ఇరాక్ తరహాలో లిబియా దురాక్రమణకు ఏర్పాట్లు చేసుకుంటున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు ల త్రయం తమ ఉద్దేశాలను మెల్ల మెల్లగా బైట పెట్టుకుంటున్నాయి. లిబియా తిరుగుబాటుదారులకు మిలట్రి సలదారులను పంపించడానికి బ్రిటన్ నిర్ణయించింది. గడ్డాఫీకి ఆయుధాలు అందకుండా చేయడానికి మొదట ‘అయుధ సరఫరా’ పై నిషేధం విధించారు. ఆర్ధిక వనరులు అందకుండా లిబియా ప్రభుత్వానికి అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉన్న ఖాతాలను స్తంభింప జేశారు. గడ్డాఫీ విమానదాడులనుండి లిబియా ప్రజలను రక్షించచే పేరుతో “నో-ఫ్లై జోన్” అన్నారు. ఆ పేరుతో లిబియా తీర ప్రాంతాన్ని విమానవాహక నౌకలతో…

హోండురాస్ లో మరో మిలట్రీ స్ధావరాన్ని తెరవబోతున్న అమెరికా

2009 లో మిలట్రీ కుట్ర ద్వారా హోండురాస్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత అక్కడ మరో మిలట్రీ స్ధావరం నెలకొల్పడానికి అమెరికా ఒప్పందం కుదుర్చుకుంటోంది. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన మాన్యువల్ జెలాయా నాయకత్వంలోని ప్రభుత్వాన్ని అక్కడి మిలట్రీ, ప్రతిపక్షాలు కుమ్మక్కయ్యి కుట్ర తో కూల్చి వేశాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడన్న నేరాన్ని మోపి రాత్రికి రాత్రి విమానం ఎక్కించి కోస్టారికా దేశానికి ప్రవాసం పంపారు. జెలాయా అధికారంలోకి వచ్చాక కార్మికులకు కనీస వేతనాలను పెంచడం తదితర చర్యలను చేపట్టడంతో పెట్టుబడిదారులు,…

సిరియా ఆందోళనలకు అమెరికా రహస్య సహాయం

సిరియా అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ జరుగుతున్న హింసాత్మక ఆందోళనలకు అమెరికా 5 సంవత్సరాలనుండీ రహస్యంగా నిధులు అందజేస్తూ వచ్చిన విషయాన్ని వికీలీక్స్ ద్వారా వెల్లడి అయ్యింది. 2006లో జార్జి బుష్ అధికారంలో ఉన్నప్పటినుండి ప్రారంభమైన ఈ సహాయం ఒబామా అధ్యక్షుడు అయ్యాక కూడా కొనసాగిన విషయం వికీలీక్స్ వెల్లడించిన డిప్లొమేటిక్ కేబుల్స్ ద్వారా స్పష్టమయ్యింది. సిరియా అధ్యక్షుడు అస్సద్ 2000 సంవత్సరంలో తన తండ్రి చనిపోయినప్పటినుండీ అధికారంలో ఉన్నాడు. ఇరాక్ మాజీ అద్యక్షుడు సద్దాం హుస్సేన్ లాగానే…

అమెరికా అప్పు చెల్లింపు సామర్ధ్యంపై అనుమానాలు, అంచనా తగ్గించిన ఎస్ & పి

ప్రముఖ రేటింగ్ సంస్ధ అమెరికా అప్పు రేటింగ్ పై తన అంచనాను తగ్గించింది. ఇప్పటివరకు “స్ధిరం” గా ఉన్న అంచనాను “నెగటివ్” గా మార్చింది. దానర్ధం మరో రెండు సంవత్సరాల్లొ రేటింగ్ తగ్గించే అవకాశాలు ఉన్నాయని అర్ధం. అయితే ఆ లోపు పరిస్ధితి మారినట్లయితే అంచనాను మళ్ళీ “స్ధిరం” గా మారే అవకాశాలు లేకపోలేదు. అమెరికా ప్రభుత్వ ఖర్చును తగ్గిస్తూ పొదుపు చర్యలతో కూడిన బడ్జెట్ కోత బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించకపోవచ్చన్న అనుమానాలు సర్వత్రా వ్యాపించాయి.…

