అలజడి, ఆందోళనల నేపధ్యం ఏమిటి? -ఈనాడు ఆర్టికల్ 8వ భాగం

‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?’ వ్యాసాల పరంపరలో ఎనిమిదవ భాగం ఈ రోజు ఈనాడులో వచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న గొడవలకు, మిలిటెన్సీకి నేపధ్యాన్ని ఈ భాగం క్లుప్తంగా చర్చించింది. ఈ చర్చాంశాల ఆధారంగా అక్కడి పరిణామాలను పరిశీలిస్తే ఒక అవగాహన రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్టికల్ ను నేరుగా ఈనాడు వెబ్ సైట్ లో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయగలరు. పి.డి.ఎఫ్ డాక్యుమెంటు రూపంలో చదవాలనుకుంటే కింద బొమ్మపైన క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ ఓపెన్…

కోలేటరల్ మర్డర్: ఓ అమెరికా సైనికుడి పశ్చాత్తాపం

2010 ఏప్రిల్ 5 తేదీన ‘కోలేటరల్ మర్డర్’ శీర్షికతో వికీ లీక్స్ విడుదల చేసిన వీడియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇరాక్ దురాక్రమణ యుద్ధంలో ఆ దేశ పౌరులపైన అమెరికా సైనికులు సాగిస్తున్న దారుణ మారణ కాండను ‘కోలేటరల్ మర్డర్’ వీడియో కళ్లకు కట్టింది. ఒక గ్రూపుగా వీధిలో నిలబడి ఉన్న సాధారణ పౌరులను మైలున్నర దూరంలో ఆకాశంలో ఎగురుతున్న హెలికాప్టర్ గన్ తో అమెరికా సైనికులు కాల్చి చంపిన దృశ్యాన్ని, దారినే పోతున్న…

చమురు లీకేజి శుభ్రం చేసే కార్మికుల కష్టాలు చూసితీరాలి -ఫోటోలు

జులై 17, 2010 తేదీన చైనా ఈశాన్య రాష్ట్రం లియావోనింగ్ లో చమురు ప్రమాదం సంభవించి ‘పచ్చ సముద్రం’ ను ముంచెత్తింది. చమురు డాక్ యార్డ్ లో చమురు ట్యాంకులు పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం అనంతరం చమురు లీకేజీని అరికట్టడానికి, పొర్లిపోయిన చమురుని తిరిగి ఎత్తి వినియోగంలోకి తేవడానికీ, సముద్ర కాలుష్యాన్ని శుభ్రం చేయడానికి కార్మికులు తీవ్రంగా శ్రమించారు. ఆ దృశ్యాలే ఇవి. 1500 తన్నుల క్రూడాయిలు సముద్రంలోకి ఒలికిపోగా అందులో మూడో వంతుని…

పంపిణీ, పెట్టుబడిదారీ పూర్వ అధిక-వడ్డీ మరియు వర్తక పెట్టుబడులు

భారత వ్యవసాయ రంగంలో మార్పులు -ఒక నోట్ -పార్ట్ 2       పంపిణీలు & ఉత్పత్తి (Distributions & Production): భూమి అద్దె, వేతనాలు, వడ్డీ మరియు లాభ మొత్తం లను పంపిణీ కిందా, భూమి, శ్రమ మరియు పెట్టుబడి మొత్తం లను ఉత్పత్తి కిందా మార్క్స్ చర్చించారు. “పంపిణీ రూపాలలో ఉండే వడ్డీ మరియు లాభాలు ‘పెట్టుబడి, ఉత్పత్తి యొక్క ప్రతినిధి (agent of production)’ అనే పూర్వాలోచన (presupposes) కలిగి ఉంటాయి” అని కూడా…

పోటీ పేరుతో డేటా చౌర్యం, గూగుల్ అతి తెలివి

‘స్ట్రీట్ వ్యూ’ కార్ల ద్వారా పశ్చిమ దేశాలలో పౌరుల వివరాలు అనుమతి లేకుండా సంపాదించి విచారణ ఎదుర్కొంటున్న గూగుల్ కంపెనీ భారత దేశ వివరాలు సంపాదించడానికి ‘మేపధాన్’ పోటీని ఎరగా వేసింది. ప్రత్యక్షంగా తాను డేటా సేకరించడం ‘చౌర్యం’ కిందికి రావడంతో అమాయక వినియోగదారులను అడ్డం పెట్టుకుని సృజనాత్మక పద్ధతుల్లో ‘డేటా చౌర్యానికి’ గూగుల్ పూనుకుంది. గూగుల్ అతి తెలివిని పసిగట్టిన బి.జె.పి ఎం.పిలు ఫిర్యాదు చేయడంతో, అధికారిక ‘రాజకీయ భౌగోళిక మేప్ ల నిర్వహణకు’ బాధ్యురాలయిన…

