రికార్డులు తిరగ రాస్తున్న యూరోజోన్ నిరుద్యోగం

17 ఐరోపా దేశాల మానిటరీ యూనియన్ ‘యూరోజోన్’ నిరుద్యోగంలో తన రికార్డులు తానే తిరగ రాస్తోంది. ఉమ్మడి యూరో కరెన్సీ ఉనికిలోకి వచ్చిన గత 13 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా 12 శాతం నిరుద్యోగాన్ని నమోదు చేసింది. జనవరిలో 11.9 శాతంగా ఉన్న నిరీద్యోగ శాతం మరో 33,000 మంది ఉద్యోగాలు కోల్పోవడంతో ఫిబ్రవరిలో 12 శాతానికి పెరిగింది. ఐరోపా వ్యాపితంగా అధికారిక నిరుద్యోగుల సంఖ్య 1.91 కోట్లకు పై చిలుకేనని ఐరోపా గణాంక సంస్ధ…

మోడి ఢిల్లీ ప్రయాణానికి దారెటు? -కార్టూన్

ఒక దేశానికి ప్రధాన మంత్రి అవాలంటే దేశం మొత్తానికి కనీసంగా ఐనా తెలిసి ఉండాలి. ప్రజలకు ప్రత్యక్షంగా చూసిన అనుభవం లేకపోయినా ప్రధాన మంత్రి అభ్యర్ధి అనగానే ప్రజల మనసుల్లో ఒక భావన మెదలాలి. బహుశా దానిని ‘మాస్ అప్పీల్’ అని (లూజ్ అర్ధంలో) అనవచ్చేమో. బి.జె.పి పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవికి అభ్యర్ధిగా అనేకమంది బి.జె.పి నాయకుల నోళ్లలో నానుతున్న నరేంద్ర మోడీకి అలాంటిది ఉన్నదా అని ఈ కార్టూన్ ప్రశ్నిస్తున్నట్లుంది. ‘మాస్ అప్పీల్’…

ఉమ్మడి ప్రయోజనాలకు గొడుగు -బ్రిక్స్ పై ఈనాడు ఆర్టికల్

“ఉమ్మడి ప్రయోజనాలకు గొడుగు” శీర్షికన, “ఆశలు రేకెత్తిస్తున్న బ్రిక్స్ బ్యాంకు” ఉప శీర్షికన ఈనాడు ఎడిటోరియల్ పేజిలో ఈ రోజు ఈ బ్లాగర్ రాసిన ఆర్టికల్ ప్రచురించబడింది. ఎడిటోరియల్ పేజిలో ప్రచురితం కావడం ఈ బ్లాగర్ కి ఇదే మొదటిసారి. పత్రిక జతచేసిన బ్రిక్స్ దేశాధినేతల ఫొటో, బ్రిక్స్ సభ్య దేశాలతో భారత దేశ వాణిజ్యాన్ని వివరించె గ్రాఫు ఆర్టికల్ కు మరింత పరిపుష్టతను చేకూర్చాయి. ఈ సందర్భంగా ఈనాడు, మిత్రులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు చెప్పడం…

భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్

(భారత దేశంలో వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల స్వభావం ఏమిటన్నదీ దేశంలో ఒక చర్చగా ఉంటోంది. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలలో, ఇంకా ముఖ్యంగా విప్లవ కమ్యూనిస్టు పార్టీలలో ఈ అంశం పైన తీవ్రమైన చర్చోపచర్చలు నడుస్తున్నాయి. భారత దేశ వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం (Capitalist Mode of Production) ప్రవేశించిందని కొంత మంది వాదిస్తుండగా, మరికొందరు ఆ వాదనను తిరస్కరిస్తున్నారు. అర్ధ వలస, అర్ధ భూస్వామ్య వ్యవస్ధగా నిర్వచించబడిన భారత దేశ సామజిక వ్యవస్ధ…

ఇండియా ప్రధాని సరే, బి.జె.పి ప్రధాని ఎవరు? -కార్టూన్

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఇటీవల జరిగిన బి.జె.పి అత్యున్నత స్ధాయి సమావేశంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా నియమించబడ్డారు. ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ తన సొంత నాయకత్వ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారని, అందులో నరేంద్ర మోడి ఒకరని పత్రికలు తెలిపాయి. ఆరు సంవత్సరాల క్రితం బి.జె.పికి రాజ్ నాధ్ సింగ్ అధ్యక్షుడుగా ఉన్నపుడే మోడిని పార్లమెంటరీ బోర్డు నుండి తొలగించారని, అదే వ్యక్తి నేతృత్వంలో మోడిని మళ్ళీ బి.జె.పి తన పార్లమెంటరీ…

