మూడు రాజధానుల బిల్లుల రద్దు, అమరావతి ఒక్కటే రాజధాని!

జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం నిర్ణయించిన అమరావతి రాజధానికి బదులుగా కర్నూలు, విశాఖపట్నంలను కూడా కలిపి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఆంధ్ర ప్రదేశ్ కోర్టుకు సమాచారం ఇచ్చారు. వివాదాస్పదంగా మారి దేశ రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించిన మూడు వ్యవసాయ చట్టాలను ప్రధాన…

క్షమించండి! వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తాను! -మోడి

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తల వంచాడు. కాదు, కాదు. భారత రైతులే ఆయన తల వంచారు. మోడి నేతృత్వం లోని బి‌జే‌పి-ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టపరమైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ దాదాపు సంవత్సర కాలంగా ఎండనకా, వాననకా జాతీయ రహదారులపై ఆందోళన చేస్తున్న రైతాంగం ఎట్టకేలకు అపూర్వ విజయం సాధించింది. ప్రధాన మంత్రి పదవి చేపట్టినాక కూడా పత్రికలతో ఏనాడూ మాట్లాడి…

అమరావతి రాజధానికి మద్దతుగా మహా పాదయాత్రలో బి‌జే‌పి!

ఆంధ్ర ప్రదేశ్ లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతిలో రాజధాని నిర్మించడానికి బదులుగా మూడు రాజధానుల పేరుతో జగన్ నేతృత్వం లోని వై‌సి‌పి ప్రభుత్వం విశాఖపట్నం నగరాన్ని ప్రముఖంగా ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే. రాజధానిగా అమరావతి బదులు విశాఖపట్నాన్ని వై‌సి‌పి ప్రకటించడంపై ఇంతవరకు పెద్దగా నోరు విప్పని బి‌జే‌పి ఇప్పుడు గత టి‌డి‌పి ప్రభుత్వ నిర్ణయం అమలుకై డిమాండ్ చేయటం విశేషం.  విజయవాడలో బి‌జే‌పి ఎస్‌సి మోర్చా సమావేశం సందర్భంగా నవంబర్ 21 తేదీన…

అత్యంత ధనిక దేశంగా అమెరికాను వెనక్కి నెట్టిన చైనా!

ప్రధాన ఆర్ధిక శక్తిగా అత్యంత వేగంగా ఎదుగుతున్న చైనా ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనిక దేశంగా అవతరించింది. వార్షిక జి‌డి‌పి రీత్యా అమెరికా ఇప్పటికీ మొదటి స్ధానంలో ఉన్నప్పటికీ సంపదల సృష్టిలో మాత్రం చైనా అమెరికాను మించిపోయింది. రెండు దశాబ్దాల క్రితంతో పోలిస్తే చైనాలో సంపదలు విపరీతంగా పెరిగాయి. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచంలో సంపదలు మూడు రెట్లు పెరిగాయని ప్రఖ్యాత కన్సల్టింగ్ కంపెనీ మెకిన్సే అండ్ కో తెలిపింది. అత్యంత సంపన్న దేశాలలో టాప్ 10…

సనాతన కుల-మత వ్యవస్ధ పునరుద్ధరణే కంగనా ప్రబోధిస్తున్న విముక్తి!

నటి కంగనా రనౌత్ తన వ్యాఖ్యలపై కొంత స్పష్టత ఇచ్చారు. తాను అన్నీ తెలిసే 1947 నాటి స్వతంత్రంపై వ్యాఖ్యానించానని తన వివరణ ద్వారా స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు తప్పయితే తన ‘పద్మ శ్రీ’ అవార్డు వెనక్కి ఇచ్చేందుకు సిద్ధం అని ప్రకటించారు. దానికి ముందు తన అనుమానాలు తీర్చాలని ఆమె కొన్ని ప్రశ్నలు సంధించారు. తన అనుమానాలకు సంతృప్తికరంగా సమాధానం ఇస్తే అవార్డు ఇచ్చేస్తానని చెప్పారు. అయితే కంగనా రనౌత్ ఇచ్చిన వివరణ మరిన్ని…

కంగనా రనౌత్ తెలిసి మాట్లాడతారా లేక…!?

