మానవత్వం లేని కాలేజీలు

ఢిల్లీ యూనివర్శిటీ పరిధిలోని కొన్ని కాలేజీల తీరిది. అంగవైకల్యాన్ని జయించడానికి శ్రమిస్తున్న సాటి మనుషులకు తోడు నిలిచి భుజం తట్టడానికి బదులు యధాశక్తి అడ్డంకులు సృష్టిస్తున్న కాలేజీలు దేశ రాజధానిలోనే కొలువుదీరి ఉన్నాయి. తమ తరపున పరీక్ష రాయడానికి తోడు తెచ్చుకున్నవారిని నిర్దాక్షిణ్యంగా బైటికి తరిమికొట్టి, ఓ అంధ విద్యార్ధి పరీక్షలో తప్పడానికి సిద్ధపడిన కాలేజీ ఒకటైతే రైటర్ ని ఆలస్యంగా అందించడమే కాక కొశ్చేన్ పేపర్ కి పూర్తి సమాధానం ఇవ్వడానికి ఒక్క నిమిషం కూడా…

గుట్టు రట్టు: భాగ్యలక్ష్మి ఆలయం ఐదు దశాబ్దాల నాటిది మాత్రమే -ఫోటోలు

ఛార్మినార్ కట్టడానికి ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి ఆలయ కట్టడం గుట్టుని ‘ది హిందూ’ పత్రిక రట్టు చేసింది. హిందూ సంస్ధలు, గ్రూపులు చెబుతున్నట్లుగా భాగ్యలక్ష్మి ఆలయం ఛార్మినార్ కట్టడమంత పాతదేమీ కాదనీ, అది కేవలం 50 సంవత్సరాల క్రితం నాటిదేననీ తెలియజేసింది. బాగ్యలక్ష్మి ఆలయం కట్టడానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా లేని ఫోటోను పత్రిక బుధవారం ప్రచురించింది. ఫోటో పైన తేదీ ఏమీ లేనప్పటికీ ఫోటోలో ఉన్న కార్లను బట్టి అది ఆరు శతాబ్దాల క్రితం తీసిన…

ఫేస్ బుక్ లో ధాకరే బంద్ వ్యతిరేకించిన మహిళల అరెస్టు, ఉగ్రుడయిన జస్టిస్ కట్జు

ధాకరే అంతిమ యాత్ర కూడా ముంబై ప్రజలకు విద్వేషంలోని మరో కోణాన్ని చవి చూపింది. ధాకరే అంతిమయాత్ర కోసం ముంబై బంద్ పాటించడం వ్యతిరేకిస్తూ ఫేస్ బుక్ లో సందేశం ఉంచిన అమ్మాయితో పాటు ఆ సందేశాన్ని లైక్ చేసిన మరో అమ్మాయిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల చర్యపై ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జు ఆగ్రహోదగ్రుడయ్యాడు. అమ్మాయిల అరెస్టుకు పాల్పడిన పోలీసు అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలనీ కోరుతూ ఆయన…

నేనెందుకు ధాకరేకు నివాళులు అర్పించలేను? -జస్టిస్ కట్జు

(జస్టిస్ మార్కండేయ కట్జు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేసి పదవీ విరమణ చేశాడు. ఇప్పుడాయన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఛైర్మన్. తన అభిప్రాయాలను జస్టిస్ కట్జు నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తాడని పేరు. దానివలన ఆయనకి మిత్రులు ఎంతమంది ఉన్నారో శత్రువులూ దాదాపు అంతమంది ఉన్నారు. ముద్రణా మీడియాపై నియంత్రణ ఉన్నట్లే దృశ్య, శ్రవణ మీడియా పై కూడా పరిమిత నియంత్రణ ఉండాలని వాదించడం వలన ఆయనకి మీడియాలో కూడా వ్యతిరేకులు ఉన్నారు. రెండు రోజుల…

