధిష్టించాక తన పలుకుబడిని మరింతగా విస్తరించారు. ఫలితంగా ఇజ్రాయెల్-ఇండియాల మధ్య త్వరలోనే స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కుదరవచ్చని వాణిజ్య విశ్లేషకులు, అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నిజానికి కాంగ్రెస్…

పట్టాలపై వాణిజ్య వసతీకరణ -ది హిందు ఎడిట్

-The Hindu Editorial dated November 18, 2014 (ప్రపంచ వాణిజ్యంలో) వివాదాస్పద అంశం ‘ఆహార భద్రత కోసం ఆహార ధాన్యాలను ప్రభుత్వం నిలువ చేసుకునే’ విషయంలో ఇండియా, అమెరికాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రపంచ వాణిజ్య చర్చలను తిరిగి పట్టాల మీదికి తేవాల్సి ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్ధ చరిత్రలో టి.ఎఫ్.ఏ గణనీయమైన అడుగు అనదగ్గ బహుళపక్ష “వాణిజ్య వసతీకరణ ఒప్పందం” (Trade Facilitation Agreement -TFA) ను కాపాడేందుకు ఈ ద్వైపాక్షిక సర్దుబాటు/రాజీ అత్యవసరమైన…

బాబా రాంపాల్ అరెస్టుకు సాయుధ ప్రతిఘటన

దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించని నేపధ్యంలో బాబా రాంపాల్ ని అరెస్టు చేయలేక హర్యానా పోలీసులు నిస్సహాయులుగా మిగిలారు. హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్న బాబా రాంపాల్ అనేకసార్లు కోర్టుకు హాజరు కాకుండా చట్టం అంటే తనకు లెక్కలేదని చాటాడు. ఆయన్ని అరెస్టు చేసి తేవాలని పంజాబ్ & హర్యానా హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఆయనకు వంట్లో బాగాలేదని కాబట్టి అరెస్టు చేయడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పడం బట్టి భారత దేశంలో కోర్టులు ఏ…

ప్రణమీయ హితైషికి… -కవిత

(ఈ కవిత 2000 సం.లో రాసినది. నా పుట్టిన రోజు సందర్భంగా అప్పటి మా సీనియర్ డివిజనల్ మేనేజర్ గోపీనాధ్ గారు అభినందనలు తెలియజేస్తూ ఒక గ్రీటింగ్ పంపారు. ఆయన గ్రీటింగ్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ కవిత రాసి పంపాను. ఆయన గొప్ప వక్త. ముఖ్యంగా ద్రవ్య కంపెనీల వ్యాపారాభివృద్ధి కోసం ఫీల్డ్ స్టాఫ్ ను ఉత్తేజపరిచే ఉపన్యాసాలు ఇవ్వడంలో దిట్ట. ఆ తర్వాత వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకుని పూర్తికాలం ఉత్తేజ ప్రసంగాలు…

ఫడ్నవీస్: విశ్వాస పరీక్ష ఇంత సులువా? -కార్టూన్

కూటమి యుగం ప్రారంభం అయ్యాక రాష్ట్రాల శాసన సభల్లోనూ, లోక్ సభలోనూ విశ్వాస పరీక్ష నెగ్గడం రాజకీయ పార్టీలకు కత్తి మీద సాముగా మారిపోయింది. కూటమిలో ప్రతి చిన్న పార్టీ గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక, అలాగని వారిని వదులుకోలేక కూటమి నేత పార్టీలు నానా చావు చచ్చేవి. కానీ మహారాష్ట్రలో మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం మెజారిటీ లేకపోయినా సరే అతి సులభంగా విశ్వాస పరీక్ష నెగ్గి ముందు తరాలకు ఒక ఆదర్శాన్ని చూపింది. బహుశా ఫడ్నవీస్…

నెహ్రూ వారసత్వానికి కాంగ్రెస్ తాళం -కార్టూన్

కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మోడి ఇమేజి దెయ్యమై వేధిస్తోంది. కళ్ళు తెరిచినా, మూసినా మోడి భూతమే ప్రత్యక్షం అవుతుండడంతో తనను బంధించుకునే పరిస్ధితిలో పడిపోయింది. తాను ఎప్పుడూ గొప్పగా చెప్పుకునే స్వాతంత్ర పోరాట వారసత్వాన్ని మోడి ఎక్కడ తన్నుకుపోతారో అన్న భయంతో ప్రధమ ప్రధాని నెహ్రూ ఇమేజికి తాళం వేసేసుకుంది. నవంబర్ 14, నెహ్రూ జన్మదినం. ఎప్పుడూ వచ్చే జన్మదినం కాదు 125వ జన్మదినం. అది పురస్కరించుకుని నెహ్రూ సంస్మరణ సభలు, సెమీనార్లు ఏర్పాటు చేసిన కాంగ్రెస్…

జి.డి.పిలు, కరెన్సీ విలువల తేడాలు -ఈనాడు

ఈ రోజు ఈనాడు పత్రికలో వివిధ జి.డి.పిల గురించి, కరెన్సీల మధ్య తేడాల గురించి చర్చించాను. పర్చేజింగ్ పవర్ ప్యారిటీ లెక్కన ఇండియా జి.డి.పి మూడో స్ధానంలో ఉంటుందని కొద్ది రోజుల క్రితం ఐ.ఎం.ఎఫ్ ప్రకటించింది. ఈ అంచనాను మన పత్రికలు సగర్వంగా రాసుకుని గర్వించాయి. దీన్ని చదివిన కొందరు మేధావులు మనకు తెలియకుండానే మనం అగ్రరాజ్యం స్ధానానికి చేరిపోతున్నామన్న భ్రమలో పడిపోయారు. వాస్తవానికి అసలు జి.డి.పియే దేశ ఆర్ధిక స్ధితిగతులను సరిగ్గా ప్రతిబింబించదు. పి.పి.పి జి.డి.పి…

జి20: మోడియే ప్రధాన ఆకర్షణ!

