తెలంగాణ: లైన్ క్లియర్, రాజీనామా యోచనలో కిరణ్
రాష్ట్రపతి రిఫరెన్స్ ద్వారా పార్లమెంటులో ప్రవేశించనున్న తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎం.పిలు, ఎమ్మేల్యేలు తదితరులు ప్రతిపాదించిన సవరణలలో కొన్నింటిని బిల్లులో చేర్చడానికి కేబినెట్ ఆమోదించింది. అయితే సీమాంధ్ర నాయకుల డిమాండ్లను ఏ మేరకు అంగీకరించారు అన్న అంశంలో వివిధ వాదనలు వినిపిస్తున్నాయి. పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లు వివరాలను ముందే పత్రికలకు చెప్పడం సభాహక్కుల ఉల్లంఘన కావడంతో హోమ్ మంత్రి బిల్లు, సవరణల వివరాలను పత్రికలకు చెప్పలేదు.…














