మహిషాసురుడు సభకు ఎందుకు వచ్చాడు?

మహిషాసుర సంహారానికి వ్యతిరేకంగా, హిందూ నమ్మకాలకు విరుద్ధంగా మహిషాసురుడి అమర దినాన్ని జే‌ఎన్‌యూ లోని ఎస్‌సి, ఎస్‌టి, ఓ‌బి‌సి, మైనారిటీ విద్యార్ధులు జరపడం “మానసిక భ్రష్టత్వంగా మానవ వనరుల శాఖ మంత్రి నిన్న పార్లమెంటులో తూలనాడారు. హిందూ పురాణాలలో దేవతలుగా, వీరులుగా, దేవుళ్ళుగా కొలవబడుతున్నవాళ్ళు దేశంలో అనేక మూలల్లో విలన్లుగా చీత్కరిస్తున్న వాస్తవాలు మంత్రి గారికి తెలియక కాదు. రిజర్వేషన్ వ్యతిరేక, హిందూ భావోద్వేగ, అగ్రకులాల ఓట్లను సొమ్ము చేసుకునేందుకు ఆమె హిందూ సాంప్రదాయాలను దళితులు తూలనాడుతున్నారన్న…

స్మృతి మళ్ళీ అబద్ధం చెప్పారు!

నోరు తెరిస్తే అబద్ధమేనా? బాధ్యతగల కేంద్ర మంత్రి పదవిలో ఉంటూ కూడా! తన ప్రసంగానికి భావోద్వేగాలను అద్దడం కోసం జరగనివి జరిగినట్లుగా, జరిగినవి జరగనట్లుగా చెప్పడం ఎవరికైనా తగునా? లేక దేశాన్ని ఏలుతున్నారు గనుక కేంద్ర మంత్రులకు తగుతుందా? కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అబద్ధాల పర్వం కొనసాగుతోంది. అత్యున్నత ప్రజాస్వామిక దేవాలయంగా చెప్పుకునే పార్లమెంటులోనే ఆమె అబద్ధాలు చెప్పేస్తున్నారు. అది కూడా ఒక చనిపోయిన విద్యార్ధి కుటుంబం లక్ష్యంగా! రోహిత్ వేముల…

ఫాసిజం: జే‌ఎన్‌యూ విద్యార్ధి నేత అరెస్ట్

హిందూత్వ ఫాసిజం తన ఫాసిస్టు ప్రయాణంలో మరో అడుగు వేసింది. ఈసారి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పంజా విసిరింది. విద్యార్ధుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అపహాస్యం చేస్తూ యూనివర్సిటీ విద్యార్ధి సంఘం అధ్యక్షుడు కన్హైయా కుమార్ పైకి ఢిల్లీ పోలీసులను ఉసి గొల్పింది. యూనివర్సిటీ విద్యార్ధులపై కఠిన చర్య తీసుకోవాలని తానే ఆదేశించానని కేంద్ర హోమ్ మంత్రి సగర్వంగా చాటుకున్నారు. యూనివర్సిటీ విద్యార్ధులు ‘జాతీయ-వ్యతిరేక’ భావోద్వేగాలు వ్యక్తం చేశారని కేంద్ర హోమ్ మంత్రి ఎకాఎకిన నిర్ధారించేశారు.…

న్యాయం కావాలి -రాధిక వేముల

అర్ధంతరంగా చనిపోయిన తన కుమారుడి మరణం వృధా కాకూడదని రాధిక వేముల ఆక్రోశిస్తోంది. తన కుమారుడి మరణానికి సంబంధించి తనకు న్యాయం జరగాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరిగేవరకు తాను పోరాటం కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తమను ఓదార్చడానికి ఢిల్లీ నుండి రెండుసార్లు వచ్చారని కానీ ప్రధాన మంత్రి నుండి ఇంతవరకూ ఎలాంటి స్పందన ఎందుకు లేదని రోహిత్ తల్లి రాధిక వేముల ప్రశ్నించారు. తన కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ…

పాకిస్తాన్: హిందు ఆలయంపై దాడి!

పాకిస్తాన్ లో ఒక హిందు ఆలయంపై దాడి జరిగిన సంగతి వెలుగు చూసింది. ఆలయంలోకి చొచ్చుకు వచ్చిన దుండగులు ఒక దేవతా విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆలయం సొంతదారును ఉటంకిస్తూ పాక్ పత్రిక డాన్ తెలిపింది. దాడి జరగడంతో భక్తులు ఆలయానికి రావడం మానుకున్నారని పూజాదికాలు నిర్వహిస్తున్న వ్యక్తి చెప్పారు. పాకిస్తాన్ లో అతి పెద్ద నగరం కరాచీలో ఈ ఘటన జరిగింది. కరాచీ జూలాజికల్ గార్డెన్స్ కి చెందిన 5వ నెంబర్ గేటు వద్ద కొన్ని…

