తెలంగాణ షో -కార్టూన్

కాంగ్రెస్ పార్టీ ఎలాగో ధైర్యం చేసి తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆ పార్టీని ఎక్కడ ముంచి ఎక్కడ తేల్చనున్నదో తెలియని పరిస్ధితి. అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటామని చెప్పిన పెద్ద మనుషులంతా ఆ మాట తీసి గట్టున పెట్టి తలో దారి పడుతున్నారు. సీమాంధ్ర జనం కోసం రాజీనామాలు నటించలేక అలాగని పార్టీలో కొనసాగుతూ ప్రజల ఆగ్రహానికి నిలవలేక ఆపసోపాలు పడుతున్నారు. తెలంగాణ మ్యాజిక్ ద్వారా ‘anti-incumbency’ ఫ్యాక్టర్ ని ఎదుర్కోవచ్చని కాంగ్రెస్ భావించిన…

పిట్ట కధ: తెలంగాణ – నదిలో దుప్పటి

విజయనగరంలో ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులు జారీ అయ్యాయని ది హిందు పత్రిక ఒక వార్త ప్రచురించింది. ఆ వార్త కింద సయ్యద్ మునిరుద్దీన్ అనే ఒక పాఠకుడు వ్యాఖ్యానంగా ఈ కింది పిట్టకధ రాశారు. ఈ పిట్టకధని ఆయన చిన్నప్పుడు విన్నారట. తెలంగాణ-సమైక్యాంధ్ర ఉద్యమాలను చూసి తనకా కధ గుర్తుకొస్తోంది అని చెబుతూ రాశారు. చాలా తమాషాగా ఉంది చదవండి! అనగనగా ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారు ఒక రోజు ఒక నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నారు.…

విజయనగరంలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కేంద్ర కేబినెట్, నోట్ ఆమోదించడానికి నిరసనగా విజయ నగరం అట్టుడుకుతోంది. ఏ.పి.ఎన్.జి.ఓ సంఘం ఇచ్చిన 48 గంటల బంద్ పిలుపు ముగిసినప్పటికీ మూడో రోజు కూడా అక్కడ ప్రజలు ఆగ్రహంతో వీధులకెక్కారు. కర్ఫ్యూ ప్రకటించినప్పటికి పరిస్ధితి అదుపులోకి రాకపోవడంతో ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులు జారీ అయినట్లు ది హిందు తెలిపింది. ప్రజల ఆగ్రహం ప్రధానంగా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణపై కేంద్రీకృతం అయింది. పి.సి.సి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోనియా…

డిప్రెషన్ బాధితురాలిని కాల్చి చంపిన అమెరికా పోలీసులు -ఫోటోలు

ఆమె డిప్రెషన్ బాధితురాలు. సంవత్సరంన్నర వయసు పాపకు తల్లి. డెంటల్ హైజీన్ నిపుణురాలు. బాలింతలకు వచ్చే డిప్రెషన్ తో బాధపడుతోంది. డిప్రెషన్ వల్లనే యేమో అక్టోబర్ 3 తేదీన వాషింగ్టన్ కేపిటల్ హిల్ ఏరియాలో వేగంగా కారు నడుపుతోంది. అధ్యక్ష భవనం దరిదాపుల్లో ఇలా ఓ కారు వేగంగా వెళ్ళడంతో పోలీసుల అప్రమత్తం అయ్యారు. ఒక పోలీసు కారును పక్కకు మళ్లించి ఆపాలని కోరాడు. ఆమె ఆగలేదు. ఇక మొదలైంది వేట. పోలీసులు వీరావతారం ఎత్తారు. కారును…

తెలంగాణ: 10 మంది మంత్రుల కమిటీ, నెలన్నర గడువు

  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 10 మంది కేంద్ర మంత్రులతో ‘మంత్రుల కమిటీ’ ని ఏర్పాటు చేయనున్నట్లు హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ఆర్ధిక, న్యాయ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రులతో పాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. సరిహద్దుల నిర్ణయం, ఆస్తులు-అప్పుల పంపకం, నీటి పంపకం తదితర అంశాలను ఈ కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి తగిన సూచనలు, సిఫారసులు చేయాలి. ఆరు వారాల గడువులో…

ఒబామా కేర్ – అమెరికా మూసివేత -కార్టూన్

అక్టోబర్ 1 తేదీ నుండి అమెరికా ప్రభుత్వం పని చేయడం లేదు. బారక్ ఒబామా ప్రభుత్వం 2010లో ఆమోదించిన ఆరోగ్య భద్రతా చట్టం అమలు మరో సంవత్సరం వాయిదా వేయాలని ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ పట్టుబడుతోంది. దానికి పాలక డెమోక్రటిక్ పార్టీ ససేమిరా అంటోంది. అమెరికా ఆరోగ్య రంగానికి ఆక్సిజన్ అందకుండా అడ్డం పడుతూ తాను మాత్రం అన్ని సౌకర్యాలు అనుభవిస్తోందని రిపబ్లికన్ పార్టీని ఈ కార్టూన్ విమర్శిస్తోంది. చట్టం అమలు వాయిదా వేయడం గానీ లేదా…

