కూతుళ్ళకి కాదు, కొడుకులకు కాపలా కాయండి!

(రచన: రమ) ఢిల్లీ బస్సులో జరిగిన సామూహిక అత్యాచార దుర్ఘటన ఎన్నడూ లేనివిధంగా ప్రజాగ్రహానికి గురయింది. మధ్య తరగతి యువతీ యువకులు వీధుల్లోకి వచ్చి రోజుల తరబడి తీవ్రస్ధాయిలో ఉద్యమించారు. వీరివెనుక ఎలాంటి రాజకీయ పార్టీలుగానీ, విద్యార్ధి సంఘాలుగానీ, ఇతరేతర సంఘాలుగానీ ఉన్న ధాఖలాలు కనపడలేదు. 1975లో హైదరాబాదులో జరిగిన రమీజాబీ అత్యాచార దుర్ఘటన తరువాత యింత ఉధృతమైన ప్రజాప్రతిఘటన అత్యాచారాల విషయంలో ఇదేనని చెప్పవచ్చు. రమీజాబీ విషయంలో విద్యార్ధి సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు ఒక…

నా కూతురి పేరు ప్రపంచానికి తెలియాలి -బద్రిసింగ్ పాండే

“ప్రపంచానికి నాకూతురు పేరు తెలియాలి. నాకూతురు తప్పేమీ చేయలేదు. తననుతాను కాపాడుకునే ప్రయత్నంలో ఆమె చనిపోయింది… నా కూతురంటే నాకు గర్వంగా ఉంది. ఆమె పేరు వెల్లడిస్తే ఇలాంటి దాడులు ఎదుర్కొని బైటపడినవారికి ధైర్యంగా ఉంటుంది. నాకూతురినుండి వారు శక్తిని పొందుతారు” అని 53 సంవత్సరాల బద్రిసింగ్ పాండే చెప్పడాని బ్రిటన్ పత్రిక ‘సండే పీపుల్’ తెలిపింది. మరో ప్రఖ్యాత పత్రిక ‘డెయిలీ మిర్రర్’ కి ఇది అనుబంధం. అమ్మాయి పేరును కూడా పత్రిక వెల్లడించింది. ఉత్తర…

ఉరి వద్దు, సజీవ దహనం చెయ్యండి -అమానత్ కోరిక

అమానత్/దామిని/నిర్భయ మిత్రుడు మౌనం వీడి కొన్ని చేదు నిజాలు చెప్పాడు. సాయం కోసం అరిచినా 45 నిమిషాల సేపు ఒక్క వాహనంగానీ, ఒక్క వ్యక్తిగానీ ఆగకుండా వెళ్లిపోయారని అతను తెలిపాడు. తన స్నేహితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో పోలీసులు విపరీతమైన ఆలస్యం చేశారనీ, నగ్నంగా ఉన్న తనకుగానీ, తన స్నేహితురాలికిగానీ కనీసం కప్పుకోవడానికి ఒక గుడ్డ ఇచ్చిన పాపాన పోలేదనీ అతను ఆరోపించాడు. విపరీతంగా రక్తం కారుతున్న తన స్నేహితురాలిని తానొక్కడినే ఎత్తుకుని పి.సి.ఆర్ (పోలీస్ కంట్రోల్ రూమ్)…

మూతపడని నోళ్ళు, గీత దాటితే సీత గతేనట!

