ఈ వికలాంగుల్ని చూస్తే స్ఫూర్తి కోసం వెతుక్కోవాల్సిన పని లేదు -ఫోటోలు

ఈ అధ్లెట్లని వికలాంగులని సంబోధించడానికి నిజానికి సిగ్గుపడాలి. కానీ అవధుల్లేని వీరి ఆత్మవిశ్వాసం యొక్క గ్రావిటీని అర్ధం చేసుకోవాలంటే వారి అంగవైకల్యాన్ని రిఫరెన్స్ గా తీసుకోక తప్పదు. కాసిన్ని కష్టాలు చుట్టుముడితేనో, ఆశించిన కాలేజీ సీటో, ఉద్యోగమో దక్కకపోతేనో, నచ్చిన వ్యక్తి భాగస్వామిగా దక్కకపోతేనో, మరింకేదో కష్టం ఎదురైతేనో… జీవితాల చివరి ఘడియల్ని వాటేసుకోవడానికి ఆతృత పడే బలహీన మనస్కులకు ఈ పారా-ఒలింపియన్ల జీవోన్మాదం కనువిప్పు కలిగిస్తుంది. 14 వ పారాలింపిక్స్ లండన్ లో ఆగస్టు 29…

అచంగ మార్కు డొల్ల శాస్త్రీయత మరొక్కసారి…

ఎకాలజిస్టు అచంగ గారు మళ్ళీ పాఠకులను తప్పుదారి పట్టించే పనిలో పడ్డారు. ఆయన నన్ను ఉద్దేశించి రాసిన తాజా టపాలో ఇలా రాశారు. ఇంకా తమరేమన్నారంటే, “అసలీయన సవాలు విసిరిందే ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూరప్‌ల దాకా రాలేదని“ఈ ముక్క చెప్పి చెలరేగిపోయారు! తమరికి తెలుగు రాకపోయన్నా ఉండాలి లేదా ఒక వ్యక్తి వ్యాఖ్యలను తమ నరంలేని నాలుక వంకర్లు తిప్పి అయినా ఉండాలి. నేనన్నదేమిటి మీరు చెప్పింది ఏమిటి? “అణుధార్మికత యూరోపు వరకూ విస్తరించిందనటానికి ఆధారాలేవైనా…

చంద్రబాబు నాయుడు గారూ! గ్యాస్ బండ మోస్తే, నిరసనా?

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పెంచింది. పెంచడం పరోక్షంగా జరిగినా జనంపైన మాత్రం ప్రత్యక్షంగా బాదేసింది. సంవత్సరానికి కుటుంబానికి 6 సిలిండర్లు మాత్రమే సబ్సిడీ రేట్లకు ఇస్తానని చెప్పింది. తద్వారా మిగిలిన సిలిండర్లను ఓపెన్ మార్కెట్లో 750/- ధరకి కొనక తప్పని పరిస్ధితి కల్పించింది. బి.జె.పి నాయకుడు వెంకయ్య నాయుడు ప్రకారం ప్రతి కుటుంబం పైనా సంవత్సరానికి అదనంగా 750 రూపాయల భారం పడనుంది. ఈనాడు ఎడిటోరియల్ ప్రకారం ఐదుగురు ఉన్న కుటుంబానికి…

రిజర్వేషన్లు కాదు, వ్యవస్ధాగత అణచివేతే అసలు సమస్య

(ఈ ఆర్టికల్ నిజానికి ‘గౌతమ్ మేకా’ గారి వ్యాఖ్య. “66 ఏళ్ల వెనుకబాటు భారతానికి సారధులు అగ్రకుల ప్రతిభా సంపన్నులే” అన్న టైటిల్ తో నేను రాసిన టపా కింద ఆయన రాసిన వ్యాఖ్య. విషయ ప్రాధాన్యత దృష్ట్యా, ఆంగ్లంలో రాసిన ఆయన వ్యాఖ్యను మరింతమంది పాఠకుల దృష్టికి తెచ్చే ఉద్దేశ్యంతో అనువదించి టపా గా మార్చుతున్నాను. ఇప్పటి వ్యవస్ధ పరిధిలోనే పరిష్కారం వెతికే ధోరణి ఉన్నప్పటికీ వ్యాఖ్యకు ఉన్న పరిమితి దృష్ట్యా, ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయంతో…

