రైతుల ఆందోళన విరమణ, 11 తేదీన సంబరాలు!

హిందూత్వ అహంభావ పాలకులపై చావు దెబ్బ కొట్టిన ‘భారతీయ’ రైతులు ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. రైతు సంఘాల సంయుక్త పోరాట వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్‌కే‌ఎం) నేతలు విధించిన షరతులకు కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఆమోదం చెప్పడంతో శనివారం, డిసెంబర్ 9 తేదీన ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరవధిక ఆందోళన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు బనాయించిన కేసులన్నింటినీ బేషరతుగా ఉపసంహరించుకుంటామని కేంద్రం రాత పూర్వకంగా హామీ ఇచ్చింది.…

హెలికాప్టర్ క్రాష్: సి‌డి‌ఎస్ బిపిన్ రావత్ దుర్మరణం

భారత సాయుధ బలగాల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సి‌డి‌ఎస్) జనరల్ బిపిన్ రావత్ తమిళనాడు లోని నీలగిరి కొండల్లో ఆయన ప్రయాణిస్తున్న ఎం-17 హెలికాప్టర్ కూలి దుర్మరణ చెందారు. జనరల్ బిపిన్ రావత్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ కి ఛైర్మన్ కూడా. ఈ పదవిలో నియమితులైన మొట్ట మొదటి ఆర్మీ అధికారి ఆయన. జనరల్ బిపిన్ రావత్ డిపార్ట్^మెంట్ ఆఫ్ మిలట్రీ అఫైర్స్ కి కూడా అధిపతిగా వ్యవహరించారు. 1 జనవరి 2020…

2+2 ఫార్మాట్ చర్చలు అంటే?

భారత విదేశాంగ విధానంలో గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న మాట “2+2 ఫార్మాట్ డైలాగ్” (2+2 నమూనా లో జరిగే చర్చలు)! సాధారణ పాఠకుల్లో చాలా మందికి ఈ పద బంధం అర్ధం ఏమిటన్నది తెలియదు. తెలియని అంశాల కోసం ఇంటర్నెట్ ని వెతికి చదివే అలనాటు ఉన్నవాళ్లకి తప్ప ఇతరులకి తెలిసే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ పద బంధాన్ని విదేశాంగ విధానం, విదేశీ సంబంధాల రంగంలో ఉపయోగిస్తారు. ఈ పేరే దాని అర్ధం ఏమిటో చెబుతోంది.…

ఇండియా రష్యా 2+2 డైలాగ్: ఏ‌కే-203 ఒప్పందం ఒకే

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియా సందర్శన సందర్భంగా ఇరు దేశాల మధ్య 2+2 ఫార్మాట్ లో ఈ రోజు చర్చలు జరిగాయి. చర్చల్లో రష్యా రక్షణ మంత్రి సెర్గి షోయిగు, విదేశీ మంత్రి సెర్గీ లావరోవ్ లు రష్యా తరపున పాల్గొనగా, ఇండియా తరపున రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ లు పాల్గొన్నారు. సోమవారం జరిగిన ఈ సమావేశం ఇండియా రష్యాల మధ్య 2+2 ఫార్మాట్ లో…

మహిళలు ఒకరి సొంత ఆస్తి కాదు! -తాలిబాన్ డిక్రీ

ఆఫ్ఘనిస్తాన్ నేల నుండి ఒక శుభ వార్త! మహిళల హక్కులను, ఆకాంక్షలను అణచివేయడంలో పేరు పొందిన తాలిబాన్ ఆఫ్ఘన్ ఆడ పిల్లలకు అనుకూలంగా ఒక ముఖ్యమైన డిక్రీ జారీ చేయడం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. “స్త్రీ ఏ ఒక్కరి ఆస్తీ కాదు. ఆమెను ఒక గౌరవప్రదమైన మరియు స్వేచ్ఛాయుత మానవునిగా పరిగణించాలి. శాంతికి బదులుగానో లేక శతృత్వానికి ముగింపు పలికే లక్ష్యంతోనో ఏ స్త్రీనీ మారకానికి ఇవ్వడం జరగరాదు” అని తాలిబాన్ ప్రభుత్వం డిక్రీ జారీ…

ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ వైరస్!

