అవినీతికి హక్కు లేదా? -కార్టూన్

– “మా సొంత ఇంధనాన్ని ఉత్పత్తి చేసుకునే హక్కు కూడా మాకు లేదా?” – సమాచార హక్కును ప్రవేశ పెట్టిన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వమే ఆ చట్టానికి తూట్లు పెట్టే కృషిలో నిమగ్నం అయింది. సమాచార హక్కు చట్టం ప్రవేశపెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ తనను తాను అభినందించుకుంటుంది. ప్రజాస్వామ్య సూత్రాలకు తాను గొప్పగా కట్టుబడి ఉన్నానని చెప్పుకోడానికి ఆర్.టి.ఐ చట్టాన్ని ఆ పార్టీ తరచుగా ఉదహరిస్తుంది. కానీ ఆ చట్టం ద్వారా పాలకుల అవినీతి వెల్లడి అవుతుండేసరికి…

అయోధ్య రాజకీయం పట్ల వి.హెచ్.పిపై సాధువుల విమర్శలు

రామ మందిరం సమస్యను రాజకీయం చేయడం పట్ల విశ్వ హిందూ పరిషత్ పై అయోధ్య సాధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంప్రదాయ పద్ధతుల్లో ఇప్పటికే తామందరమూ కలిసి పరిక్రమను ఇప్పటికే పూర్తిచేయగా పరిక్రమ పేరుతో మళ్ళీ కొత్త కార్యక్రమం చేపట్టం రాజకీయ లబ్ది పొందేందుకేనని వారు తీవ్రంగా విమర్శించారు. పరిక్రమ యాత్ర అంటూ కరపత్రాలు పంచి ఇప్పుడేమో పరిక్రమ కాదు పధ యాత్ర అంటూ మాట మార్చడంపైన వారు విరుచుకుపడ్డారు. భారత దేశ హిందువులందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు…

ఈ ప్రాకృతిక జీవ సౌందర్యం చూసి తీరాలి -ఫోటోలు

అందంగా కనిపించడానికి మనుషులు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రకృతి సిద్ధంగా దొరికే పదార్ధాలతో అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న మనిషి క్రమ క్రమంగా వాటిని వదిలేసి కంపెనీలు తయారు చేసే సౌందర్య ఉత్పత్తులపై ఆధారపడడం ప్రారంభించారు. కార్పొరేట్ కంపెనీల ఉత్పత్తులు తాత్కాలిక అందాన్నిచ్చినా దానితో పాటు సరికొత్త అనారోగ్యాలను కూడా తెచ్చిపెడుతున్నాయి. నిజానికి మనిషి ప్రకృతితో కలిసి జీవిస్తూ ప్రకృతిని కాపాడుతూ బతికితే అతనికి/ఆమెకు మించిన అందం మరెక్కడా ఉండదేమో! ప్రకృతి ఒడిని వీడని జంతుజాలం,…

సిరియాపై దుస్సాహసానికి అమెరికా ఏర్పాట్లు?

ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియాల వరుసలో సిరియాను చేర్చడానికి అమెరికా ఏర్పాట్లు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా రక్షణ కార్యదర్శి చక్ హెగెల్ (మన మంత్రితో సమానం) చెబుతున్న మాటలు నిజమే అయితే సిరియాపై దాడి చేయడానికి అమెరికా తన యుద్ధ నౌకలను సిద్ధం చేస్తోంది. మధ్యధరా సముద్రంలో అమెరికా మోహరించిన నాలుగు యుద్ధ నౌకలు సిరియా జలాలకు సమీపంలోకి తరలిస్తున్నట్లు పత్రికల ద్వారా తెలుస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా రెండు రోజుల క్రితం చెప్పిన మాటలను…

రూపాయి-పార్లమెంటు: పతనం దేనిది? -కార్టూన్

నాయకుడు: అది పార్లమెంటే! సామాన్యుడు: కాదది రూపాయే! ఒక పక్క రూపాయి విలువ పతనం అవుతుండగా ఆర్ధిక వ్యవస్ధ తీరుతెన్నులను చర్చించి సవరించవలసిన చట్ట సభల సభ్యులు మాత్రం సంకుచిత రాజకీయ ప్రయోజనాలే పరమార్ధంగా రకరకాల సర్కస్ ఫీట్లు సాగిస్తున్నారు. ‘ఆహార భద్రతా బిల్లు,’ ‘ఇన్సూరెన్స్ ఎఫ్.డి.ఐ బిల్లు,’ తదితర ప్రజా వ్యతిరేక బిల్లులకు ఆమోదం పొందడానికి పాలక పక్షం చిత్రవిచిత్రమైన ఎత్తుగడలు వేస్తుండగా, పాలక పక్షం పరువు తీసి వీలైనన్ని ఓట్ల మార్కులు తమ ఖాతాలో…

