రేషన్ షాపు కాదు బంగారం కొట్టు -కార్టూన్

“ఇది రేషన్ కోసం. బంగారం కోసం క్యూ అదిగో, అక్కడుంది!” ——————————— గత కొన్ని రోజులుగా బంగారం ధర భారీ స్ధాయిలో పతనం అవుతోంది. ఇండియాలో అయితే గత శనివారం నుండి బంగారం రేటు పెద్ద ఎత్తున పడిపోతోంది. మంగళవారం వరకు భారీగా పతనం అయిన బంగారం ధర బుధవారం కూడా పతనం కొనసాగి ట్రేడింగ్ చివర కొద్దిగా పెరిగినట్లు తెలుస్తోంది. భుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 10 గ్రాముల బంగారం ధర 25,790 రూపాయల వద్ద…

సంచలనం! సంచలనం!! మాయాకొడ్నానికి మరణ శిక్ష కోరనున్న మోడి

ఇండియాలో నర మానవుడెవరూ కలలో కూడా ఊహించని పరిణామం ఇది. దేశ రాజకీయాల్లో కార్డులు అట్టా ఇట్టా కాకుండా తిరగబడుతున్నాయి. దేశ అత్యున్నత పదవికి గురి పెట్టిన నరేంద్ర మోడి అందుకు స్వపక్షీయులనే బలిపశువులుగా నిలబెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఒకప్పటి తన నమ్మిన బంటులను ‘ప్రధాని పదవి’ అనే దేవత కోసం పార్లమెంటు ఎన్నికల వధ్య శిల పైన బలిగా అర్పించబోతున్నాడు. తన ఆజ్ఞ, అనుజ్ఞలతో గుజరాత్ లోని నరోద పాటియాలో పేద ముస్లిం ప్రజలను అత్యంత దారుణంగా…

మైనస్ జె.డి(యు), మోడి ఇమేజ్ భారం బి.జె.పి ఆపగలదా? -కార్టూన్

బి.జె.పి లో నరేంద్ర మోడి అనుకూల ప్రచారం ఇతర నాయకులకు అలవి కానంతగా పెరిగింది. మోడి తప్ప దేశానికి దిక్కు లేదని దేశ ప్రజలకు నచ్చజెప్పడానికి ఆయన పార్టీ మద్దతుదారులు, అభిమానులు చెవినిల్లు కట్టి పోరుతున్నారు. మోడీకి ముందే జరిగిన గుజరాత్ అభివృద్ధిని కూడా మోడి చలవే అని తాము నమ్మి ఇతరులను కూడా నమ్మమంటున్నారు. మోడి ప్రధాని అయితే మంత్రి పదవులు దక్కుతాయన్న అసవల్లనే యేమో గాని బి.జె.పిలో ఆరెస్సెస్సేతర నాయకులైన యశ్వంత్ సిన్హా లాంటివారు…

బోస్టన్ బాంబు పేలుళ్లు -ఫోటోలు

అమెరికాలోని బోస్టన్ నగరంలో బాంబు పేలుళ్లు జరిగాయి. సెకన్ల వ్యవధిలో జరిగిన రెండు బాంబు పేలుళ్లలో ముగ్గురు చనిపోగా 130 మందికి పైగా గాయపడ్డారు. గాయపడినవారిలో ఆరుగురి పరిస్ధితి విషమంగా ఉంది. 40 కి.మీ బోస్టన్ మారధాన్ పరుగు పందెం చివరి అంచెలో ఈ పేలుడు సంభవించింది. ప్రేక్షకులు నిలుచున్న చోట పేలుడు జరిగినట్లు కనిపిస్తోంది. పేలుడు అనంతరం ఏరియల్ వ్యూ నుండి తీసిన వీడియోను కింద చూడవచ్చు.   ఈ కింది ఫోటోలను ఆర్.టి (రష్యా…

అమెరికాలో బాంబు పేలుడు, ముగ్గురి మరణం

అమెరికాలోని బోస్టన్ నగరంలో బాంబు పేలుళ్లు సంభవించాయి. సెకన్ల వ్యవధిలో రెండు బాంబులు పేలగా మరో 5 పేలని బాంబులు దొరికాయని పోలీసులు తెలిపారు. 40 కి.మీ దూరం సాగే ‘బోస్టన్ మారధాన్’ పోటీ ముగింపు స్ధలంలో జరిగిన ఈ పేలుళ్లలో ముగ్గురు మరణించారు. 130 మందికి పైగా గాయపడ్డారు. పదుల సంఖ్యలో అవయవాలు తీసివేయాల్సి వచ్చిందని ఆసుపత్రుల అధికారుల సమాచారాన్ని ఉటంకిస్తూ పత్రికలు తెలిపాయి. బాల్ బేరింగ్ లాంటి ఇనప వస్తువులు కూరి బాంబులు తయారు…