జపాన్ పునర్నిర్మాణం ఖరీదు రు. 14 లక్షల కోట్లు

శక్తివంతమైన భూకంపం, వినాశకర సునామీల ధాటికి దెబ్బతిన్న ఈశాన్య జపాన్ ని పునర్నించడానికి 300 బిలియన్ డాలర్లు అవసరమని జపాన్ ప్రభుత్వం లెక్కగట్టింది. భూకంపం, సునామీల్లొ ఫుకుషిమా దైచి వద్ద అణు విద్యుత్ కర్మాగారం దెబ్బతిని అందులోని నాలుగు రియాక్టర్ల నుండి రేడియేషన్ వెలువడుతున్న విషయం విదితమే. ప్రమాద స్ధాయి అత్యధిక స్ధాయి 7 గా నిర్ణయించిన ఫుకుషిమా అణు ప్రమాదం నుండి ఆ ప్రాంతాన్ని బైట పడేయడానికి ఎంత కాలం పడుతుందో చెప్పడానికి అణు ప్ల్లాంటు…

ఆకలి, దరిద్రాలతో బడి మానేస్తున్న బ్రిటన్ విద్యార్ధులు

బడిమానేయడం ఇండియాలో సర్వ సాధారణం. పిల్లల్ని కూలికి పంపితే కుటుంబానికి కొంచెం ఆదాయం పెరుగుతుందనే ఆలోచనతో పల్లేల్లొ పేద రైతులు, కూలీలు తమ పిల్లలు చేతికందాక బడిమానిపిస్తారు. మూడు సంవత్సరాల క్రితం సంభవించిన ప్రపంచ ద్రవ్య, ఆర్ధిక సంక్షోభాల పుణ్యమాని ఇప్పుడు యూరప్ లోని ధనిక దేశాల్లో సైతం ఆ పరిస్ధితులు తలెత్తుతున్నాయి. ఆర్ధిక సంక్షోభం తర్వాత స్తంభించిపోయిన ఆర్ధిక కార్యకలాపాలను పునరుద్ధరించి వేగవంతం చేయడానికి అభివృద్ధి చెందిన దేశాలు ట్రిలియన్ల కొద్దీ డాలర్లను ప్రవేటు బహుళజాతి…

జపాన్ అణు కర్మాగారం పేలనున్న టైంబాంబుతో సమానం -అణు నిపుణుడు

భూకంపం, సునామిల్లో దెబ్బతిన్న జపాన్ లోని ఫుకుషిమా దైచి అణువిద్యుత్ కర్మాగారం వద్ద రేడియేషన్ తగ్గుతోందని జపాన్ ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవానికి అది పేలడానికి సిద్ధంగా ఉన్న టైంబాంబుతో సమానమని అమెరికాకి చెందిన అణు నిపుణుడు మిచియో కాకు హెచ్చరించాడు. న్యూయార్క్ లోని సిటీ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్న భౌతిక శాస్త్రవేత్త మిఛియో కాకు అమెరికాకి చెందిన డెమొక్రసీ నౌ టీవీ చానెల్ తో మాట్లాడుతూ జపాన్ అణు ప్రమాదానికి సంబంధించిన వాస్తవాలను వెల్లడించాడు. ఫుకుషిమాలోని…