‘బేచులర్ పార్టీ’ సినిమా నెట్ లో చూసినందుకు 1010 మందిపై కేసులు

కేరళ పోలీసులకు చెందిన యాంటీ-పైరసీ విభాగం ఏకంగా 1010 మంది నెట్ వినియోగదారులపై కేసులు పెట్టింది. ‘బేచులర్ పార్టీ’ అనే మళయాళం సినిమాని ఇంటర్నెట్ లో అప్ లోడ్ గానీ, డౌన్ లోడ్ గానీ చెయ్యడమే వీరు చేసిన నేరం. దేశంలో ఇలాంటి కేసు నమోదు చేయడం ఇదే మొదటిసారని ‘ది హిందూ’ చెబుతోంది. బొగ్గు గనుల్ని దోచుకున్న వారిని ఏమీ చెయ్యలేకపోగా పార్లమెంటు సైతం వారికి అండగా ఉంటుంది.  ఒక సినిమా డౌన్ లోడ్ చేసుకున్నవారిని…

విశ్వమానవుడి రోజువారీ జీవనం, జీవితం -ఫొటోలు

వివిధ దేశాల్లో ప్రజల రోజువారీ జీవనాన్ని, ప్రజా జీవితంలోని వివిధ కోణాలనూ పట్టిచ్చే అరుదైన ఫొటోలివి. ముఖ్యంగా ప్రజల సాంస్కృతిక జీవనాన్ని ఈ ఫోటోలు ప్రతిబింబిస్తున్నాయి. ప్రజల ఆర్ధిక స్ధితిగతులను బట్టే వారి సంతోషాలు, బాధలూ నిర్ణయం అవుతుంటాయి. ఫోటోలన్నీ దాదాపు పాజిటివ్ కోణాన్ని ప్రతిబింబిస్తున్నప్పటికీ అక్కడక్కడా కొన్ని తేడాలు లేకపోలేదు. ఆర్ధిక బలిమి కలిగిన వర్గాల ప్రజల జీవనంలో సౌకర్యం, సంతృప్తి, ఆనందం, కొత్తదనం కనిపిస్తే శ్రమ అనివార్యం అయిన వర్గాల్లో శ్రమల అనివార్యతల్లోనే సంతృప్తి,…

66 ఏళ్ల వెనుకబాటు భారతానికి సారధులు అగ్రకుల ప్రతిభా సంపన్నులే

ఎస్.సి, ఎస్.టి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రతిపాదించింది. బుధ, గురు వారాల్లో ఈ బిల్లును రాజ్య సభలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించి విఫలం అయింది. సమాజ్ వాదీ పార్టీ, శివసేన పార్టీలు బిల్లుకి వ్యతిరేకంగా నినాదాలిస్తూ సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకున్నాయి. కోల్-గేట్ కుంభకోణాన్ని సాకుగా చూపి ప్రమోషన్ రిజర్వేషన్ల బిల్లు కి బి.జె.పి మోకాలడ్డింది. “జూనియర్లు సీనియర్లవుతారు. ఇదేం జోకా? ప్రభుత్వ పాలనే జోకైపోయింది” అని బి.సి ల విముక్తి ప్రదాత అయిన…

