ఆకలికి నకనకలాడుతున్నవారు 84 కోట్లు -ఐరాస

తీవ్ర ఆకలితో (chronic hunger) అలమటిస్తున్నవారు ప్రపంచంలో 84.2 కోట్లమందని ఐరాస ప్రకటించిన నివేదిక ఒకటి తెలిపింది. 2010-12 కాలంలో ఈ సంఖ్య 86.8 కోట్లని, 2011-13 కాలంలో అది 2.6 కోట్లు తగ్గిందని సదరు నివేదిక తెలిపింది. కాగా అభివృద్ధి చెందిన దేశాల్లో తీవ్రంగా ఆకలిగొన్నవారు 1.57 కోట్లమంది ఉండడం గమనార్హం. ‘ప్రపంచంలో ఆహార అబధ్రత పరిస్ధితి’ అన్న నివేదికలో ఐరాస ఈ అంశాలను తెలియజేసింది. ఐరాసలోని ఆహార విభాగం ఎఫ్.ఎ.ఓ (Food and Agricultural…

కీన్యా మారణకాండ: సైన్యమే మాల్ ని కూల్చేసిందా?

కీన్యా రాజధాని నైరోబిలో జరిగిన మారణకాండలో వాస్తవాలేమిటో చెప్పడానికి కీన్యా ప్రభుత్వం ఇంతవరకు ముందుకు రాలేదు. సోమాలియా నుండి వచ్చిన ఆల్-షబాబ్ టెర్రరిస్టులు ఈ దురాగతానికి పాల్పడ్డారని, పిరికిపందలను తరిమికొట్టామని ఆర్భాటంగా ప్రకటనలు ఇవ్వడం తప్ప దాడి ఎలా జరిగింది, అసలు మాల్ ఎందుకు, ఎలా కూలిపోయిందీ చెప్పడం లేదు. పేలుళ్ళ వేడికి భవనం బలహీనపడి కూలిపోయిందని కీన్యా ప్రభుత్వం చెబుతుండగా ఆల్-షబాబ్ ఇందుకు విరుద్ధంగా ప్రకటించింది. తమ సభ్యుల నుండి మాల్ ను విముక్తి చేయలేక…

గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలు తాగి మనిషి… -కార్టూన్

– ఏమైందీ, తొక్కిసలాటా? కాదు – చట్టం తనపని తాను చేసుకుపోయింది లేండి! – పాలక పక్షం, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా అంతా కట్ట గట్టుకుని 17 యేళ్ళ నాడు మేసిన గడ్డి ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ సౌధాన్ని కూల్చేసే పెను భూతమై నిలిచింది. నితీశ్ కుమార్ (జెడి-యు), బి.జె.పి ల విడాకుల నుండి లబ్ది పొందాలని భావించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆశలు ప్రత్యేక సి.బి.ఐ కోర్టు తీర్పుతో ఒక్కసారిగా అవిరయ్యాయి. కోర్టు…

పనిపిల్లను పెంపుడు కుక్కలతో కరిపించిన దుర్మార్గం!

జీవజాలంలో అత్యంత అభివృద్ధి చెందిన జాతి మనిషి. కానీ మనుషుల్లో ‘మనిషితనం’ చిక్కనవడానికి బదులు జంతు ప్రవృత్తి పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. ఢిల్లీలో వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తే మనిషి ‘నిజంగా నాగరీకుడేనా’ అన్న అనుమానం కలక్క మానదు. పని చేయించుకోడానికని ఇంటిలో ఉంచుకున్న మైనర్ బాలికను పెంపుడు కుక్కలతో ఒళ్ళంతా కరిపించిన దుర్మార్గులని ఏమనాలి? వారిని జంతువులతో కూడా పోల్చడానికి మనసొప్పడం లేదు. జంతువు, జంతువు కాబట్టి జంతువులానే ప్రవర్తిస్తుంది. కానీ మనిషిలా ప్రవర్తించలేని మనుషుల్ని జంతువుతో…

సి.ఆర్.ఆర్, రెపో, రివర్స్ రెపో రేట్లు అంటే?

ప్రశ్న: రెపో  రేటు, రివర్స్ రెపో రేటు గురించి వివరించగలరా? జవాబు: ఈ ప్రశ్నకు సమాధానం వివిధ సందర్భాల్లో వివరించాను. కానీ అలాంటి సందర్భం మళ్ళీ వస్తే గుర్తు తెచ్చుకోడానికి పాఠకులకు ఇబ్బంది ఉన్నట్లు కనిపిస్తోంది. బహుశా వివరణలో కాకుండా, టపాలోనే ఈ పేర్లు ఉన్నట్లయితే వెతుక్కోడానికి కొంత సులభంగా ఉండవచ్చని మళ్ళీ వివరిస్తున్నాను. గతంలో ఇచ్చిన వివరణను విస్తృతం చేస్తున్నాను. రిజర్వ్ బ్యాంకు నియంత్రణలో ఉండే వడ్డీ రేట్లను దేశంలో ద్రవ్య చలామణిని అదుపులో ఉంచడానికి…

