కర్ణాటక: క్రైస్తవ పుస్తకాలు తగలబెట్టిన హిందుత్వ గ్రూపులు

ఇప్పుడిక క్రైస్తవుల వంతు వచ్చింది. దేశంలో ఓ పక్క ముస్లింలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కర్ణాటకలో ఏడాది నుండి క్రైస్తవుల పైనా చర్చిల పైనా వరుస దాడులు జరుగుతున్నాయి. తాజాగా కోలార్ జిల్లాలో శ్రీనివాస్ పురా లో హిందుత్వ కి చెందిన రైట్ వింగ్ గ్రూప్ కార్యకర్తలు నలుగురు క్రైస్తవ యువకుల పైన దాడి చేశారని ఇండియన్ ఎక్స్^ప్రెస్, NDTV తెలిపాయి. ఈ నలుగురు క్రైస్తవ మత పుస్తకాలను ఇల్లిల్లూ తిరిగి పంచుతున్నట్లు తెలుస్తోంది. హిందూత్వ సంస్థల…

జులియన్ అసాంజేని అమెరికికాకు ఇచ్చేస్తారట! -కార్టూన్

బ్రిటన్ హై కోర్టు అసాంజే ను అమెరికాకు extradite చెయ్యడానికి ఓకే చెబుతూ తీర్పు చెప్పింది. దానితో అయన హక్కులకు చివరికి ప్రాణాలకు కూడా ముప్పు వచ్చింది. అసాంజేను లాక్కెళ్లి జైల్లో కుక్కడానికి, ఆయనను చిత్ర హింసలు పెట్టి కక్ష తీర్చుకోవడానికి అమెరికా అనేక ఏళ్లుగా ఉవ్విళ్లూరుతోంది. బ్రిటన్ పై తీవ్ర ఒత్తిడి తెస్తూ వచ్చింది. అమెరికా ఒత్తిళ్లు ఫలించాయి. అసాంజేను అమెరికాకు అప్పగిస్తే అంకుల్ సామ్ ఏం చేస్తాడో కార్టూన్ చెబుతోంది. డిప్లొమాటిక్ కేబుల్స్ తో…

గుజరాత్ హైకోర్టు: జనం ఏం తినాలో మీరెలా నిర్ణయిస్తారు?

ప్రజల ఆహార అలవాట్లపై నిర్బంధం విధించాలని ప్రయత్నిస్తున్న హిందూత్వ పాలకులకు గుజరాత్ హై కోర్టు కాస్త గడ్డి పెట్టింది. అహ్మదాబాద్ మున్సిపాలిటీలో మాంసాహారం అమ్ముతున్న తోపుడు బండ్ల ను మునిసిపాలిటీ స్వాధీనం చేసుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపింది. ప్రజలు ఏ ఆహారం తినాలో నిర్ణయించే అధికారం పాలకులకు లేదని తేల్చి చెప్పింది. స్వాధీనం చేసుకున్న తోపుడు బండ్లను వెంటనే వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. “మీరు మాంసాహారం భుజించరు. అది మీ దృక్పధం. కానీ జనం ఏమి…

నాగాలాండ్ కూలీల హత్య: పార్లమెంటును తప్పుదారి పట్టించిన హోం మంత్రి?

14 మంది నాగాలాండ్ కూలీలను భారత భద్రతా బలగాలు కాల్చి చంపిన విషయంలో హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటుకు తప్పుడు సమాచారం ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కూలీలు వారు ప్రయాణిస్తున్న వాహనంలో భద్రతా బలగాల సంకేతాలను లెక్క చేయకుండా పారిపోవడానికి ప్రయత్నించడం వల్లనే సైనికులు కాల్పులు జరపవలసి వచ్చిందని మంత్రి రాజ్య సభలో చెప్పారు. దుర్ఘటనలో ప్రాణాలతో బైటపడిన కూలీలు చెబుతున్నది ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నదని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి…

రైతుల ఆందోళన విరమణ, 11 తేదీన సంబరాలు!

