పంజాబ్ బస్సుల్లో ఆగని చిల్లర వెధవల ఆగడాలు

ఢిల్లీ బస్సులో నిర్భయపై జరిగిన అత్యాచారం ఉదంతం దరిమిలా భారత ప్రభుత్వం తెచ్చిన సో-కాల్డ్ కఠిన చట్టాలు మహిళలకు ఏ మాత్రం రక్షణ ఇవ్వలేకపోతున్న సంగతి మళ్ళీ మళ్ళీ రుజువవుతోంది. కావలసింది కఠిన చట్టాలు కాదని, సామాజిక వ్యవస్ధ నిర్మాణంలోనే సమూల మార్పులు వస్తే తప్ప మహిళలతో పాటు ఇతర అణగారిన సెక్షన్ ప్రజలకు రక్షణ ఉండదని పలువురు సామాజిక శాస్త్రవేత్తలు, ఆలోచనాపరులు, ముఖ్యంగా సమాజం మార్పును కోరేవారు చెప్పిన మాటలు ప్రత్యక్షర సత్యాలని పంజాబ్ లో…

ముస్లిం హిందువులు మళ్ళీ ముస్లిం మతం లోకి…

సంఘ పరివార్ గణాలు ఆగ్రాలో అట్టహాసంగా నిర్వహించిన ముస్లిం మత మార్పిడి మూన్నాళ్ల ముచ్చటగా ముగిసింది. భూములు ఇస్తామని మాయ మాటలు చెప్పి ముస్లిం మతం నుండి కొందరిని హిందు మతంలోకి మార్చినట్లు తతంగం నడిపారని మోసం గ్రహించి తిరిగి ముస్లిం మతంలోకి వచ్చామని సదరు ముస్లింలు చెప్పడం విశేషం. ఆగ్రాలోని నాట్ కమ్యూనిటీకి చెందిన ముస్లింలు అత్యంత పేదవారు. వారికి తమది అని చెప్పుకునే ఆస్తులు దాదాపు లేవు. ప్రభుత్వానికి చెందిన వృధా భూముల్లోనే తాత్కాలిక…

నేపాల్: యూరోపియన్లు కనపడుటలేదు

నేపాల్ భూకంపం ఒక్క నేపాల్ ప్రజలకు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాపితంగా అనేకమందికి విషాధాన్ని మిగిల్చింది. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలకు చెందిన 1000 మంది వరకు కనిపించకుండా పోయారని యూరోపియన్ యూనియన్ అధికారులు తెలిపారు. పర్వతారోహకులకు హిమాలయ పర్వతాలు ఆకర్షణీయం కావడంతో ఈ పరిస్ధితి ఏర్పడింది. 1000 మంది వరకూ ఆచూకీ తెలియకుండా పోగా 12 మంది మరణించినట్లు ధృవపడిందని నేపాల్ సందర్శించిన ఈ.యు బృందం తెలిపింది. “వాళ్ళు ఎక్కడ ఉన్నదీ తెలియదు. కనీసం ఎక్కడ…

బాబా రాందేవ్ మందు తింటే మగ పుట్టుక గ్యారంటీ(ట)!

భారత సామాజిక వ్యవస్ధ ప్రయాణం పైకి ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ వాస్తవంలో మధ్య యుగాల చెంతకు ప్రయాణిస్తోందని చెప్పేందుకు మరో దృష్టాంతం ఇది! పురోగమనం, ప్రగతి, అభివృద్ధి, ముందడుగు… ఇలాంటి పదాలు తమ అర్ధాన్ని కోల్పోవడమే కాదు, విచిత్రార్ధాల్ని సృష్టిస్తున్న కాని కాలంలో ఉన్నామని బాబా రాందేవ్ గారి దివ్య ఔషధ వ్యవస్ధ స్పష్టం చేస్తోంది. బాబా రాందేవ్ నెలకొల్పిన ఆయుర్వేద ఔషధ కంపెనీ ‘పతంజలి ఆయుర్వేద కేంద్ర ప్రైవేట్ లిమిటెడ్’ ఒక ఔషధం తయారు చేసింది.…

ఆత్మహత్య రైతులు పిరికిపందలు, నేరస్ధులు -బి.జె.పి

భూ సేకరణ చట్టం సవరణల ద్వారా తన రైతు వ్యతిరేక, ప్రైవేటు బహుళజాతి కంపెనీ అనుకూల స్వభావాన్ని చాటుకున్న బి.జె.పి ఇప్పుడు ఏకంగా రైతులపై నేరుగా దాడి చేసేందుకు సైతం వెనుదీయడం లేదు. ఢిల్లీలో ఎఎపి నిర్వహించిన రైతుల ర్యాలీలో ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడడాన్ని ‘నాటకం’గా అభివర్ణించిన హర్యానా వ్యవసాయ మంత్రి, ఆత్మహత్యకు పాల్పడే రైతులు ‘పిరికిపందలు’ అనీ, ‘నేరస్ధులు’ అనీ తిట్టిపోసాడు. “భారత చట్టం ప్రకారం ఆత్మహత్యకు పాల్పడడం నేరం. ఆత్మహత్యకు పాల్పడే ఏ…