అత్యాచారాలకి వ్యతిరేకంగా అంతపెద్దఎత్తున జనం ఉద్యమించినా పురుష పుంగవుల నోళ్ళు మూతపడబోమంటున్నాయి. గీత దాటితే సీతకి పట్టిన గతే పడుతుందని బి.జె.పి నాయకుడొకరు నోరు పారేసుకుంటే, మహిళలపై అత్యాచారాలు ఇండియాలో జరుగుతున్నాయి గానీ భారత్ లో జరగడం లేదని ఆర్.ఎస్.ఎస్ సుప్రీం నాయకుడు స్పష్టం చేస్తున్నాడు. మధ్య ప్రదేశ్ బి.జె.పి మంత్రి కైలాస్ విజయ్ వర్గియా, ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ తాజాగా మహిళాలోకం ఆగ్రహాన్నీ, పౌర ప్రపంచం ఖండన మండనలను ఎదుర్కొన్నారు. “Ek…

దక్షిణ కొరియా పేడోఫైల్ కు కెమికల్ కేస్ట్రేషన్ శిక్ష

లైంగిక అత్యాచారాల నిరోధం విషయంలో భారత ప్రభుత్వానికి దక్షిణ కొరియా ఒక దారి చూపినట్లు కనిపిస్తోంది. అత్యాచార నేరస్ధులకు ‘రసాయన పుంస్త్వనాశనం’ (chemical castration) ఒక శిక్షగా విధించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇప్పటికే ప్రతిపాదించగా దక్షిణ కొరియా కోర్టు ఒక పెడోఫైల్ (చిన్నపిల్లలపై అలవాటుగా లైంగిక అత్యాచారం చేసే వ్యక్తి) కి మొదటిసారిగా ‘రసాయన పుంస్త్వ నాశనం’ శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. కెమికల్ కేస్ట్రేషన్ కు అనుగుణంగా 2011లో చట్టం చేసిన తర్వాత దక్షిణ కొరియాలో…

గుజరాత్ లోకాయుక్త: మోడికి ఓటమి, గవర్నర్ కి మొట్టికాయ

కోర్టుల్లో ఓటమి పరంపరను నరేంద్ర మోడీ దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు. గుజరాత్ గవర్నర్ నియమించిన లోకాయుక్తకు తన ఆమోదం లేనందున నియామకాన్ని రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టు గడప తొక్కిన మోడి అక్కడ కూడా ఓటమి చవిచూశాడు. తొమ్మిదేళ్లకు పైగా రాష్ట్ర లోకాయుక్త పదవిని ఖాళీగా అట్టిపెట్టిన నీతివంతమయిన ముఖ్యమంత్రి మోడి గవర్నర్ చొరవను హర్షించే కనీసనీతిని ప్రదర్శించలేకపోయాడు. తనను తాను అజేయుడుగా భావించుకునే అపోహనుండి మోడీ బైటికి రావాలని గుజరాత్ హైకోర్టు చేత అత్యంత అవమానకరంగా అభిశంసన…

ఢిల్లీ అత్యాచారం: కొనసాగుతున్న గోప్యత ఎవరి ప్రయోజనాలకు?

మరిన్ని రక్షణలతో రూపొందనున్న కొత్త అత్యాచార నిరోధ చట్టానికి ఢిల్లీ అత్యాచారం బాధితురాలి పేరు పెట్టడానికి సూచన వచ్చింది. కేంద్ర మంత్రి శశిధరూర్ ఈ సూచన చేశాడు. అమ్మాయి పేరుని ఇంతవరకూ బైటపెట్టకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన శశిధరూర్ అమ్మాయి తల్లిదండ్రులు, సోదరులు అంగీకరిస్తే నూతన సవరణలతో కూడిన చట్టానికి అమ్మాయి పేరే పెట్టాలని ఆయన కోరాడు. బాధితురాలి తల్లిదండ్రులు, సోదరులు అందుకు తమకు అభ్యంతరం లేదని తెలియజేశారని ‘ది హిందూ’ తెలిపింది. ప్రభుత్వానికి ఈ ఆలోచన…

అమ్మాయిల గౌన్లు అశ్లీలమా? వీళ్ళు కదా రేపిస్టులకు కాపలాదార్లు!