నగ్నత్వం కాదు, ముస్లిం అస్తిత్వమే ఎం.ఎఫ్ హుస్సేన్ పై దాడులకు కారణం

(రచయిత: నాగరాజు అవ్వారి) ఎం.ఎఫ్.హుస్సేన్ ఆధునిక చిత్రకారుడు. ఆయన చిత్రాలలో రూపం రీత్యా క్యూబిజం వంటి అనేక ఆధునిక ధోరణులు కనిపిస్తాయి. అయితే భావజాల రీత్యా సంపూర్ణంగా ఆధునికుడని ఆయనను ఒప్పుకోవడం కష్టం. ఏ రకమైన భావజాలానికీ ఆయన ప్రాతినిధ్యం వహించకపోవడం దీనికి కారణం. ప్రత్యేకంగా ఏ ఒక్క భావజాలానికీ ప్రాతినిధ్యం వహించక పోవడంవల్ల ఆయన చిత్రాలలో రూపంలోనూ, సారంలోనూ అనేక రకమైన ధోరణులు కనపడతాయి. ఆరెస్సెస్ ఆయన పట్ల తీసుకున్న వైఖరికి ప్రత్యేకమైన కారణాలున్నాయి. “హిందూత్వ”కు…

సవిత ప్రాణం బలితీసుకున్న అబార్షన్ వ్యతిరేక కేధలిక్ చట్టం

ఐర్లండ్ దేశ కేధలిక్ చట్టాలు అబార్షన్ కి అనుమతించక పోవడంతో భారత సంతతి యువతి సవిత హలప్పనవర్ ప్రాణాలు కోల్పోయింది. తాను హిందూ యువతిననీ కేధలిక్ చట్టాలు తనకు వర్తింపజేయొద్దనీ కోరినప్పటికీ చట్టం దృష్టిలో నేరస్ధులుగా మారడానికి డాక్టర్లు ముందుకు రాలేదు. దానితో ఇంకా రూపమే తీసుకోని జీవాన్ని రక్షించే పేరుతో ఉనికిలోకి వచ్చిన అనాగరిక చట్టానికి రెండు ప్రాణాలూ బలైపోయాయి. 31 సంవత్సరాల సవిత దుర్మరణం సంగతి బైటికి పొక్కడంతో వేలాది ప్రజలు స్త్రీలకు అబార్షన్…

ఈ ఎం.ఎఫ్.హుస్సేన్ చిత్రంలో నగ్నత్వం ఉందా?

ప్రపంచ ప్రఖ్యాత భారతీయ చిత్రకారుడు ఎం.ఎఫ్.హుస్సేన్ ఈ చిత్రాన్ని గీశాడు. 2009 సంవత్సరంలో మార్చి 8 తేదీన అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా డెక్కన్ క్రానికల్ పత్రిక ఈ చిత్రాన్ని ప్రచురించింది. భారతదేశ మహిళల స్త్రీత్వం యొక్క సారం వారి శక్తే (Essence of Indian womenhood is shakti) అని ఎం.ఎఫ్.హుస్సేన్ ఈ చిత్రానికి శీర్షికగా పెట్టాడు. భారత దేశ మహిళల శక్తికి దుర్గా దేవిని ప్రతీకగా చూపిస్తూ హుస్సేన్ ఈ బొమ్మని గీసినట్లు చూస్తే…

రాముడు చెడ్డ బాలుడు -రాం జేఠ్మలాని

‘రాముడు మంచి బాలుడు’ అని చదవడమే ఇప్పటిదాకా మనకున్న అలవాటు. ఇకనుండి ‘రాముడు చెడ్డవాడు’ అనికూడా చదువుకోవచ్చు. బి.జె.పి రాజ్యసభ సభ్యుడు, జగన్ బెయిల్ కోసం తీవ్రంగా శ్రమించి విఫలం అయిన ప్రముఖ సుప్రీం కోర్టు లాయర్ రాం జేఠ్మలాని భారత ప్రజలకు ఆ అవకాశాన్ని కల్పించాడు. ఏ కారణంతో అయితే ఇన్నాళ్లూ ఆయన్ని నెత్తిన పెట్టుకున్నారో సరిగ్గా అదే కారణంతో రాముడు తాజాగా చెడ్డవాడు కావడమే ఓ ఆసక్తికర పరిణామం. స్త్రీ, పురుషుల మధ్య సంబంధాలపై…

‘మాదే స్నాన’ ఇపుడు ఎంగిలాకులపై కాదట!