హిందూత్వ అహంభావ పాలకులపై చావు దెబ్బ కొట్టిన ‘భారతీయ’ రైతులు ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. రైతు సంఘాల సంయుక్త పోరాట వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్‌కే‌ఎం) నేతలు విధించిన షరతులకు కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఆమోదం చెప్పడంతో శనివారం, డిసెంబర్ 9 తేదీన ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరవధిక ఆందోళన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు బనాయించిన కేసులన్నింటినీ బేషరతుగా ఉపసంహరించుకుంటామని కేంద్రం రాత పూర్వకంగా హామీ ఇచ్చింది.…

హెలికాప్టర్ క్రాష్: సి‌డి‌ఎస్ బిపిన్ రావత్ దుర్మరణం

భారత సాయుధ బలగాల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సి‌డి‌ఎస్) జనరల్ బిపిన్ రావత్ తమిళనాడు లోని నీలగిరి కొండల్లో ఆయన ప్రయాణిస్తున్న ఎం-17 హెలికాప్టర్ కూలి దుర్మరణ చెందారు. జనరల్ బిపిన్ రావత్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ కి ఛైర్మన్ కూడా. ఈ పదవిలో నియమితులైన మొట్ట మొదటి ఆర్మీ అధికారి ఆయన. జనరల్ బిపిన్ రావత్ డిపార్ట్^మెంట్ ఆఫ్ మిలట్రీ అఫైర్స్ కి కూడా అధిపతిగా వ్యవహరించారు. 1 జనవరి 2020…

2+2 ఫార్మాట్ చర్చలు అంటే?

భారత విదేశాంగ విధానంలో గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న మాట “2+2 ఫార్మాట్ డైలాగ్” (2+2 నమూనా లో జరిగే చర్చలు)! సాధారణ పాఠకుల్లో చాలా మందికి ఈ పద బంధం అర్ధం ఏమిటన్నది తెలియదు. తెలియని అంశాల కోసం ఇంటర్నెట్ ని వెతికి చదివే అలనాటు ఉన్నవాళ్లకి తప్ప ఇతరులకి తెలిసే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ పద బంధాన్ని విదేశాంగ విధానం, విదేశీ సంబంధాల రంగంలో ఉపయోగిస్తారు. ఈ పేరే దాని అర్ధం ఏమిటో చెబుతోంది.…

ఇండియా రష్యా 2+2 డైలాగ్: ఏ‌కే-203 ఒప్పందం ఒకే

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియా సందర్శన సందర్భంగా ఇరు దేశాల మధ్య 2+2 ఫార్మాట్ లో ఈ రోజు చర్చలు జరిగాయి. చర్చల్లో రష్యా రక్షణ మంత్రి సెర్గి షోయిగు, విదేశీ మంత్రి సెర్గీ లావరోవ్ లు రష్యా తరపున పాల్గొనగా, ఇండియా తరపున రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ లు పాల్గొన్నారు. సోమవారం జరిగిన ఈ సమావేశం ఇండియా రష్యాల మధ్య 2+2 ఫార్మాట్ లో…

మహిళలు ఒకరి సొంత ఆస్తి కాదు! -తాలిబాన్ డిక్రీ

ఆఫ్ఘనిస్తాన్ నేల నుండి ఒక శుభ వార్త! మహిళల హక్కులను, ఆకాంక్షలను అణచివేయడంలో పేరు పొందిన తాలిబాన్ ఆఫ్ఘన్ ఆడ పిల్లలకు అనుకూలంగా ఒక ముఖ్యమైన డిక్రీ జారీ చేయడం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. “స్త్రీ ఏ ఒక్కరి ఆస్తీ కాదు. ఆమెను ఒక గౌరవప్రదమైన మరియు స్వేచ్ఛాయుత మానవునిగా పరిగణించాలి. శాంతికి బదులుగానో లేక శతృత్వానికి ముగింపు పలికే లక్ష్యంతోనో ఏ స్త్రీనీ మారకానికి ఇవ్వడం జరగరాదు” అని తాలిబాన్ ప్రభుత్వం డిక్రీ జారీ…

ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ వైరస్!

ప్రస్తుతం ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కోవిడ్ వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత దేశంలో కూడా ప్రవేశించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.రెండు కేసులూ కర్ణాటక రాష్ట్రంలో కనుగొన్నట్లు ప్రభుత్వం గురువారం తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ సోకిన ఇద్దరూ పురుషులే. ఒకరి వయసు 66 సం.లు కాగా మరొకరి వయసు 46 సం.లు. ఈ ఇద్దరి జాతీయత ఏమిటో వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో భారత పత్రికలు వెల్లడించడం లేదు. అయితే WION వెబ్ సైట్ అందజేసిన…