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి మరో వివాదంలో కేంద్ర బిందువుగా నిలిచారు. ఏకంగా భారత దేశ స్వాతత్ర్య దినం పైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారామె. ఆర్ణబ్ గోస్వామి కేకలకు, పెడబొబ్బలకు గతంలో అవకాశం ఇచ్చిన టైమ్స్ నౌ చానెల్ నిర్వహించిన ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి.కొందరు బి‌జే‌పి నేతలు కూడా ఆమె అవగాహనా రాహిత్యాన్ని తిట్టిపోస్తున్నారు. గురువారం జరిగిన ఈవెంట్ లో ఒక ప్రశ్నకు సమాధానం…

మోడి క్లీన్ చిట్: మనస్సాక్షి ఉన్న జడ్జి ఈ సాక్షాన్ని విస్మరించరు!-2

పిటిషనర్ జకీయా జాఫ్రీ తరపున సుప్రీం కోర్టు అడ్వకేట్ కపిల్ సిబాల్ వినిపిస్తున్న వాదనలు: జైదీప్ పటేల్ మొబైల్ అసలు స్వాధీనమే చేసుకోలేదు. ఆయన అనేక ఫోన్ కాల్స్ చేసి ఉంటాడు. ఆయన ఫోన్ స్వాధీనం చేసుకోకపోతే మీరు (సిట్) ఏమి పరిశోధన చేసినట్లు? 27 ఫిబ్రవరి, 2021 (గోధ్రా రైలు దహనం జరిగిన రోజు) తేదీకి ముందే బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, సంఘ్ పరివార్ సభ్యులు ఆయుధాలు, మందుగుండు నిలవ చేసుకున్నారని చెప్పే…

విచారణ చెయ్యకుండానే మోడికి క్లీన్ చిట్ -జకీయా జాఫ్రీ వాదన

గోధ్రా రైలు దహనం అనంతరం గుజరాత్ రాష్ట్ర వ్యాపితంగా ముస్లింలపై జరిగిన మారణకాండ విషయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ (సిట్) క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. క్లీన్ చిట్ పై నిరసన పిటిషన్ దాఖలు చేసిన జకీయా జాఫ్రీ తరపున అడ్వకేట్ కపిల్ సిబాల్ తన వాదనలు ఈ రోజు కొనసాగించారు. జాఫ్రీ చేసిన ఫిర్యాదుపై అనేక సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నప్పటికీ వాటిపై పరిశోధన జరపకుండానే…

రాఫేల్: బి‌జే‌పి నేతలారా, అధికారం మీదేగా విచారణ చెయ్యరేం?

భారతీయ జనతా పార్టీ (బి‌జే‌పి) నేతల ధోరణి మరీ విడ్డూరంగా కనిపిస్తోంది. కేంద్రంలో ప్రభుత్వాధికారం ఉన్నది బి‌జే‌పి చేతుల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం లోని అత్యంత శక్తివంతమైన విచారణ సంస్ధలన్నీ బి‌జే‌పి ప్రభుత్వం నియంత్రణలో ఉన్నాయి. కాబట్టి రాఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో కమీషన్ చేతులు మారినట్లు వచ్చినట్లు ఆరోపణలపై విచారణ చేయవలసిన బాధ్యత బి‌జే‌పి పైనే ఉన్నది, అధికారం కూడా వారి చేతుల్లోనే ఉన్నది. అలాంటిది ఫ్రెంచి పరిశోధనా వార్తల పోర్టల్ మీడియా పార్ట్ తాజాగా…

రాఫెల్ డీల్: లంచం సాక్ష్యాలున్నా సి‌బి‌ఐ దర్యాప్తు చేయలేదు!

ఫ్రాన్స్ యుద్ధ విమానాల కంపెనీ దాసో ఏవియేషన్ (Dassault Aviation), భారత దేశానికి రాఫేల్ యుద్ధ విమానాలు సరఫరా చేసిన సంగతి తెలిసిందే. యూ‌పి‌ఏ హయాంలోనే 125 విమానాల సరఫరాకు ఒప్పందం కుదిరినా అంతిమ ఒప్పందం సాగుతూ పోయింది. నరేంద్ర మోడి అధికారం చేపట్టిన వెంటనే ఈ ఒప్పందాన్ని పరుగులు పెట్టించాడు. ఒప్పందాన్ని ప్రభుత్వం-ప్రభుత్వం ఒప్పందంగా మార్చి 36 రాఫేల్ జెట్ విమానాలు సరఫరాకు ఒప్పందం పూర్తి చేశాడు. ఈ ఒప్పందంలో లంచం చేతులు మారాయని ఫ్రెంచి…

రష్యన్ పి‌ఎం‌సిలు: సబ్ సహారన్ ఆఫ్రికా దేశాల్లో తిష్ట -3

సబ్-సహారా ఆఫ్రికా సబ్ సహారన్ ఆఫ్రికా దేశాలు సంపద్వంతమైన ఖనిజ వనరులకు నిలయం. సహారా ఎడారికి దక్షిణాన ఉన్న దేశాలను సబ్-సహారా ఆఫ్రికా గా పరిగణిస్తారు. ఉత్తరాన సహారా ఎడారి దేశాలు, దక్షిణాన అడవులతో నిండిన ఇతర ఆఫ్రికా దేశాలకు మధ్య అటు పూర్తిగా ఎడారి కాకుండా, ఇటు పూర్తిగా పంటలు సమృద్ధిగా పండేందుకు వీలు లేకుండా ఉన్న ప్రాంతాన్ని సహేలి ప్రాంతం అంటారు. పశ్చిమాన సెనెగల్ నుండి తూర్పున సోమాలియా వరకు ఒక బెల్ట్ లాగా…