కేబినెట్ ఆమోదంతో తెలంగాణ ప్రక్రియ ప్రారంభం

ఎట్టకేలకు తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. గురువారం సాయంత్రం సమావేశమయిన కేంద్ర కేబినెట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై హోమ్ మంత్రి ప్రవేశ పెట్టిన నోట్ ను తీర్మానంగా ఆమోదించింది. టి.వి ఛానెళ్లు చెబుతున్నదాని ప్రకారం సి.డబ్ల్యూ.సి తీర్మానాన్ని కేబినెట్ యధాతధంగా ఆమోదించింది. హైద్రాబాద్ 10 యేళ్లపాటు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. కొత్త రాజధాని ఎక్కడన్నదీ కేబినెట్ నియమించే మంత్రుల బృందం నిర్ణయిస్తుందని హోమ్ మంత్రి సుశీల్ కుమార్…

కొత్త బట్టలు కాదు, కొత్త రాజునే నేయగల నేర్పరులు! -కార్టూన్

కొత్త బట్టలా? కాదులే – ఇది మన కొత్త మహారాజు గారిని తయారు చేయడానికి… – మహారాజు గారి కొత్త బట్టల కధ అందరికీ తెలిసిందే. తమ పదవులకు, హోదాకు తగని వ్యక్తులకు తప్ప అందరికీ కనిపించే బట్టలు నేసి తెస్తామన్న నేతగాళ్ల చేతిలో రాజు, మంత్రి, వారి పరివారం అంతా ఫూల్స్ అయిన కధను కార్టూనిస్టు జ్ఞప్తికి తెస్తున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ నేతలు నేస్తున్నది యువరాజు వారి కొత్త బట్టలను కాదు. పాత మహారాజు…

ఆకలికి నకనకలాడుతున్నవారు 84 కోట్లు -ఐరాస

తీవ్ర ఆకలితో (chronic hunger) అలమటిస్తున్నవారు ప్రపంచంలో 84.2 కోట్లమందని ఐరాస ప్రకటించిన నివేదిక ఒకటి తెలిపింది. 2010-12 కాలంలో ఈ సంఖ్య 86.8 కోట్లని, 2011-13 కాలంలో అది 2.6 కోట్లు తగ్గిందని సదరు నివేదిక తెలిపింది. కాగా అభివృద్ధి చెందిన దేశాల్లో తీవ్రంగా ఆకలిగొన్నవారు 1.57 కోట్లమంది ఉండడం గమనార్హం. ‘ప్రపంచంలో ఆహార అబధ్రత పరిస్ధితి’ అన్న నివేదికలో ఐరాస ఈ అంశాలను తెలియజేసింది. ఐరాసలోని ఆహార విభాగం ఎఫ్.ఎ.ఓ (Food and Agricultural…

కీన్యా మారణకాండ: సైన్యమే మాల్ ని కూల్చేసిందా?

కీన్యా రాజధాని నైరోబిలో జరిగిన మారణకాండలో వాస్తవాలేమిటో చెప్పడానికి కీన్యా ప్రభుత్వం ఇంతవరకు ముందుకు రాలేదు. సోమాలియా నుండి వచ్చిన ఆల్-షబాబ్ టెర్రరిస్టులు ఈ దురాగతానికి పాల్పడ్డారని, పిరికిపందలను తరిమికొట్టామని ఆర్భాటంగా ప్రకటనలు ఇవ్వడం తప్ప దాడి ఎలా జరిగింది, అసలు మాల్ ఎందుకు, ఎలా కూలిపోయిందీ చెప్పడం లేదు. పేలుళ్ళ వేడికి భవనం బలహీనపడి కూలిపోయిందని కీన్యా ప్రభుత్వం చెబుతుండగా ఆల్-షబాబ్ ఇందుకు విరుద్ధంగా ప్రకటించింది. తమ సభ్యుల నుండి మాల్ ను విముక్తి చేయలేక…

గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలు తాగి మనిషి… -కార్టూన్

– ఏమైందీ, తొక్కిసలాటా? కాదు – చట్టం తనపని తాను చేసుకుపోయింది లేండి! – పాలక పక్షం, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా అంతా కట్ట గట్టుకుని 17 యేళ్ళ నాడు మేసిన గడ్డి ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ సౌధాన్ని కూల్చేసే పెను భూతమై నిలిచింది. నితీశ్ కుమార్ (జెడి-యు), బి.జె.పి ల విడాకుల నుండి లబ్ది పొందాలని భావించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆశలు ప్రత్యేక సి.బి.ఐ కోర్టు తీర్పుతో ఒక్కసారిగా అవిరయ్యాయి. కోర్టు…

పనిపిల్లను పెంపుడు కుక్కలతో కరిపించిన దుర్మార్గం!