స్కూళ్ళు, కాలేజీల అమ్మాయిలు గౌనులు ధరించడం వల్లనే వారికి సమస్యలు వస్తున్నాయనీ, కనుక విద్యార్ధినులు గౌను ధరించడం నిషేధించాలనీ రాజస్ధాన్ కి చెందిన ఒక ఎమ్మెల్యే తమ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖరాసి కలకలం సృష్టించాడు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ఆగ్రహించిన విద్యార్ధినులు ఆయన ఇంటిముందు నిరసన నిర్వహించడమే కాకుండా ఆయనాకొక గౌను బహూకరించారు. అమ్మాయిల దుస్తుల ధారణపై ప్రతికూల వ్యాఖ్యలు చేసి అప్రతిష్టపాలవుతున్న వారి జాబితాలో ఆళ్వార్ నగర నియోజకవర్గ ఎమ్మెల్యే బన్వరీలాల్ సింఘాల్ చేరిపోయాడు.…

నిర్భయానికి మరణం లేదు -కవిత

ఢిల్లీ బస్సులో దారుణానికి గురై మరణించిన అమ్మాయిని పత్రికలు, ప్రజలు, ఆందోళనకారులు అనేక పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు. ఆరు మృగాలతో నిర్భయంగా పోరాడింది కనుక ‘నిర్భయ’ అనీ కొందరు, ఒకనాటి వాస్తవ ఘటనకు గుర్తుకు తెచ్చుకుంటూ ‘దామిని’ అని కొందరు పిలుస్తున్నారు. ఎన్.డి.టి.వి చానెల్ బాధితురాలిని ‘అమానత్’ అని సంబోధించింది. ఆకాశంలో సగం ధిక్కరించిన పిడికిళ్ళైనంతకాలం తాను ఏ పేరుతోనైనా నిలిచే ఉంటుందని మరో కవి చిట్టిపాటి.వెంకటేశ్వర్లు తన కవితలో ఇలా స్పందిస్తున్నారు. బొమ్మపై క్లిక్ చేసి…

హిందూ ద్వేషంతో భారతీయుడిని పట్టాలపైకి నెట్టి చంపిన అమెరికన్ మహిళ

అమెరికాలో న్యూయార్క్ సబ్ వే లో భారతీయుడొకరు దారుణంగా హత్యకు గురయ్యాడు. రైలుకోసం ఎదురుచూస్తున్న అతన్ని ఓ అమెరికన్ మహిళ స్టేషన్ లోకి ప్రవేశిస్తున్న రైలు ముందుకి వెనకనుండి తోసి చంపేసింది. మొదటి, రెండు కంపార్ట్ మెంట్లు అతని మీదుగా పోవడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని సునందో సేన్ గా గుర్తించారు. తనకు హిందువులన్నా, ముస్లింలన్నా ద్వేషమనీ అందుకే అతన్ని చంపేశాననీ అమెరికన్ మహిళ అంగీకరించినట్లుగా న్యూయార్క్ పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 11, 2001…

కూతురు ప్రశ్న–హృద్యమైన కవిత

కూతురు ప్రశ్న -రచన: నాగరాజు ఒక దృశ్యానికేసి చూపుతూ మర్మాంగమంటే ఏమిటని ఏడేళ్ళ కూతురు అడిగిన ప్రశ్నకు దూరంగా ఉదయం నుండి తిరుగుతున్నాను ఒక్కో పూవునూ ఏరి కూర్చి కథా మాలికలను దిగంతాలకు పరిచినట్టో ఒక దృగ్విషయపు లోతులకు దూకి పొరలను తొలుచుకొని కాంతియానం చేసినట్టో కాదు కదా అదే పనిగా ఎవరూ చెప్పకపోయినా సరిగా కూర్చోవాలనీ దాచ్చుకున్నట్టుగా తిరగాలనీ తన చుట్టూ ఉన్న వారిలోనే తప్పుక తప్పుక తిరుగుతూ జీవన క్రియలనూ జీవితాన్నీ సాగించాలనీ నేర్చుకుంటున్న…