ప్రస్తుతం ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కోవిడ్ వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత దేశంలో కూడా ప్రవేశించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.రెండు కేసులూ కర్ణాటక రాష్ట్రంలో కనుగొన్నట్లు ప్రభుత్వం గురువారం తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ సోకిన ఇద్దరూ పురుషులే. ఒకరి వయసు 66 సం.లు కాగా మరొకరి వయసు 46 సం.లు. ఈ ఇద్దరి జాతీయత ఏమిటో వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో భారత పత్రికలు వెల్లడించడం లేదు. అయితే WION వెబ్ సైట్ అందజేసిన…

అంబేద్కర్ రచనల ప్రచురణ నిలిపివేత, సుమోటు కేసు నమోదు

మహారాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలను ప్రచురించే ప్రాజెక్టును నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మహారాష్ట్ర ప్రాంతీయ పత్రిక లోక్ సత్తా ఒక వార్త ద్వారా వెలుగులోకి తెచ్చింది. సదరు వార్తను పరిగణలోకి తీసుకున్న బొంబే హై కోర్టు, ప్రచురణ ప్రాజెక్టు నిలిపివేయడాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా సుమోటుగా డిసెంబర్ 1 న స్వీకరించింది. మరాఠీ పత్రిక లోక్ సత్తా నవంబర్ 24 తేదీన అంబేద్కర్ రచనలు, ప్రసంగాల ప్రచురణను నిలిపివేసిన…

చనిపోయిన రైతుల లెక్కల్లేవు, పరిహారం ఇవ్వలేం -కేంద్రం

మోడి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం చనిపోయిన రైతుల కుటుంబాల దీన పరిస్ధితితో తనకు సంబంధం లేదని చేతులు దులిపేసుకుంది. తమ నిర్లక్ష్యం, రైతుల పట్ల బాధ్యతారాహిత్యం కారణంగా ఏడాది పాటు చలికి వణుకుతూ, ఎండలో ఎండుతూ, వానలో నానుతూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలో పాల్గొనడం వలన అర్ధాంతరంగా చనిపోయిన రైతులకు సంబంధించిన రికార్డులు తమ వద్ద లేనందున వారి కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించే ప్రసక్తే తలెత్తదని స్పష్టం చేసింది. అసలు కనీస తర్కం కూడా…

5 ని.ల్లో రద్దు బిల్లు మూజువాణి ఆమోదం, నోటితో నవ్వుతూ…

పార్లమెంటరీ సంప్రదాయాలు, నియమ నిబంధనలు, నియమావళి, సుస్ధిర ప్రక్రియలు ఒక్కొక్కటిగా మాయమైపోతున్నాయి. దాదాపు ఆరున్నర దశాబ్దాల పార్లమెంటరీ ఆచరణలో తామే నెలకొల్పుకున్న సో-కాల్డ్ ప్రజాస్వామిక సభా సూత్రాలు రద్దయిపోతూ వాటి స్ధానంలో పార్లమెంటరీ నియంతృత్వ సూత్రాలు ప్రవేశిస్తున్నాయి. ప్రజలు తమ ప్రతినిధులుగా ఎన్నుకున్న సభ్యులు నిరసనలను గౌరవించడం మాట అటుంచి కనీసం పట్టించుకోవడమే ఒక గొప్ప అంశంగా మారే రోజులు వచ్చాయి. ప్రజాస్వామ్య దేవాలయంగా ఇన్నాళ్లూ మన పాలకులు డప్పు కొట్టుకున్న పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లులు…

బ్రిటిష్ రాణి ఆధిపత్యాన్ని రద్దు చేయనున్న బార్బడోస్!

కరేబియన్ దేశాల్లో ఒకటయిన బార్బడోస్ త్వరలో బ్రిటిష్ రాణి ఆధిపత్యం నుండి వైదొలగడానికి నిర్ణయం తీసుకుంది. సర్వ స్వతంత్ర దేశంగా అవతరించనుంది. బ్రిటిష్ డొమీనియన్ నుండి వైదొలిగి నూతన రిపబ్లిక్ దేశంగా అవతరించనుంది. 400 యేళ్ళ పాటు బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా, బ్రిటిష్ వలస దేశంగా మగ్గిన బార్బడోస్ 1965లో స్వాతంత్రం ప్రకటించుకుంది. స్వాతంత్రం ప్రకటించుకున్నప్పటికీ బ్రిటిష్ డొమీనియన్ లో భాగంగా బార్బడోస్ కొనసాగింది. అనగా ఆ దేశ రాజ్యాధిపతిగా (Head of the State) బ్రిటిష్…