బ్యాంకు రిజర్వు రేట్లను మళ్ళీ పెంచిన చైనా

చైనా మరోసారి రిజర్వు రిక్వైర్ మెంట్ రేటును పెంచింది. ద్రవ్యోల్బణం రికార్టు స్ధాయిలో 5.4 శాతానికి చేరుకోవడంతో చైనా మార్కెట్ల్లొ చలామణీలో ఉన్న డబ్బును నియంత్రించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటివరకు 20 శాతంగా ఉన్న రిజర్వు రిక్వైర్ మెంట్ రేటును (ఆర్.ఆర్.ఆర్) 20.5 శాతానికి పెంచింది. వాణిజ్య బ్యాంకులు తాము సేకరించీన్ డిపాజిట్లలొ రిజర్వు డబ్బుగా అట్టి పెట్టవలసిన డబ్బు శాతాన్ని రిజర్వు రిక్వైర్ మెంటు శాతం అంటారు. ఇండియాలొ దీన్ని సి.ఆర్.ఆర్ (క్యాష్ రిజర్వు రేషియో)…

పూర్తిస్ధాయి సంక్షోభానికి ఒకే ఒక్క షాక్ దూరంలోనే ఉన్నాం -ప్రపంచ బ్యాంకు

2008 లో సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నుండి ఇంకా పూర్తిగా కోలుకోనే లేదు. “పూర్తి స్ధాయి సంక్షోభానికి ఇంకొక్క షాక్ ఎదురైతే చాలు” అని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు రాబర్ట్ జోల్లిక్ హెచ్చరించాడు. ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న ఆహారధరలు మరో తీవ్రమైన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం బద్దలవడానికి ప్రధాన దోహదకారిగా పని చేస్తున్నదని రాబర్ట్ హెచ్చరించాడు. ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ లు వాషింగ్టన్ లో జరుపుతున్న వేసవి సమావేశాల సందర్భంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఈ…

పెట్రోలు దాహంలో చైనాతో పోటీ పడుతున్న ఇండియా

అమెరికాతో  పెట్రోలు వనరుల కోసం చైనా పోటిపడడం ఇప్పటివరకూ తెలుసు. తాజాగా ఇండియా చైనాతో పోటీ పడుతున్న పరిస్ధితి నెమ్మదిగానే అయినా స్ధిరంగా తలెత్తుతోంది. అమెరికా దురాక్రమణ యుద్ధాలు చేస్తూ పెట్రోలు కోసం తెగబడుతుంటే, చైనా వాణిజ్య ఒప్పందాల ద్వారా, పెట్టుబడుల ద్వారా పోటీ పడుతోంది. ఇప్పుడు చైనా పద్ధతుల్లోనే ఇండియా కూడా ఆయిల్, గ్యాస్ వనరుల కోసం పరుగులు పెట్టడం మొదలు పెట్టింది. తాజాగా కజకిస్ధాన్ ఆధీనంలోని పెట్రోల్ బావిలో భారత ప్రభుత్వం సంస్ధ ఓ.ఎన్.జి.సి…

ధనికులకు పన్ను తగ్గింపు, పేదలకు సంక్షేమ పధకాల కోత; అమెరికాలో దారుణం

అమెరికా ఆర్ధిక సంక్షోభం నుండి ఇంకా కోలుకోలేదు. దేశంలో ధనికుల వద్ద డబ్బు మూల్గుతుంటే పేదలు, మధ్య తరగతి ఆదాయాలు లేక ప్రభుత్వ సంక్షేమ పధకాల మీద ఆధారపడుతున్నారు. ఈ పరిస్ధితుల్లో సంక్షోభ పరిష్కారానికి వెంటనే తట్టే ఆలోచన: ధనికులకు పన్ను పెంచి తద్వారా ఆదాయం పెంచుకోవడం. కాని అమెరికా ప్రతినిధుల సభకు దీనికి పూర్తిగా వ్యతిరేకమైన ఐడియా తట్టింది. నిజానికి ఇది ఐడియా కాదు విధానం. అమెరికాలోని ప్రతినిధుల సభకు గత సంవత్సరం జరిగిన ఎన్నిల్లో…

