గుల్బర్గ్ హత్యాకాండ: దక్కని న్యాయం

గుల్బర్గ్ హత్యాకాండ బాధితులకు చివరికి తీరని శోకం, అసంతృప్తి, వేదన, నిస్పృహ మాత్రమే దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు ఎహసాన్ జాఫ్రీతో సహా 69 మంది ముస్లింలను ఊచకోత కోసిన కేసులో 24 మందిని మాత్రమే దొషులుగా ట్రయల్ కోర్టు తేల్చింది. ఆ 25 మందిలో కూడా 11 మంది మాత్రమే హత్యలకు బాధ్యులుగా కోర్టు గుర్తించింది. పోలీసులు మొత్తం 60 మందిపై అభియోగాలు మోపగా 36 మందిని కోర్టు నిర్దోషులుగా తీర్పు చెప్పింది.…

పనామా పేపర్స్: అమెరికా ఫైనాన్స్ ప్రయోజనాలే లక్ష్యం -4

(3వ భాగం తరువాత………..) అమెరికా ఫైనాన్స్ కంపెనీలే లబ్దిదారులు ఒక నేరం జరిగినప్పుడు పోలీసులు లేదా నేర విచారణ సంస్థలు ఒక అంశంపై తప్పనిసరిగా దృష్టి పెడతాయి. ఆ నేరం వల్ల లబ్ది పొందేది ఎవరు? అని ప్రశ్నించుకుంటారు. ఆ ప్రశ్నకు సమాధానం దొరికితే నేర విచారణ అనేక కేసుల్లో పూర్తయి పోతుంది. అనేకానేకానేక పరిణామాలు నిత్యం విడివిడిగా, జమిలిగా చోటు చేసుకునే ప్రపంచ కార్యరంగంలో చోటు చేసుకునే పరిణామాలకు కారణాలు కనిపెట్టడం మామూలు కంటికి కష్ట…

పఠాన్ కోట్ దాడిలో పాక్ హస్తం: సాక్ష్యం లేదు  -ఎన్ఐఎ

నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అథిపతి పొరపాటునో గ్రహపాటునో ఒక నిజం కక్కేశారు. “పఠాన్ కోట్ దాడి వెనుక పాక్ హస్తం లేదు” అని న్యూస్18 ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దాడి వెనుక పాక్ ప్రభుత్వం  గానీ పాక్ ప్రభుత్వ ఏజెన్సీలు గానీ కుమ్మక్కు అయినట్లు తమ వద్ద ఎటువంటి సాక్షాలు లేవుఅని ఎన్ ఐ ఎ డైరెక్టర్ శరత్ కుమార్ స్పష్టం చేశారు.  ఎన్ ఐ ఎ వెల్లడి కేంద్రం లోని బిజెపి ప్రభుత్వాన్ని…

అక్రమ డబ్బు, పన్ను ఎగవేతలకు నూతన స్వర్గం అమెరికా! -3

– (2వ భాగం తరువాత………….) అక్రమ డబ్బుకు కొత్త స్వర్గం అమెరికా! 2008 ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం తర్వాతి రోజుల్లో అమెరికా, ఐరోపాలు జి20 ని ప్రధానంగా రంగంలోకి దించాయి. జి20 పేరుతో సంక్షోభం భారాన్ని బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాలపై నెట్టడానికి ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా చైనా వద్ద ఉన్న అపారమైన విదేశీ మారక ద్రవ్య నిల్వలు లక్ష్యంగా పెట్టుకుంది. (ఐతే చైనా ఆ బుట్టలో పడకపోవడం వేరే సంగతి).…

యూపి ఎన్నికలు : దళిత ఓట్లు  -కార్టూన్ 

2017లో  జరిగే  యూపి ఎన్నికలలో దళితుల ఓట్లు కీలకం అవనున్నాయని పార్టీలు భావిస్తున్నాయి. దానితో దళితులను ప్రసన్నం చేసుకుని లబ్ది పొందడానికి వివిధ పార్టీలు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. బిజెపి మామూలుగానే దళిత వ్యతిరేక  పార్టీ . రోహిత్ ఆత్మహత్య  దరిమిలా ఆ ముద్రను థ్రువపరుచుకుంది. జెఎన్యూలో కొందరు బ్రాహ్మణ వాద ప్రొఫెసర్లు తయారుచేసిన డొజియర్ లో  “యూనివర్సిటీలో జాతీయ వ్యతిరేక, దేశ వ్యతిరేక ప్రొఫెసర్లు, విద్యార్థులు అందరూ దళితులు, ముస్లింలే” అని పేర్కొన్న నేపథ్యంలో…