ఎస్సీ, ఎస్టీ ప్రమోషన్ల బిల్లు: పార్టీల వికృత రూపాలు బట్టబయలు

ఎస్.సి, ఎస్.టి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడానికి గురువారం మరో ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా పాలక, ప్రతిపక్ష పార్టీల ద్వంద్వ బుద్ధులు దేశ ప్రజల ముందు నగ్నంగా ప్రదర్శించబడ్డాయి. కోల్ గేట్ కుంభకోణం సృష్టించిన పార్లమెంటరీ సంక్షోభం నుండి బైట పడడానికి అధికార పార్టీ ‘ఎస్.సి, ఎస్.టి ప్రమోషన్ల రిజర్వేషన్’ బిల్లుని అడ్డు పెట్టుకుంటే, బి.సి ఓట్ల కోసం ఒక పార్టీ, హిందూ ఓట్ల కోసం మరొక పార్టీ ఈ…

శ్రీలంక కాకి తమిళనాడుపై ఎగరకూడదు మరి! -కార్టూన్

నేను చెప్పానా? తమిళనాడు పైన ఎగరకపోతేనే మంచిదని….! శ్రీలంక తో భారత దేశానికి ఉన్న ప్రతి సంబంధాన్నీ రాక్షసీకరించే ప్రయత్నాలు తమిళనాడులో జోరుగా సాగుతున్నాయి. రాజకీయ పార్టీలు ఒకరితో ఒకరు పోటీలు పడుతూ తమిళ జాతీయవాదంలో తామే నిఖార్సయినవారమని చెప్పడానికి అసలు సమస్యే కానీ అంశాలని పెద్ద సమస్యలుగా చేస్తున్నారు. ఎల్.టి.టి.ఇ తో పోరులో చివరి రోజుల్లో శ్రీలంక ప్రభుత్వం ఆదేశాల మేరకు తమిళ పౌరులపై సాగిన నరమేధం గురించి నిర్దిష్ట అవగానను ఇంతవరకూ ఈ పార్టీలేవీ…

నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్ 2012 ఫోటో పోటీలు -ఫోటోలు

‘నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్’ మ్యాగజైన్ (National Geographic Traveler) వారు 2012 సంవత్సరానికి గాను నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన ఫొటోలివి. 152 దేశాలకు చెందిన 6,615 మందికి పైగా ఫోటో గ్రాఫర్లు 12,000 కి పైగా సమర్పించిన ఎంట్రీలనుండి విజేతలను నిర్ణయించారరని మ్యాగజైన్ వెబ్ సైట్ తెలిపింది. ఆఫ్ఘనిస్ధాన్ నుండి వియత్నాం వరకూ తీసిన ఈ ఫొటోల్లో ప్రశాంత ల్యాండ్ స్కేప్ దృశ్యాలనుండి యాదృచ్ఛిక సంఘటనల వరకూ అన్ని రకాల దృశ్యాలనూ పరిగణించారట. మొత్తం మీద చూస్తే…

ప్రభుత్వాల ఉదాసీనత ఫలితం, తమిళనాడులో శ్రీలంక యాత్రీకులపై దాడులు

శ్రీలంక తమిళుల పరిస్ధితిపై కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ రెచ్చగొట్టే ప్రకటనలు వెరసి శ్రీలంక యాత్రీకులపై విద్వేషపూరిత దాడులు జరుగుతున్నాయి. తమిళనాడు దేవాలయాలను సందర్శించడానికి శ్రీలంక నుండి వచ్చిన యాత్రీకులు మధ్యలోనే ప్రయాణం ముగించుకుని భయాందోళనలతో తిరుగు ప్రయాణం కట్టారు. తమిళనాడు సందర్శనకు వ్యతిరేకంగా శ్రీలంక ప్రభుత్వం ‘ట్రావెల్ అడ్వైజరీ’ కూడా జారీ చేయవలసిన పరిస్ధితి తలెత్తింది. తమిళనాడు తమిళులనుండి రాళ్ళు, చెప్పుల దాడిని ఎదుర్కొన్న యాత్రికులలో శ్రీలంక తమిళులే మెజారిటీ కావడం జాతి…