మృ(మ)గత్వాన్ని ధిక్కరించి, రాజ్యాధిపత్యాన్ని వణికించిన సాహసి ఇక లేదు

యావత్భారతదేశాన్ని అశ్రుధారల్లో ముంచుతూ ఆ సాహసిక యువతి తుదిశ్వాస విడిచింది. క్రూర మృగాలు సైతం సిగ్గుపడేలా ఆరుగురు మగవాళ్ళు అత్యంత హేయమైన రీతిలో ఆడిన పాశవిక మృత్యుక్రీడలో ఆమె ఆవిసిపోయి సెలవు తీసుకుంది. శరీరాన్ని నిలిపి ఉంచే వివిధ అవయవాలు విషతుల్యమైన రక్తం ధాటికి ఒక్కొక్కటీ కూలి సోలిపోగా కుటుంబసభ్యుల మధ్యా, పేరు మోసిన వైద్యుల మధ్యా శాశ్వతంగా కన్నుమూసింది. పోతూ పోతూ అభివృద్ధి సాధించామని చెప్పుకుంటున్న నాగరీక మానవుల మానవత్వాన్ని పరిహసించి పోయిందామె. “ఆమెను బతికించడానికి…

బాధితురాలి సింగపూర్ తరలింపు రాజకీయం -డాక్టర్లు; కాదు -ప్రభుత్వం

ఢిల్లీ బస్సులో సామూహిక అత్యాచారానికి గురయిన అమానత్ (అసలు పేరు కాదు) ను సింగపూర్ లోని ‘మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్’ కి తరలించాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న రాజకీయ నిర్ణయమే తప్ప తాము తీసుకున్న వైద్య నిర్ణయం కాదని అమానత్ కి వైద్యం చేసిన డాక్టర్లు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం వైద్యం కోసమే సింగపూర్ తరలింపు నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. బాధితురాలి ఆరోగ్యం మరింత క్షీణిస్తున్నదనీ, ఆమె శరీర అవయవాలు పని చేయడం లేదనీ, ఆమె మెదడుకు…

అమ్మాయిలు డేటింగ్ చేస్తే అత్యాచారానికి అర్హులవుతారా?

(ఈ టపా దీనికి ముందరి టపా కింద మిత్రుడు ప్రవీణ్ రాసిన వ్యాఖ్యలకు సమాధానంగా పాఠకులు గ్రహించగలరు) – స్త్రీవాదిననీ, మార్క్సిస్టుననీ చెప్పే మిత్రుడు చేసిన వ్యాఖ్యల్లో వ్యక్తపరిచిన అభిప్రాయాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. పైగా తన అభిప్రాయాలతో ఏకీభవిస్తేనే స్త్రీవాది మరియు మార్క్సిస్టు అవుతారన్నట్లుగా చెప్పడం ఇంకా అభ్యంతరకరంగా ఉంది. మిత్రుడు చెప్పిందాన్నిబట్టి చూస్తే, ఆయన దృష్టిలో డేటింగ్ అంటే శారీరక సంభోగమే తప్ప మరొకటి కాదు. స్త్రీలు డేటింగ్ చేయడం తనకి నచ్చదు. ఒక…

బాధితురాలి స్టేట్‌మెంట్‌ని మార్చడానికి ఢిల్లీ పోలీసుల కుయత్నం?

ఢిల్లీ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్.డి.ఎం) ముందు సామూహిక అత్యాచారం బాధితురాలు ఏమి జరిగిందీ తెలియజేసింది. ఎస్.డి.ఎం ముందు బాధితురాలు అమానత్ (అసలు పేరు కాదు) ఏమి చెప్పిందీ సౌత్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డి.సి.పి) ఛాయా శర్మ క్లుప్తంగా పత్రికలకు తెలిపింది. ఆమె ప్రకారం ఆ రోజు రాత్రి దాదాపు 9:30 గంటలకు అమానత్ తన ఫ్రెండ్ తో కలిసి మునిర్కాలో బస్ స్టాప్ వద్ద నిలబడి ఉన్నారు. బస్సులో ఉన్న మైనర్…