పనామా పేపర్స్: పుతిన్ ఎందుకు కేంద్రం అయ్యాడు? -2

(మొదటి భాగం తరువాత……….) అసలు ఐ‌సి‌ఐ‌జే ఎక్కడిది? సంవత్సరం క్రితం వరకూ దీనిని గురించి తలచుకున్నవారు లేరు. 1997లో స్థాపించినట్లు చెబుతున్న దీని మాతృ సంస్థ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటెగ్రిటీ (సి‌పి‌ఐ). సి‌పి‌ఐకి నిధులు సమకూర్చి పెడుతున్న వాళ్ళు ఎవరో తెలుసుకుంటే మొత్తం విషయంలో సగం అర్ధం అయిపోతుంది. యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) మాజీ రాయబారి క్రెయిగ్ ముర్రే తన వెబ్ సైట్ లో ఇలా తెలిపాడు. “మొస్సాక్ ఫన్సెకా సమాచారాన్ని వడ కట్టిన…

ఫైనాన్స్ మత్తగజాల మధ్య సమరమే ‘పనామా పేపర్స్’! -1

[ఈ వ్యాసం మొదట ప్రజా పంధా పక్ష పత్రికలో రెండు భాగాలుగా అచ్చయింది. బ్లాగ్ లో 4 భాగాలుగా ఇస్తున్నాను. -విశేఖర్] ********* ఏప్రిల్ మొదటి వారంలో (4 తేదీ నుండి) ప్రపంచ పౌరులందరినీ ఆకట్టుకున్న వార్త ఒకటి పత్రికల్లో, ఛానెళ్లలో పతాక శీర్షికలను ఆక్రమించింది. దాదాపు ప్రతి దేశంలోనూ తమ పాలకుల అవినీతి, బంధు ప్రీతి, అధికార దుర్వినియోగాల పట్ల విసిగిపోయి ఉన్న ప్రజలకు కొత్తగా ఒక ‘అవినీతి వ్యతిరేక మెస్సయ్యా’ ప్రత్యక్షమయిన భావనను ఆ…

మృత జవాన్లకు సానుభూతికూడా ట్విట్టర్ తోనేనా?

“మహారాష్ట్ర, పులగావ్ వద్ద సెంట్రల్ ఆమ్యూనిషన్ డిపోలో మంటలకు ప్రాణాలు నష్టపోవడం బాధ కలిగిస్తోంది. నా ఆలోచనలు బాధితులతో ఉన్నాయి.” అని ఒక ట్వీట్ లో ప్రధాని నరేంద్ర మోడి పేర్కొన్నారు. “గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను. ఆర్‌ఎం మనోహర పరికర్ ఘటనా స్ధలిని సందర్శించి పరిస్ధితిని సమీక్షించాలని కోరాను” అని మరో ట్వీట్ లో ప్రధాని పేర్కొన్నారు. ట్విట్టర్ ద్వారా కాకుండా ప్రధాన మంత్రి కార్యాలయం నుండి ప్రకటన వెలువడినట్లుగానీ, అందినట్లుగానీ ఏ పత్రికా…

ఆర్మీ మందుగుండు డిపోలో పేలుడు, 17గురు సైనికులు ఆహుతి

మహారాష్ట్రలో భారత రక్షణ బలగాల ఆయుధాలకు మందుగుండు సరఫరా చేసే అతి పెద్ద మందుగుండు డిపోలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంగా చెబుతున్న దుర్ఘటనలో 17 మంది సైనికులు దుర్మరణం చెందారని పత్రికలు తెలిపాయి. మరణాల సంఖ్య 20 కి పెరిగిందని కొన్ని పత్రికలు చెప్పాయి. ప్రధాన మంత్రి యధావిధిగా ‘ట్విట్టర్’ ద్వారా తన ఆందోళన ప్రకటించారు. తన ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయని తెలిపారు. మృతులలో ఇద్దరు అధికారులు కాగా 15 మంది డిఫెన్స్ సెక్యూరిటీ…

కోల్డ్ వార్ మనస్తత్వం వదలండి, అమెరికాతో చైనా

అమెరికా హెచ్చరికలకు చైనా ఘాటుగా బదులు ఇచ్చింది. రక్షణ కార్యదర్శి (మన రక్షణ మంత్రికి సమానం) ఎష్టన్ కార్టర్ చేసిన వ్యాఖ్యలు కోల్డ్ వార్ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని, కోల్డ్ వార్ మెంటాలిటీ నుండి బైటికి వస్తే మంచిదని హెచ్చరించింది. అమెరికా మిలట్రీ అధికారులు డైరెక్ట్ చేసే హాలీవుడ్ కోల్డ్ వార్ సినిమాలో తాము ఎలాంటి పాత్ర పోషించబోమని అపహాస్యం చేసింది. “కార్టర్ వ్యాఖ్యలు అమెరికా స్టీరియోటైప్ ఆలోచనా విధానాన్ని, అమెరికా ఆధిపత్య భావనని నగ్నంగా ఆరబోశాయి” అని…

రష్యా సదస్సుకు ఈ‌యూ నేత, అమెరికా అభ్యంతరం!

