ఇష్రాత్ జహాన్, హిందూత్వ మరియు ఒక ఆంగ్ల ఛానెల్!

డేవిడ్ కోలమన్ హేడ్లీ అలియాస్ డేవిడ్ హేడ్లీ అలియాస్ దావూద్ సయీద్ జిలానీ! భారత ఉపఖండంలో ఇప్పుడితగాడి పేరు ఒకటే మోతగా మోగుతోంది. పత్రికలు, ఛానెళ్లలో ఎక్కడ చూసినా ఈయన పేరు కనపడని చోటు లేదు. భారత దేశంలో చారిత్రక ప్రదేశాలను చూసి తరిద్దామని వచ్చిన విదేశీ టూరిస్టులు హెడ్లీ నామ స్మరణతో తరించిపోతున్న మన న్యూస్ చానెళ్లను చూస్తే గనక గబుక్కన ఆయన మన నేషనల్ హీరో అనుకోవచ్చు కూడాను! జనానికి అదృష్టమో/ దురదృష్టమో గానీ…

రద్దయ్యేది సన్నకారు రుణాలా, కార్పొరేట్ రుణాలా?

“ముందు మాల్యాని పట్టుకోండి…” ఆర్టికల్ కింద విన్న కోట నరసింహారావు గారి వ్యాఖ్యకు సమాధానంగా ఈ వ్యాసాన్ని చూడగలరు. ********* (బడా ఋణ గ్రహీతలను) “వదిలిపెట్టేస్తారు అనేది ఓ అపోహ. అసలు ఋణమాఫీ అన్నది సన్నకారు ఋణాల విషయంలోనే ఎక్కువ జరుగుతుంది.” ఇది విన్నకోట నరసింహారావు గారి వ్యాఖ్యలోని ఓ భాగం. జరుగుతున్న రాజకీయ రగడని అవకాశంగా తీసుకుని బాకీలు ఎగవేసే ధోరణి వల్ల దేశంలో ముఖ్య ఆర్ధిక సంస్ధలైన బ్యాంకుల వ్యవహారాలు ముందుకు సాగకుండా నిర్వీర్యం…

హ్యాపీ పాకిస్తాన్ నేషనల్ డే! -మోడి గ్రీటింగ్స్

“భారత్ మాతా కీ జై’ అనని వారు పాకిస్తాన్ వెళ్లిపోవచ్చు” బి‌జే‌పితో పాటు ఇతర హిందూత్వ సంస్ధల నేతలకు ఈ చాలా ఇష్టమైన డైలాగ్. ఈ డైలాగ్ చెబితే చాలు వారు అరివీర దేశభక్తులుగా రిజిస్టర్ అయిపోయినట్లే అని వారి ప్రగాఢ నమ్మకం. పాకిస్తాన్ మన పొరుగు దేశం అనీ, అనేక వేల సంవత్సరాలుగా ఇరు దేశాల ప్రజలు కలిసి మెలిసి నివసించారని వాళ్ళు ఇట్టే మర్చిపోతుంటారు. ప్రాచీన భారత నాగరికతగా చెప్పుకుని మురిసిపోయే హరప్పా, మొహంజొదారో…

ముందు మాల్యాని పట్టుకోండి! -రైలు టికెట్ కొనని మహిళ

భారత పాలకుల ధనికవర్గ తత్వాన్ని ఒక మహిళ ఎండగట్టిన ఉదంతం చోటు చేసుకుంది. సహజంగా వివాదాలకు దూరంగా ఉండాలని భావించే ధనిక కుటుంబాలకు చెందిన మహిళ ఈ సాహసానికి పూనుకోవడం విశేషం. 44 సం.ల మహిళ ఆదివారం రైలులో టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడింది. బహుశా ‘పట్టుబడింది’ అనడం సరైనది కాకపోవచ్చు. ఎందుకంటే ఆమె టికెట్ కొనలేనంత పేదరాలు కాదు. ‘పట్టుబడిన అనంతరం’ ఆమె టికెట్ కలెక్టర్ విధించిన జరిమానా చెల్లించడం కంటే జైలుకు వెళ్లడానికే సిద్ధపడడాన్ని…

వైవిధ్యానికీ, బహుళ గొంతుకలకూ జేఎన్యూ వేదిక

(ప్రముఖ పాత్రికేయులు, వ్యవసాయరంగ నిపుణులు, ‘రామన్ మెగసెసే’ అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ జేఎన్యూ ఉద్యమానికి మద్దతుగా గత 19న విద్యార్థులనుద్దేశించి క్యాంపస్లో ప్రసంగించారు. ఆ ప్రసంగానికి పూర్తిపాఠం ఇది.) *****అనువాదం: జి వి కే ప్రసాద్ (నవ తెలంగాణ)***** నేను జేఎన్యూ పూర్వ విద్యార్థిని కావడం నాకు గర్వకారణం. 1977లో ఎమర్జెన్సీని ఎత్తివేసిన కొద్ది కాలానికే నేనీ క్యాంపస్లో అడుగుపెట్టాను. ఆ రోజుల్లో పురుషుల ‘గంగా’ హాస్టల్ రాజకీయంగా ఎక్కువ క్రియాశీలంగా ఉండేది. నేనందులోనే ఉండేవాణ్ని.…

ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు, ఆర్ట్ ఆఫ్ లూటింగ్!