మహిళా పోలీసుకే ధైర్యం లేకపోతే నాకెలా ఉంటుంది –ఫోటో జర్నలిస్టు

(ముంబై ఫోటో జర్నలిస్టుపై జరిగిన సామూహిక అత్యాచారం పట్ల టైమ్స్ ఆఫ్ ఇండియా ఫోటో జర్నలిస్టు ఉమా కదం స్పందన ఇది. ది హిందు పత్రిక దీనిని ప్రచురించింది. ఉమా కదం గత 13 యేళ్లుగా టైమ్స్ గ్రూపులోని వివిధ పత్రికలకు ఫోటో జర్నలిస్టుగా పని చేస్తున్నారు.) నేను ఫోటో జర్నలిస్టుగా నా కెరీర్ ని 2001లో ప్రారంభించాను. అప్పట్లో నగరంలో ఉన్న అతి కొద్దిమంది మహిళా ఫోటోగ్రాఫర్లలో నేను ఒకరిని. మొదటి రెండు లేదా మూడు…

సొంత కరెన్సీల్లో ఇండియా-ఇరాక్ వ్యాపారం

ఇండియా, ఇరాక్ దేశాలు తమ సొంత కరెన్సీల్లో ద్వైపాక్షిక వ్యాపారం సాగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ చెబుతున్నారు. ఇరాక్ ప్రధాని నౌరి కమిల్ ఆల్-మాలికి ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న నేపధ్యంలో ఆనంద్ శర్మ ఈ విషయాన్ని తెలిపారు. అంతర్జాతీయ కరెన్సీకి బదులుగా సొంత కరెన్సీలలో వ్యాపారం చేసినట్లయితే ఆ మేరకు విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచుకునే భారం ఇరు దేశాలకు తగ్గుతుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పడిపోతూ, కరెంటు…

అదే ఘోరం, అదే క్రూరత్వం, ఈసారి ముంబై

డిసెంబరు 16 నాటి ఢిల్లీ అత్యాచారం విషయంలో నిందితులపై ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేగంగా పని చేస్తున్నాయో లేదో గానీ అత్యాచారాల వేగం మాత్రం కొనసాగుతూనే ఉంది. దాదాపు ఢిల్లీ బస్సు అత్యాచారం తరహాలోనే ఒక ఫోటో జర్నలిస్టు యువతి పైన ఐదుగురు మృగాళ్ళు పైశాచిక రీతిలో అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ సంఘటనలో కూడా యువతి బాయ్ ఫ్రెండ్ ని దుండగులు తీవ్రంగా కొట్టారు. బాధితురాలి శరీరంలో అంతర్గతంగా తీవ్ర గాయాలు…

ఫైళ్ళు ఇక్కడితో మాయం అవుతాయి -కార్టూన్

కేశవ్ కుంచె నుండి రూపు దిద్దుకున్న మరో ఆణిముత్యం ఈ కార్టూన్. తొమ్మిదేళ్ల ప్రధాన మంత్రి ఈ కార్టూన్ చూస్తే సిగ్గుతో చితికిపోవాలి! “The buck stops here” అనేది ఆంగ్లంలో ఓ సామెత లాంటిది. బాధ్యత మోయాల్సి వచ్చినప్పుడు పక్కవాడి మీదికి నెట్టివేయడం మామూలుగా జరుగుతుంటుంది. ‘అలా పక్కవాడి మీదకు నేను తోసివేయను. నేనే స్వీకరిస్తాను’ అని ఈ వాక్యం చెబుతున్నవారు చెబుతున్నట్లు దీని అర్ధం. అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్.ట్రూమన్ బల్ల మీద ఈ…

చైనాకు పోటీగా కాశ్మీరులో భారత్ బలప్రదర్శన

చైనా సైనికులు మరొకసారి దౌలత్ బేగ్ ఓల్డి సెక్టార్ (డి.బి.ఓ సెక్టార్) లో చొచ్చుకు వచ్చారన్న వార్తల నేపధ్యంలో భారత ప్రభుత్వం చైనాకు గట్టి సంకేతాలు ఇవ్వాలని నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది. పాక్ యుద్ధంలో వాడి వదిలేసిన విమాన కేంద్రాన్ని తిరిగి వినియోగంలోకి తేవడమే కాకుండా మంగళవారం సైనికులను పెద్ద మొత్తంలో చేరవేసే సైనిక వాహక విమానాన్ని అక్కడ దించింది (touch down). వాస్తవాధీన రేఖ (Line of Actual Control)కు సమీపంలో చైనా సైనికులు చొరబడ్డారని చెబుతున్న…

