హెచ్చరిక సంకేతాలు -ది హిందు ఎడిటోరియల్

(డిసెంబర్ 22 తేదీ ప్రచురించిన ఎడిటోరియల్ Cautionary signals కు ఇది యధాతధ అనువాదం.) ********* 2014-15 కు సంబంధించిన మధ్య సంవత్సర ఆర్ధిక సమీక్ష, ఈ ఆర్ధిక సంవత్సరంలో ఆర్ధిక వృద్ధి 5.5 శాతం ఉంటుందని వాస్తవికంగా అంచనా వేసింది. ఆర్ధిక వృద్ధి యొక్క ఉరవడి ఇంకా బలహీనంగానే ఉన్నదనీ, ఆర్ధిక వ్యవస్ధ స్ధిరగతిని ఇంకా అందుకోవలసే ఉన్నదనీ… పారిశ్రామిక ఉత్పత్తి, వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణంలపై గత వారం విడుదల అయిన ఆర్ధిక గణాంకాలు స్పష్టంగా…

సమాన దూరం అయింది, ఇజ్రాయెల్ కౌగిలి మిగిలింది

గాజాపై అత్యాధునిక క్షిపణులతో నరహంతక దాడులు చేసి 2016 మందిని ఇజ్రాయెల్ బలి గొన్న రోజుల్లో పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య సమాన దూరం పాటించడం తమ విధానం అని ప్రకటించి మోడి ప్రభుత్వం తన అంతర్జాతీయ దివాళాకోరుతనం చాటుకుంది. ఇప్పుడు ఏకంగా ఇజ్రాయెల్ పక్షాన చేరిపోయి, అనాదిగా ఆక్రమిత పాలస్తీనాకు ఇస్తున్న మద్దతును ఏకపక్షంగా ఉపసంహరించుకునేందుకు మోడి ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోందని పత్రికల వార్తల ద్వారా తెలుస్తోంది. అదే జరిగితే భారత విదేశాంగ విధానాన్ని అత్యంత హీనమైన, ప్రగతి విహీనమైన…

నేపాల్: ప్రకృతి, జీవితం -ఫోటోలు

హిమాలయ రాజ్యమైన నేపాల్ సహజంగానే ప్రకృతి సౌందర్యాలకు నిలయం. ఇటీవలి వరకు ఫ్యూడల్ రాచరికంలో మగ్గిన ఫలితంగా అక్కడ దరిద్రానికి కొదవ లేదు. ఒక పక్క రాచరికం మిగిల్చిన సంపన్న భవనాలు, మరో పక్క ఆ మూడు రోజుల కోసం స్త్రీలను బందిఖానా చేసే చౌపడి గుడిసెలు! ప్రకృతి ఒడిలో నిండా మునిగినట్లుండే నేపాల్ జనజీవనానికి ప్రతిబింబాలు ఈ కింది ఫోటోలు. నేపాల్ ని ‘ప్రపంచపు పైకప్పు’ (roof of the world) అని కూడా పిలుస్తారట!…

ప్రపంచ అసమానతల్లో పెరుగుదల -ది హిందు ఎడిట్

నిజ వేతనాలపై అంతర్జాతీయ కార్మిక సంస్ధ (ఐ.ఎల్.ఓ) తాజాగా వెలువరించిన నివేదిక కనుగొన్న అంశాలు వివిధ సందర్భాలలోని క్రియాశీల చొరవలను, విధానపరమైన పక్షవాతాన్ని సూచిస్తున్నాయి. ప్రపంచ నిజ వేతనాలు పడిపోతుండడం కొనసాగుతుండడం వల్లా, జాతి మరియు లింగ ఆధారిత వివక్షాపూరిత వేతన తేడాల వల్లా కుటుంబాల ఆదాయాలలో అసమానతలు తీవ్రం అవుతున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. అధ్యయనంలో కొట్టొచ్చినట్టు కనపడుతున్న అంశం, అభివృద్ధి చెందిన దేశాలలో 1999-2013 సంవత్సరాల మధ్య కాలంలో కార్మిక ఉత్పాదకత పెరుగుదల వారి…

చిన్న శవపేటికలను పూడ్చడమూ కష్టమే!

“అతి చిన్న శవపేటికలు అత్యంత బరువైనవి” అంటూ తాలిబాన్ పైశాచిక హత్యాకాండను పాక్ ప్రజలు నిరసించారు. “చిన్న శవ పేటికలను పూడ్చడం చాలా కష్టమయింది” అని సమాధుల తవ్వకం దారు తాజ్ ముహమ్మద్ గాద్కదిక స్వరంతో, దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పాడు. పెషావర్ లోని అతి పెద్ద శ్మశాన వాటికలో సమాధులను తవ్వేవారిలో తాజ్ ముహమ్మద్ ఒకరు. ముస్లిం సంప్రదాయాల ప్రకారం శవాలను సాధ్యమైనంత త్వరగా పూడ్చిపెట్టాలి. దానితో డిసెంబర్ 16 తేదీన అమానుష రీతిలో దాడి జరగగా…