ఆస్ట్రేలియా నగరం బ్రిస్బేన్ లో జరుగుతున్న జి20 సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోడి గారే ప్రధాన ఆకర్షణగా నిలిచారని పత్రికలు కోడై కూస్తున్నాయి. భారత పత్రికలే కాకుండా కొన్ని పశ్చిమ పత్రికలు కూడా ఈ అంశంలో ఏకాభిప్రాయాన్ని కలిగి ఉండడం విశేషం. ముఖ్యంగా పశ్చిమ రాజ్యాధినేతలు మోడితో కరచాలనం చేయడానికి, వీలయితే హగ్ చేసుకోవడానికీ, ఆయనతో కలిసి ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపుతున్నారట. నవంబర్ 15, 16 తేదీలలో బ్రిస్బేన్ లో జి20 గ్రూపు దేశాల…

నేను ఏకాకిని… -కవిత

నేను ఏకాకిని జనారణ్యంలో మనుషుల్ని వెతుక్కుంతున్న జీవాన్ని మనుషుల్లో ‘మనసు’ కై దేవులాడుతున్న మానవతా పిపాసిని నటిస్తున్న నిద్రపై స్వారీ చేస్తున్న మెలకువని చచ్చిన రాకుమారుడ్ని మళ్ళీ చంపి వధ్య శిల ఎక్కనున్న చంద్రమతిని కృత్రిమత్వానికి సహజత్వానికి మధ్య దూరాన్ని కొలుస్తున్న కొలబద్దను సమూహంలో లేని సామూహికతను సమాజంలో లేని సామాజికతను కృష్ణుడిని తప్ప చూడలేని దృత రాష్ట్రుడి చూపుని కళ్ళకు గంతలు కట్టని గాంధారిని కుప్పతొట్టి బాలల కడుపు నింపుతున్న నిండు విస్తరాకుని పాలింకిన చన్నులను…

మనోరమ: చిత్రహింసలు పెట్టి చంపేశారు -కమిషన్

మణిపురి యువతి తంగ్జామ్ మనోరమ హత్యకు ఎవరు బాధ్యులో విచారించిన జ్యుడీషియల్ కమిషన్ నివేదిక ఎట్టకేలకు వెలుగు చూసింది. నివేదికను కమిషన్ వెల్లడి చేసిన దశాబ్దం తర్వాత, అది కూడా సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్నాకనే, అందులోని అంశాలు పాక్షికంగానైనా లోకానికి వెల్లడి అయ్యాయి. అస్సాం రైఫిల్స్ కు చెందిన సైనిక బృందం ఒకటి మనోరమ ఇంట్లో చొరబడి, ఆమెను లాక్కెళ్లి, చిత్రహింసలకు గురిచేసి, అనంతరం విచక్షణారహితంగా అనేకమార్లు తుపాకితో కాల్చి చంపారని కమిషన్ నివేదిక తెలిపింది.…

తగు మూల్యం చెల్లించిన భద్రతా బలగాలు -ది హిందు ఎడిట్

(మాచిల్ బూటకపు ఎన్ కౌంటర్ కేసులో కోర్టు మార్షల్ జరిగిన పర్యవసానంగా ఐదుగురు సైనికులకు జీవిత ఖైదు శిక్ష పడింది. ఈ శిక్షను చూపిస్తూ AFSPA ను రద్దు చేయనవసరం లేదని మాజీ ఆర్మీ అధిపతి, ప్రస్తుత ఉప విదేశీ మంత్రి  జనరల్ వి.కె.సింగ్ అప్పుడే ప్రకటించేశారు. ఈ పరిణామంపై ది హిందు ప్రచురించిన సంపాదకీయం. -విశేఖర్) కాశ్మీర్ లో బూటకపు ఎన్ కౌంటర్ కు పాల్పడినందుకు గాను 4 రాజ్ పుటానా రైఫిల్స్ కు చెందిన…

అమ్మాయిలకు ప్రవేశం లేని యూనివర్సిటీ లైబ్రరీ -కార్టూన్

“ఈ పుస్తకంలో అమ్మాయిలకు చాలా రిఫరెన్స్ లు ఉన్నాయి సార్ – చదవడం కొనసాగించమంటారా?” ****************** “ఒక స్త్రీ విద్యావంతురాలయితే ఒక కుటుంబం మొత్తం విద్యావంతం అవుతుంది” అని సాధారణ సత్యంగా చెబుతుంటారు. కానీ అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఎ.ఎం.యు) వైస్ ఛాన్సలర్ లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా ఇందుకు విరుద్ధంగా వ్యాఖ్యానించి అలహాబాద్ హై కోర్టు చేత చీవాట్లు తిన్నారు. ఎ.ఎం.యు లోని మౌలానా ఆజాద్ లైబ్రరీ అత్యంత ప్రసిద్ధి చెందిన గ్రంధాలయం. విచిత్రంగా ఇందులోకి…