విస్తరిస్తున్న రష్యన్ ప్రైవేట్ మిలట్రీ కార్యకలాపాలు -2

అనధికారికంగానే అయినా రష్యన్ పి‌ఎం‌సి లు రష్యాకు చెందిన పలు వ్యూహాత్మక, ఆర్ధిక, రాజకీయ లక్ష్యాలను నెరవేరుస్తున్న సంగతి కాదనలేనిది. ఈ ప్రయోజనాలు: 1. విదేశీ విధానం:. పి‌ఎం‌సిల ద్వారా రష్యా ప్రభావం విస్తరిస్తోంది. ముఖ్యంగా భద్రతా రంగంలో. దానితో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలతో పాటు ప్రభుత్వేతర శక్తులతోనూ స్నేహ సంబంధాలు పెంపొందుతున్నాయి. 2. మిలట్రీ ప్రయోజనాలు: ప్రత్యేక బలగాల (స్పెషల్ ఫోర్సెస్) ద్వారా శిక్షణ పొందిన ప్రైవేటు బలగాలు ప్రత్యేకమైన నైపుణ్యం, సామర్ధ్యం కలిగి…

విస్తరిస్తున్న రష్యన్ ప్రైవేట్ మిలట్రీ కార్యకలాపాలు

“నువ్వు రాళ్ళు విసిరితే చుట్టూ గోడ కట్టుకుంటా…” అంటూ సాగుతుంది ఒక కొటేషన్. ఉక్రెయిన్ సంక్షోభం దరిమిలా, అమెరికా ప్రపంచాధిపత్యాన్ని ఎదుర్కొనే క్రమంలో రష్యా ఈ సూత్రాన్నే పాటించింది. అమెరికా విసిరిన వ్యూహాన్ని ప్రయోగించి తన వరకు గోడ కట్టుకోవడంతో పరిమితం కాకుండా తన సహాయం అర్ధించిన ఇతర దేశాలకు కూడా గోడలు కట్టి ఇస్తోంది రష్యా. పనిలో పనిగా తన ప్రభావాన్ని ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో సాపేక్షికంగా గణనీయంగా విస్తరించుకుంటోంది. 2014 వరకు…

కరోనా వైరస్ బయోవెపన్ కాదు -అమెరికా ఇంటలిజెన్స్

కరోనా వైరస్ ను చైనా ఉద్దేశ్యపూర్వకంగా తయారు చేసిన జీవాయుధం అని చెప్పడం పూర్తిగా అశాస్త్రీయం (unscientific) అని అమెరికాకు చెందిన 17 గూఢచార సంస్ధలు నిర్ధారించాయి. కరోనా వైరస్ జీవాయుధం అని చెప్పేందుకు తగిన శాస్త్రీయ ఆధారాలు లేవని, అటువంటి వాదనలు శాస్త్రీయ పరీక్షలకు నిలబడవని అమెరికా ఇంటలిజెన్స్ ఏజన్సీలు స్పష్టం చేశాయి. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు అమెరికా గూఢచార ఏజన్సీలు పరిశోధన చేసి నివేదిక సమర్పించాయి. సదరు నివేదిక సారాంశాన్ని గత…

ఫ్రాన్స్-బ్రిటన్ మధ్య తీవ్రమైన చేపల తగాదా: ఆకస్ పుణ్యం?

ఆస్ట్రేలియా, యూ‌కే, అమెరికాలు కలిసి ఇండో-పసిఫిక్ ప్రాంతం లక్ష్యంగా ‘ఆకస్’ కూటమి ఏర్పడిన నేపధ్యంలో ఫ్రెంచ్, బ్రిటిష్ దేశాల మధ్య చేపల వేట తగాదా మరింత తీవ్రం అయింది. డిసెంబర్ 31, 2020 నాటితో బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తయినప్పటి నుండి అడపా దడపా ఇరు దేశాల ఫిషింగ్ బోట్లు చేపల వేట హక్కుల విషయమై తగాదా పడుతూ వచ్చాయి. నేడు ఆ తగాదా ఫ్రెంచి ప్రభుత్వమే ప్రత్యక్ష చర్య తీసుకునే వరకూ వెళ్లింది. ఆకస్ ఏర్పాటు ఫలితంగా…