అమెరికా, యూరోపియన్ యూనియన్ ల మధ్య లుకలుకలు మెల్లగానే అయినా పెరుగుతున్నాయి. రష్యా నగరం సెయింట్ పీటర్స్ బర్గ్ లో ప్రతి యేటా జరిగే “సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరం” (SPIEF) సమావేశాలకు ఈ యేడు యూరోపియన్ కమిషన్ (ఈ‌సి) అధ్యక్షుడు జీన్-క్లాడ్ జంకర్ హాజరు కానున్నాడు. ఆయన రష్యా వెళ్లడానికి అమెరికా అభ్యంతరం చెబుతోంది. ఒక పక్క రష్యాపై అమెరికా-ఈ‌యూల ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలు కొనసాగుతుండగా రష్యా జరిపే ఆర్ధిక సదస్సుకు ఈ‌సి…

రుమేనియా నాటో బేస్: బలిపశువు అవుతారు -రష్యా

అమెరికా నేతృత్వం లోని మిలటరీ గూండా కూటమి నాటో (North Atantic Treaty Organisation) కు తమ దేశంలో మిసైల్ స్ధావరం కల్పించడంపై రష్యా నోరు విప్పింది. అనవసరంగా నాటో యుద్ధోన్మాదంలో బలి పశువు కావొద్దని హితవు పలికింది. అమెరికన్ యాంటీ మిసైల్ వ్యవస్ధను తమ దేశంలో నెలకొల్పడానికి అనుమతి ఇవ్వడం తగదని, తమ రక్షణ కోసం అమెరికా మిసైల్ వ్యవస్ధపై చేసే దాడి రుమేనియాపై దాడిగా మారుతుందని హెచ్చరించింది. యూరోపియన్ యూనియన్ తో సంబంధాలు మెరురుపరుచుకునే…

మళ్ళీ రేప్: ఒకినావాలో అమెరికా వ్యతిరేక ఆందోళనలు

జపాన్ దక్షిణ ద్వీప రాష్ట్రం ఒకినావాలో అమెరికా సైనికులు మరోసారి దురాగతానికి పాల్పడ్డారు. సాయంత్రం సమయంలో అమెరికా సైనిక స్ధావరం సమీపంలో వాకింగ్ కి వెళ్ళిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం ఆ మహిళను గొంతు పిసికి చంపేశారు. మే 26-27 తేదీలలో టోక్యోలో G7 దేశాల సమావేశం జరగడానికి మూడు రోజుల ముందు జరిగిన ఈ దారుణానికి వ్యతిరేకంగా జపాన్ ప్రజలు ఆందోళనలను తీవ్రం చేశారు. ఒకినావా రాష్ట్రంలోను ఫుటెన్మా సైనిక స్ధావరాన్ని పూర్తిగా…

కోల్డ్ వార్ 2.0: కజకిస్తాన్ లో ప్రేరేపిత ఆందోళనలు

కోల్డ్ వార్ వర్షన్ 2.0 లో కజకిస్తాన్ ఒక భాగం అయింది. రష్యా పొరుగు దేశం కజకిస్తాన్ లో సో-కాల్డ్ ప్రజాందోళనలు చెలరేగడంతో రష్యా వ్యతిరేక కోల్డ్ వార్ లో మరో ఫ్రంట్ ను అమెరికా తెరిచినట్లయింది. సిరియాను అస్తవ్యస్తం కావించి రష్యాను సిరియా యుద్ధంలో కూరుకుపోయేలా చేయడానికి శత విధాలుగా ప్రయత్నించి విఫలం అయిన అమెరికా మరో దుస్సాహసానికి ఒడిగడుతోంది. మే 21 తేదీన కజకిస్తాన్ లో వివిధ నగరాలలో ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలలో…

గత ప్రభుత్వాలూ కృషి చేశాయి -దారి తప్పిన మోడి

అస్సాంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సర్బానంద సోనోవాల్ నేతృత్వంలో బి‌జే‌పి మొదటి సారిగా అస్సాంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనేకమంది కేబినెట్ మంత్రులతో సహా ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కూడా కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతవరకు ఈ వార్తలో విశేషం ఏమీ లేదు. ప్రధాన మంత్రి ప్రసంగంలో దొర్లిన కొన్ని మాటలే అసలు విశేషం. “స్వతంత్రం అనంతరం గతంలో ఏ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినా కూడా, ప్రతి…