ఐ.పి.ఎల్: పిచ్ చూసి చెబుతాం… ఎవరు ఆడతారో -కార్టూన్

పిచ్ ను బట్టి ఏయే దేశాల వాళ్లు ఆడవలసి ఉంటుందో కెప్టెన్ నిర్ణయించ వలసిన రోజులు వచ్చేసాయి. ఏ దేశం వాళ్లు ఆడగూడదో చెప్పాక, ఏయే దేశాల వాళ్లు ఆడతారో కూడా చెప్పాలి కదా! ది హిందూ కార్టూనిస్టు సురేంద్ర ఆ విషయమే చెబుతున్నారు, ఈ కార్టూన్ ద్వారా. లేకపోతే, ఐ.పి.ఎల్ మ్యాచుల్లో ఒక దేశానికి చెందిన ఆటగాళ్లు ఆడగూడదని రాజకీయ నాయకులు నిర్ణయించడం ఎమిటి, విడ్డూరం కాకపోతే. అది కూడా ఒక రాష్ట్రంలో ఆడే మ్యాచ్…

సూర్యనెల్లి అత్యాచారం: రాజ్యసభ ఉపాధ్యక్షుడికి తాజా నోటీసులు

సూర్యనెల్లి సామూహిక అత్యాచారం కేసు రాజ్య సభ ఉపాధ్యక్షుడు పి.జె.కురియన్ ను వదలకుండా వెంటాడుతోంది. బాధితురాలి పట్టు విడవని ప్రయత్నాలు కేరళ కాంగ్రెస్ నాయకుడికి రాజకీయంగా చివరి రోజులు ఖాయం చేసినట్లు కనిపిస్తోంది. తన పైన అత్యాచారం జరిపిన వారిలో ఒకరైన పి.జె.కురియన్ పైన పునర్విచారణ చేయాలని మార్చి నెల ఆరంభంలో బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్ ను పెరుమాదె జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు మార్చి 2 తేదీన కొట్టివేసింది. అయినప్పటికీ పట్టు విడవకుండా…

బ్రిక్స్ పీఠంపై బాహాబాహి, జపాన్ వాకిట భిక్షాందేహి

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ (BRICS) సమావేశంలో సహచర ఎమర్జింగ్ దేశాలతో కలిసి “పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని తిరస్కరిద్దాం, బహుళ ధృవ ప్రపంచాన్ని స్ధాపిద్దాం” అని పిలుపు ఇచ్చే భారత పాలకులు ధనిక దేశాల వద్ద దేహి అనడం మాత్రం మానడం లేదు. అలవాటు పడిన ప్రాణం ఏమో గాని, ఆఫ్ఘనిస్థాన్ పునర్నిర్మాణానికి 2 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టామని సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పుకునే భారత ప్రభుత్వం రైల్వే సబ్ వేల నిర్మాణం పేరిట 2.32 బిలియన్ డాలర్ల…

ములాయంజీ! ఆకాశానికి నిచ్చెన నిలిచేనా? -కార్టూన్

బిజెపి అగ్రనాయకుడు గత సంవత్సరం ఒక అనూహ్యమైన వ్యాఖ్య చేశారు. దేశంలో ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్, బిజెపి నాయకులు కాకుండా ఇతర పార్టీల నాయకులే ఈసారి ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని. ప్రధాన మంత్రి పదవి కోసం కలలు కంటున్నారని భావిస్తున్న అద్వానీ, ఉన్నట్టుండి ఇలా అన్నారేవిటా అని పరిశీలకులు ఆశ్చర్యం వెలిబుచ్చారు. బహుశా బిజెపి లోనే ప్రధాని పదవికి పోటీగా వస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఝలక్ ఇవ్వడానికి అద్వానీ ఒక అస్త్రాన్ని…

జయ హుకుం, ఐ.పి.ఎల్ జో హుకుం

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు సంధించిన లేఖాస్త్రం, ఐ.పి.ఎల్ పాలిట బ్రహ్మాస్త్రమే అయింది. తమిళనాడులో ‘అమృత యూనివర్సిటీ‘ లాంటి ప్రధాన విద్యా సంస్థలు సైతం యూనివర్సిటీని మూసేసి విద్యార్ధులకు సెలవులిచ్చి ఇళ్లకు పంపేందుకు దారి తీసిన ఆందోళనలు ఇపుడు శ్రీలంక ఐ.పి.ఎల్ ఆటగాళ్ళకు ‘ఆట‘విడుపును సమకూర్చాయి. జయలలిత ‘హుకుం‘ జారీ చేయగా, ఐ.పి.ఎల్ గవర్నింగ్ బాడీ ‘జో హుకుం‘ కొట్టి సలాము చేసింది. చెన్నైలో జరిగే ఐ.పి.ఎల్ మ్యాచ్ లకు…

