బాలికలపై అత్యాచారాలు, కదిలించే కార్టూన్లు

ఏప్రిల్ 15 తేదీన ఇద్దరు యువకులు పీకల్దాకా తాగి కన్నూ మిన్నూ కానని మదాన్ని నిలువెల్లా నింపుకున్నారు. కాపు కాసి, చాక్లెట్ ఆశ చూపి అయిదేళ్ళ పాపను తమ గదిలోకి తీసుకెళ్లారు. అనంతరం అత్యంత పాశవిక రీతిలో అత్యాచారం చేశారు. ఏప్రిల్ 17 తేదీన కూడా ఇలాగే మరో ఐదేళ్ల పాపను చాక్లెట్ ఆశ చూపి పిలిచి అత్యాచారం చేశాడొక మధ్య వయస్కుడు. పనయ్యాక పాపని పొలాల్లో పారేసిపోయాడు. ఆ పాప ఇప్పుడు పూనాలో ఒక ప్రైవేటు…

మహిళలపై నేరాలు -గ్రాఫిక్స్

2012, 2013 సంవత్సరాలకు గాను జనవరి 1 నుండి ఏప్రిల్ 15 వరకు భారత దేశంలో మహిళలపై జరిగిన వివిధ నేరాలను పోల్చుతూ పి.టి.ఐ వార్తా సంస్ధ ఈ క్రింది గ్రాఫిక్స్ ను తయారు చేసింది. ది హిందు పత్రిక అందజేసిన ఈ గ్రాఫిక్స్ లో వివరాలు కళ్ళు బైర్లు కమ్మేలా ఉన్నాయి. మహిళలపై నేరాలకు పాల్పడినవారిలో అత్యధికులు సమీప బంధువులు, తెలిసినవారేనని ఈ వివరాల ద్వారా తెలుస్తున్నది. 2013లో ఇప్పటి వరకు 1869 నేరాలు మహిళలపై…

ఆడది అలా చూడకుండా మగాడేమీ చెయ్యడు -కాంగ్రెస్ నాయకుడు

ఒకరో, ఇద్దరో నాయకులైతే నాలుగు మాటలతో విమర్శించి ఛీ, ఛీ అని ఊరుకుంటాం. ఒకసారి, రెండు సార్లు అయినా ‘సరికాదు, సవరించుకోండి’ అని చెబుతాం. కానీ ఈ రాజకీయ నాయకులు గుంపంతా అదే బాపతైతే ఎన్ని విమర్శలు చేయాలి. ఎన్ని ఛీ, ఛీలు కొట్టాలి, ఎన్నిసార్లు సవరించుకోమని చెప్పాలి!? మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి కూడా అయిన ఓ పెద్ద మనిషి మహిళలు ఆహ్వానించే విధంగా చూడకపోతే మగాళ్లు అసలు వారినేమీ ఇబ్బంది పెట్టరు…

దాహం వేసినప్పుడు బావి తవ్వుకుందాం! -కార్టూన్

“ఏయ్! ఆ పోలీసు సంస్కరణల పుస్తకాలు పట్రండి… ఇప్పుడే!” – ప్రభుత్వము, పోలీసులు అనేక అంశాల్లో దాహం వేసినప్పుడు బావి తవ్వుకునే ధోరణి అనుసరించడం అందరూ ఎరిగినదే. మహిళలపై అత్యాచారాలు జరిగిన సందర్భం వచ్చినప్పుడల్లా పోలీసు సంస్కరణల గురించి మంత్రులు, రాజకీయ నాయకులు, చివరికి పోలీసు అధికారులు సైతం అనేక మాటలు, వాగ్దానాలు కురిపించడం సర్వసాధారణంగా మారింది. దుర్ఘటన జరిగినపుడు పోలీసులు తగిన రీతిలో స్పందించకపోవడం పోలీసుల తీరుతో ప్రజలు, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగడం ప్రభుత్వము,…

జస్టిస్ వర్మ ఇక లేరు

జ్యోతి సింగ్ పాండే అలియాస్ నిర్భయ పై జరిగిన పాశవిక సామూహిక అత్యాచార, హత్యోదంతం అనంతరం భారత దేశ న్యాయ వ్యవస్ధకు బాధ్యతాయుతమైన రీతిలో ప్రాతినిధ్యం వహించిన జస్టిస్ జగదీష్ శరణ్ వర్మ సోమవారం మరణించారు. నిర్భయ చట్టం రూపకల్పన కోసం ప్రభుత్వం నియమించిన కమిటీకి నాయకత్వం వహించిన జస్టిస్ జె.ఎస్.వర్మ రికార్డు సమయంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ప్రజల సమస్యల పట్ల అధికార వ్యవస్ధ స్పందించవలసిన తీరుకు ఒక ఉదాహరణగా నిలిచారు. ‘నిర్భయం చట్టం’ –…