రోహిత్, రాధిక: అచ్చమైన దళిత కధ! -3

MA MEd చదివిన ఉపాధ్యాయురాలు తన ఆడ పిల్లలను BSc-BEd, BCom-BEd లు చదివించుకుంది. అందులో తప్పు పట్టాల్సింది ఏ కోశానా లేదు. కానీ ‘నా సొంత కూతురు లాంటిది’ అని చెప్పిన రాధికకు మాత్రం అత్తెసరు చదువుతో ముగించేయడం ఎలా అర్ధం చేసుకోవాలి, ఉపాధ్యాయురాలు అయి ఉండి కూడా! అదీ కాక, తన ‘సొంత కూతురుతో సమానం’ అయినప్పుడు 14 సంవత్సరాలకే పెళ్లి చేసి పంపేయడం ఎలా సాధ్యం! బాల్య వివాహాలు చట్ట విరుద్ధం అన్న…

అచ్చమైన దళిత కధలో పాత్రలు రోహిత్, రాధిక -2

మొదటి భాగం తరువాత……………….. – రాధిక ఎదుర్కొంటున్న హింసను చూసి ఆమెను ‘దత్తత’ తెచ్చుకున్న అంజని, బహుశా, తన తప్పు సవరించుకునే పనిలో పడ్డారు. మణి నుండి తన కూతురు, మనవళ్లను రక్షించుకున్నానని ఆమె చెప్పారు. “వాళ్ళు మణిని వదిలిపెట్టి వచ్చేశారు. 1990లో వాళ్ళను మళ్ళీ మా ఇంట్లోకి ఆహ్వానించాను” అని అంజని చెప్పారు. అయితే రాధిక చెప్పింది అది కాదు. ఈ విషయాలు హిందూస్తాన్ విలేఖరికి చెబుతున్నప్పుడు రాధిక, అంజని పక్కనే ఉన్నారు. అంజని స్పష్టమైన…

రాధిక, రోహిత్: అచ్చమైన దళిత కధలో పాత్రలు -1

పాలక పార్టీ తాజాగా మరో కేంద్ర మంత్రిని రంగంలోకి దించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్ధుల ఆందోళనను పరిష్కరించేందుకు కాదు. రోహిత్, మరో నలుగురు దళిత విద్యార్ధులపై మరింత బురద జల్లేందుకు. యూనివర్సిటీ పాలకవర్గం ద్వారా తాము సృష్టించిన సమస్య నుండి దళిత కోణాన్ని తొలగించడానికి స్మృతి ఇరానీ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో విదేశాంగ మంత్రిని కేంద్రం ప్రవేశపెట్టింది. “నాకు అందుబాటులో ఉన్న సంపూర్ణ సమాచారం మేరకు రోహిత్ అసలు దళితుడే కాదు. ఆయన దళితుడని…

రోహిత్: చట్టం ఉల్లంఘన కాదు, అణచివేతకు ప్రతిఘటన!

“మొదట దళిత సమస్య, ఆ తర్వాతే విద్యార్ధి సమస్య” శీర్షిక గల ఆర్టికల్ కింద వ్యాఖ్యాతల అభిప్రాయాలకు సమాధానం ఈ టపా. ********* మీ ప్రశ్నల రీత్యా నేను చెప్పవలసినవీ, అడగవలసినవి కొన్ని ఉన్నాయి. విషయం మొత్తాన్ని ‘చట్టం పాటించడం లేదా అతిక్రమించడం’ లోకి మీరు కుదించివేశారు. ఆ పరిధి వరకే మీ దృష్టి ఉన్నట్లయితే అది మీ యిష్టం. కానీ ఈ అంశం కేవలం చట్టం అనుసరణ/ అతిక్రమణ వరకే పరిమితం అయిందని నేను భావించడం…

రోహిత్ నిరసనకు దారి తీసిన DU ఘటన -వీడియో

రోహిత్ వేముల ఆత్మహత్యకు దారి తీసిన పరిస్ధితుల్లో మొదటిది ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన ఒక ఘటన అని పత్రికలు, ఛానెళ్ల ద్వారా తెలిసిన విషయం. ఆ ఘటనకు సంబంధించిన వీడియోయే ఇది. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని కిరోరి మాల్ కాలేజీలో గత ముజఫర్ నగర్ మత కొట్లాటలపై ఒక డాక్యుమెంటరీ (ముజఫర్ నగర్ బాకీ హై) ప్రదర్శిస్తుండగా ఏ‌బి‌వి‌పి విద్యార్ధి సంఘం వాళ్ళు దాడి చేసి ప్రదర్శన నిలిపివేయించారు. ఆ డాక్యుమెంటరీ ‘యాంటీ నేషనల్’ అన్న ఆరోపణతో…

మొదట దళిత సమస్య, ఆ తర్వాతే విద్యార్ధి సమస్య!