కర్ణాటకలోని కుక్కే సుబ్రమణ్య దేవాలయంలో జరుగుతున్న కుల దురాచారంలో ఇక ఎంగిలాకులను ఉపయోగించరు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకనుండి ‘ఎవరూ ఆరగించని’ ప్రసాదాన్ని ఆకుల్లో పెట్టి ఆరుబయట పరిస్తే ఆచారం పాటించదలిచినవారు వాటిపై పడి దొర్లొచ్చు. సుబ్రమణ్య ఆలయంలో కులాధిపత్య దురాచారాన్ని అడ్డుకోవాలని ఆలయంలో బ్రాహ్మణులు మాత్రమే ప్రసాదాన్ని ఆరగించే సౌకర్యాన్ని రద్దు చేయాలనీ హై కోర్టులో దాఖలయిన ఫిర్యాదుకు ఈ విధంగా పరిష్కారం లభించింది. పిటిషనర్లు కూడా సవరించిన దురాచారానికి ఆమోదం చెప్పడంతో వివాదాన్ని…

ధర్మపురి కుల హింస: బంగారం, డబ్బు దోచుకుని తగలబెట్టారు -ఫోటోలు

ధర్మపురి జిల్లాలో కులాంతర వివాహం వల్ల జరిగిన కుల హింసలో దాడి చేసినవారు ఒక పధకం ప్రకారం వ్యవహరించారు. ప్రతి ఇంటిని వెతికి విలువైన వస్తువులను దోచుకున్నాకనే ఇళ్లను తగలబెట్టారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ (టి.ఒ.ఐ) పత్రిక తెలిపింది. ఇళ్లతో పాటు ఇళ్లముందు ఉన్న వాహనాలను కూడా తగలబెట్టారని తెలిపింది. మొత్తం 268 ఇళ్ళను, 50 ద్విచక్ర వాహనాలను, నాలుగు వేన్లను తగలబెట్టారని డేషింగ్ టైమ్స్ పత్రిక తెలిపింది. దాదాపు 2500 మంది దాడిలో పాల్గొన్నారనీ, అప్పటికే…

దళితుడిని పెళ్ళాడితే దళిత కాలనీలు తగలబడతాయ్!

ఓ అగ్రకుల యువతి దళిత యువకుడిని వివాహం చేసుకున్నందుకు యువతి తండ్రి ఆత్మహత్య చేసుకోగా, యువతి కులస్ధులు మూకుమ్మడిగా దాడి చేసి దళితుల కాలనీని తగలబెట్టిన దుర్మార్గం తమిళనాడులో చోటు చేసుకుంది. కులం పరువుకోసం దళితుల ఇళ్లను తగలబెట్టిన ఈ సో కాల్డ్ అగ్రకులస్ధులు తగలబెట్టిన ఇళ్ళలో దోపిడీకి తెగబడి తమ పరువు ఎంత పాతాళంలోకి దిగబడి ఉందో చెప్పకనే చెప్పుకున్నారు. సాంస్కృతిక అభివృద్ధిలో ఉత్తరభారతం కంటే ముందున్నాయని చెప్పే దక్షిణ భారత రాష్ట్రాల్లోనూ అదే వెనుకబాటుతనం…