“మనల్ని మనమే విమర్శించుకుంటే ప్రపంచం ఇండియావైపు ఎందుకు చూడాలి?” యమునా తీరాన్ని ఖరాబు చేసే పనిలో నిమగ్నం అయిన పండిట్ శ్రీ శ్రీ రవిశంకర్ కు మద్దతు వస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అడిగిన ప్రశ్న ఇది. [పండిట్ బిరుదు ఆయనకు గతంలో ఉండేది. తర్వాత దానిని రద్దు చేసుకున్నారు. అందుకే రాసి కొట్టివేయడం.] మూడు రోజుల పాటు జరగనున్న ‘ప్రపంచ సాంస్కృతి పండగ’ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడి శుక్రవారం ఢిల్లీలో ప్రారంభిస్తూ…

ఆర్ట్ ఆఫ్ "లివింగ్ ఇట్ అప్"

“మనదేం బోయింది!” ఈ మాట అప్పుడప్పుడూ అంటుంటాం. మనది కాని సొమ్ముని అదుపు లేకుండా ఖర్చు చేసేసే అవకాశం వచ్చినప్పుడు ‘ఎక్కువ ఖర్చు పెడుతున్నాం’ అన్న వివేకం ఎక్కడో పని చేస్తూ ఉంటుంది, కానీ ఊరక వచ్చింది ఖర్చు పెట్టకుండా ఉండలేక నిభాయించుకోలేని బలహీనతలో పడిపోతాం. శ్రీ శ్రీ రవి శంకర్ గారి వ్యవహారం అలాగే ఉన్నట్లుంది చూడబోతే. “జీవించే కళ” అంటూ శ్రీ శ్రీ రవి శంకర్ గారూ మహా సామ్రాజ్యాన్నే నిర్మించారు. “ఒత్తిడి లేని…

JNU లోపల కన్హయ్యపై దాడి!

ప్రభుత్వాలే ఉద్దేశపూర్వకంగా ఉన్మాదపూరిత భావోద్వేగాలతో దేశంలో గాలిని నింపేశాక కన్హయ్య, ఉమర్ ఖలీద్, అనిర్బన్ లాంటి వాళ్ళకు రక్షణ ఎక్కడ ఉంటుంది? దేశ రాజధానిలో కోర్టు ఆవరణలోనే న్యాయాన్ని రక్షిస్తామని పట్టా పుచ్చుకున్న న్యాయవాదులు పోలీసుల సాక్షంగా కన్హయ్యపై దాడి చేశారు. ఇప్పుడు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రాంగణంలో తన వారి మధ్య భద్రంగా ఉన్నాడనుకున్న కన్హయ్యను దుండగుడు ఒకరు బూతులు తిట్టి, కొట్టారని వార్త వెలువడింది. పి‌టి‌ఐ వార్తా సంస్ధ ప్రకారం JNUSU అధ్యక్షుడు…

కన్హయ్యతో మమతను పెళ్లగించగలరా? -కార్టూన్

“కన్హైయా కుమార్ ఎన్నికల ప్రచారంలో సి‌పి‌ఐ, సి‌పి‌ఎం పార్టీల తరపున పాల్గొంటారు” అని ఇరు పార్టీలు పుత్రోత్సాహంతో ప్రకటించేశాయి. తద్వారా జే‌ఎన్‌యూ విద్యార్ధుల పోరాటాన్ని తీసుకెళ్లి పార్లమెంటు/అసెంబ్లీ ఎన్నికల రొంపిలోకి దింపి స్వప్రయోజనాలకు వినియోగించడానికి ఆ పార్టీలు తలపెట్టాయి. సి‌పి‌ఎం నేత సీతారాం యేచూరి, సి‌పి‌ఐ నేత డి రాజాలు ఇద్దరూ ఈ మేరకు టి‌వి ఛానెళ్లలో కనపడి ప్రకటన చేశారు. కన్హైయా బెయిల్ పై విధించబడ్డ షరతుల రీత్యా ఆయన కేరళ, బెంగాల్ కు ప్రయాణించబోరని…

ఈ యేటి నిరర్ధక ఆస్తులు లక్ష కోట్లు!

