సిద్దికి కప్పన్ కేసు: చార్జ్ షీట్ లో హాస్యాస్పద కారణాలు -ఇండియన్ ఎక్స్^ప్రెస్

ద ఇండియన్ ఎక్స్^ప్రెస్ ఎడిటోరియల్  –02/10/2021 సిద్దికి  కప్పన్  అరెస్టు మరియు నిర్బంధం కొనసాగింపుకు హాస్యాస్పద కారణాలు చూపిన యూపి ఎస్‌టి‌ఎఫ్ చార్జ్ షీట్ దేశ ద్రోహం (సెడిషన్) చట్టంను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను జులై నెలలో విచారిస్తూ, ప్రభుత్వ సంస్ధలు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయడం పట్ల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ ఆందోళన వ్యక్తం చేశారు. పౌరులు స్వేచ్ఛాయుతంగా మాట్లాడే హక్కుతో పాటు వివిధ…

బ్రిటన్ పై ఇండియా ప్రతీకార చర్య

భారత దేశం బదులు తీర్చుకుంది. యూ‌కే నుండి వచ్చే యూ‌కే పౌరులు ఇండియాకు వస్తే గనక వారు తప్పనిసరిగా 10 రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్ లో ఉండే విధంగా నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు అక్టోబర్ 4 తేదీ నుండి అమలులోకి రానున్నాయి. బ్రిటన్ పౌరులు వాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా, దేశంలోకి వచ్చిన తోడనే తప్పనిసరిగా 10 రోజుల క్వారంటైన్ లో ఉండడంతో పాటు మొదట ఆర్‌టి-పి‌సి‌ఆర్ పరీక్ష చేయించుకోవాలని ఇండియా నిర్దేశించింది. అలాగే వచ్చిన…

అమెరికా ప్రతీకారం: కరెన్సీ సమస్యతో అల్లాడుతున్న ఆఫ్ఘన్ ప్రజలు

తాలిబాన్ పాలనపై అమెరికా పాల్పడుతున్న ప్రతీకార చర్యలు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను తీవ్ర సంక్షోభం లోకి నెట్టివేస్తున్నాయి. పశ్చిమ దేశాల నుండి ఇప్పటిదాకా అందుతూ వచ్చిన సహాయాన్ని నిలిపివేయడంతో పాటు ఆఫ్ఘన్ దేశానికి చెందిన సెంట్రల్ రిజర్వ్ బ్యాంకు రిజర్వు నిధులను కూడా అందకుండా నిషేధం విధించడంతో ఉన్నత స్ధాయీ ప్రభుత్వాధికారుల నుండి అత్యంత కడపటి పౌరుడు సైతం తిండికి, ఇతర కనీస సౌకర్యాలకు కటకటలాడుతున్నారు. తాలిబాన్ డబ్బు సమస్య ప్రధానంగా అమెరికా ట్రెజరీ విభాగం స్తంభింపజేసిన ఆఫ్ఘన్…

ఆకస్: సుదృఢం అవుతున్న బహుళ ధృవ ప్రపంచం! -3

    నాటోకు కాల దోషం? అప్పటికే ఆఫ్ఘనిస్తాన్ సైనిక ఉపసంహరణ విషయమై నాటో కూటమి లోని ఈ‌యూ సభ్య దేశాలు అసంతృప్తిగా ఉన్నాయి. నాటో కూటమితో సంప్రదించకుండా, ఈ‌యూతో ఏకీభావం సాధించకుండా ఆఫ్ఘన్ నుండి సైనిక బలగాలను ఆగస్టు 31 లోపు ఉపసంహరిస్తున్నామని బైడెన్ ఏకపక్షంగా ప్రకటించడం ఈ‌యూ దేశాలకు గాని నాటో కూటమికి గానీ మింగుడు పడలేదు. అత్యంత పెద్దదయిన నాటో ‘ఉమ్మడి’ మిలట్రీ స్ధావరం అయిన బాగ్రం వైమానికి స్ధావరాన్ని జులైలో ఖాళీ…

ఆకస్: అమెరికా, ఈ‌యూల మధ్య చిచ్చు -2

దూరం అవుతున్న యూ‌ఎస్, ఈ‌యూ ఈ అంశాన్ని కాస్త వివరంగా చూద్దాం. రెండో ప్రపంచ యుద్ధానంతరం సోషలిజం విస్తరించనున్నదన్న భయంతో అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు ఉమ్మడిగా పని చేయడం ప్రారంభించాయి యుద్ధంలో జర్మనీ, జపాన్, ఇటలీల ఫాసిస్టు కూటమిని ఓడించడానికి ఏర్పడిన నాటో కూటమి యుద్ధం ముగిశాక సోషలిజం నిర్మూలన లక్ష్యంగా పని చేయడం ప్రారంభించింది. ప్రధాన భౌగోళిక-రాజకీయ పరిణామాలన్నింటిలో యూ‌ఎస్, ఈ‌యూ లు నాటో వేదికగా పరస్పరం సంప్రదించుకుని పాల్గొన్నాయి. సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా…