గడ్డాఫీ అమ్ములపొదిలో క్లస్టర్ బాంబులు, హక్కుల సంస్ధ ఆందోళన

లిబియాలో గడ్డాఫీ బలగాలు పౌరులపై క్లస్టర్ బాంబులు ప్రయోగిస్తున్నాయని మానవహక్కుల సంస్ధ హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్ధ ఆరోపించింది. ఈ ఆరోపణలను లిబియా ప్రభుత్వం తిరస్కరించింది. క్లస్టర్ బాంబులుగా పెర్కొంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక కొన్ని ఫోటోలను ప్రచురించింది. పౌరుల నివాస ప్రాంతాల్లో క్లస్టర్ బాంబుల్ని పేల్చడం వలన మానవ నష్టం అపారంగా ఉంటుందనీ, గడ్డాఫీ ఈ బాంబుల వాడకాన్ని వెంటనే నిలిపివేయాలనీ హక్కుల సంస్ధ డిమాండ్ చేసింది. అయితే న్యూయార్క్ టైమ్స్ విలేఖరికి కనిపించిన బాంబు…

ఇండియా, చైనా, అమెరికాల్లో దూసుకెళ్తున్న ద్రవ్యోల్బణం

ఇండియా ద్రవ్యోల్బణం తగ్గించడమే మా మొదటి ప్రాధాన్యం అంటూ భారత ప్రధాని నుండి ప్రణాళికా కమిషన్ ఉపాధ్యక్షుడు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరు వరకూ గత సంవత్సరం ప్రారంభం నుండీ అదే పనిగా ఊదరగోట్టినా, వారి హామీలు కార్య రూపం దాల్చలేదు. తాజా గణాంకాల ప్రకారం ఇండియాలో ద్వవ్యోల్బణం మార్చి నెలలో 8.9 శాతానికి చేరింది. మార్చి నాటికి ద్రవ్యోల్బణాన్ని 5.5 శాతానికి తగ్గిస్తామని ప్రధాని మన్మోహన్, ప్రణాళికా శాఖ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా,…

సెజ్ లపై త్రిణమూల్ కాంగ్రెస్ అతి తెలివితేటలు

సెజ్ (ఎస్.ఇ.జెడ్ – స్పెషల్ ఎకనమిక్ జోన్) ల ఏర్పాటుపై రైల్వే మంత్రి మమత నాయకత్వంలోని త్రిణమూల్ కాంగ్రెస్ అతి తెలివితేటలు ప్రదర్శిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 18 నుండి మే 10 వరకు ఐదు విడతల్లో జరగనున్న సంగతి విదితమే. ఎన్నికల కోసం మమత పార్టీ బెంగాలీ, ఇంగ్లీషు భాషల్లొ మేనిఫెస్టో (ఎన్నికల ప్రణాళిక) విడుదల చేసింది. రెండూ ఒకే విధంగా ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా…

ప్రజల డాక్టరు డా.బినాయక్ సేన్ కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

సెడిషన్ ఆరోపణలపై యావజ్జీవ శిక్షను ఎదుర్కొంటున్న డాక్టర్ బినాయక్ సేన్ ను సుప్రీం కోర్టు శుక్రవారం బెయిల్ పై విడుదల చేసింది. “మనది ప్రజాస్వామ్య వ్యవస్ధ. ఆయన మావోయిస్టులకు సానుభాతిపరుడు మాత్రమే. అంతమాత్రాన ఆయనను సెడిషన్ ఆరోపణల కింద దోషిగా నిర్ధారించలేము.  సానుభూతిపరుడు తప్ప అంతకంటే ఏమీకాదు” అని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కోంది. బినాయక్ సేన్ విడుదల వార్త తెలిస్తే ఆయన వైద్య సేవ చేసిన చత్తీస్ ఘడ్ లోని గిరిజన తెగల ప్రజలు…