ఉగ్రవాదానికి పాక్ విరుగుడు మరణ శిక్షలు! -కార్టూన్

పాక్ ప్రధాని: “నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను- మరణ దండనపై నిషేధాన్ని ఎత్తివేశామని…” ********* పెషావర్ ఉగ్ర దాడిలో 130 మందికి పైగా స్కూల్ పిల్లలు మరణించిన దరిమిలా ఉగ్రవాదంపై కత్తి కడుతున్నట్లు చూపడానికి అక్కడి ప్రభుత్వం చర్యలు ప్రకటిస్తోంది. అందులో మొదటిది మరణ శిక్షలు! ఉగ్రవాదులకు మరణ దండన విధిస్తామనడం ఒక విధంగా హాస్యాస్పదం. ఉగ్రవాదులే చావడానికి నిర్ణయించుకుని వచ్చి దాడులు చేస్తుంటే వారికి మరణ దండన వేస్తామంటే జడిసిపోతారా? ఉదాహరణకి పెషావర్ దాడినే తీసుకుంటే దాడి…

బొగ్గు, భీమా ప్రైవేటీకరణ: ఆర్డినెన్స్ ఆలోచనలో కేంద్రం?

వచ్చే మంగళవారంతో శీతాకాలం పార్లమెంటు సమావేశాలు ముగింపుకు రానున్నాయి. మళ్ళీ పార్లమెంటు సమావేశం అయ్యేది బడ్జెట్ కే. భీమా ప్రయివేటీకరణ, బొగ్గు గనుల ప్రయివేటీకరణ బిల్లులను శీతాకాలం సమావేశాల్లోనే మోడి ఆమోదింపజేస్తారని స్వదేశీ, విదేశీ కంపెనీలు, బహుళజాతి కంపెనీలు గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. కానీ సమావేశాలు ముగింపుకు వస్తున్నా బిల్లుల అతీగతీ లేదని కంపెనీలు బెంగ పెట్టుకున్నాయి. ఈ నేపధ్యంలో మోడి ప్రభుత్వం నుండి కంపెనీల ఆశలను ఈడేర్చే శుభవార్త అందింది. పార్లమెంటు ఆమోదంతో సంబంధం లేకుండా…

అతి చిన్న శవ పేటికలు అత్యంత బరువైనవి -ఫోటోలు

“SMALLEST COFFINS ARE THE HEAVIEST” పెషావర్ పాఠశాలపై తాలిబాన్ జరిపిన పైశాచిక మృత్యు క్రీడకు నిరసనగా జరుగుతున్న ప్రదర్శనలో ఒక యువతి పట్టుకున్న ప్లకార్డ్ పై రాసి ఉన్న ప్రకటన ఇది. “అతి చిన్న శవపేటికలు, అత్యంత బరువైనవి” ఈ ఐదు పదాల ప్రకటనకు ఎంత లోతైన అర్ధం! మానవ మాత్రుల సామాన్య దృష్టికి అందని లోతు అది. బహుశా మానవుడి సాధారణ భావోద్వేగానికి కూడా అందని లోతు కావచ్చు. ప్లకార్డు పట్టుకున్న ఆ యువతికి…

మోడి మార్కు లక్ష్మణ రేఖ -కార్టూన్

ప్రధాని నరేంద్ర మోడి తన లక్ష్మణ రేఖ ప్రకటించారు. సాధ్వి నిరంజన్ జ్యోతి ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ‘రామ్ జాదే – హరామ్ జాదే’ అంటూ చేసిన ప్రసంగం ఉభయ సభల్లో ప్రతిపక్షాలకు ఆయుధం ఇవ్వడంతో ఆయన ‘కొత్త మంత్రులు, పార్టీ నేతలు’ ‘నియంత్రణ’లో ఉండాలని లక్ష్మణ రేఖ గీశారు. ఇంత గొడవ జరుగుతుంటే ప్రధాని ఎక్కడ? అంటూ ప్రతిపక్షాలు గర్జించడంతో పార్లమెంటుకు వచ్చిన ప్రధాని ‘కొత్త మంత్రి, గ్రామీణ నేపధ్యం, అంతా కొత్త. అయినా ఆపాలజీ…

సౌకర్యం ఖరీదు! -ది హిందు ఎడిటోరియల్

పలుచని, పర్యావరణ క్షీణతలో ఇమిడిపోలేని, ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచుల వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని కేంద్ర ప్రభుత్వమే నియమించిన అనేక కమిటీలు తేల్చి చెప్పినప్పటికీ, వాటి చెడు ప్రభావాలు ఏమిటన్నదానికి పెద్ద మొత్తంలో సాక్ష్యాలు పోగుబడి ఉన్నప్పటికీ దేశంలో “ప్లాస్టిక్ సంచుల ఉత్పత్తి, వినియోగాలను నిషేదించే ఉద్దేశం ఏమీ లేదు” అని ఇటీవల ప్రభుత్వం దృఢంగా ప్రకటించింది. కానీ అటువంటి నిషేధం ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలులో ఉన్నది. దురదృష్టవశాత్తూ ఛార్జీలు వసూలు…