ప్రపంచ యుద్ధ ప్రమాదాన్ని చేరువ చేసిన ‘ఆకస్’ మిలట్రీ కూటమి

  2021 సెప్టెంబర్ 15 వ తేదీన ప్రపంచ భౌగోళిక-రాజకీయ యవనికపై ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా(A), బ్రిటన్ (యునైటెడ్ కింగ్^డమ్ – UK), అమెరికా సంయుక్త రాష్ట్రాలు (US).. ఈ మూడు సభ్య దేశాలుగా ‘ఆకస్ (AUKUS) పేరుతో మిలట్రీ కూటమి ఏర్పడినట్లుగా మూడు దేశాల నేతలు ప్రకటించారు. కూటమి ఏర్పాటు దానికదే ఒక ముఖ్య పరిణామం కాగా, ఆస్ట్రేలియాకు అణు ఇంధనంతో నడిచే 8 సబ్ మెరైన్లను అమెరికా సరఫరా చేయనున్నట్లు…

కస్టమ్స్ సుంకం తగ్గించి ట్రంప్ కి ఫోన్ చేసిన మోడి

ప్రధాన మంత్రి, ఆర్ధిక మంత్రుల (కేబినెట్) విధాన నిర్ణయాలు ఎవరి ప్రయోజనం కోసం ఉద్దేశించబడి ఉండాలి? ఈ ప్రశ్నకు జవాబు చాలా సులభం. దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు విధానాలు రూపొందించి అమలు చేయాలి. విదేశాలు, విదేశీ కంపెనీల మరియు విదేశీయుల పెట్టుబడుల ప్రయోజనాల కోసం భారత ప్రభుత్వం పని చేయకూడదు. అలా ఎవరైనా చేస్తే దేశద్రోహం అవుతుంది. భారత దేశ రక్షణ కోసం పని చేసే ఆర్మీ-నేవీ-ఎయిర్ ఫోర్స్ అధికారులు రక్షణ రహస్యాలను విదేశాలకు అందజేస్తే…

గోవా బి‌జే‌పి అవినీతి: 88 మైనింగ్ కాంట్రాక్టులు రద్దు చేసిన కోర్టు

కాంగ్రెస్ పార్టీ అవినీతికి రారాజు అని బి‌జే‌పి నేతలు తిట్టి పోస్తారు. ఎన్నడూ నోరు మెదపని ప్రధాని నరేంద్ర మోడి ఎన్నడన్నా నోరు తెరిస్తే మాత్రం కాంగ్రెస్ అవినీతి గురించీ, అనువంశిక పాలన గురించీ విమర్శించకుండా ఉండడు. కానీ కాంగ్రెస్ అవినీతిని కొనసాగించడానికి మాత్రం బి‌జే‌పికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. గోవా బి‌జే‌పి ప్రభుత్వం రెన్యూవల్ చేసిన 88 మైనింగ్ లీజులు అక్రమం అని సుప్రీం కోర్టు ధర్మాసనం నిర్ధారించింది. లీజులను రద్దు చేస్తూ ఈ రోజు…

అమెరికా ఆర్ధిక పరిస్ధితులే బ్లడ్ బాత్ కి కారణం -2

“రష్యాలో వర్షం కురిస్తే భారత కమ్యూనిస్టులు ఇండియాలో గొడుగు పట్టుకుంటారు” అని గతంలో పరిహాసం ఆడేవాళ్లు. బి‌జే‌పి పార్టీ, దాని అనుబంధ సంఘాల వాళ్ళకు ఈ పరిహాసం అంటే తగని ఇష్టంగా ఉండేది. “భారత స్టాక్ మార్కెట్ల పతనానికి మేము తెచ్చిన ఎల్‌టి‌సి‌జి పన్ను కారణం కాదు, బలహీన గ్లోబల్ (అమెరికా అని చదువుకోవాలి) ఆర్ధిక పరిస్ధితులే అందుకు కారణం” అని ఇప్పుడు బి‌జే‌పి మంత్రి జైట్లీ నిజాలను విడమరిచి చెబుతున్నాడు. అప్పుడు కమ్యూనిస్టులపై చేసిన పరిహాసం…

ప్రపంచ స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్ –విశ్లేషణ 1

సోమవారం ప్రపంచం లోని వివిధ ప్రధాన స్టాక్ మార్కెట్లు భారీ మొత్తంలో నష్టపోయాయి. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఈ భారీ పతనాన్ని బ్లడ్ బాత్ గా అభివర్ణిస్తున్నాయి. అమెరికా ప్రధాన స్టాక్ సూచీ అయిన డౌ జోన్స్, 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం కాలంలో కూడా ఎరగని విధంగా ఒకే రోజు 1175 పాయింట్లు నష్టపోయింది. కాబట్టి బ్లడ్ బాత్ అనడం కరెక్ట్ అనిపించక మానదు. అంకెల్లో చూసినప్పుడు ఇంత భారీ పతనాన్ని డౌ…