ముస్లింల వ్యతిరేకి వి ఎస్ నైపాల్ కి అవార్డా! ఎందుకు? -గిరీష్ కర్నాడ్ -2

మొదటిభాగం తరువాయి… ఇపుడు మళ్ళీ ఆయన చెప్పేదేమిటో ఊహించదగినదే. అదేమంటే, ముస్లింలు భారతీయ ఆర్కిటెక్చర్ ను నాశనం చేశారు; ప్రతీదీ కూలిపోయింది. వారు దోపిడీదారులు మరియు వినాశనకారులు. ముస్లింల హయాంలో ఏమి జరిగిందో తెలియాలంటే ఏ భవనాన్నైనా చూడవచ్చు. జనం ఆయనతో వాదించినపుడు ఆయన తాజ్ గురించి ఏమాన్నాడో చూడండి: “తాజ్ అనేది పెద్ద వృధా, క్షీణదశలో ఉన్నది. చివరికది ఎంత క్రూరమైనదంటే అక్కడ ఎక్కువసేపు ఉండడం నాకు చాలా కష్టంగా తోచింది. ప్రజల రక్తం గురించి…

ముస్లింల వ్యతిరేకి వి ఎస్ నైపాల్ కి అవార్డా! ఎందుకు? -గిరీష్ కర్నాడ్ -1

[సుప్రసిద్ధ నాటక రచయిత, సినీ నటుడు గిరీష్ కర్నాడ్ ముంబై గడ్డపై ఒక సాహితీ వేదికలో నిర్వాహకులపైనే కత్తి దూశాడు. ట్రినిడాడియన్-బ్రిటిష్ పౌరుడు, నోబెల్ సాహితీ బహుమతి స్వీకర్త విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్ కు ‘టాటా లిటరేచర్ లైవ్! ఫెస్టివల్’, లైఫ్ అఛీవ్మెంట్ అవార్డ్ ప్రకటించడంపై మండిపడ్డాడు. ‘నాటకరంగంలో తన ప్రయాణం’ పై ప్రసంగించడానికి నిర్వాహకులు గిరీష్ ను ఆహ్వానించగా ఆయన నైపాల్ రాతలపై, భావాలపై దాడి చేయడానికి అవకాశాన్ని వినియోగించాడు.బాబ్రీ మసీదు కూల్చివేతను సమర్ధించిన…

శ్రమ విలువను గుర్తించిన మేధావి ఆమె

ఆమె పేరు క్రాంతి (ట). అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి విజయనగరం జిల్లా ఇట్లమామిడి పల్లిలో వ్యవసాయం చేయడానికి వచ్చిన ఈమె అద్భుత మహిళగా తోస్తోంది. కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ సంస్మరణ వ్యాసం కోసం రాజశేఖర రాజు గారి బ్లాగ్ లోకి వెళ్ళి, అక్కడి నుండి ఓ లింక్ పట్టుకుని జర్నలిస్టు అరుణ పప్పు గారి బ్లాగ్ లోకి వెళ్తే ఓ అపూర్వ కధనం కనిపించింది. ఆ కధనం ఆసాంతం చదివాక నిజంగా ఆశ్చర్యంతో ఏ…

‘రివర్స్ స్టింగ్’ లో దొరికిపోయిన జీ న్యూస్ బ్లాక్ మెయిలింగ్

స్టింగ్ ఆపరేషన్లతో ఠారెత్తిస్తున్న మీడియా రివర్స్ స్టింగ్ ఆపరేషన్ లో బైటపడిపోయి నీళ్ళు నములుతోంది. జిందాల్ స్టీల్ పవర్ లిమిటెడ్ (జె.ఎస్.పి.ఎల్) ఛైర్మన్ నవీన్ జిందాల్ ను బొగ్గు కుంభకోణం స్టోరీతో బ్లాక్ మెయిల్ చెయ్యబోయిన జీ న్యూస్ ఎడిటర్లు రహస్య కెమెరాకి అడ్డంగా దొరికిపోయారు. కుంభకోణం స్టోరీని ప్రసారం చెయ్యకుండా ఆపడానికి మొదట 20 కోట్లు ఆ తర్వాత 100 కోట్లు కెమెరా ముందు డిమాండ్ చేసిన జీ న్యూస్ ఎడిటర్లు తాము స్టింగ్ ఆపరేషన్…