జీవజాలంలో అత్యంత అభివృద్ధి చెందిన జాతి మనిషి. కానీ మనుషుల్లో ‘మనిషితనం’ చిక్కనవడానికి బదులు జంతు ప్రవృత్తి పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. ఢిల్లీలో వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తే మనిషి ‘నిజంగా నాగరీకుడేనా’ అన్న అనుమానం కలక్క మానదు. పని చేయించుకోడానికని ఇంటిలో ఉంచుకున్న మైనర్ బాలికను పెంపుడు కుక్కలతో ఒళ్ళంతా కరిపించిన దుర్మార్గులని ఏమనాలి? వారిని జంతువులతో కూడా పోల్చడానికి మనసొప్పడం లేదు. జంతువు, జంతువు కాబట్టి జంతువులానే ప్రవర్తిస్తుంది. కానీ మనిషిలా ప్రవర్తించలేని మనుషుల్ని జంతువుతో…

సి.ఆర్.ఆర్, రెపో, రివర్స్ రెపో రేట్లు అంటే?

ప్రశ్న: రెపో  రేటు, రివర్స్ రెపో రేటు గురించి వివరించగలరా? జవాబు: ఈ ప్రశ్నకు సమాధానం వివిధ సందర్భాల్లో వివరించాను. కానీ అలాంటి సందర్భం మళ్ళీ వస్తే గుర్తు తెచ్చుకోడానికి పాఠకులకు ఇబ్బంది ఉన్నట్లు కనిపిస్తోంది. బహుశా వివరణలో కాకుండా, టపాలోనే ఈ పేర్లు ఉన్నట్లయితే వెతుక్కోడానికి కొంత సులభంగా ఉండవచ్చని మళ్ళీ వివరిస్తున్నాను. గతంలో ఇచ్చిన వివరణను విస్తృతం చేస్తున్నాను. రిజర్వ్ బ్యాంకు నియంత్రణలో ఉండే వడ్డీ రేట్లను దేశంలో ద్రవ్య చలామణిని అదుపులో ఉంచడానికి…

అమెరికా, ఇటలీ రాజకీయ సంక్షోభం; ఇండియా షేర్లు పతనం

‘ఎంకి చావు, సుబ్బు చావుకొచ్చింది’ అని కొత్త సామెత రాసుకోవాలి. అంతర్జాతీయంగా పెట్టుబడుల ప్రవాహాలకు గేట్లు తెరిచిన ‘ప్రపంచీకరణ’ విధానాలు ఆర్ధిక వ్యవస్ధలను అతలాకుతలం చేయగల శక్తిని సంతరించుకోగా, పులిని చూసి వాతలు పెట్టుకున్న నక్కల్లాగా షేర్ల వ్యాపారంలో అదృష్టం పరీక్షించుకుంటున్న మధ్యతరగతి జనం చివరకు దురదృష్ట జాతకులై తేలుతున్నారు. లేకపోతే అమెరికాలో రిపబ్లికన్-డెమోక్రటిక్ పార్టీల సిగపట్లు, ఇటలీలో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న అవినీతి సామ్రాట్లు ఇండియా షేర్ మార్కెట్లను కుదేయడం ఏమిటి? సోమవారం బి.ఎస్.ఇ సెన్సెక్స్…

మన్మోహన్: రాహుల్ గాంధీ బరువు తూచే యంత్రం?

అధికారం, హోదా అన్నీ ఉన్నా కూడా ఏమీ చేయని/చేయలేని వ్యక్తిని ‘ఉత్సవ విగ్రహం’గా చెప్పుకోవడం పరిపాటి!అవడానికి ప్రధమ పౌరుడే అయినా ఎలాంటి కార్యనిర్వాహక అధికారాలూ లేని, కేవలం కేంద్ర మాంత్రివర్గం ఆమోదించిన నిర్ణయాలపైన సంతకం మాత్రమే పెట్టగల రాష్ట్రపతిని ‘రబ్బర్ స్టాంప్’ గా సంభోధించడమూ తెలిసిందే. ప్రధాన మంత్రి పదవి వీటికి భిన్నం. అది భారత దేశంలో అత్యున్నత అధికారం కలిగిన పదవి. ఆ పదవిని అమెరికా కంపెనీలకు తప్ప భారత దేశ ప్రజలకు ఉపయోగించని మన్మోహన్…