భావ ప్రకటన స్వేచ్ఛ: క్యూబాకి ఒకటి, అమెరికాకి మరొకటి -కార్టూన్

‘యోవాని సాంఛేజ్’ పశ్చిమ దేశాలకు మహా ఇష్టురాలు. క్యూబా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసమ్మతి ప్రకటించడం దానికి కారణం. ఆమె ఈ మధ్య ప్రపంచ పర్యటనకి బయలుదేరింది. క్యూబాలో జనం ఎన్నో కష్టాలు పడుతున్నారని ఆవిడ ప్రచారం చేస్తోంది. యోవాని అసమ్మతిని క్యూబా ప్రభుత్వం సహించలేకపోతోందని, ఆమె భావ ప్రకటనా స్వేచ్చని హరిస్తోందని అమెరికా, యూరప్ దేశాల ప్రభుత్వాలు మొత్తుకుంటాయి.  ఆమె అసమ్మతి సహజంగానే పశ్చిమ కార్పొరేట్ పత్రికలలో ప్రముఖ స్ధానం పొందుతోంది. యోవాని భావ ప్రకటన స్వేచ్చ…

యుద్ధం రీత్యా ఎంబసీలు ఖాళీ చేయాల్సి రావచ్చు -ఉత్తర కొరియా

ఉత్తర కొరియా, అమెరికాలు పరస్పర హెచ్చరికలతో ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో గువామ్ లో ఉన్న తమ సైనిక స్ధావారానికి అదనంగా రెండు క్షిపణి విచ్ఛేదక వ్యవస్ధలను అమెరికా గురువారం నాడు చేరవేసింది. దక్షిణ కొరియా ఆధునిక డిస్ట్రాయర్ యుద్ధ పరికరాలను ఉత్తర కొరియా సరిహద్దుకు శుక్రవారం తరలించింది. ఈ నేపధ్యంలో ఉత్తర కొరియాలోని విదేశీ రాయబారులు తమ తమ ఎంబసీలను ఖాళీ చేయాల్సి రావచ్చని ఏప్రిల్ 10 తర్వాత వారికి రక్షణ ఇవ్వడం తమకు…

మా తాగడుకు మహేష్ బాబే కారణం, ఇద్దరు యువకుల ఫిర్యాదు

ఇది బొత్తిగా ఊహించని పరిణామం. తాగుడుతో తమ ఒళ్ళు గుల్ల అవడానికి కారణం సినిమా హీరో మహేష్ బాబే అని ఆరోపిస్తూ ఇద్దరు యువకులు రాష్ట్ర మానవ హక్కుల సంస్ధకు ఫిర్యాదు చేశారు. ఒక పేరు పొందిన లిక్కర్ బ్రాండు (రాయల్ స్టాగ్) కు మహేష్ బాబు ప్రచారం చేశాడని, తాము ఆయనకు పిచ్చి ఫ్యాన్ లము కావడంతో తాము కూడా తాగడం ప్రారంభించామని సతీష్ కుమార్, అమ్రు నాయక్ లు ఫిర్యాదు చేశారు. తాగుడు వలన…

ఫుకుషిమా అణు ఫ్యాక్టరీలో మళ్ళీ పవర్ కట్

రెండేళ్ల క్రితం భారీ ప్రమాదం సంభవించిన ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో మళ్ళీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. మూడో నెంబరు అణు రియాక్టరు వద్ద వాడిన అణు ఇంధనాన్ని చల్లబరిచే కూలింగ్ వ్యవస్ధ రెండు గంటల సేపు విఫలం అయిందని జపాన్ వార్తా సంస్ధ క్యోడో న్యూస్ ఏజన్సీని ఉటంకిస్తూ ‘ది హిందు’ తెలిపింది. నెల రోజులలో ఇక్కడ విద్యుత్ సరఫరా విఫలం కావడం ఇది రెండోసారి. తక్షణ ప్రమాదం ఏమీ లేదని అణు కర్మాగారం నిర్వహిస్తున్న…

అసలు మైకు పట్టనేల, పట్టితిపో…… -కార్టూన్

అంత భారీ భావాలు వ్యక్తపరచనేల, ఇంత భారం మోయనేల? – రాహుల్ ఇప్పుడు మైకు భారాన్ని మోస్తున్నాడు. మొదటిసారి ‘కాన్ఫేడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్’ (సి.ఐ.ఐ) గురువారం జరిపిన సమావేశంలో మైకు పట్టిన రాహుల్ గాంధీ పేదలను, ముస్లింలను, దళితులను  పరాయీకరిస్తే ఆర్ధిక వృద్ధి తీవ్రంగా దెబ్బ తింటుందని బోధించాడు. సామాన్య మానవుడికి సాధికారత అప్పగించే విధంగా వ్యవస్ధాగత మార్పులు తేవలసి ఉందని, అందుకోసం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చాడు. “వివిధ తరగతులను పరాయీకరించే రాజకీయాలతో ఆడుకుంటే…