ఆఫ్రికా: ఇద్దరు భారతీయులను కాల్చి చంపిన ఫ్రెంచి సైన్యం

ఆఫ్రికాలో సాగుతున్న సామ్రాజ్యవాద ప్రచ్ఛన్న యుద్ధం ఇద్దరు భారతీయులను బలి తీసుకుంది. ఆఫ్రికా ఖండంలో అంతకంతకూ పెరుగుతూ పోతున్న చైనా వాణిజ్య ప్రయోజనాలను దెబ్బతీయడానికి అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లు ప్రత్యక్షంగా తీసుకుంటున్న మిలట్రీ చర్యలకు భారతీయులు మూల్యం చెల్లించవలసి వచ్చింది. ‘సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‘ దేశంలో విమానాశ్రయాన్ని సమీపిస్తున్న మూడు వాహనాల పైకి ఫ్రెంచి సేనలు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఇద్దరు భారతీయులు, ఒక  దేశీయుడు చనిపోగా మరొక భారతీయుడు, ఛాద్ పౌరుడు గాయపడ్డారు.…

తెరచాప కడితే హెలికాప్టర్ ఎగురుతుందా? -కార్టూన్

దేశాల విదేశాంగ విధానాలకు ఆయా దేశాల ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఉండాలి. అందులో సందేహం లేదు. కానీ ప్రజల ప్రయోజనాలు ఏమిటన్నదీ సంకుచిత, స్వల్పకాలిక స్వార్ధ పూరిత ఎత్తుగడలు నిర్ణయించరాదని ఈ కార్టూన్ లో ‘ది హిందూ‘ కార్టూనిస్టు కేశవ్ చెబుతున్నారు. బహుశా శ్రీలంక మానవ హక్కుల తీర్మానం, కాశ్మీరులో భారత్-పాక్ సైనికుల ఘర్షణలు, (ఇటలీ మెరైన్ల వ్యవహారం కూడానా?) కార్టూనిస్టు దృష్టిలో ఉన్నాయనుకుంటాను. ఎల్.టి.టి.ఇ తో పోరాటం గెలిచిన చివరి రోజుల్లో శ్రీలంక సైన్యం తమిళ…

పాక్ తో అణు సంబంధాలు కొనసాగుతాయి -చైనా

ఎవరేమనుకున్నా పాకిస్ధాన్ తో తమ అణు వాణిజ్య సంబంధాలు కొనసాగుతాయని చైనా స్పష్టం చేసింది. అంతర్జాతీయ నియమ నిబంధనలకు కట్టుబడే తాము పాకిస్ధాన్ కు అణు రియాక్టర్లు సరఫరా చేస్తున్నామని ‘న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‘ (ఎన్.ఎస్.జి) నిబంధనలు కూడా తాము అతిక్రమించడం లేదని చైనా తెలిపింది. కనీసం రెండు కొత్త అణు రియాక్టర్ల నిర్మాణానికి చైనా సహకరిస్తోందని, ఇది అంతర్జాతీయ నియమాలకు విరుద్ధమని ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో చైనా తన అణు వ్యాపారాన్ని గట్టిగా సమర్థించుకుంది. ఎన్.ఎస్.జి…

వాస్తవాలను వెలికి తీసే విశ్లేషణ -ఈనాడు ఆర్టికల్ 6వ భాగం

‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?’ అనే ఆర్టికల్ వరుసగా ఈనాడు చదువు పేజీలో ప్రచురితం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో ఆరవ భాగం ఈరోజు (సోమవారం, మార్చి 25 తేదీ) ప్రచురించబడింది. ఐదు భాగాల వరకూ అంతర్జాతీయ పరిస్ధితులను ఎలా చూడలన్న విషయాన్ని చూశాము. అంతర్జాతీయ రంగంలో ఉండే వివిద శిబిరాలు, ఆర్ధిక, రాజకీయ కూటములు, భౌగోళిక విభజనలు, వాటి ప్రాధాన్యతలు తదితర అంశాలను ఈ ఐదు భాగాల్లో చర్చించాము. ఆరవ భాగం…

చైనాలో కోకాకోలా గూఢచర్యం?

తమ నైఋతి రాష్ట్రంలో కోకాకోలా కంపెనీ చట్ట విరుద్ధంగా మేపింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని చైనా ఆరోపించింది. ఇరు దేశాల మధ్య ‘సైబర్ గూఢచర్యం‘ ఆరోపణలు ఉధృతంగా సాగుతున్న నేపధ్యంలో అమెరికా కంపెనీపై ఆరోపణలకు ప్రాధాన్యత ఏర్పడింది. తమ దేశంపై జరుగుతున్న సైబర్ దాడుల్లో అత్యధికంగా అమెరికా నుండి వస్తున్నాయని చైనా, చైనా నుండి వస్తున్నాయని అమెరికా ఇటీవల ప్రకటనల యుద్ధం సాగించాయి. చేతితో ఉపయోగించే GPS (Global Positioning System) పరికరాలతో రహస్య భూభాగాలను మేపింగ్ చేసే…