అంబేద్కర్ రచనల ప్రచురణ నిలిపివేత, సుమోటు కేసు నమోదు

మహారాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలను ప్రచురించే ప్రాజెక్టును నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మహారాష్ట్ర ప్రాంతీయ పత్రిక లోక్ సత్తా ఒక వార్త ద్వారా వెలుగులోకి తెచ్చింది. సదరు వార్తను పరిగణలోకి తీసుకున్న బొంబే హై కోర్టు, ప్రచురణ ప్రాజెక్టు నిలిపివేయడాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా సుమోటుగా డిసెంబర్ 1 న స్వీకరించింది. మరాఠీ పత్రిక లోక్ సత్తా నవంబర్ 24 తేదీన అంబేద్కర్ రచనలు, ప్రసంగాల ప్రచురణను నిలిపివేసిన…

చనిపోయిన రైతుల లెక్కల్లేవు, పరిహారం ఇవ్వలేం -కేంద్రం

మోడి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం చనిపోయిన రైతుల కుటుంబాల దీన పరిస్ధితితో తనకు సంబంధం లేదని చేతులు దులిపేసుకుంది. తమ నిర్లక్ష్యం, రైతుల పట్ల బాధ్యతారాహిత్యం కారణంగా ఏడాది పాటు చలికి వణుకుతూ, ఎండలో ఎండుతూ, వానలో నానుతూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలో పాల్గొనడం వలన అర్ధాంతరంగా చనిపోయిన రైతులకు సంబంధించిన రికార్డులు తమ వద్ద లేనందున వారి కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించే ప్రసక్తే తలెత్తదని స్పష్టం చేసింది. అసలు కనీస తర్కం కూడా…

5 ని.ల్లో రద్దు బిల్లు మూజువాణి ఆమోదం, నోటితో నవ్వుతూ…

పార్లమెంటరీ సంప్రదాయాలు, నియమ నిబంధనలు, నియమావళి, సుస్ధిర ప్రక్రియలు ఒక్కొక్కటిగా మాయమైపోతున్నాయి. దాదాపు ఆరున్నర దశాబ్దాల పార్లమెంటరీ ఆచరణలో తామే నెలకొల్పుకున్న సో-కాల్డ్ ప్రజాస్వామిక సభా సూత్రాలు రద్దయిపోతూ వాటి స్ధానంలో పార్లమెంటరీ నియంతృత్వ సూత్రాలు ప్రవేశిస్తున్నాయి. ప్రజలు తమ ప్రతినిధులుగా ఎన్నుకున్న సభ్యులు నిరసనలను గౌరవించడం మాట అటుంచి కనీసం పట్టించుకోవడమే ఒక గొప్ప అంశంగా మారే రోజులు వచ్చాయి. ప్రజాస్వామ్య దేవాలయంగా ఇన్నాళ్లూ మన పాలకులు డప్పు కొట్టుకున్న పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లులు…

బ్రిటిష్ రాణి ఆధిపత్యాన్ని రద్దు చేయనున్న బార్బడోస్!

కరేబియన్ దేశాల్లో ఒకటయిన బార్బడోస్ త్వరలో బ్రిటిష్ రాణి ఆధిపత్యం నుండి వైదొలగడానికి నిర్ణయం తీసుకుంది. సర్వ స్వతంత్ర దేశంగా అవతరించనుంది. బ్రిటిష్ డొమీనియన్ నుండి వైదొలిగి నూతన రిపబ్లిక్ దేశంగా అవతరించనుంది. 400 యేళ్ళ పాటు బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా, బ్రిటిష్ వలస దేశంగా మగ్గిన బార్బడోస్ 1965లో స్వాతంత్రం ప్రకటించుకుంది. స్వాతంత్రం ప్రకటించుకున్నప్పటికీ బ్రిటిష్ డొమీనియన్ లో భాగంగా బార్బడోస్ కొనసాగింది. అనగా ఆ దేశ రాజ్యాధిపతిగా (Head of the State) బ్రిటిష్…

ఎం‌ఎస్‌పి గ్యారంటీ కోసం ఆందోళన కొనసాగుతుంది -రైతు సంఘాలు

ఇతర ముఖ్యమైన డిమాండ్ల సాధన కోసం తమ ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాలు ప్రకటించాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఆపాలజీ వల్ల తమ డిమాండ్లు నెరవేరవనీ, క్షమాపణ కోరడానికి బదులు ‘కనీస మద్దతు ధర’ (Minimum Support Price) ను గ్యారంటీ చేసేందుకు చట్టం తేవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. “మేము ఎక్కడికీ వెళ్ళడం లేదు” అని సంయుక్త కిసాన్ మోర్చా నాయకుల్లో ఒకరు, బి‌కే‌యూ నాయకులూ అయిన రాకేశ్ తికాయత్ స్పష్టం చేశాడు. నరేంద్ర…