అమెరికా, ఇటలీ రాజకీయ సంక్షోభం; ఇండియా షేర్లు పతనం

‘ఎంకి చావు, సుబ్బు చావుకొచ్చింది’ అని కొత్త సామెత రాసుకోవాలి. అంతర్జాతీయంగా పెట్టుబడుల ప్రవాహాలకు గేట్లు తెరిచిన ‘ప్రపంచీకరణ’ విధానాలు ఆర్ధిక వ్యవస్ధలను అతలాకుతలం చేయగల శక్తిని సంతరించుకోగా, పులిని చూసి వాతలు పెట్టుకున్న నక్కల్లాగా షేర్ల వ్యాపారంలో అదృష్టం పరీక్షించుకుంటున్న మధ్యతరగతి జనం చివరకు దురదృష్ట జాతకులై తేలుతున్నారు. లేకపోతే అమెరికాలో రిపబ్లికన్-డెమోక్రటిక్ పార్టీల సిగపట్లు, ఇటలీలో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న అవినీతి సామ్రాట్లు ఇండియా షేర్ మార్కెట్లను కుదేయడం ఏమిటి? సోమవారం బి.ఎస్.ఇ సెన్సెక్స్…

మన్మోహన్: రాహుల్ గాంధీ బరువు తూచే యంత్రం?

అధికారం, హోదా అన్నీ ఉన్నా కూడా ఏమీ చేయని/చేయలేని వ్యక్తిని ‘ఉత్సవ విగ్రహం’గా చెప్పుకోవడం పరిపాటి!అవడానికి ప్రధమ పౌరుడే అయినా ఎలాంటి కార్యనిర్వాహక అధికారాలూ లేని, కేవలం కేంద్ర మాంత్రివర్గం ఆమోదించిన నిర్ణయాలపైన సంతకం మాత్రమే పెట్టగల రాష్ట్రపతిని ‘రబ్బర్ స్టాంప్’ గా సంభోధించడమూ తెలిసిందే. ప్రధాన మంత్రి పదవి వీటికి భిన్నం. అది భారత దేశంలో అత్యున్నత అధికారం కలిగిన పదవి. ఆ పదవిని అమెరికా కంపెనీలకు తప్ప భారత దేశ ప్రజలకు ఉపయోగించని మన్మోహన్…

జవహర్ లాల్ నెహ్రూ పండిట్ కాదా?

ప్రశ్న:  పండిట్ నెహ్రూ వంశ చరిత్ర ఏమన్నా తెలిస్తే చెప్పండి. ఆయన అసలు పండిటే కాదని కొందరు అంటున్నారు? జవాబు: భారత దేశపు ప్రప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పండిట్ వంశస్ధుడే. మోతీలాల్ నెహ్రూ కుటుంబం కాశ్మీరీ బ్రాహ్మణులకు చెందినది. అనగా జవహర్ లాల్ నెహ్రూ  కాశ్మీరీ పండిట్ ల వంశంలో జనించారు. వారి కుటుంబం 18వ శతాబ్దం ప్రారంభంలోనే ఇండియాకు వలస వచ్చింది. నెహ్రూ అసలు పండిట్ కాదని ప్రచారం చెయ్యడం వెనుక ఉద్దేశ్యం…

అందరూ దొంగలే, ఎవరికీ ఓటు వేయం -కార్టూన్

ఎన్నికల్లో ఓటు హక్కుకు సంబంధించి సుప్రీం కోర్టు రెండు రోజుల క్రితం ఒక తీర్పు ప్రకటించింది. ఒక నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్ధులందరినీ తిరస్కరించే హక్కు ఓటర్లకు ఉండాలనేది ఆ తీర్పు తాత్పర్యం. అభ్యర్ధులందరిని తిరస్కరించే హక్కు ఓటర్ కి ఉండాలనీ, అది కూడా భావ ప్రకటనా స్వేచ్చలో భాగమేననీ సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ మేరకు ఇ.వి.ఎం మిషన్లలో ‘ఎవరూ కాదు’ అనే బటన్ చేర్చాలని ఎన్నికల కమిషన్ ను ఆదేశిస్తున్నట్లు పేర్కొంది.…

మినీ (చెల్లింపుల) సంక్షోభం వాకిట అమెరికా?