ఐ.ఏ.ఎస్ అధికారి నిజాయితీకి బహుమతి: 44వ బదిలీ

సోనియా గాంధీ జామాత రాబర్ట్ వాద్రా పాల్పడిన అక్రమ భూ ఆక్రమణలపై విచారణకు ఆదేశించి వార్తలకెక్కిన హర్యానా కేడర్ సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి అశోక్ ఖేమ్కా మరోసారి బదిలీ అయ్యాడు. వాద్రా భూ కుంభకోణం తుట్టె కదిలించినందుకు గత అక్టోబరు నెలలో బదిలీ అయిన ఖేమ్కా, విత్తనాభివృద్ధి సంస్ధ నుండి మళ్ళీ బదిలీ వేటు ఎదుర్కొన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీకి కారణం చెప్పలేదు. విత్తనాభివృద్ధి సంస్ధ ఉద్యోగుల పోస్టింగులు, క్రమశిక్షణ చర్యలతో హర్యానా పాలకవర్గాలు కన్నెర్ర చేయడమే…

మణిపూర్ ఎన్ కౌంటర్లు బూటకం, సుప్రీం కోర్టు కమిటీ నిర్ధారణ

మణిపూర్ లో భారత సైనికులు పాల్పడిన ఆరు ఎన్ కౌంటర్లు బూటకం అని సుప్రీం కోర్టు కమిటీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. 12 సంవత్సరాల బాలుడితో సహా ఎన్ కౌటర్ లో మరణించినవారందరికీ ఎటువంటి క్రిమినల్ రికార్డు లేదని కమిటీ తేల్చి చెప్పింది. జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ లతో కూడిన డివిజన్ బెంచి కమిటీ నివేదికను పరిశీలించింది. కమిటీ ఆరు ఎన్ కౌంటర్ కేసులను విచారించగా, ఆరు కేసులూ…

కాంగ్రెస్ వర్కింగ్ ఫార్ములా -కార్టూన్

కాంగ్రెస్ ప్రభుత్వంలోని యు.పి.ఏ ప్రభుత్వ పని తీరుపై ‘ది హిందు’ పత్రిక మరో కార్టూన్ బాణం విసిరింది. అవినీతి స్కాముల మూటలు మోస్తూ, సోనియమ్మ చేతిలో కళ్ళెం పట్టుకుని అదపు చేస్తుంటే, ‘మిస్టర్ క్లీన్’ భారంగా బండి లాగుతున్న దృశ్యం, పరిస్ధితిని కళ్ళకు కడుతోంది. కానయితే స్కాములు ప్రధానికి నిజంగా భారమా లేక ఆయనకు తెలిసీ జరుగుతున్నాయా అన్నది చర్చాంశం. 2జి స్కాము మన్మోహన్ కి తెలిసే జరిగిందనీ, జరగబోతున్నది తెలిసినా ఆయన అడ్డుకోవడానికి ప్రయత్నించలేదని ఇటీవల…

ఇలాంటి దారుణాలు పశ్చిమ దేశాల్లోనే జరుగుతాయి…

మాజీ భార్య పైన నేరం నెట్టడానికి తాజా భార్యతో కలిసి ఇంటికి నిప్పు పెట్టి ఆరుగురు పిల్లలని చంపుకున్న జంట కధ ఇది. 8 వారాల పాటు కొనసాగిన కోర్టు విచారణలో 56 యేళ్ళ నిందితుడు మిక్ ఫిల్ పాట్ అత్యంత అసహజమైన జీవితం గడిపిన వ్యక్తిగా పత్రికల్లో స్ధానం సంపాదించాడు. ఐదుగురు భార్యలతో మొత్తం 17 మంది పిల్లలకు జన్మ ఇవ్వడం, పదేళ్లపాటు ఇద్దరు భార్యలతో ఒకే ఇంటిలో గడపడం, మిత్రులతో కలిసి భార్యతో లైంగిక…

మన్మోహన్ ప్రభుత్వానికి ఫుల్ మార్కులా? -కార్టూన్

కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ తానే ప్రధాన మంత్రి కావొచ్చని మన్మోహన్ చెప్పినట్లు ఈ మధ్య పత్రికలు గుసగుసలాడాయి. బ్రిక్స్ సమావేశం నుండి తిరిగొస్తూ విమానంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని ఇచ్చిన అస్పష్ట సమాధానం ఈ గుసగుసలకు కారణం. మీరు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన ఊహాగానాలకు బదులివ్వను అని చెబుతూనే ‘బ్రిడ్జి దగ్గరకు వెళ్ళాక దాన్ని ఎలా దాటాలనేది ఆలిచిస్తాం” అన్నారు. దానర్ధం మళ్ళీ ప్రధాని పదవి ఆయన కోరుతున్నట్లే…