రైతులకు ఉరి బిగించే అభివృద్ధి -కార్టూన్

అభివృద్ధి పేరుతో భారత పాలకులు రైతుల మనుగడను ఏ స్ధాయిలో ప్రశ్నార్ధకం చేస్తున్నారో పట్టిస్తున్న కార్టూన్ ఇది! పాలకులు నిత్యం అభివృద్ధి మంత్రం జపిస్తారు గానీ ఆ అభివృద్ధి ఎవరికి చెందినదో ఎప్పుడూ చెప్పరు. అసలు 66 యేళ్ళ స్వతంత్రావనిలో అభివృద్ధి లేకుండా ఎలా పోయిందో మొదట వారు చెప్పాలి. ఈ ప్రశ్నకు సమాధానాన్ని వారు పార్టీల మధ్య తగాదా స్ధాయికి కుదించి జనాన్ని కూడా అదే నమ్మమంటారు. పాలకవర్గ పార్టీలన్నింటి వెనుకా ఉన్నది ఒకే దోపిడీ…

వెనుదిరిగిన (అరబ్) వసంతం -ది హిందు ఎడిట్..

2013లో జరిగిన మిలట్రీ కుట్ర ద్వారా అధికారం నుండి కూల్చివేయబడిన ముస్లిం బ్రదర్ హుడ్ (ద ఇఖ్వాన్) నాయకులపై మోపిన ప్రధాన క్రిమినల్ కేసుల నుండి వెలువడతాయని భావిస్తున్న అనేక తీర్పుల్లో ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మహమ్మద్ మొర్సీ, ఆయన సహ ప్రతివాదులపై గత వారం వెలువడిన దోషిత్వ నిర్ధారణ తీర్పు మొదటిది. డిసెంబర్ 2012లో అధ్యక్ష భవనం వెలుపల నిరసనకారులపై అల్లర్లు రెచ్చగొట్టినందుకు గాను మోర్సీకి 20 యేళ్ళ కారాగారవాస శిక్ష విధించారు. నూతన రాజ్యాంగ…

నేపాల్ భూకంపం: మృతులు 2200 పైనే -ఫోటోలు

నేపాల్ ను తాకిన భారీ భూకంపం ఆ చిన్న దేశంలో విలయాన్ని సృష్టించింది. ఇటీవలి వరకూ కొనసాగిన శతాబ్దాల నాటి భూస్వామ్య రాచరిక పాలన దేశ సంపదలను కొన్ని కుటుంబాల చేతుల్లోనే కేంద్రీకరింపజేయడంతో ఇప్పుడది ప్రకృతి విలయానంతర రక్షణ ఏర్పాట్లు చేయడంలో కూడా ఘోరంగా విఫలం అవుతోంది. సంపన్న కుటుంబాలు ప్రభుత్వాన్ని, ప్రజలను పేదరికంలోకి నెట్టడంతో రక్షణ పరికరాలు కొరవడి, తగిన శిక్షణ లేని భద్రతా సిబ్బంది తెల్లమొఖం వేయడంతో జనమే పూనుకుని తమ ఏర్పాట్లు తాము…

గ్రీసు దివాలాకు యూరప్ ఏర్పాట్లు?

ఋణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఐరోపా రాజ్యాలు గ్రీసు దివాలా తీసే పరిస్ధితికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. యూరో జోన్ (యూరోను ఉమ్మడి కరెన్సీగా కలిగి ఉన్న 17 ఈ.యు సభ్య దేశాల సమూహం) నాయకురాలైన జర్మనీ ఆర్ధిక మంత్రి ఈ మేరకు తగిన సూచనలు ఇస్తున్నట్లు వాణిజ్య పత్రికలు, పరిశీలకులు భావిస్తున్నారు. గ్రీసు తన జాతీయ కరెన్సీ డ్రాక్మాను రద్దు చేసుకుని యూరోను తమ కరెన్సీగా స్వీకరించిన దేశాల్లో ఒకటి. 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం…

ఢిల్లీలో రైతు ఆత్మహత్య, పాలకుల మొసలి కన్నీళ్లు -ఫోటోలు

బుధవారం ఢిల్లీలో ఎఎపి నిర్వహించిన కిసాన్ ర్యాలీ సందర్భంగా రాజస్ధాన్ నుండి వచ్చిన రైతు (గజేంద్ర సింగ్) ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య లేఖ రాసి మరీ చనిపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నెపాన్ని ఢిల్లీ ప్రభుత్వం పైకి నేట్టేందుకు చట్ట సభల సాక్షిగా ఆసక్తి ప్రదర్శించింది. కాగా అనంతరం జరిగిన, జరుతున్న తంతు ఈ దేశ పాలకవర్గాల కపటత్వాన్ని పచ్చిగా వెల్లడి చేసింది. భారత దేశంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం కొత్త కాదు. కాంగ్రెస్, టి.డి.పి, బి.జె.పి,…