రోహిత్ వేముల కులంపై చర్చ ఇంకా ముగియలేదు. పత్రికలు, ఛానెళ్లు, ప్రభుత్వాధికారులు, పోలీసులు ఈ సమస్యను ఇంకా కలియబెడుతూనే ఉన్నారు. రోహిత్ దళితుడా కాదా అన్నది అర్జెంటుగా తేల్చేయ్యాలన్నది కొందరి పంతంగా కనిపిస్తోంది. నిజం చెప్పాలంటే రోహిత్ దళితుడే అని నమ్ముతున్నవారికి ఎలాంటి సమస్యా లేదు. వారా చర్చలో నుండి ఎప్పుడో వెళ్ళిపోయారు. వారు రోహిత్ కు, అతనితో పాటు సస్పెండ్ అయినవారికి న్యాయం జరగాలన్న డిమాండ్ తో ఉద్యమంలో మునిగి ఉన్నారు. ఎటొచ్చీ రోహిత్ దళితుడు…

షేమ్ ఆన్ యూ! మోడిపై మల్లిక ఆగ్రహం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడిని గుజరాత్ నాట్యకళావేత్త మల్లిక సారాభాయ్ మరోసారి తీవ్రంగా విమర్శించారు. ‘పద్మ విభూషణ్’ గ్రహీత అయిన తన తల్లి మరణిస్తే సానుభూతిగా ఒక్క మాట కూడా చెప్పలేని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సిగ్గు పడాలని ఆమె విమర్శించారు. గుజరాత్ మత మారణకాండ విషయంలో మొదటిసారి స్పందిస్తూ గుజరాత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో ‘ప్రజా ప్రయోజన వ్యాజ్యం’ దాఖలు చేసిన వ్యక్తి మల్లిక సారాభాయ్. భారత దేశం అంతరిక్ష పరిశోధనలకు నేతృత్వం వహించిన…

రోహిత్ వేముల దళితుడు కాదా?

యూనివర్సిటీ ఆఫ్ హైదారాబాద్ లో సస్పెన్షన్ కు గురై ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల కులం గురించి ఈ నాలుగు రోజుల్లోనే అనేక కాకమ్మ కధలు ప్రచారంలో పెట్టారు. అనేక ఆడియోలు, వీడియోలు (డాక్టర్డ్) ప్రదర్శించారు. ఈ పుకార్లు, కధలు, వీడియోలు ప్రచారం చేసిపెట్టడంలో ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉన్న వార్తా ఛానెళ్లు, ముఖ్యంగా ఆంగ్ల వార్తా ఛానెళ్లు తలమునకలుగా సహకరించాయి. రోహిత్ ఆత్మహత్య దేశవ్యాపితంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన దళితుడు కావడం వల్లనే…

రోహిత్ ఆత్మహత్య: సస్పెన్షన్ ఎత్తివేత

కేంద్ర ప్రభుత్వ విశ్వ విద్యాలయం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రోహిత్ మిత్రులు నలుగురు రీసర్చ్ స్కాలర్ విద్యార్ధులపై స్పస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. సస్పెన్షన్ ఎత్తివేత తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది. సస్పెన్షన్ ఎత్తివేసినందున విద్యార్ధులంతా సాధారణ విద్యా కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని వైస్ ఛాన్సలర్ పి అప్పారావు కోరారు. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నియమించిన సబ్ కమిటీ గురువారం సమావేశమై సస్పెన్షన్ ను బేషరతుగా ఎత్తివేయడానికి నిర్ణయించిందని పాలకవర్గం ఒక ప్రకటనలో పేర్కొంది. “యూనివర్సిటీలో నెలకొన్న అసాధారణ…

రోహిత్: దళిత విద్యార్ధులు Vs హిందూత్వ రాజ్యం!

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎట్టకేలకు నోరు విప్పారు. ఆమె ఇచ్చిన వివరణ విద్యార్ధుల భావోద్వేగాలను చల్లార్చడానికి బదులు మరింత రెచ్చగొట్టినట్లుగానే వెలువడింది. “ఇది దళితులు-దళితేతరుల మధ్య సమస్యకు సంబంధించినది కాదు. రెండు విద్యార్ధి సంఘాలకు మధ్య ఘర్షణకు సంబంధించిన సమస్య. దళిత్ పేరుతో భావోద్వేగాలు రెచ్చగొట్టొద్దు” అని ఆమె ప్రకటించారు. అదే నోటితో ఆమె “వైస్ ఛాన్సలర్ ఆదేశాలను (ఆర్డర్ ను) విద్యార్ధులకు స్వయంగా అందించిన వ్యక్తికూడా దళితుడే” అంటూ తాను కూడా దళితుడి భుజం…