ఎం‌ఎస్‌పి గ్యారంటీ కోసం ఆందోళన కొనసాగుతుంది -రైతు సంఘాలు

ఇతర ముఖ్యమైన డిమాండ్ల సాధన కోసం తమ ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాలు ప్రకటించాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఆపాలజీ వల్ల తమ డిమాండ్లు నెరవేరవనీ, క్షమాపణ కోరడానికి బదులు ‘కనీస మద్దతు ధర’ (Minimum Support Price) ను గ్యారంటీ చేసేందుకు చట్టం తేవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. “మేము ఎక్కడికీ వెళ్ళడం లేదు” అని సంయుక్త కిసాన్ మోర్చా నాయకుల్లో ఒకరు, బి‌కే‌యూ నాయకులూ అయిన రాకేశ్ తికాయత్ స్పష్టం చేశాడు. నరేంద్ర…

మూడు రాజధానుల బిల్లుల రద్దు, అమరావతి ఒక్కటే రాజధాని!

జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం నిర్ణయించిన అమరావతి రాజధానికి బదులుగా కర్నూలు, విశాఖపట్నంలను కూడా కలిపి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఆంధ్ర ప్రదేశ్ కోర్టుకు సమాచారం ఇచ్చారు. వివాదాస్పదంగా మారి దేశ రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించిన మూడు వ్యవసాయ చట్టాలను ప్రధాన…

క్షమించండి! వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తాను! -మోడి

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తల వంచాడు. కాదు, కాదు. భారత రైతులే ఆయన తల వంచారు. మోడి నేతృత్వం లోని బి‌జే‌పి-ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టపరమైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ దాదాపు సంవత్సర కాలంగా ఎండనకా, వాననకా జాతీయ రహదారులపై ఆందోళన చేస్తున్న రైతాంగం ఎట్టకేలకు అపూర్వ విజయం సాధించింది. ప్రధాన మంత్రి పదవి చేపట్టినాక కూడా పత్రికలతో ఏనాడూ మాట్లాడి…

అమరావతి రాజధానికి మద్దతుగా మహా పాదయాత్రలో బి‌జే‌పి!

ఆంధ్ర ప్రదేశ్ లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతిలో రాజధాని నిర్మించడానికి బదులుగా మూడు రాజధానుల పేరుతో జగన్ నేతృత్వం లోని వై‌సి‌పి ప్రభుత్వం విశాఖపట్నం నగరాన్ని ప్రముఖంగా ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే. రాజధానిగా అమరావతి బదులు విశాఖపట్నాన్ని వై‌సి‌పి ప్రకటించడంపై ఇంతవరకు పెద్దగా నోరు విప్పని బి‌జే‌పి ఇప్పుడు గత టి‌డి‌పి ప్రభుత్వ నిర్ణయం అమలుకై డిమాండ్ చేయటం విశేషం.  విజయవాడలో బి‌జే‌పి ఎస్‌సి మోర్చా సమావేశం సందర్భంగా నవంబర్ 21 తేదీన…

అత్యంత ధనిక దేశంగా అమెరికాను వెనక్కి నెట్టిన చైనా!

ప్రధాన ఆర్ధిక శక్తిగా అత్యంత వేగంగా ఎదుగుతున్న చైనా ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనిక దేశంగా అవతరించింది. వార్షిక జి‌డి‌పి రీత్యా అమెరికా ఇప్పటికీ మొదటి స్ధానంలో ఉన్నప్పటికీ సంపదల సృష్టిలో మాత్రం చైనా అమెరికాను మించిపోయింది. రెండు దశాబ్దాల క్రితంతో పోలిస్తే చైనాలో సంపదలు విపరీతంగా పెరిగాయి. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచంలో సంపదలు మూడు రెట్లు పెరిగాయని ప్రఖ్యాత కన్సల్టింగ్ కంపెనీ మెకిన్సే అండ్ కో తెలిపింది. అత్యంత సంపన్న దేశాలలో టాప్ 10…