ప్రధాని సేవ ప్రజలకు కాదు, ప్రభు వర్గాలకు -కార్టూన్

మంత్రి: దయచేసి అలాంటి దాడులు చేయకుండా సంయమనం పాటించండి. మన దేశ పెట్టుబడి వాతావరణానికి అది నష్టకరం- గౌరవనీయులైన పారిశ్రామికవేత్తలను గాయపరిస్తే… ప్రధాని: ?! ——————————— ప్రధాన మంత్రి మన్మోహన్ గారికి ప్రభుత్వం లోనూ, కాంగ్రెస్ లోనూ ఉన్న గౌరవం ఏపాటిదో వివరించే ఉదాహరణలు కోకొల్లలు. సోనియా గాంధీ విదేశీయత ప్రధాని పదవికి అడ్డు రావడం, పి.వి.నరసింహారావు ఏలుబడిలో భారత దళారీ పెట్టుబడిదారులకు, విదేశీ సామ్రాజ్యవాదులకు నమ్మకంగా సేవలు చేయడం ద్వారా సాధించిన పలుకుబడి అచ్చిరావడంతో దేశ…

ఫుకుషిమా: అణువు చిదిమేసిన జ్ఞాపకం -ఫోటోలు

అణువు ఎంతని? కంటికి సైతం కనపడని అణువు ‘ఇంతింతై, వటుడింతింతై’ అన్నట్లుగా విశ్వరూపం దాల్చింది. ఫుకుషిమా జనానికి జ్ఞాపకాన్ని కూడా భయపెట్టే భూతంలా మార్చివేసింది. అలా పొద్దున్నే నడిచి వెళ్ళిన రోడ్డూ, పెరట్లో ఇష్టంగా పెంచుకున్న మొక్కా, జీవిత పర్యంతం కష్టించి ఆర్జించుకున్న ఇల్లూ, చివరికి తనను తాకిన పాదానికి ధరణీ మాత ఇష్టంతో అద్దిన ధూళీ అన్నీ ఇప్పుడు అణు రక్కసి కోరల్లో చిక్కి పెను భూతాలుగా మారాయి. 2011 మార్చి 11 తేదీన మానవుడి…

విభజన అధికారం పార్లమెంటుదే – ప్రొ.కె.నాగేశ్వర్ (10టివి)

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రొఫెసర్ నాగేశ్వర్ కొన్ని ముఖ్యమైన విషయాలను తెలిపారు. కార్మికులు, ఉద్యోగుల భాగస్వామ్యంతో ఏర్పడిన 10టి‌విలో ఆయన నిన్న మాట్లాడుతూ రాష్ట్రాల విభజనపై రాజ్యాంగం ఏమి చెబుతోందో వివరించారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ తలా ఒక ప్రకటన చేస్తూ జనాన్ని రకరకాలుగా మభ్య పెడుతూ  గందరగోళంలో పడేస్తున్న పరిస్ధితుల్లో నాగేశ్వర్ గారు ఇచ్చిన వివరణ చాలా ఉపయోగంగా ఉంది. అందులో కొంత భాగం: ” ప్రస్తుతం రాష్ట్ర విభజనపై నేతలు…

అమెరికా ఓడ సిబ్బంది అరెస్టు

అమెరికన్లు ఒక్కరు కూడా లేని ‘సీమన్ గార్డ్ ఒహియో’ ఓడ సిబ్బందిని భారత పోలీసులు మొత్తానికి అరెస్టు చేశారు. అమెరికా ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీ అడ్వాన్ ఫోర్ట్ కి చెందిన ఈ ఓడ సిబ్బందిలో భారతీయులు కూడా ఉన్నారు. కానీ అమెరికన్ ఒక్కరూ లేరు. బ్రిటన్, ఎస్తోనియా, ఉక్రెయిన్ తదితర దేశాలకు చెందిన సిబ్బందిని అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకు, చట్ట విరుద్ధంగా డీజెల్ కొనుగోలు చేసినందుకు, భారత సముద్ర జలాల్లో అనుమతి లేకుండా ప్రవేశించినందుకు అరెస్టు…

మేం కాపలా కాసేది మీ నౌకలకే, ఇండియాతో అడ్వాన్ ఫోర్ట్

ఆయుధాలతో పట్టుబడిన అమెరికన్ ప్రైవేటు సెక్యూరిటీ ఓడ కధ ఆసక్తికరమైన మలుపు తిరిగింది. పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు పట్టుబడ్డాయని చెబుతున్న అడ్వాన్ ఫోర్ట్ కి చెందిన ఓడలో లో భారతీయులు కూడా ఉన్న సంగతి గమనించాలని, ఆ ఓడ వాస్తవానికి భారత నౌకల రక్షణ కోసమే నియమించబడిందని కంపెనీ అధ్యక్షుడు విలియం వాట్సన్ చెబుతున్నాడు. భారత నౌకలకు సముద్ర దొంగల నుండి రక్షణ ఇస్తున్న ‘సీమన్ గార్డ్ ఓహియో’ ను అదుపులోకి తీసుకోడం వలన భారత్…