పాత పేపర్ కాదయ్యా బాబూ! -కార్టూన్

“నేను మీకు పాత పేపర్ ఏమీ అమ్మలేదు. కావాలంటే తేదీ చెక్ చేసుకోండి!” – సాధారణంగా వార్తా పత్రికలు ఒక వార్తను తామే ముందు ఇవ్వడానికి పోటీ పడుతుంటాయి. ఫలానా వార్త మేమే ముందు ఇచ్చాం అని కొన్నిసార్లు చెప్పుకుంటుంటాయి. తద్వారా వేగంగా వార్తలు అందించే యంత్రాంగం తమ వద్ద ఉన్నదని చెప్పుకుని సర్క్యులేషన్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తాయి. కానీ ఈ మధ్య కాలంలో పత్రికలకు అలాంటి అవకాశం లేకుండా పోతోంది. ఫ్రంట్ పేజీ వార్తలన్నీ చద్ది వార్తలుగానే…

అసరం బాపు అసలు రూపు ఇదీ!

అసరం బాపు గుర్తున్నాడా? గత డిసెంబర్ నెలలో నిర్భయపై అత్యాచారం జరిగిన తర్వాత వెల్లువెత్తుతున్న నిరసనల మధ్య నోరు పారేసుకున్న బాబా!. అత్యాచారంలో నిర్భయ తప్పు కూడా ఉన్నదనీ, తనపై లైంగిక దాడి చేసినవారిని ఆమె ‘అన్నా, తమ్ముడూ’ అని వేడుకుని ఉంటే వారాపనికి దిగి ఉండేవారు కాదనీ, ఆ విధంగా ఆమె గౌరవం (ఆయన ఉద్దేశ్యం శీలం అని) కాపాడబడి ఉండేదనీ కూసిన మహా ‘పురుషుడు’! అంతటితో ఆగాడా? “రెండు చేతులు కలవకుండా శబ్దం రాదు…

‘తీవ్ర’ ప్రమాద స్ధాయిలో ఫుకుషిమా రేడియేషన్ లీకేజి

జపాన్ ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద రేడియేషన్ కలుషిత నీటి లీకేజి ‘తీవ్ర’ (serious) స్ధాయికి చేరిందని జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఒక లీటర్ నీటిలో రేడియేషన్ కు సాధారణ అనుమతి స్ధాయి 150 బెక్యూరల్స్ కాగా ఫుకుషిమా వద్ద లీటర్ నీటిలో 30 మిలియన్ బెక్యూరల్స్ రేడియేషన్ తో కలుషితం అయిన నీరు నిరంతరం లీక్ అవుతూ సముద్రంలో కలుస్తోంది. అంతర్జాతీయ రేడియేషన్ ప్రమాద స్కేలు పైన దీని తీవ్రతను 3 కు జపాన్ ప్రభుత్వం…

వెళ్ళి ఫైళ్ళు తవ్వుకు రండి, ఫోండి! -కార్టూన్

దాదాపు 80,000 కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం వికారమైన మలుపు తీసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కుంభకోణాన్ని విచారిస్తున్న సి.బి.ఐకి అవసరమైన ఫైళ్ళు బొగ్గు శాఖ ఇవ్వనే లేదు. ఈ విషయాన్ని సి.బి.ఐ కోర్టుకి ఫిర్యాదు చేస్తే కోర్టు తీసిన ఆరాలో ప్రభుత్వంగా చల్లగా చెప్పిన సంగతి ఏమిటంటే సంబంధిత ఫైళ్ళు కనపడడం లేదట. ఆగ్రహించిన సుప్రీం కోర్టు ఈ విషయంపైన అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. మూడు రోజుల క్రితమే ఈ అఫిడవిట్ సమర్పించగా అందులో…

పతనం: రూపాయి vis-à-vis ఉపగ్రహం -కార్టూన్

– ఈ లోపు, మరో శాటిలైట్ లంచ్ వెహికల్: – ఒక వార్త: సోమవారం ఏకంగా 148 పైసలు పతనమై డాలర్ తో మారకపు విలువ 63 రూపాయల మార్కు దాటిన రూపాయి విలువ మంగళవారం మరో కొత్త పతన స్ధాయిని నమోదు చేసింది. నిన్న 63.13 రు.ల వద్ద ముగిసిన రూపాయి విలువ ఈ రోజు ట్రేడింగ్ ఎత్తుకోవడంతోనే 63.75 రు.ల వద్ద ఎత్తుకుంది. ట్రేడింగ్ కొనసాగే కొద్దీ అదింకా పతనమై డాలర్ ఒక్కింటికి రు.…