“ప్రపంచం అంతా ఆర్ధిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుంటే ఇండియా మాత్రం అద్భుతమైన ప్రగతి (ఆర్ధిక వృద్ధి) నమోదు చేస్తుంది. ఇది మా విధానాల వల్లనే సాధ్యపడింది….” ఇది ఈ మధ్య కాలంలో ప్రధాన మంత్రి మోడి తరచుగా చెబుతున్న మాట! ప్రధాని మాటలు వాస్తవమేనా? కాదు అని ఆర్ధిక మంత్రి ఇచ్చిన సమాచారం చెబుతోంది. రాజ్య సభలో అరుణ్ జైట్లీ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం ప్రకారం 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు -మొదటి…

బడ్జెట్ 2016: పాపులిస్టు ముసుగులో సంస్కరణలు -2

విద్య, ఆరోగ్యం, కుటుంబ, స్త్రీ శిశు సంక్షేమం ఈ రంగాలకు కేటాయింపులు భారీగా పెంచినట్లు మోడి-జైట్లీ బడ్జెట్ చూపింది. బడ్జెట్ లో భారీ కేటాయింపులు చూపడం ఆనక చడీ చప్పుడు కాకుండా సవరించి కోత పెట్టడం మోడి మార్కు ‘బడ్జెట్ రాజకీయం’. వివిధ శాఖల్లోని అంకెలను కలిపి ఒకే హెడ్ కింద చూపుతూ భారీ కేటాయింపులు చేసినట్లు చెప్పుకోవడం కూడా మోడి మార్కు మాయోపాయం. ఉదాహరణకి స్త్రీ, శిశు సంక్షేమం కింద బడ్జెట్ లో చూపినదంతా స్త్రీ,…

2016 బడ్జెట్: రాష్ట్రాల ఎన్నికలే లక్ష్యంగా… -1

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఒక విచిత్రమైన బడ్జెట్ ప్రతిపాదించారు. దాదాపు ఎవరికీ ఏమీ అర్ధం కాకుండా పోయిన బడ్జెట్ ఇది. సారాంశాన్ని ఒక ముక్కలో చెప్పడానికి సాధారణ పరిశీలకులకు ఎవరికీ అవకాశం ఇవ్వకుండా బడ్జెట్ ప్రతిపాదించబడింది. చివరికి స్టాక్ మార్కెట్లు కూడా మొదట 600 పాయింట్లు పైగా పడిపోయి మళ్ళీ లేచి 153 పాయింట్ల నష్టంతో సర్దుకుంది. అనగా ధనిక పారిశ్రామిక వర్గాలకు కూడా బడ్జెట్ తనకు అనుకూలమో, ప్రతికూలమో ఒక పట్టాన అర్ధమై చావలేదు.…

వేశ్యలు ప్రతీఘాత ఉదాహరణలు కారు -చర్చ

గత ఆర్టికల్ –మహిషాసురుడు సభకు ఎందుకు వచ్చాడు?– కింద వెంకట్ గారి చర్చకు సమాధానంగా ఈ వ్యాసాన్ని చూడగలరు -విశేఖర్) —————– ఒకటి: సెక్స్ వర్కర్స్ కూడా మనుషులే. వాళ్లేమీ ఇష్టం ఉండి ఆ పని చేయరు. వారి శరీరాలతో వ్యాపారం చేసే వాళ్ళు అధికార వ్యవస్ధలోనే తిష్ట వేసుకుని ఉంటారు. లేదా అధికారంలోని పెద్దల అండదండలతోనే స్త్రీల శరీరాలతో వ్యాపారం జరుగుతోంది. అక్రమ సంపాదనలు, సంపదలు పెరగడం కోసం యువతుల్ని, బాలికల్ని పలు రకాలుగా మోసం…

వీడియో మార్ఫింగ్ స్మృతి సలహాదారు పని?

జే‌ఎన్‌యూ విద్యార్ధుల ఆందోళన, అఫ్జల్ గురు సంస్మరణ కార్యక్రమం లకు సంబంధించి ఇంటర్నెట్ లోనూ, టి.వి న్యూస్ ఛానెల్స్ తదితర ప్రసార మాధ్యమాల్లోనూ ప్రచారంలో ఉన్న 7 వీడియోల్లో మూడు వీడియోలలో ఉద్దేశ్యపూర్వకంగా మార్పులు చేసినట్లు ఢిల్లీ ప్రభుత్వం నియమించిన మెజిస్టీరియల్ విచారణలో తేలిన సంగతి విదితమే. మార్పులు చేసిన మూడు వీడియోల్లో ఒక వీడియోను ఎడిట్ చేయగా, రెండు వీడియోలు కావలసిన అర్ధం వచ్చే విధంగా, కోరుకున్న ప్రభావం కలిగే విధంగా ఉద్దేశ్యపూర్వకంగా మార్ఫింగ్ చేశారని…

సమస్యలకు, చర్చకు సమాధానం ఇవ్వని ప్రధాని!

ప్రతిపక్షాలు ఆత్మ న్యూనత భావం (ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్) తో బాధపడుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తేల్చేశారు. అందుకే అవి పార్లమెంటులో (ముఖ్యంగా రాజ్య సభలో) చర్చ సజావుగా సాగకుండా అడ్డుకుంటున్నాయని ఆయన నిర్ధారించారు. కానీ చర్చ జరగకుండా నిరోధిస్తున్నది ఒక్క కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీలేనా? పాలక పక్షం అందునా ప్రధాన మంత్రి గారే చర్చలు ముందుకు సాగనివ్వకుండా అడ్డుకోవడం లేదా? ప్రజా సమస్యలు చర్చలోకి రాకుండా పాలక, ప్రతిపక్షాలు రెండూ ఆటంకాలు కలిగిస్తున్నాయి. కాకపోతే…