యూరో జోన్ ఆర్ధిక వ్యవస్ధ పైకి తేలిందా? -కార్టూన్

యూరోజోన్ ఎక్స్ ప్రెస్: గాస్ప్! (ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న శబ్దం) పీతలు: “పాపం! వాళ్లింకా ఒడ్డున పడనేలేదు” – ఐరోపా ఖండంలోని 28 దేశాలు కలిసి యూరోపియన్ యూనియన్ (ఇ.యు) గా ఏర్పడగా అందులోని 17 దేశాలను యూరో జోన్ అని పిలుస్తారు. ఈ 17 దేశాలు తమ తమ జాతీయ కరెన్సీలను వదిలేసుకుని ఒకే కరెన్సీ ‘యూరో’ ఏర్పాటు చేసుకున్నాయి. యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) తప్ప మిగిలిన ప్రధాన దేశాలన్నీ యూరోజోన్ సభ్య దేశాలే.…

ఉపాధి హామీ పధకం ఛారిటీ, దాన్ని ఆపాలి -మోడి

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి తాను కప్పుకున్న ఒక్కో ముసుగూ విప్పి పారేస్తున్నారు. తాను వ్యాపారులు, కంపెనీల పక్షమే కానీ ప్రజల పక్షం కాదని చక్కగా చెప్పుకుంటున్నారు. తన గురించి పట్టించుకోవాల్సిన అంశం మతోన్మాదం కాదనీ, తన పక్కా ప్రజా వ్యతిరేక విధానాలే అనీ జనానికి గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ‘మహాత్మాగాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం’ ఛారిటీ పధకం అనీ, ఓట్ల కోసం ఉద్దేశించిన అలాంటి పధకాలు తనకు ఇష్టం లేదనీ…

అమెరికాకు తలొగ్గిన అలీన నెహ్రూ -కత్తిరింపు

భారత పత్రికల్లో చాలా అరుదుగా కనిపించే వార్త ఇది. తెలుగు పత్రికల్లో ఇలాంటి వార్త రావడం ఆశ్చర్యమే. నిజానికి దీనిని వార్త అనడం కంటే చరిత్ర అనడం సముచితం. ఇంకా చెప్పాలంటే వాస్తవ చరిత్ర అనడం ఇంకా సముచితం. అలీన దేశాల కూటమి ఏర్పాటు చేయడంలో మన ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేసిన కృషి మామూలుది కాదు. అలాంటి నెహ్రూ చైనా దాడితో ఎటూ పాలుపోక అమెరికా శరణు జొచ్చాడని ఈ ‘వాస్తవ చరిత్ర’…

రూపాయి: చేతకాకపోతే సరి! -కార్టూన్

“ఏం భయపడొద్దు. అది మరింత జారిపోకుండా ఎక్కడో ఒకచోట ఆగి తీరాల్సిందే!” – “రూపాయిన పతనం కానివ్వం.”అడిగినప్పుడల్లా ప్రధాని, ఆర్ధిక మంత్రులు చెప్పే మాట ఇది. ఒక పక్క పతనం అవుతూనే ఉంటుంది. వీళ్ళేమో మీడియా సెంటర్లో కూర్చుని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతుంటారు. అదేమని అడిగితే “ఇక్కడ అంతా బాగానే ఉంది. విదేశాల్లో పరిస్ధితుల్ని మనం నియంత్రించలేము కదా?” అని చిలక పలుకులు పలుకుతున్నారు. అసలు విదేశాల్లో పరిస్ధితి బాగోలేకపోతే ఆ ప్రభావం మనమీద ఎందుకు…

భారత స్టాక్ మార్కెట్లలో రక్తపాతం

శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లు 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభాన్ని తలపించాయి. అమెరికాలో ఆశావాహ పరిస్ధితులు నెలకొన్నాయని భావించిన అంతర్జాతీయ మదుపరులు భారత స్టాక్ మార్కెట్ల నుండి, రూపాయి నుండి తమ సొమ్ము ఉపసంహరించుకుని డాలర్ల కోసం ఉరుకులు పరుగులు పెట్టడంతో రూపాయి ఢమాల్ మని కూలిపోయింది. రూపాయితో పాటు స్టాక్ సూచీలు కూడా ఒక్కుమ్మడిగా కూలిపోయాయి. మార్కెట్ల పతనాన్ని పత్రికలు రక్తపాతంతో పోల్చుతున్నాయి. ఈ ఒక్కరోజే 2 లక్షల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ ను…