వర్తమాన అంశాల్లో కీలకం, ఈశాన్య భారతం -ఈనాడు వ్యాసం 7వ భాగం

“జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?” వ్యాస పరంపరలొ ఏడవ భాగం ఈ రోజు ఈనాడులో వచ్చింది. జాతీయ పరిస్ధితుల అవగాహనలో భాగంగా ఈశాన్య భారతాన్ని వేధిస్తున్న సరిహద్దు సమస్య గురించి ఈ భాగంలో చర్చించబడింది. ఈనాడు ఇంటర్నెట్ పేజిల్లో ఆర్టికల్ చూడాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి. ఈనాడు ఇ-పేపర్ నుండి తీసుకున్న ఇమేజ్ ను కింద చూడవచ్చు. ఇమేజ్ పొడవుగా ఉన్నందున ఒకే పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ గా మార్చడం కుదరలేదు. అందువలన పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ల…

అవినీతిని నిలదీసేది దళిత మహిళ ఐతే…

ఆమె ఒక మహిళా సంఘం కార్యకర్త. అవినీతిని నిలదీయడం ఆమె చేసిన నేరం. ఆ మాత్రానికే అత్యంత ఘోరంగా ఆమె పైన అత్యాచారం చేసి, వింటేనే ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో హింసించి చంపేశారు. ఫిర్యాదు చేయబోయిన తండ్రి, కుమారుల పైనే నేరం బనాయించడానికి సిద్ధపడడం పోలీసుల వికృత లీలకు తాజా రూపం. భూస్వామ్య కుల దురహంకారం ఎప్పటికప్పుడు కొత్త శిఖరాలను అధిరోహించే బీహార్ సీమ ఈ ఘోరానికి వేదిక. దేశం మొత్తం అభివృద్ధి పధంలో సాగడానికి తమ…

విషవాయువు విడుదల, స్టెరిలైట్ కంపెనీ మూసివేతకు ఆర్డర్

మార్చి 23 తేదీన విషపూరితమైన సల్ఫర్ డై ఆక్సైడ్ వాయువును విడుదల చేసి పరిసర గ్రామాల ప్రజలను అనారోగ్యానికి గురిచేసిన ‘స్టెరిలైట్ కాపర్’ కంపెనీని మూసివేయాల్సిందిగా తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించింది. చుట్టుపక్కల గ్రామాల పొలాలను పనికి రాకుండా చేసిన ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామీణులు అనేక సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నారు. ఫ్యాక్టరీ మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సమీప గ్రామాల ప్రజలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. టపాకాయాలు కాల్చి తమ సంతోషాన్ని తెలియజేశారు.…

ఉభయ కొరియాల వద్ద యుద్ధ పరిస్ధితులు

ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. దక్షిణ కొరియా, అమెరికాలు మళ్ళీ సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టడంతో ఉత్తర కొరియా తీవ్రంగా ప్రతిస్పందిస్తోంది. గతంలో ఎన్నడూ లేనట్లుగా అమెరికా బి-2 బాంబర్లు కొరియా గగనతలం పైన ఎగరడంతో ఉత్తర కొరియా కలవరపాటుకు గురవుతోంది. ఆ దేశ అత్యున్నత మిలట్రీ కమాండ్ అత్యవసర సమావేశం జరిపి అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఖండాంతర క్షిపణులను అప్రమత్త స్థాయికి చేర్చుతున్నట్లు ప్రకటించింది. అమెరికా భూభాగం…

శ్రీలంక ఆటగాళ్లు ఐ.పి.ఎల్ ఆడొద్దు –రావణ ఫోర్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐదో అంచె టోర్నమెంటులో చెన్నైలో జరిగే మ్యాచుల్లో శ్రీలంక ఆటగాళ్లను ఆడనివ్వరాదని ఐ.పి.ఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం శ్రీలంకలో వాతావరణాన్ని వేడెక్కించింది. శ్రీలంక క్రికెట్ ఆటగాళ్లు ఐ.పి.ఎల్ లో ఆడకుండా తగిన చర్యలు తీసుకోవాలని వివిధ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఆటగాళ్లను ఆపే అధికారం తమకు లేదని శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. శ్రీలంకకు చెందిన బుద్ధిస్టు జాతీయ గ్రూపులు ఐ.పి.ఎల్ లో శ్రీలంక క్రికెట్ ఆటగాళ్లు ఆడకుండా…

