చైనా రియల్ రాబందుల భూదాహానికి ప్రతిఘటన ఈ మేకు ఇళ్ళు -ఫోటోలు

చైనా అత్యంత వేగంగా అమెరికా జి.డి.పి పరిమాణాన్ని సమీపిస్తోంది. ప్రస్తుతం అమెరికా వార్షిక జి.డి.పి 16.8 ట్రిలియన్ డాలర్లు ఉంటే చైనా జి.డి.పి 9.2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. మూడేళ్ళ క్రితం జపాన్ ను మూడో స్ధానానికి నెట్టి రెండో స్ధానానికి చేరేనాటికి చైనా జి.డి.పి 4.5 ట్రిలియన్లు. ఇప్పుడు అంతకు అంతా జి.డి.పి ని పెంచుకుని అమెరికాని వెనక్కి నేట్టేందుకు దూసుకుపోతోంది. చైనా విశృంఖల అభివృద్ధిలో ‘రియల్ ఎస్టేట్ బూమ్’ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది.…

అంబేద్కర్ విగ్రహ పూజా పందెం -కార్టూన్

ఓటు బ్యాంకు రాజకీయాలు ఎంతకైనా తెగించేలా చేస్తాయి. రాజకీయ, ఆర్ధిక అవినీతికి వ్యతిరేకంగా జన్మించిన పార్టీ ఎఎపి. ఆ పార్టీ కూడా గెలవడం కోసం తన స్ధాపనా సూత్రాలను కూడా వదిలిపెట్టి అభ్యర్ధులను నిలబెట్టిందని మాజీ అన్నా బృందం సభ్యుడు ప్రశాంత్ భూషణ్ బహిరంగంగా పత్రికలకు ఎక్కవలసిన పరిస్ధితి! అంబేద్కర్ 125వ శత జయంతి ఉత్సవాలను గ్రాండ్ గా జరిపేందుకు కాంగ్రెస్, బి.జె.పి లు శాయశక్తుల ఎలా కృషి చేస్తున్నాయో మొన్నటి ది హిందు సంపాదకీయం “Admiration…

ఎన్ కౌంటర్లు ఎందుకు చట్టవిరుద్ధం?

‘నిన్ను ఎన్ కౌంటర్ చేసేస్తా’ ఇది పోలీసు సినిమాల్లో తరచుగా వినపడే పదం. ఎన్ కౌంటర్ చేయడాన్ని వీరోచితకార్యంగా సినిమాలు వాడుకలోకి తెచ్చాయి. ‘ఎన్ కౌంటర్ స్పెషలిస్టు’ అనే బిరుదు కొందరు పోలీసులకు పత్రికలు తగిలించడం మొదలై చాలాకాలమే అయింది. వీటన్నింటి మూలంగా ఎన్ కౌంటర్ చెయ్యడం పోలీసుల విధి, కర్తవ్యం, బాధ్యత… ఇత్యాదిలాగా పరిస్ధితి తయారయింది. ఆంద్ర ప్రదేశ్ మాత్రమే కాదు, దాదాపు పోలీసులు, సైన్యంలకు ఆధిపత్యం అప్పగించి పాలన సాగించే ప్రతి చోటా ఈ…

అనుసరణ లేని ఆరాధన -ది హిందు ఎడిటోరియల్

రాజకీయ శాస్త్రవేత్త, ఆర్ధికవేత్త, న్యాయ నిపుణులు, సామాజిక సంస్కరణవేత్త, భారత రాజ్యాంగ నిర్మాత, ఓ పురుష నేత (a leader of men): డా. బి.ఆర్.అంబేద్కర్  వైవిధ్యభరిత ఆసక్తులతో, బహుళముఖ వ్యక్తిత్వంతో వర్గీకరణవాద మరియు విభజనవాద ప్రయత్నాలను ధిక్కరిస్తారు. అయితే పేద, బలహీన వర్గాల ప్రజలను ఉద్ధరించేందుకు ఒంటి చేతితో కృషి చేయడం ద్వారా ఆయన తన జీవితకాలంలో స్ఫూర్తిదాయక వ్యక్తిగా, జీవితానంతర దశాబ్దాలలో జాతీయ ఆదర్శ ప్రతిమగా అవతరించారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ తో అనంతర…

పశ్చిమ అమెరికా కరువు విభ్రాంత దృశ్యం -ఫోటోలు

అమెరికన్ వాల్ స్ట్రీట్ కంపెనీలు ఎప్పటిలాగానే లాభాలు నమోదు చేస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు పైపైకి చూస్తున్నాయి. ఆర్ధిక సంక్షోభం ముగిసిందని ప్రభుత్వాలు తీర్మానిస్తున్నాయి. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. వృద్ధి రేటు కూడా పెరుగుద్దంటున్నారు. జనం మాత్రం కరువు బారిన పడి విలాపిస్తున్నారు. పశ్చిమ అమెరికా తీర రాష్ట్రాలను ఎన్నడూ ఎరగని కరువు పట్టి పీడిస్తోంది. ఒక్క కాలిఫోర్నియా రాష్ట్రమే కాదు, నెవాడా, ఆరిజోనా, ఉటా తదితర రాష్ట్రాలన్నీ నీటి కోసం అలమటిస్తున్నాయి. ప్రతి యెడూ సాధారణంగా ఈ…