గవర్నమెంట్ షట్ డౌన్! (ప్రభుత్వం మూసివేత) పశ్చిమ పత్రికల్లో ఏది చూసినా ఇదే గోల. ఉదాహరణకి ఈ వార్తల హెడ్డింగులు చూడండి.   House conservatives hold firm as government shutdown looms -Reuters: Sat Sep 28, 2013 6:37am EDT US braces for possible government shutdown -BBC News: 27 September 2013 Last updated at 22:09 GMT Stocks End Week Lower As Govt. Shutdown…

హృదయం ద్రవించుకుపోయే కీన్యా మాల్ రక్తపాతం -ఫోటోలు

కీన్యా రాజధాని నైరోబిలోని ‘వెస్ట్ గేట్ మాల్’ పైన నాలుగు రోజుల పాటు జరిగిన రక్తపాతం నాగరిక ప్రపంచాన్ని నిశ్చేష్టుల్ని చేసింది. ఆల్-ఖైదా అనుబంధ సంస్ధ అయిన ఆల్-షబాబ్, ఈ దాడికి తానే బాధ్యురాలినని ప్రకటించింది. దాడిలో 61 మంది సాధారణ పౌరులు చనిపోగా ఇంకా 63 మంది జాడ తెలియలేదు. చనిపోయినవారిలో కిన్యా అధ్యక్షుడు కీన్యెట్టా రక్త సంబంధీకులు కూడా ఉన్నారు. ఆల్-షబాబ్ టెర్రరిస్టులు విసిరిన గ్రెనేడ్ల ధాటికి నాలుగు అంతస్ధుల మాల్ లోని మూడు…

ఆహా రాహుల్! ఏమి మీదు నాటకంబు?

“కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం ప్రపంచంలో మరెక్కడా లేదు” ఇది మన రాష్ట్ర మంత్రి టి.జి.వెంకటేష్ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్య. ‘ప్రజాస్వామ్యం అంటే కేవలం ధనిక రాజకీయవేత్తలకు వర్తించేది మాత్రమే’ అన్న నిర్వచనం ఏమన్నా ఉన్నట్లయితే ఆయన చెప్పిందాంట్లో సందేహం అనేదే లేదు. ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వమే హడావుడిగా ఒక ఆర్డినెన్స్ తయారు చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపితే, మరోపక్క ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయే, తమ పార్టీలోని మరోనేత ఆ…

స్నోడేన్ పత్రాలు: హార్డ్ డిస్క్ సహా అమెరికా గుప్పిట్లో ఇండియా జాతకం 2

మొదటి భాగం తరువాత……… కొమింట్ పత్రంలోని వివరాలు భయంకరమైన నిజాలని మనముందు ఉంచాయని ది హిందూ పత్రిక వ్యాఖ్యానించింది. మన్ హట్టన్ (న్యూయార్క్) లోని ఐరాస భారత శాశ్వత కార్యాలయం ఎన్.ఎస్.ఏ టాప్ టార్గెట్లలో ఒకటి. ఇక్కడ ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి, ఉప శాశ్వత ప్రతినిధి, ఒక మంత్రి, ఒక రాజకీయ సమన్వయకర్త, ఆరుగురు కౌన్సిలర్లు, ఒక కల్నల్ ర్యాంకులోని మిలట్రీ సలహాదారు, ఇంకా ప్రపంచ దేశాలతో ఇండియాకు ఉండే వివిధ సంబంధాలకు సంబంధించిన అనేకమంది…

హార్డ్ డిస్క్ సహా ఇండియా జాతకం అమెరికా గుప్పిట్లో -స్నోడేన్ పత్రాలు -1

అమెరికా నీతిమాలిన గూఢచర్యం గురించి కళ్ళు తిరిగే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇండియా తనకు ఎంతో కావలసిన మిత్రుడు అని ప్రపంచానికి చాటే అమెరికా, తన గడ్డపై (వాస్తవానికి అది రెడ్ ఇండియన్ల గడ్డ)  ఇండియాకు సంబంధించి ఏ కార్యాలయాన్నీ గూఢచర్యం నుంచి మినహాయించలేదు. చివరికి, భారత దేశం యొక్క ప్రపంచ స్ధాయి దౌత్య కార్యకలాపాలకు గుండెకాయ లాంటివి అయిన న్యూయార్క్ లోని ఐరాస శాశ్వత భారత రాయబార కార్యాలయం, వాషింగ్టన్ డి.సి లోని భారత ఎంబసీ…

జనరల్ వి.కె.సింగ్ విశ్రాంత కాలం తీరే వేరు -కార్టూన్

పదవీ విరమణ చేశాక ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ విశ్రాంత కాలాన్ని ఎంజాయ్ చేస్తారు. కానీ జనరల్ వి.కె.సింగ్ పదవీ విరమణ చేశాక తన కాలాన్ని ఎంజాయ్ చేస్తున్న తీరు మాత్రం ప్రత్యేకం అనే చెప్పుకోవాలి. ఒకసారి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా హజారే పక్కన కనిపిస్తారు. మరోసారి ఆర్మీ కుంభకోణాలపై గొంతెత్తుతారు. మరోసారేమో ఏకంగా బి.జె.పి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడి తోనే వేదిక పంచుకుంటారు. జనరల్ వి.కె.సింగ్ ఎంజాయ్ మెంటు ఎలా ఉన్న దానివల్ల…