పెట్టుబడుల క్లియరెన్స్ ప్రధాని మోడి చేతుల్లోకి

‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం ద్వారా భారత దేశంలోకి విరివిగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని కలలు గంటున్న ప్రధాన మంత్రి మోడి ఆ వైపుగా అడుగులు వేగంగా వేస్తున్నారు. మన్మోహన్ హయాంలో యు.పి.ఏ 2 పాలన చివరి రోజుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, విదేశీ-స్వదేశీ ప్రైవేటు పెట్టుబడుల క్లియరెన్స్ కు ఏర్పాటు చేసిన ‘ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్’ (పి.ఎం.జి) ను ప్రధాని మోడి తన చేతుల్లోకి తీసుకున్నారని పేరు చెప్పని అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా…

రోదసీలోకి భారతీయుడు: మార్క్ 3 ద్వారా ముందడుగు

రోదసీ ప్రపంచంలోకి భారతీయుడు ప్రవేశించే దూరం దగ్గరలోనే ఉన్నదని నేడు ప్రయోగించిన జి.ఎస్.ఎల్.వి – మార్క్ III ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం ద్వారా రుజువయింది. రాకెట్ ద్వారా మనుషులు కూర్చుని ఉండే మాడ్యూల్ ను రోదసీలోకి ప్రయోగించిన అనంతరం సదరు మాడ్యూల్ భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే ప్రయోగాన్ని LVM3/CARE ప్రయోగం ద్వారా భారతీయ శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించి చూశారు. మాడ్యూల్ సురక్షితంగా భూవాతావరణంలోకి ప్రవేశించడమే కాకుండా అనుకున్న చోటనే బంగాళాఖాతంలో దిగడంతో శాస్త్రవేత్తలు ఆనందోత్సాహాలు…

తాలిబాన్ సరే, డ్రోన్ దాడుల లెక్క తేల్చరా?

ఆఫ్ఘన్-పాక్ సరిహద్దు ప్రాంతాల్లో సంచరించే తెహ్రీక్-ఏ-తాలిబాన్ అనే తీవ్రవాద సంస్ధ పెషావర్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ పైకి ఆత్మాహుతి మిలిటెంట్లను పంపి 132 మంది పిల్లలను, టీచర్లను బలిగొన్న వార్త ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. తాలిబాన్ పైశాచికత్వం తలచుకుని ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుపితులై పిడికిళ్ళు బిగిస్తున్నారు. ‘వారు పిల్లల్ని ఎలా చంపారో వారినీ అలానే చంపాలి’ అప్పుడే తగిన శాస్తి’ అన్న నిర్ణయానికి రాకపోతే వారిలో ఏదో లోపం ఉందన్నంతగా భావోద్వేగాలు…

తాలిబాన్ తుపాకి శిక్షణ టార్గెట్లు: పూలు! -కార్టూన్

లేలేత ప్రాయపు చిన్న పిల్లలు సున్నిత శరీరాలను కలిగి ఉంటారు. వారి అవయవాలు తేలికగా వంగిపోయే విధంగా ఉంటాయి. ఈ కారణం తోనే చిన్న పిల్లలను పూలతో పోల్చడం కద్దు. పూల రెమ్మలు ఎంత మెత్తగా, సున్నితంగా ఉంటాయో చిన్న పిల్లల శరీరాలు, హృదయాలు కూడా అంతే మెత్తగా, సున్నితంగా ఉంటాయి. పెషావర్ లో ఆర్మీ పబ్లిక్ స్కూల్ పై పాకిస్తాన్ తాలిబాన్ చేసిన పైశాచిక దాడి నేపధ్యంలో కార్టూనిస్టు తాలిబాన్ స్వభావాన్ని ఈ విధంగా సున్నితంగా…

విదేశాల్లో నల్లడబ్బు: మూడో స్ధానంలో ఇండియా

భారతీయుల నల్ల డబ్బు తమ వద్ద లేదని స్విట్జర్లాండ్, తదితర నల్ల డబ్బు స్వర్గాలు నమ్మబలుకుతుండగా అందులో నిజం లేదని వాస్తవాలు తెలియజేస్తున్నాయి. రష్యా, చైనాల తర్వాత దేశీయ డబ్బును విదేశాలకు తరలిపోతున్న దేశాలలో ఇండియాయేదే తదుపరి స్ధానం అని ఒక అంతర్జాతీయ సర్వే సంస్ధ నిర్ధారించింది. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ (జి.ఎఫ్.ఐ) అనే సంస్ధ నల్ల డబ్బు వివరాలను వెల్లడి చేసింది. జి.ఎఫ్.ఐ నివేదిక ప్రకారం ఒక్క 2012 లోనే 94.76 బిలియన్ డాలర్ల డబ్బు…