పవర్ గ్రిడ్ విఫలమై విద్యుత్ సరఫరా ఆగిపోతే… -ఫోటోలు

ఉత్తర భారతంలో నెల రోజుల క్రితం విద్యుత్ సరఫరా ఆగిపోయి జన జీవనం స్తంభించినప్పటి ఫొటోలివి. జులై 30, 31 తేదీల్లో ఉత్తర భారత దేశంలోని ఏడు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్ధాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాలలో సరఫరా దెబ్బతిని అంధకారం నిండిపోయింది. రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి సూపర్ ఫాస్ట్ సర్వీసులతో పాటు 300 కి పైగా రైళ్ళు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. జులై…

డబ్బుకు లోకం దాసోహం, ఆలోచనాత్మక ఫోటో ప్రాజెక్ట్ -ఫోటోలు

వినియోగం కోసం తయారు చేసుకున్న వస్తువుల మారకం కోసం మనిషి సృష్టించిన సాధనమే డబ్బు. మారకాన్ని సులభతరం చేయడానికి పుట్టిన డబ్బు మనిషి జీవితాన్ని సంక్లిష్టం చేసింది. సామాజిక జీవనంలో భాగంగా పుట్టి సమాజాన్ని తన వశం చేసుకుంది. ఏం చేసయినా తనను వశం చేసుకున్నవాడిని అందలం ఎక్కించింది. శ్రమ తప్ప ఏమీ చేయ(లే)నివాడిని పాతాళానికి తోక్కేసింది. అమ్మా నాన్న, అక్కా చెల్లి, అన్నా తమ్ముడు, భార్య భర్త… ఇలా సమస్త సంబంధాల్లోకి జొరబడి మానవత్వాన్ని, మానవ…

నరోడ-పాటియా: నేరమెవరిది? శిక్షలెవరికి? -ఫోటోలు

2002 ఫిబ్రవరి 28 తేదీన అహ్మదాబాద్ శివార్లలోని నరోడ-పాటియా లో ముస్లింలపై సాగిన నరమేధానికి దోషులెవరో ప్రత్యేక సెషన్స్ కోర్టు గుర్తించింది. ముఖ్యంగా చేతిలో తుపాకి ధరించి, హిందూ మతం పేరుతో మూకలను రెచ్చగొట్టి, వారికి కత్తులు, కరవాలాలు సరఫరా చేసి తమను తాము రక్షించుకోలేని నిస్సహాయ మహిళలపైనా, పసి పిల్లలపైనా, వృద్ధులపైనా అత్యంత క్రూరంగా, అమానవీయంగా హత్యాకాండకి నాయకత్వం వహించిన మహిళా డాక్టర్ గా డాక్టర్ మాయాబెన్ కొడ్నానిని కోర్టు గుర్తించింది. రీసెర్చ్ స్కాలర్ పేరుతో…

మోడి ప్రతీకార సిద్ధాంతానికి చెంపపెట్టు, నరోడ-పాటియా తీర్పు

గుజరాత్ నరమేధం లో భాగంగా జరిగిన నరోడ-పాటియా హత్యాకాండ కేసులో ప్రత్యేక సెషన్స్ కోర్టు తరతరాలకు నిలిచిపోయే విధంగా అత్యద్భుతమైన తీర్పు ప్రకటించింది. గోధ్రా రైలు దహనానికి హిందువులు ఐచ్ఛికంగా తీసుకున్న ప్రతీకార చర్య ఫలితమే ‘ముస్లింలపై సాగిన నరమేధం’ అని ప్రవచించిన నరేంద్ర మోడి ‘ప్రతీకార సిద్ధాంతానికి’ చెంప పెట్టులాంటి తీర్పు ప్రకటించింది. గుజరాత్ మాజీ మంత్రి మాయా కొడ్నాని, భజరంగ్ దళ్ నాయకుడు బాబూ భజరంగి తదితరులు పన్నిన కుట్ర ఫలితంగానే ‘నరోడ-పాటియా నరమేధం’…