జలాంతర్గామి పేలుడు: గుర్తుపట్టలేని స్ధితిలో శవాలు

ముంబై డాక్ యార్డ్ లో అనూహ్య కారణాలతో పేలిపోయి మునిగిపోయిన ‘ఐ.ఎన్.ఎస్ సింధూరక్షక్’ జలాంతర్గామి నుండి నాలుగు శవాలను వెలికి తీశారు. ఈ శవాలు గుర్తు పట్టలేని స్ధితిలో ఉన్నాయని తెలుస్తోంది. మంటల్లో పూర్తిగా కాలిపోవడంతో డి.ఎన్.ఏ శాంపిల్ సహాయంతో గుర్తుపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జలాంతర్గామిలో సజీవులుగా ఎవరైనా మిగిలి ఉండే అవకాశాలు పూర్తిగా అడుగుంటాయని అధికారులు చెబుతున్నారు. నేవీ చీఫ్ అడ్మిరల్ డి.కె.జోషి మాత్రం అద్భుతం జరిగే అవకాశం లేకపోలేదని జలాంతర్గామి లోపల గాలి గదుల్లో…

ఈజిప్టులో మళ్ళీ ఎమర్జెన్సీ, రక్తం పారిస్తున్న మిలట్రీ

ఈజిప్టు మళ్ళీ రక్తం ఓడుతోంది. వదిలిందనుకున్న మిలట్రీ పిశాచం మళ్ళీ ఆ దేశాన్ని పట్టి పీడిస్తోంది. రెండేళ్ల క్రితం 2011లో సంభవించిన ప్రజా తిరుగుబాటులో హోస్ని ముబారక్ పదవీచ్యుతుడయిన సంగతి తెలిసిందే. దరిమిలా అధికార పగ్గాలను తాత్కాలికంగా కోల్పోయిన ఈజిప్టు మిలట్రీ, ప్రజాస్వామిక ఎన్నికల్లో అధ్యక్ష పదవి చేపట్టిన ముస్లిం బ్రదర్ హుడ్ నేత మహమ్మద్ మోర్శి ని గత జులై మొదటివారంలో కుట్ర చేసి కూల్చివేసింది. మోర్శికి మళ్ళీ అధికారం అప్పజెప్పాలని దేశవ్యాపితంగా బైఠాయింపులు, ప్రదర్శనలతో…

ముంబై: జలాంతర్గామి పేలుడు, మునక -18 మంది మరణం?

భారత నౌకాదళం బుధవారం తెల్లవారు ఝాము భారీ మూల్యం చెల్లించింది. సంప్రదాయక సబ్ మెరైన్ లో పేలుడు సంభవించి ముంబై డాక్ యార్డ్ లో మునిగిపోవడంతో 18 మంది నావికాదళ సభ్యులు చనిపోయినట్లు భావిస్తున్నారు. చనిపోయినవారిలో ముగ్గురు ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ‘సింధూరక్షక్’ అనే పేరుగల ఈ జలాంతర్గామును రష్యా సరఫరా చేసింది. కిలో క్లాస్ యుద్ధనౌకగా భావించే ఈ జలాంతర్గామి భారత నౌకాదళంలో ఒక ముఖ్య భాగం అని తెలుస్తోంది. ఇప్పటికే వివిధ కారణాల వలన…

సరిహద్దులో పాక్ దాగుడుమూతలు! -కార్టూన్

సరిహద్దులో పాకిస్ధాన్ ‘కాల్పుల విరమణ’ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తోందని పత్రికలు, ఛానెళ్లు కొద్ది రోజులుగా చెబుతున్నాయి. దేశంలో పరిస్ధితి తమకు అనుకూలంగా లేనప్పుడు, పార్లమెంటులో ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమైన బిల్లులు ప్రవేశపెట్టి, ప్రతిపక్షాలు నిరసనల రూపంలో ఇచ్చే పరోక్ష మద్దతుతో మూజువాణి ఓటుతో ఆమోదించాలనుకున్నపుడు సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు తలెత్తడం మామూలు విషయమే. ఈ ఎత్తుగడల్లో సైనికుల ప్రాణాలు ఉట్టిపుణ్యానికి హరీమన్నా పాలక పెద్దలకు లెక్కా, జమా ఉండవు. ప్రస్తుతం తలెత్తిన ఉద్రిక్తతలు కూడా ఆదేకోవలోనివే…

ఎక్కడున్నావే గొంగళీ అంటే… -కార్టూన్

అద్భుతమైన కార్టూన్ ఇది! మన్మోహన్ సింగ్ అనుసరించిన నూతన ఆర్ధిక విధానాల డొల్లతనాన్ని ఈ కార్టూన్ శక్తివంతంగా వివరిస్తోంది. డంకేల్ ఒప్పందాన్ని అంగీకరించడం తప్ప మరో దారి లేదని చెప్పి డబ్ల్యూ.టి.ఓ ఉరుగ్వే రౌండ్ చర్చలను భారత దేశ ప్రజల నెత్తిన ‘నూతన ఆర్ధిక విధానాలు’గా రుద్దిన మన్మోహన్ తిరిగి బయలుదేరిన చోటికే చేరడం యాదృచ్ఛికం ఎంతమాత్రం కాదు. ఆ విధానాల తీరే అంత. ఏ విధానాలైనా ప్రజల కొనుగోలు శక్తిని స్ధిరంగా పెంచగలిగితేనే కంపెనీలకి లాభాలూ,…

