బొగ్గు కేటాయింపులు చట్ట విరుద్ధం -పార్లమెంటు కమిటీ
బొగ్గు గనుల కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వం నియమించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగట్టింది. ఇష్టమొచ్చిన వారికి ఇష్టారీతిన బొగ్గు గనులను కేటాయించారని, గనుల కేటాయింపులో ఎలాంటి పారదర్శకత గానీ, సక్రమమైన పద్ధతులు గానీ పాటించలేదని దుయ్యబట్టింది. ప్రజలు అప్పజెప్పిన అధికారాన్ని తీవ్రంగా దుర్వినియోగపరిచారని జాతీయ సహజ వనరులను కొద్ది సంఖ్యలోని కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఉదారంగా దోచిపెట్టిందని తేల్చి చెప్పింది. 1993-2010 మధ్య కాలంలో దేశాన్ని పాలించిన ప్రభుత్వాలన్నీ దేశానికి మసి పూయడంలో భాగస్వామ్యం…