ప్చ్! లాభం లేదు, చైనా రేటింగ్ ఏజన్సీ -కార్టూన్లు

ఋణ పరిమితి పెంచడానికి, మూసేసిన ప్రభుత్వాన్ని తిరిగి తెరవడానికీ అమెరికా రాజకీయ పార్టీలు ఒక అంగీకారానికి వచ్చినప్పటికీ చైనా సంతృప్తి పడలేదు. చైనాకు చెందిన పరపతి మూల్యాంకనా సంస్ధ (Credit Rating Agency) ఒకటి ఒప్పందం కుదిరినాక కూడా అమెరికా పరపతి రేటింగును తగ్గించి సంచలనం సృష్టించింది. బీజింగ్ నుండి పని చేసే డెగాంగ్ రేటింగ్ ఏజన్సీ అమెరికా ప్రభుత్వ ఋణ రేటింగును A నుండి A- కు తగ్గించింది. అమెరికా పరపతి వాస్తవంగా ఉన్నదాని కంటే…

బానిసత్వంలో 3 కోట్ల మంది, సగం ఇండియాలోనే

బానిస సమాజం అంతరించిందని గొప్పగా చెప్పుకుంటాం. అది నిజం కాదన్న చేదు నిజం మనం అంగీకరించాల్సిందే. వర్తమాన ప్రపంచంలో 3 కోట్ల మంది బానిసలుగా బతుకుతున్నారని ‘గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ 2013’ (జి.ఎస్.ఐ 2013) సర్వేలో తేలింది. గత సంవత్సరం సర్వే చేసిన ‘ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్’ (ఐ.ఎల్.ఓ) బానిస బతుకులు నెట్టుకొస్తున్నవారి సంఖ్య 2.1 కోట్లని తెలిపింది. వాస్తవం దానికంటే ఘోరమని జి.ఎస్.ఐ 2013 సర్వేలో స్పష్టం అయింది. ప్రపంచంలోని మొత్తం బానిసత్వంలో సగం బానిసత్వాన్ని…

అమెరికా: ఎట్టకేలకు ఒప్పందం, సంక్షోభం వాయిదా

సెనేట్ లో ఉభయ పార్టీల మధ్య ఒప్పందం కుదరడంతో ఎట్టకేలకు అమెరికా ఋణ పరిమితి సంక్షోభం, ప్రభుత్వ మూసివేత సంక్షోభం తాత్కాలికంగా పరిష్కారం అయ్యాయి. జనవరి 15 వరకు ప్రభుత్వ ఖర్చులు ఎల్లమారే బడ్జెట్, ఫిబ్రవరి 7 వరకూ అందుబాటులో ఉండే ఋణ పరిమితి పెంపుదల… ఒప్పందంలోని ప్రధాన అంశాలు. అనగా సంక్షోభం వాయిదా వేశారు తప్ప పరిష్కారం కాలేదు. పరిష్కారం చేసుకోడానికి వీలయిన చర్చలు చేయడానికి సమయం మాత్రం దక్కించుకున్నారు. దానర్ధం పరిష్కారం తధ్యం అని…

అమెరికా: ఋణ పరిమితి చర్చలు మళ్ళీ విఫలం

అమెరికాలో ఋణ పరిమితి చర్చలు మళ్ళీ పతనం అయ్యాయి. ప్రతినిధుల సభలో రిపబ్లికన్ నాయకులు ప్రతిపాదించిన బిల్లుకు ఆ పార్టీ సభ్యల్లోనే మద్దతు కొరవడడంతో అది సభలోకి ప్రవేశించకముందే ఉపసంహరించుకున్నారు. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వవద్దని కన్సర్వేటివ్ గ్రూపులు కోచ్ బ్రదర్స్, టీ పార్టీలు ప్రచారం చేయడంతో ప్రతినిధుల సభలో రిపబ్లికన్ నేత, స్పీకర్ జాన్ బోయ్ నర్ ప్రయత్నాలు వమ్ము అయ్యాయి. దానితో అమెరికా పరపతి రేటింగును తగ్గించాల్సి ఉంటుందని ఫిచ్ ఋణ రేటింగు సంస్ధ…

ఛత్తీస్ ఘర్: పటేల్ హత్యకు సారీ -మావోయిస్టులు

ఛత్తీస్ ఘర్ పి.సి.సి అధ్యక్షుడు నందకుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేష్ పటేల్ ల హత్యకు సి.పి.ఐ (మావోయిస్టు) పార్టీ క్షమాపణ చెప్పింది. తండ్రి కొడుకుల హత్య ద్వారా తమ కామ్రేడ్స్ భారీ తప్పిదం చేశారని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ నూతన కార్యదర్శి రామన్న అలియాస్ రావుల శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారని ది హిందు తెలిపింది. ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టు ఎవరో తమకు తెలియదని కానీ ఏడు పేజీల ఇంటర్వ్యూ తమకు చేరిందని పత్రిక…

గడ్డి కోసం తాటిచెట్టెక్కిన అమెరికా ప్రైవేటు ఓడ!

‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే, దూడ మేత కోసం’ అన్నాట్ట వెనకటికొకడు. భారత సముద్ర జలాల్లో చట్ట విరుద్ధంగా ప్రవేశించిన ఓడ యజమాని అయిన అమెరికా ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీ చెబుతున్న కారణం కూడా అలాగే ఉంది. అమెరికా ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీ ‘అడ్వాన్ ఫోర్ట్’ కి చెందిన ‘సీమన్ గార్డ్ ఓహియో’ గత శుక్రవారం తమిళనాడు లోని ట్యుటికోరిన్ ఓడ రేవు సమీపంలోని భారత సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించడంతో భారత తీర రక్షణ దళాలు…

పొదుపు చేయాలి వృద్ధి చెందాలి, ఎలా? -కార్టూన్

ఏనుగు గారు: ఆర్ధిక వ్యవస్ధ నడక సాగాలంటే -మన పౌరులను ఖర్చు చేసేలా ప్రోత్సహించడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను. నిద్ర లోంచి మేల్కొన్న అలారం: పొదుపు… పొదుపు… అమెరికా ఆర్ధిక వ్యవస్ధ గురించి ఆ దేశ ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ప్రతిబింబించే కార్టూన్ ఇది. రిపబ్లికన్ పార్టీ గుర్తు ఏనుగు. ఏనుగు గారు పడక కుర్చీలో విశ్రాంతిగా కూర్చుని జనాన్ని తమ వద్ద ఉన్న డబ్బుని ఖర్చు పెట్టించి తద్వారా అమెరికా ఆర్ధిక…

ఈ జైపూర్ బాల మాంత్రికుడి మేజిక్ చూడండి -వీడియో

జైపూర్ లో స్వదేశీ, విదేశీ టూరిస్టులను తన కనికట్టుతో కట్టి పడేస్తున్న బాల మాంత్రికుడి చిట్టి పొట్టి మాయాజాలం చూడండి. భుజానికి గుడ్డ సంచి తగిలించుకుని, అందులో కాసిన్ని మేజిక్ సరంజామా నింపుకుని తెచ్చి టూరిస్టులను ఆకర్షిస్తూ పొట్ట పోసుకోవడం ఈ బాలుడి దినచర్యలా కనిపిస్తోంది. బాలుడి మేజిక్ అభినందనీయమే అయినా ఇంత చిన్న వయసులో తన పొట్ట తానే నింపుకోవలసి రావడం ఈ బాల మాంత్రికుడి వెనుక దాగిన ఒక విషాధం. మన పుణ్య భూమిలో…

దతియా దసరా తొక్కిసలాట, 115 పైగా దుర్మరణం -ఫోటోలు

దుర్గాష్టమి రోజున మధ్య ప్రదేశ్ లో జరిగిన ఘోరమైన తొక్కిసలాటలో 115 మందికి పైగా దుర్మరణం చెందడం ఏ విధంగా చూసినా అనివార్యం కాదు. ఇదే చోట ఏడేళ్ళ క్రితం జరిగిన తొక్కిసలాటలో పాతిక మందికి పైగా చనిపోయారు. రెండు రాష్ట్రాల నుండి జనం ఈ చోటికీ వస్తారని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘోరమైన రీతిలో భద్రతా చర్యలు తీసుకోవడం బట్టి వారికి ప్రజల పట్ల ఉన్న బాధ్యత ఏపాటిదో అర్ధం అవుతోంది. వెనుకబడిన…

2 వారాల్లో 7800 కోట్లు పరారీ, అమెరికా మూసివేత ఫలితం

విదేశీ పెట్టుబడుల కోసం భారత ప్రభుత్వం పడని పాట్లే లేవు. ఎన్ని పాట్లు పడినా ఫలితాలు మాత్రం సరిగ్గా విరుద్ధంగా వస్తున్నాయి. దానికి కారణాలు భారత ప్రభుత్వం చేతుల్లో లేకపోవడమే అసలు సమస్య. అక్టోబర్ నెలలో ఇప్పటివరకూ, అనగా రెండు వారాల్లో రు. 7,800 కోట్లు లేదా 1.2 బిలియన్ డాలర్లు దేశం నుండి పరారీ అయ్యాయి. ఈ పలాయనం అమెరికా ప్రభుత్వం మూసివేత ఫలితమేనని పి.టి.ఐ తెలిపింది. భారత ఋణ మార్కెట్ నుండే ఈ మొత్తం…