ఢిల్లీ పాప అత్యాచారం: రెండో నిందితుడి అరెస్టు

తూర్పు ఢిల్లీలోని గాంధీ నగర్ లో ఐదేళ్ల పాపపై అత్యాచారం జరిగిన కేసులో రెండో వ్యక్తి పాత్రను నిరాకరిస్తూ వచ్చిన పోలీసులు సోమవారం అందుకు విరుద్ధమైన పరిణామాన్ని దేశ ప్రజల ముందు ఆవిష్కరించారు. రెండో నిందితుడుగా భావిస్తున్న ప్రదీప్ ను బీహార్ లోని లఖిసారాయ్ జిల్లా నుండి అరెస్టు చేశామని ఢిల్లీ పోలీసులు సోమవారం ప్రకటించారు. తాను పాపపై ఏ అఘాయిత్యానికి తలపెట్టలేదని, అత్యాచారం చేసింది ప్రదీప్ అని మనోజ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. పాపపై అత్యాచారం…

మధ్యప్రదేశ్ లో మరో పాప!

ఢిల్లీలో ఐదేళ్ల పాపపై జరిగిన అత్యాచారం విషయంలో దేశం నిశ్చేష్టురాలై ఉండగానే మధ్య ప్రదేశ్ లో మరో ఐదేళ్ల పాపపై దాదాపు అలాంటి ఘోరమే చోటు చేసుకుంది. ఐదేళ్ల పాప పైన 35 సంవత్సరాల త్రాష్టుడొకరు లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ పాప కూడా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని పత్రికలు చెబుతున్నాయి. పరిస్ధితి క్షీణించడంతో పాపను హుటాహుటిన నాగపూర్ కి ఎయిర్ అంబులెన్సు లో మహారాష్ట్ర లోని నాగపూర్ కి తరలించారు. మధ్య ప్రదేశ్ లోని…

గంజాయివనంలో తులసి: పుట్టే ప్రతి ఆడపిల్లకి 111 చెట్లు నాటే గ్రామం

భారత దేశంలో చెడబుట్టిందీ గ్రామం. మందీ మార్బలం అంతా చేతుల్లో ఉంచుకుని కూడా ‘మహిళా సాధికారత’ విషయంలో మాటలు తప్ప చేతల్లోకి వెళ్లని ప్రభుత్వాల నిష్క్రియా సంస్కృతి ఎల్లెడలా వ్యాపించి ఉన్న రోజుల్లో ఈ గ్రామం తనదైన పర్యావరణ-స్త్రీవాదాన్ని (Eco-feminism) పాటిస్తోంది. ఆడోళ్లపై ఫ్యూడల్ అహంభావం, అణచివేత, చిన్న చూపు విస్తృతంగా వ్యాపించి ఉండే రాజస్ధాన్ రాష్ట్రంలోనే ఈ వింత చోటు చేసుకోవడం విశేషం. గత అనేక సంవత్సరాలుగా పిప్లాంత్రి గ్రామ ప్రజలు ఆడపిల్లలను జాగ్రత్తగా సాకడమే…

ఢిల్లీ పాప అత్యాచారం: పాలకులారా, ఛావెజ్ ను చదవండి!

అత్యంత విలువైన సమయాన్ని పోలీసులు వృధా చేయడంతో పాపను త్వరగా కనుక్కోలేకపోయారని ఢిల్లీ పాప బంధువులు ఆరోపించారు. సోమవారం సాయంత్రం పాప కనిపించకుండా పోయాక కొద్ది సేపు వెతికి గాంధీ నగర్ పోలీసులను ఆశ్రయించామని కానీ వారు రాత్రంగా స్టేషన్ లోనే తమను కూర్చోబెట్టారని వారు తెలిపారు. ఆ తర్వాత రోజు కూడా అదీ, ఇదీ కావాలని తిప్పించారని అసలు వెతికే ప్రయత్నం చేయలేదని తెలిపారు. పాప దొరికిన తర్వాత తండ్రిని పక్కకు పిలిచి గొడవ చేయొద్దని…

ఐదేళ్ల పాప అనుభవించిన అమానుషం చెప్పనలవి కాదు…

అదే రాజధాని నగరం. అదే తరహా అత్యాచారం, అదే పోలీసులు, అదే నిష్క్రియాపరత్వం, అదే అవహేళన, అదే వర్గ స్పృహ…! వయసొక్కటే తేడా. ఈసారి అత్యాచారం బాధితురాలి వయసు కేవలం 5 సంవత్సరాలు. శారీరక బాధ తప్ప తనను ఏం చేస్తున్నాడో తెలియని పసి వయసు. జరిగిన అమానుషం ఏమిటో ఊహించుకోలేని మనసు. అభం శుభం తెలియని ఆ పాప ఎప్పటిలాగా ఆడుకోడానికి బైటికి వచ్చింది. ఎప్పటి నుండి కన్నేసాడో గాని మానసిక వైపరీత్యంతో, శారీరక మద…