సత్యంకు పడింది పెద్ద శిక్షేనా? -కార్టూన్

రామలింగ రాజు సోదరులు, ఇతర పెద్ద మనుషులకు అవినీతికి పాల్పడినందుకు గాను హై కోర్టు శిక్షలు ప్రకటించింది. అత్యధికంగా 7 సం.ల జైలు శిక్ష + 5.5 కోట్లు జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించింది. ఈ శిక్షలను చూసి అందరూ సంతోషిస్తున్నారు. తగిన శిక్ష పడిందని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు సత్యం కంపెనీ అధిపతి రామలింగ రాజు బృందం పాల్పడిన అవినీతికి పడిన శిక్ష మొత్తం కార్పొరేట్ అవినీతికి పడవలసిన శిక్షతో పోల్చితే ఎంత చిన్న దెబ్బతో సమానమో…

స్వామి గొంతు మారింది, బి.జె.పి నోరు జారింది

రాఫెల్ ఫైటర్ జెట్ విమానాల కొనుగోళ్లపై నిప్పులు చిమ్ముతున్న స్వామి తీరా ఒప్పందం కుదిరి ప్రధాని సంతకం అయ్యాక పాక్షికంగా వెనక్కి తగ్గారు. ప్రధాని గనక ఒప్పందం కుదుర్చుకోవడంలో ముందుకు వెళ్తే కోర్టుకు వెళ్ళడం తప్ప తనకు మరో మార్గం లేదని కూడా ఆయన హెచ్చరించారు. అలాంటిది ఫ్రాన్స్ పర్యటన మొదటి రోజే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంషా ఒలాండే తో కలిసి ‘పడవ పై చర్చ’ జరిపి 36 జెట్లను రెడీగా ఉన్నవి కొనుగోలు చేయాలని ప్రధాని…

ప్రశ్న: బోసుపై నెహ్రూ గూఢచర్యం; నేతాజీ మరణించారా?

ప్రశ్న (రవిచంద్ర): నేతాజీ మరణం నిజమేనా? ఆయన కుటుంబంపై మన ప్రభుత్వమే గూఢచర్యం నిర్వహించడం ఎందుకు? ఆయన దేశ భక్తుడు కారా? సమాధానం: యు.పి.ఏ, ఎన్.డి.ఏ ల కింద చేరిన పాలక వర్గ గ్రూపుల మధ్య వైరుధ్యం, వైరం కొత్త పుంతలు తొక్కుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్నడో స్వతంత్రం వచ్చిందని చెప్పినప్పటి నాటి గూఢచార కార్యకలాపాలను పనిగట్టుకుని మరీ ఇప్పుడు వెల్లడి చేయడం, అది కూడా ఎంచుకున్నవి మాత్రమే వెల్లడి చేయడం వల్ల ఈ అనుమానాలు కలుగుతున్నాయి. ఇండియా…

సర్వ మత హక్కులు కాపాడుతాం –మోడి

“ప్రతి పౌరుని యొక్క హక్కులను, స్వేచ్చను మేము రక్షించి కాపాడతాం. ప్రతి ఒక్క మతము, సంస్కృతి, నమ్మకాలకు చెందిన ప్రతి ఒక్క పౌరుడికి మా సమాజంలో సమాన స్ధానం ఉండేలా చూస్తాము. మా భవిష్యత్తులో నమ్మకాన్ని కల్పిస్తాము. ఆ భవిష్యత్తు సాధించేందుకు విశ్వాసం ఇస్తాము.” ఇవి ఫ్రెంచి గడ్డపై ప్రధాని నరేంద్ర మోడి పలికిన పలుకులు. ఫ్రెంచి నేల మనది కాదు. కనీసం మన పాత వలస ప్రభువు కూడా కాదు. ప్రధాని అక్కడికి వ్యాపార ఒప్పందాల…

రాఫెల్ కు స్వామి నో, మోడి యెస్

రాఫెల్ ఫైటర్ జెట్లు తక్షణ ప్రాతిపదికన ఏకంగా 36 కొనుగోలు చేసేందుకు ప్రధాని మోడి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫ్రాన్స్ బయలుదేరుతూనే రాఫెల్ ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తూ వెళ్ళిన ప్రధాని చెప్పినట్లుగానే ‘పడవపై చర్చలు’ జరిపి భారీ కొనుగోలుకు తలూపారు. మనం ఇప్పుడు ఆర్డర్ ఇస్తే రాఫెల్ ఫైటర్ జెట్లు తయారు చేయడం కాదు. ఇప్పటికే తయారై ఎగరడానికి సిద్ధంగా ఉన్న ఫైటర్ జెట్ విమానాలనే ఇండియా కొనుగోలు చేయనుంది. జెట్ ఫైటర్ విమానాల కొనుగోలు…

ఎర్ర చందనానికి శవపేటికల కాపలా!