మోడిని ఎంత విమర్శిస్తే అంత బలం -కార్టూన్

గుజరాత్ లోపల మోడి వాలి టైపు. వాలికి ఎదురు నిలబడి పోరాడినవాడి నుండి సగం బలం వాలికి వచ్చి చేరుతుందట! దానితో శ్రీరాముల వారు సైతం చెట్టు చాటున నిలబడి దొంగ దెబ్బ తీయక తప్పలేదు. మోడి విషయం కూడా అంతే. ఆయనను ఎంత విమర్శిస్తే మోడీకి అంత బలం. మోడిని వ్యక్తిగతంగా విమర్శిస్తే మోడీకి ఇంకా బలం. గత మూడు ఎన్నికల్లో అదే జరిగింది. తనపైన ప్రత్యర్ధులు విరుచుకుపడినప్పుడల్లా దానిని ‘గుజరాత్ ఆత్మాభిమానం’ కింద మలుచుకుని…

శ్రీలంక: సాయంలో కోత పెట్టిన అమెరికా

శ్రీలంకకు ఇస్తున్న సహాయంలో అమెరికా కోత విధించింది. మానవ హక్కుల హరణ, మిలట్రీ జోక్యం వల్ల కోత విధిస్తున్నట్లు అమెరికా విదేశాంగ ప్రతినిధి చెప్పినట్లు పి.టి.ఐ తెలిపింది. ఎల్.టి.టి.ఇ యుద్ధం ముగిసిన తర్వాత ఉత్తరాన నివశిస్తున్న తమిళులకు పౌరహక్కులు కల్పించడంలోనూ, నాశనం అయిన నిర్మాణాలను పునర్నిర్మించడంలోను, రాజకీయంగా తమిళులను దేశంలో కలుపుకోవడంలోనూ శ్రీలంక ప్రగతి సాధించలేదని తాము ఇస్తున్న సాయం బాధితులకు అందకుండా మిలట్రీ జోక్యం చేసుకుంటోందని అమెరికా ప్రతినిధి తమ చర్యకు కారణంగా చెప్పాడు. ది…

భిన్నత్వంలోనూ ప్రత్యేకం దక్షిణ భారత దేశం -ఈనాడు ఆర్టికల్ 9వ భాగం

“జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా” వ్యాస పరంపర లోని తొమ్మిదో భాగం ఈరోజు ఈనాడు చదువు పేజిలో ప్రచురితం అయింది. నేరుగా ఈనాడు వెబ్ పేజీలో చూడదలిస్తే ఇక్కడ క్లిక్ చేయగలరు. పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ రూపంలో చదవాలనుకుంటే కింద బొమ్మ పైన క్లిక్ చేయండి.

బ్రిటిష్ మాజీ ప్రధాని ధాచర్ మరణం వారికి పండగ -ఫోటోలు

బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ ధాచర్ ఏప్రిల్ 8 తేదీన మరణించింది. ఆమె మరణం పట్ల ధనికులు ఖేదం ప్రకటిస్తే కార్మికులు, అల్పాదాయ, మధ్యతరగతి వర్గాలు అనేకులు మోదం ప్రకటించారు. దేశవ్యాపిత సంబరాలకు సైతం ‘క్లాస్ వార్’ లాంటి సంస్ధలు, మైనింగ్ వర్కర్స్ యూనియన్ లాంటి కార్మిక సంఘాలు పిలుపునిచ్చి అమలు చేసాయి కూడా. ధాచర్ మరణం పట్ల సంబరాలు జరుపుకున్న ఫోటోలను కింద చూడవచ్చు. ఈ సంబరాలకు కారణం ఏమిటో అర్ధం చేసుకోవాలంటే చరిత్రలోకి కొద్దిగా…

మోడి గాలి జనం ఒప్పుకోరు -నితీష్ కుమార్

ఎన్.డి.ఎ కూటమి ఏర్పడినప్పుడు విధించిన షరతులు ఇప్పటికీ వర్తిస్తాయని, అలా అయితేనే కూటమి కొనసాగుతుందని జనతా దళ్ (యునైటెడ్) పార్టీ నాయకుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశాడు. ‘తాము ఒక తుఫాను సృష్టిస్తామని, ప్రజలు దానిని అంగీకరిస్తారని’ కొంత మంది భావిస్తున్నారని, కానీ ప్రజలు చదువు లేకపోయినా చాలా తెలివైనవారని మోడిని పరోక్షంగా ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించాడు. తెలివైన ప్రజలు ఎలాంటి గాలిని ఒప్పుకోరని రాజకీయ నాయకులు చెప్పే మాటల్లో విషయం ఉన్నదీ లేనిదీ వారు…