బోస్టన్ పేలుళ్ళ అనుమానితుల చిత్రం విడుదల, ఒకరి కాల్చివేత

బోస్టన్ మారధాన్ బాంబు పేలుళ్ళ కేసులో ఇద్దరు అనుమానితుల చిత్రాలు, వీడియోలను అమెరికా ‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ (ఎఫ్.బి.ఐ) విడుదల చేసింది. సి.సి కెమెరాలు రికార్డు చేసిన వీడియో నుండి ఇద్దరు అనుమానితులను ఎఫ్.బి.ఐ గుర్తించింది. వీడియో, చిత్రాలను విడుదల చేస్తూ వారి గురించి తెలిసినవారు సమాచారం ఇవ్వాలని ఎఫ్.బి.ఐ కోరింది. బాంబులు పెట్టిన వ్యక్తి నల్ల వ్యక్తి అని ‘న్యూయార్క్ పోస్ట్’, ‘బోస్టన్ టైమ్స్’ లాంటి పత్రికలు చేసిన ప్రచారం నిజం కాదని ఎఫ్.బి.ఐ…

బ్రిటిష్ మాజీ ప్రధాని ధాచర్ మరణం వారికి పండగ -ఫోటోలు

బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ ధాచర్ ఏప్రిల్ 8 తేదీన మరణించింది. ఆమె మరణం పట్ల ధనికులు ఖేదం ప్రకటిస్తే కార్మికులు, అల్పాదాయ, మధ్యతరగతి వర్గాలు అనేకులు మోదం ప్రకటించారు. దేశవ్యాపిత సంబరాలకు సైతం ‘క్లాస్ వార్’ లాంటి సంస్ధలు, మైనింగ్ వర్కర్స్ యూనియన్ లాంటి కార్మిక సంఘాలు పిలుపునిచ్చి అమలు చేసాయి కూడా. ధాచర్ మరణం పట్ల సంబరాలు జరుపుకున్న ఫోటోలను కింద చూడవచ్చు. ఈ సంబరాలకు కారణం ఏమిటో అర్ధం చేసుకోవాలంటే చరిత్రలోకి కొద్దిగా…

దళితురాలని తెలిసే చంపారు, తెనాలి ఘటనపై ఎస్.పి -కత్తిరింపు

తెనాలిలో తాగుబోతుల దుర్మార్గం ఫలితంగా లారీ కింద పడి చనిపోయిన సునీల కుటుంబం దళితులని తెలిసే వారిపై దుర్మార్గానికి పాల్పడ్డారని గుంటూరు ఎస్.పి జె.సత్యనారాయణ హై కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారని ఈనాడు పత్రిక తెలిపింది. బి.టెక్ చదువున్న సునీల కుమార్తెను దుండగులు మొదట కులం పేరుతో దూషించి అనంతరం లైంగికంగా వేధించారని ఎస్.పి తన నివేదికలో పేర్కొన్నారు. ది హిందు రిపోర్టును పిటిషన్ గా సుమోటోగా విచారణకు స్వీకరించిన రాష్ట్ర హై కోర్టు స్వయంగా విచారణను…

భార్యల మార్పిడి, వరకట్నం, అత్యాచారం: నేవీలో సాంస్కృతిక పతనం!

ఉన్నత స్ధాయి పరీక్షలు నిర్వహించి నౌకాదళ అధికారులను ఎన్నుకుంటారు. ఉన్నత విద్యార్హతలు ఉంటేనే ఈ పరీక్షలలో నెగ్గడం సాధారణంగా సాధ్యపడుతుంది. అలాంటి అధికారులు సాంస్కృతిక జీవనంలో భారత సమాజానికి ఆదర్శంగా ఉండేలా జీవిస్తారని ఆశిస్తాము. ఆధునిక సమానతా విలువలను ఒంటబట్టించుకుని స్త్రీలకు తగిన గౌరవ, మర్యాదలు ఇస్తారని ఊహిస్తాము. కానీ అలాంటి ఊహలకు, ఆశలకు తాము అర్హులము కాదని నౌకాదళ అధికారులు కొందరు చెప్పదలుచుకున్నట్లు కనిపిస్తోంది. ఉన్నతాధికారి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు ఆర్మీ చట్టాల ప్రకారం…

తమిళనాట తెలుగు కోసం పోరుతున్న స.వెం.రమేష్

ప్రళయ కావేరి కధల రచయిత సన్నాడి వెంకట రమేష్ ఉరఫ్ స.వెం.రమేష్ 18 సంవత్సరాల వయసు వరకు తెలుగు రాసి ఎరగరు. మద్రాసులో పి.జి వరకు ఆంగ్ల మాధ్యమం లోనే చదువుకున్న రమేష్ తెలుగులో కధలు రాసే స్ధాయికి ఎదగడమే అద్భుతం అయితే, ఆ కధలను వేలాది పల్లె పదాలతో నింపడం ఇంకో అద్భుతం. పులికాట్ సరస్సు వద్ద ఉన్న తమ తాత, ముత్తాతల గ్రామాలకు వచ్చి అక్కడి పద సంపదను చూసి అచ్చెరువు పొంది పట్టుబట్టి…