కొండలే రగిలే వడగాలి… … -ఫోటోలు

అమెరికాలో ఈ మధ్య దావనలాలు ఎక్కువైనాయి. మే మొదటివారంలో లాస్ ఏంజిలిస్ సమీపంలో భారీ దావానలంతో పోరాడి అదుపులోకి తెచ్చిన అమెరికన్ అగ్నిమాపక దళం ఈసారి ఆ నగరానికి 140 కి.మీ దూరంలోని రివర్ సైడ్ కౌంటీ వద్ద మరో భారీ దావానలంతో తలపడుతున్నారు. ‘సిల్వర్ ఫైర్’ గా పిలుస్తున్న ఈ దావానలాన్ని అదుపు చేయడానికి దాదాపు 1500 మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. ఆగస్టు 7 తేదీన మొదలయిన మంటలు ఇక్కడి కొండాల్ని ఆసాంతం రగిలిస్తున్నాయి.…

ఐ.ఎ.ఎస్ లను తంతే…..?–కార్టూన్

ఏం జరుగుతుందో తెలియడానికి ఇంతకు మించి వివరంగా బహుశా ఎవరూ చెప్పలేరేమో! ఐ.ఎ.ఎస్ లను ‘అయ్యా, ఎస్’ లు అని ఆంధ్ర ప్రదేశ్ జనం చెప్పుకుంటారు. వారు అలా ‘అయ్యా, ఎస్’ అని ఎందుకు అనవలసి వస్తోందో ఉత్తర ప్రదేశ్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ ఉదాహరణ స్పష్టం చేస్తోంది. అధికారులకు కూడా స్పష్టమైన రూల్స్ ని ప్రభుత్వ గ్రంధాల్లో నిర్దేశించి ఉంచారు. కానీ రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, కంపెనీల స్వార్ధ ప్రయోజనాల కోసం వీటిని నీరుగార్చడం లోనే…

పార్లమెంటు పొయ్యిపై ఆహార బిల్లు వంటకం -కార్టూన్

కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రతా బిల్లుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. దాదాపు రెండు సంవత్సరాల నుండీ ఈ బిల్లు గురించి చెబుతూ వచ్చిన కాంగ్రెస్ నిరసనల హోరు మధ్య నిన్ననే పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ఈ నిరసనలు ఆహార భద్రతా బిల్లుపై కాకుండా వేరే అంశాలపైన కావడం గమనార్హం. కొంతమంది తెలంగాణ వద్దని నినాదాలు చేస్తుంటే, మరి కొంతమంది కాశ్మీరులో జవాన్ల హత్యలపై ఆందోళన చేస్తుండగా ఈ బిల్లుని హడావుడిగా ప్రవేశపెట్టారు. విచిత్రం ఏమిటంటే ఇలాంటి తొందర…

పైపైకి దూసుకు పోతున్న దాడులు, చొరబాట్లు -కార్టూన్

“అబ్బో!” “అబ్బే, అక్కడ సంతోషించడానికేమీ లేదులెండి. మన సరిహద్దులో పెరుగుతున్న దాడులు, చొరబాట్లను చూపించే గ్రాఫ్ అది!” – ఇటీవలి కాలంలో కాశ్మీరులో భద్రతా బలగాలపై దాడులు పెరిగాయి. చొరబాట్లు కూడా పెరిగాయని పత్రికలు చెబుతున్నాయి. ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైనికుల ఉపసంహరణ గడువు (డిసెంబర్ 2014) దగ్గర పడేకొద్దీ కాశ్మీరు లోనూ, సరిహద్దు లోనూ దాడులు పెరగడం గమనార్హం. గడువు సమీపిస్తున్న దృష్ట్యా తాలిబాన్ తో చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకోడానికి అమెరికా నానా తంటాలు…

ఫుకుషిమా డ్రైనేజి నీటిలో ప్రమాదకర రేడియేషన్ -కంపెనీ

ఫుకుషిమా అణు కర్మాగారం చల్లబరచడానికి నిర్మించిన డ్రైనేజి వ్యవస్ధ మొత్తం తీవ్రస్ధాయి రేడియేషన్ తో కూడిన నీటితో నిండిపోయిందని కర్మాగారాన్ని నిర్వహిస్తున్న ‘టోక్యో ఎలక్ట్రికల్ పవర్ కంపెనీ’ (టెప్కో) ప్రకటించింది. డ్రైనేజీలో ఇప్పుడు 20,000 టన్నుల నీరు నిలవ ఉన్నదనీ ఇందులో అణు ధార్మికత అత్యంత ప్రమాద స్ధాయిలో ఉన్నదని కంపెనీ తెలిపింది. భూమి అడుగున నిర్మించిన పైపుల్లో ఉన్న ఒక లీటర్ నీటిలో 2.35 బిలియన్ బెక్యూరల్స్ పరిమాణంలో సీసియం రేడియేషన్ (అణు ధార్మికత) ఉన్నట్లు…