చాలా అద్భుతమైన కార్టూన్! ఆంద్ర ప్రదేశ్ పోలీసుల వికృత రక్త కేళీ పిపాసకు ప్రత్యక్ష సాక్ష్యం శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్. ఇది నిజమైన ఎన్ కౌంటరే అని ఎ.పి పోలీసులు, ఎ.పి రాష్ట్ర ప్రభుత్వం నమ్మబలుకుతున్నారు. పోలీసులు చాలా మంచి పని చేశారని ముద్దు కృష్ణమ నాయుడు గారి లాంటి పెద్ద మనుషులు పోలీసులను పత్రికలు, ఛానెళ్ల సాక్షిగా మెచ్చుకున్నారు. కొన్ని ఛానెళ్లు, పత్రికలు కూడా ‘ఖతమ్’, ‘హతం’ అంటూ మనుషుల ప్రాణాలకు తాము…

కాలిఫోర్నియాలో రికార్డు కరువు, నీటికి రేషన్ -ఫోటోలు

అమెరికాకు అన్నపూర్ణగా పేర్కొనబడే కాలిఫోర్నియా రాష్ట్రం ప్రస్తుతం రికార్డు స్ధాయి కరువుతో తీసుకుంటోంది. వరుసగా 4 సం.ల పాటు వర్షాలు లేకపోవడంతో కరువు అమెరికా భారీ మూల్యం చెల్లిస్తోంది. కాగా ఇంతటి తీవ్ర స్ధాయి కరువు పరిస్ధితులకు గ్లోబల్ వార్మింగే కారణమన్న వాదనపై నాయకులు శాస్త్రవేత్తలు రెండు శిబిరాలుగా చీలిపోయి వాదులాడుకుంటున్నారు. నేల మాత్రం నెర్రెలిచ్చి వర్షపు చుక్క కోసం చేతకపక్షిలా ఎదురు చూస్తోంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో కరువు ఎంత తీవ్రంగా ఉన్నదంటే నగరాలకు, పట్టణాలకు 25…

క్లుప్తంగా… 9/4/15

మూడు దేశాల పర్యటనకు మోడి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారు మూడు పశ్చిమ దేశాల పర్యటనకు పయనమై వెళ్లారు. మొదటి విడతగా ఫ్రాన్స్ లో నాలుగు రోజులు పర్యటించే ప్రధాని అనంతరం మూడు రోజుల పాటు ఏంజెలా మెర్కల్ అతిధిగా జర్మనీ పర్యటిస్తారు. తదనంతరం ప్రధాని కెనడా సందర్శించడం ఒక విశేషం. భారత ప్రధాన మంత్రులు కెనడా వెళ్ళడం చాలా తక్కువ. వెళ్తే రాష్ట్ర పతి, ఉపరాష్ట్రపతి, వారి కుటుంబ సభ్యులు వెల్లడమే గానీ…

చట్టాల అమలులో హింసా ప్రయోగం -ది హిందు ఎడిట్..

[Violence in law enforcement శీర్షికన ఈ రోజు (ఏప్రిల్ 8) ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్] ఆంద్ర ప్రదేశ్ కు చెందిన యాంటీ-స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది 20 మంది చెక్కకోత పనివాళ్లను -ఎర్ర చందనం స్మగ్లింగ్ మాఫియాతో సంబంధం ఉందని భావిస్తూ- చంపివేయడం వల్ల పోలీసుల జవాబుదారీతనం పట్లా, అసమతుల్య బలప్రయోగం పట్లా వ్యాకులపూరితమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చెక్కకోత పనివాళ్లను లొంగి పొమ్మని టాస్క్ ఫోర్స్ బలగాలు…

ఇదీ మోడీ వ్యవసాయ మద్దతు! -కార్టూన్

“నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడం” అనే సామెత వింటుంటాం. భారత రైతుల పట్ల ప్రధాని మోడి వ్యవహరిస్తున్న తీరు అలాగే ఉంది. “వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాటిని ఆపలేమా?” అని ఆయన బహిరంగ సభల్లో ప్రశ్నిస్తారు. ఆత్మహత్యలు ఆపండి మహా ప్రభో అని ఆయనని అందలం ఎక్కిస్తే, ఆ అందలం మీద కూర్చొని ఆత్మహత్యల్ని ఆపలేమా అని తిరిగి జనాన్ని ప్రశ్నించడం ఏమిటి, జనాన్ని వెక్కిరించడం కాకపోతే! నిన్నో మొన్నో ఆయన బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడారు.…