విమర్శల రాయి విసురు, నిధుల పండ్లు రాలు -కార్టూన్

రాజకీయాలు పెద్దోళ్లు-పెద్దోళ్లు ఆడుకోవడానికే గానీ జనాల అవసరాలు తీర్చడానికా? ఎన్నికల మేనిఫెస్టోలు, నాయకుల ప్రసంగాలు, పార్టీల రాజ్యాంగాలు ఇవన్నీ జనం పేరు చెప్పకుండా ఒక్క వాక్యాన్నీ ముగించలేవు. అదే చేతల్లోకి వస్తే జేబులోకి (ఆదేలెండి, ఖాతాలోకి) కాసు రాలకుండా ఒక్క అడుగూ ముందుకు పడదు. ములాయం సింగ్ యాదవ్ ఇటీవల సాగించిన బురద రాజకీయం ఆ సంగతే చెబుతోంది. రెండు రోజుల పాటు ములాయం సింగ్ కాంగ్రెస్ పైన నోటితో నిప్పులు విరజిమ్మాడు. త్వరలోనే ఎన్నికలు వస్తాయన్నాడు.…

వావ్… ఫొటోలు, పోటీ కోసం!

స్మిత్‌సోనియన్ మ్యాగజైన్ నిర్వహించే పోటీ కోసం ఎంపికైన టాప్ 50 ఫొటోల్లో ఇవి కొన్ని. 112 దేశాల నుండి 37,600 ఫొటోలు పోటీ కోసం వచ్చాయట. అందులో 50 ఫొటోలను షార్ట్ లిస్ట్ చేసింది మ్యాగజైన్. ఇంకా చివరి ఫలితాలు వెల్లడి కాలేదట. ఐదు విభాగాల్లో విజేతలు నిర్ణయించి బహుమానం ఇవ్వనున్నారు. పోటీ ఈ రోజు, అంటే మార్చి 29 తో ముగుస్తోంది. ‘రీడర్స్ ఛాయిస్‘ విజేత కోసం ఈ ఫొటోలను స్మిత్‌సోనియన్ మ్యాగజైన్ తన వెబ్…

ఇటలీ ఒంటరి అయుండేది –ఇటలీ ప్రధాని

కేరళ జాలర్లను హత్య చేసిన ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇటలీ మెరైన్లను ఇండియాకు పంపక పోయి ఉన్నట్లయితే అంతర్జాతీయంగా ఇటలీ ఒంటరి అయుండేది అని ఆ దేశ ప్రధాని మారియో మోంటి గురువారం వ్యాఖ్యానించాడు. మెరైన్లను వెనక్కి పంపడాన్ని వ్యతిరేకిస్తూ ఇటలీ విదేశీ మంత్రి గిలియో టెర్జీ రాజీనామా చేయడంతో మారియో నాయకత్వం లోని తాత్కాలిక ప్రభుత్వం ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఈ నేపధ్యంలో ఇటలీ ప్రధాని తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. న్యూ ఢిల్లీతో సంబంధాల విషయంలో తీవ్రమైన స్ధాయిలో…

శ్రీలంకతో ఎన్నికల యుద్ధం ప్రాక్టీస్ -కార్టూన్

శ్రీలంక తమిళుల దుర్భర పరిస్ధితులపై తమిళనాడులో అక్కడి రాజకీయ పార్టీలు భావోద్వేగాలు రెచ్చగొట్టి పెట్టాయి. శ్రీలంక ప్రభుత్వం సాగించిన యుద్ధ నేరాలపై అమెరికా ఐరాస మానవ హక్కుల తీర్మానం ప్రతిపాదించడం పార్టీలకు వాటంగా కలిసి వచ్చింది. యుపిఎ ప్రభుత్వానికి డిఎంకె మద్దతు ఉపసంహరించుకోవడంతో పార్టీల నాటకం రక్తి కట్టింది. ఐ.పి.ఎల్ ఆటలకు శ్రీలంక ఆటగాళ్లను అనుమతించేది లేదని తమిళనాడు ముఖ్యమంత్రి హుంకరించడంతో రక్తి కట్టిన నాటకం కాస్తా రసాభాసగా మారిపోయింది. ప్రత్యేక తమిళ ఈలం కోసం సాయుధంగా…

డాలర్ నిల్వలకు ఎసరు తెస్తున్న ధనికుల బంగారం దాహం

భారత దేశ ధనికులు బంగారం పైన పెంచుకుంటున్న వ్యామోహం మన విదేశీ మారక ద్రవ్య నిల్వలకు ఎసరు తెస్తోంది. దేశంలోకి వస్తున్న విదేశీ మారక ద్రవ్యం కంటే బంగారం, చమురుల కొనుగోళ్ల కోసం దేశం బైటికి వెళుతున్న విదేశీ మారక ద్రవ్యమే ఎక్కువ కావడంతో నిల్వలు తరిగిపోతున్నాయి. ఫలితంగా భారత ఆర్ధిక వ్యవస్థకు కరెంటు ఖాతా లోటు (Current Account Deficit –CAD) రికార్డు స్థాయికి చేరుకుంది. ఒక దేశ ఆర్ధిక వ్యవస్థ మౌలిక ప్రమాణాలలో (ఫండమెంటల్స్)…