చైనా 2016కల్లా అమెరికాను దాటిపోతుంది -ఒఇసిడి

2016 నాటికి చైనా ఆర్ధిక వ్యవస్థ ‘పర్చేసింగ్ పవర్ ప్యారిటీ’ (పి.పి.పి) పరంగా అమెరికాను మించిపోతుందని ఒఇసిడి (Organization for Economic Cooperation and Development) జోస్యం చెప్పింది. వరుసగా నాలుగో దశాబ్దంలో వేగవంతమైన ఆర్ధిక వృద్ధి (జి.డి.పి వృద్ధి రేటు) నమోదు చేయడానికి చైనా ఉరుకులు పరుగులు పెడుతోందని ఒఇసిడి విడుదల చేసిన తాజా నివేదిక తెలియజేసింది. గత సంవత్సరం జపాన్ ఆర్ధిక వ్యవస్థ పరిమాణాన్ని మించి పోయి అమెరికా తర్వాత అతి పెద్ద ఆర్ధిక…

నీటి ఆటలు కొందరికి; నీటి పాట్లు మరెందరికో -ఫొటోలు

భవిష్యత్తులో నీటి కోసం ప్రపంచ యుద్ధాలు తప్పవని అనేకమంది ఇప్పటికే జోస్యం చెప్పేశారు. భూగ్రహం వేడెక్కుతున్న ఫలితంగా ‘నీటి కొరత ఒక చోట, పల్లెలను, నగరాలను తేడా లేకుండా ముంచెత్తే తుఫాను వరదలు మరొక చోట’ నిత్య వాస్తవంగా మారిపోయింది. లాభ దాహాలతో పరితపించి పోతున్న కార్పొరేట్ కంపెనీలు నీటి వనరులను స్వాధీనం చేసుకుంటూ ప్రజలు దాహంతో పరితపించేలా ప్రభుత్వాలను ప్రభావితం చేస్తున్నాయి. లేకపోతే కాసింత రంగు కలిపి మిలియన్లు దండుకుంటున్న కూల్ డ్రింకు కంపెనీల కోసం…

మధ్యాహ్న భోజనం పిల్లలకి కాదు, భోక్తలకి

– చిన్న పిల్లల ‘మధ్యాహ్న భోజన పధకం‘ కూడా అవినీతి పరుల బొజ్జలు, భోషాణాలు నింపుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోనే ఈ దారుణం జరుగుతోంది. అనేక సంవత్సరాలుగా ఢిల్లీలోని బడి పిల్లలకు పెడుతున్న మధ్యాహ్న భోజనం అత్యంత అనారోగ్యకరంగా ఉంటోందని ప్రయోగ శాలల పరీక్షలు తేల్చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో సేకరించిన మధ్యాహ్న భోజన శాంపిళ్లలో 83 శాతం ప్రయోగశాలల పరీక్షల్లో విఫలం అయ్యాయని ఆర్.టి.ఐ (Right to Information) చట్టం…

నారాయణ స్వామి కత్తి దూశారు… తిరగేసి! -కార్టూన్

సిబిఐ పుణ్యమాని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వి.నారాయణ స్వామి వార్తల్లో నానుతున్నారు. తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డిఎంకె, యుపిఎ ను వదిలి వెళ్ళిన మరుసటి రోజే ఆ పార్టీ నేత కరుణానిధి తనయులు స్టాలిన్, అళగిరి ఇళ్లపైన సిబిఐ చేత దాడి చేయించడం ద్వారా అన్ని పక్షాల నుండి ఆయన విమర్శలను ఎదుర్కొంటున్నాడు. దురుద్దేశం ఏమీ లేదని సిబిఐ తన పని తాను చేసుకుందే తప్ప ప్రభుత్వానికి దానికి సంబంధం లేదనీ, అది స్వతంత్ర సంస్థ…

ఫేస్ బుక్ లో 10 శాతం మంది తిట్లు తింటున్నారట!

ఫేస్ బుక్ ఖాతాదారుల్లో కనీసం నూటికి పది మంది తిట్లు, అవమానాలు ఎదుర్కొంటున్నారని ఒక అధ్యయనం తెలిపింది. అధ్యయనం ప్రకారం ఫేస్ బుక్ వినియోగదారుల్లో పది శాతం మంది తమ ‘వాల్‘ పైన అభ్యంతరకరమైన, అవమానకరమైన సందేశాలు పోస్ట్ చేయబడిన అనుభవాలు ఎదుర్కొన్నారు. తమకు నచ్చని యూజర్‌లను తిట్టడం, అవమానించడం, వ్యక్తిగతంగా ఎగతాళి చేయడం బూతురాయుళ్ళ పనిగా ఉంటోంది. బెదిరిస్తూ ప్రైవేటు సందేశాలు ఇవ్వడం కూడా వీరి పనుల్లో ఒకటని టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది. ఇంకా ఘోరం…