ఇప్పుడు అమెరికాకి నెం.1 టార్గెట్, వెనిజులా -హాలీవుడ్ దర్శకుడు

అమెరికా ప్రభుత్వానికి, అమెరికా మీడియాకి ఇపుడు వెనిజులా నెంబర్ 1 టార్గెట్ అని ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు అలివర్ స్టోన్ వ్యాఖ్యానించాడు. 2009లో హ్యూగో ఛావెజ్ పై ‘సౌత్ ఆఫ్ ద బోర్డర్’ అనే డాక్యుమెంటరి నిర్మించి ఛావెజ్ గురించిన వాస్తవాలను/అవాస్తవాలను అమెరికా ప్రజలకు తెలియజేసేందుకు ఆలివర్ స్టోన్  ప్రయత్నం చేశాడు. తన సినిమా ప్రత్యేక స్క్రీనింగ్ సందర్భంగా చనిపోయిన ఛావెజ్ పశ్చిమ వార్తా పత్రికలు, ప్రభుత్వాలు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని దుయ్యబట్టాడు. వెనిజులా ప్రజలు అత్యధిక మెజారిటీతో…

అమెరికా ‘మేగ్నిట్ స్కీ జాబితా’కు యాకోవ్లెవ్ జాబితా’తో బదులిచ్చిన రష్యా

నాలుగు దశాబ్దాల పాటు సాగిన ‘ప్రచ్ఛన్న యుద్ధం’ (కోల్డ్ వార్) లో రెండు అంతర్జాతీయ వైరి శిబిరాలకు నాయకత్వం వహించిన అమెరికా, రష్యాలు మళ్ళీ ఒక్కసారి ఆ రోజులను గుర్తుకు తెచ్చాయి. ‘మేగ్నిట్ స్కీ చట్టం’ కింద అనేకమంది రష్యా ప్రముఖుల పైన ఆంక్షలు విధిస్తూ అమెరికా ప్రకటించిన ‘మేగ్నిట్ స్కీ జాబితా’ కు ప్రతీకారంగా పలువురు అమెరికన్ ప్రముఖులపై ఆంక్షలు ప్రకటిస్తూ రష్యా మరొక జాబితా విడుదల చేసింది. ఇరు దేశాలు తమ చర్యలకు మానవ…

దళితురాలని తెలిసే చంపారు, తెనాలి ఘటనపై ఎస్.పి -కత్తిరింపు

తెనాలిలో తాగుబోతుల దుర్మార్గం ఫలితంగా లారీ కింద పడి చనిపోయిన సునీల కుటుంబం దళితులని తెలిసే వారిపై దుర్మార్గానికి పాల్పడ్డారని గుంటూరు ఎస్.పి జె.సత్యనారాయణ హై కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారని ఈనాడు పత్రిక తెలిపింది. బి.టెక్ చదువున్న సునీల కుమార్తెను దుండగులు మొదట కులం పేరుతో దూషించి అనంతరం లైంగికంగా వేధించారని ఎస్.పి తన నివేదికలో పేర్కొన్నారు. ది హిందు రిపోర్టును పిటిషన్ గా సుమోటోగా విచారణకు స్వీకరించిన రాష్ట్ర హై కోర్టు స్వయంగా విచారణను…

భార్యల మార్పిడి, వరకట్నం, అత్యాచారం: నేవీలో సాంస్కృతిక పతనం!

ఉన్నత స్ధాయి పరీక్షలు నిర్వహించి నౌకాదళ అధికారులను ఎన్నుకుంటారు. ఉన్నత విద్యార్హతలు ఉంటేనే ఈ పరీక్షలలో నెగ్గడం సాధారణంగా సాధ్యపడుతుంది. అలాంటి అధికారులు సాంస్కృతిక జీవనంలో భారత సమాజానికి ఆదర్శంగా ఉండేలా జీవిస్తారని ఆశిస్తాము. ఆధునిక సమానతా విలువలను ఒంటబట్టించుకుని స్త్రీలకు తగిన గౌరవ, మర్యాదలు ఇస్తారని ఊహిస్తాము. కానీ అలాంటి ఊహలకు, ఆశలకు తాము అర్హులము కాదని నౌకాదళ అధికారులు కొందరు చెప్పదలుచుకున్నట్లు కనిపిస్తోంది. ఉన్నతాధికారి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు ఆర్మీ చట్టాల ప్రకారం…

ఏ రాయయితేనేం… పళ్లూడగొట్టుకోడానికి? -కార్టూన్

రానున్న ఎన్నికల్లో ఎవరికి ఓటేయ్యాలి? ప్రజలను ఎటువంటి వివక్ష లేకుండా పాలన చేయడం అటుంచి వారి మానాన వారిని బతకనిచ్చే పార్టీలు ఇండియాలో ఏమున్నాయని? వనరులన్నీ విదేశీ కంపెనీలు తరలించుకుపోతున్నా నోరు మూసుకున్నందుకు కాళ్ళ కింద భూమిని కూడా ఇప్పుడు లాక్కుపోతున్నారు. ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వకపోయినా చిల్లర కొట్టు పెట్టుకుని స్వయం ఉపాధి కల్పించుకుంటే దాన్ని తీసుకుపోయి వాల్ మార్ట్ కి అప్పజెపుతున్నారు. ఇన్ని చేసినా సహించి ఊరుకుంటే నువ్వు ముస్లింవి కనుక చంపుతాను అని ఒకరోస్తే,…