మోడి, దావోస్ సమావేశాలు, సామ్రాజ్యవాద వైరుధ్యాలు -2

మోడికి దక్కిన ఈ పోస్ట్ మెన్ / కొరియర్ పాత్రకే భారత మీడియా, బి‌జే‌పి నేతలు చంకలు గుద్దుకుంటున్నారు. ప్రపంచ వేదికలపై భారత్ కు ప్రతిష్ఠ పెరిగింది అని చెప్పడానికి ఇదే తార్కాణం అని ప్రజలకు నమ్మబలుకుతున్నారు. బలి ఇచ్చేముందు మేకపోతును అందంగా అలంకరించి, డప్పు వాయిద్యాల మధ్య వీధుల వెంట ఊరేగిస్తారన్న ఎరుక వీరికి లేకపోవడం భారత ప్రజల దౌర్భాగ్యం. కాగా మోడీ, ట్రంప్ ను తప్పు పట్టడాన్ని చైనా భలే సంతోషపడింది. దావోస్ వేదికపై…

మోడి, దావోస్ సమావేశాలు, సామ్రాజ్యవాద వైరుధ్యాలు -1

ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో ఆల్పైన్ పర్వతాల లోని విడిది నగరం దావోస్ లో ప్రపంచ ఆర్ధిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) సమావేశాలు జరుగుతున్నాయి. భారత దేశ ప్రధాని నరేంద్ర మోడి కూడా ఈ సమావేశాలకు హాజరై ప్రారంభ ప్రసంగం చేసి వచ్చాడు. మోడీతో పాటు పలు ఇతర దేశాల ప్రభుత్వాధినేతలు కూడా వేదికపై ప్రసంగాలు చేస్తున్నారు. 2000 సం. తర్వాత మొదటిసారిగా అమెరికా అధ్యక్షుడు ఈ సమావేశాలకు హాజరవుతున్నాడు. అందుకు అమెరికాకు కారణాలు ఉన్నాయి. అధ్యక్షుడు…

బడ్జెట్ 2018-19: ఉద్యోగులకు తొండి చెయ్యి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఎన్నికలు దగ్గర కావడంతో వారి ఆశలు ఇంకా పెరిగాయి. ఓట్ల కోసం ఆదాయ పన్ను విషయంలో మరింత రాయితీ ఇస్తాడని ఆశించారు. కానీ వారిని జైట్లీ బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచింది. గతంలో ఉన్న రాయితీలలో ఎలాంటి మార్పూ లేకుండా అట్టే కొనసాగించింది. విద్యా సెస్ కు ఆరోగ్యం జత కలిపి 1% అదనంగా సెస్ వసూలు చేస్తామని ప్రకటించారు. గత సంవత్సర…

ఎకనమిక్ సర్వే 2018: 10 ప్రధాన అంశాలు

జనవరి 29 తేదీన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎకనమిక్ సర్వే – 2018, 10 ప్రధాన అంశాలను గుర్తించింది. ఇవి భారత ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రమణీయన్ దృష్టిలో ప్రధానమైనవి. ‘పది కొత్త ఆర్ధిక నిజాలు’ అని సర్వే వీటిని అభివర్ణించింది.  ప్రజల వైపు నుండి చూసినపుడు ప్రధానం కావచ్చు, కాకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నియమించుకున్న సలహాదారు కనుక ఈ అంశాలు పాలకవర్గాల దృక్కోణం నుండి ప్రధాన అంశాలుగా ఉంటాయని గుర్తించడం సబబు.…

ఆర్ధిక వ్యవస్ధకు యుగాంతం ప్రమాదం! -ఎకనమిక్ సర్వే హెచ్చరిక

భారత ప్రభుత్వం 2018-19 కి గాను ఎకనమిక్ సర్వేను విడుదల చేసింది. ఏటా బడ్జెట్ ప్రకటనకు ముందు విడుదలయ్యే ఎకనమిక్ సర్వే భారత ఆర్ధిక వ్యవస్ధ వృద్ధికి (జి‌డి‌పి గ్రోత్ కి) నాలుగు పెద్ద గండాలు ఉన్నాయని హెచ్చరించింది. భారత దేశానికి ప్రధాన ఆర్ధిక సలహాదారు (చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్) అరవింద్ సుబ్రమణియన్ రచించిన ఎకనమిక్ సర్వే, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి చెప్పుకుంటున్న ఆర్ధిక గొప్పలను పరిహాసం చేసినంత పని…