పనికి(మాలిన)రాని కీచులాట! -కార్టూన్

రైతుల సమస్యల పట్ల పాలక, ప్రతిపక్ష పార్టీలు ఇరువురికీ చిత్తశుద్ధి కొరవడిందని శక్తివంతంగా చెబుతున్న కార్టూన్ ఇది. రాహుల్ గాంధీ తన పునరాగమనానికి భూసేకరణ చట్టం – 2013 కు మోడీ ప్రభుత్వం తెస్తున్న సవరణలను ఆలంబనగా చేసుకున్నారు. తాము రైతులకు అనుకూలమైన చట్టం తెస్తే మోడి దానికి చిల్లులు పొడుస్తున్నారని ఆయన ఆక్రందన! విచిత్రంగా బి.జె.పి, మోడిలు సైతం తమ సవరణలు రైతుల కోసమే అని చెబుతున్నారు. కొంతమంది పనిగట్టుకుని తమ సవరణలపై దుష్ప్రచారం చేస్తున్నారని…

భూతద్దం పరిశీలనలో గూగుల్ -ది హిందు ఎడిట్..

అయిదేళ్ళ పాటు కొనసాగిన ప్రక్రియ అనంతరం, గూగుల్ కంపెనీ అనుచిత (వ్యాపార) పద్ధతులను పాటిస్తున్న ఆరోపణలపై విచారణ చేయనున్నట్లు యూరోపియన్ కమిషన్ లాంఛనంగా ప్రకటించింది. యూరప్ లో ఇంటర్నెట్ శోధన సేవల మార్కెట్ లో తనకున్న గుత్తస్వామ్యాన్ని తన స్వార్ధ ప్రయోజనాలకు గూగుల్ కంపెనీ వాడుకుంటోందన్నది ఆరోపణ. ప్రధాన ఆరోపణల్లో ఒకటి, గూగుల్ లో పోలిక కొనుగోళ్ళ (comparison shopping) పని పద్ధతికి సంబంధించినది. ‘ఉత్పత్తుల పోలిక కొనుగోలు’ విధానం, వినియోగదారులకు ఆన్ లైన్ షాపింగ్ వెబ్…

కోకోకోలాపై పెరుందురై ప్రజల విజయం

ప్రజలు ఎక్కడ తిరగబడుతున్నారు అని ప్రశ్నిస్తున్న అమాయక బుద్ధి జీవులకు తమిళనాడులోని పెరుందురై ప్రజలు సమయానుకూల సమాధానం ఇచ్చారు. నీటి వనరులను పీల్చి పంటల్ని పిప్పి చేసే కోకోకోలా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తిరగబడడంతో కోకోకోలాకు ఇచ్చిన భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. కోకోకోలాకు భూములపై ఇచ్చిన లీజును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో పెరుందురై ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. తమిళనాడు రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక సంస్ధ…

రాహుల్ పునరాగమనం -ది హిందు ఎడిటోరియల్

[ఏప్రిల్ 21 తేదీన ది హిందూలో ప్రచురించిన ‘Return of Rahul’ సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం.] దాదాపు రెండు నెలల పాటు సెలవు రాహుల్ గాంధీ సెలవులో వెళ్లిపోవడం సరైన సమయంలో జరిగిన పరిణామమో ఏమో గానీ ఆదివారం నాడు ఢిల్లీలో భూ సేకరణ చట్టం (సవరణలు) కు వ్యతిరేకంగా నిర్వహించిన భారీ ర్యాలీ మాత్రం కాంగ్రెస్ పార్టీని మరింత చురుకైన ప్రతిపక్షంగా నిలబెట్టినట్లు కనిపిస్తోంది. నిరసనలకు ప్రారంభ ఊపు ఇచ్చింది రైతుల గ్రూపులు, పౌర…

రైతుల భూములపై రాహుల్ కి అంత ప్రేమ ఏల? -కార్టూన్

రాహుల్ గాంధీ సెలవు కాలం ముగించుకుని కలుగులోంచి వెలికి వచ్చారు. వచ్చీ రావడంతోనే రైతుల (కోసం) ర్యాలీ నిర్వహించి తన పునరాగమనాన్ని ఘనంగా చాటారు (లేదా చాటానని ఆయన అనుకున్నారు). ఆయన మాట్లాడినంత సేపూ జనం (ఎలాగో) ఉన్నారని, ఆయన ముగించి సోనియా గాంధీ మాట్లాడడం ప్రారంభించగానే జనం వెళ్లిపోవడం మొదలు పెట్టారని పత్రికలు గుస గుస రాశాయి. పునరాగమనం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడి తెచ్చిన భూ సేకరణ చట్ట సవరణ బిల్లుపై ఆయన నిప్పులు…