ఇది హిందూత్వ కాదు ‘చోర్ బజార్’! -శివ సేన

హిందూత్వను ఎవరు నిజాయితీగా ఆచరిస్తున్నారు అన్న అంశంలో బి‌జే‌పి, శివసేన పార్టీల మధ్య ఎప్పుడూ పోటీ నెలకొని ఉంటుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్‌సి‌పి లతో కలిసి శివసేన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ పోటీ మరింత తీవ్రం అయింది. బి‌జే‌పి తో స్నేహం విడనాడి లిబరల్ బూర్జువా పార్టీలైన కాంగ్రెస్, ఎన్‌సి‌పి లతో జట్టు కట్టడమే హిందూత్వ సిద్ధాంతానికి ద్రోహం చెయ్యడంగా బి‌జే‌పి ఆరోపిస్తుంది. అసలు బి‌జే‌పి ఏనాడో హిందూత్వను వదిలి పెట్టి అవినీతికి,…

దళిత వంటను ఆ పిల్లలు ముట్టుకోలేదు, ఆమె ఉద్యోగం పోయింది!

భారత రాజ్యాంగం కుల వివక్షను రద్దు చేసింది. అలాగే అంటరానితనాన్ని కూడా రద్దు చేసింది. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 యేళ్ళు గడిచినా కూడా భారత సమాజం రాజ్యాంగంలో పొందు పరిచిన సామాజిక విలువలను గౌరవించేందుకు సిద్ధంగా లేదు. ఉత్తర ఖండ్ లోని ఒక స్కూల్ పిల్లలు దళిత మహిళ వంట చేసిందన్న కారణంతో ఆ స్కూల్ లో వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని తినడం మానేశారు. స్కూల్ భోజనం తినడానికి బదులు తమ ఇళ్ల నుండి…

రిపేర్ ఖర్చు పెట్టలేక టెస్లా ఎలక్ట్రిక్ కారు పేల్చేసిన ఓనర్!

ఇది ఫిన్లాండ్ దేశంలో జరిగింది. టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలకు పెట్టింది పేరు. ఎలాన్ మస్క్ ఈ కంపెనీ వ్యవస్ధాపకుడు. టెస్లా కంపెనీకి సి‌ఈ‌ఓ ఆయనే.  ఫేస్ బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రాం కంపెనీల యజమాని మార్క్ జుకర్ బర్గ్ వాట్సప్ ప్రైవసీ పాలసీలో మార్పులు చేశాక, వాట్సప్ ని మొబైల్ ఫోన్ల నుండి తీసేసి దాని బదులు సిగ్నల్ అప్లికేషన్ ను ఇన్స్టాల్ చేసుకోమని యూజర్లకు ట్విట్టర్ ద్వారా సలహా ఇవ్వడం లాంటి చర్యలు, ప్రకటనల ద్వారా…

కర్ణాటక: క్రైస్తవ పుస్తకాలు తగలబెట్టిన హిందుత్వ గ్రూపులు

ఇప్పుడిక క్రైస్తవుల వంతు వచ్చింది. దేశంలో ఓ పక్క ముస్లింలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కర్ణాటకలో ఏడాది నుండి క్రైస్తవుల పైనా చర్చిల పైనా వరుస దాడులు జరుగుతున్నాయి. తాజాగా కోలార్ జిల్లాలో శ్రీనివాస్ పురా లో హిందుత్వ కి చెందిన రైట్ వింగ్ గ్రూప్ కార్యకర్తలు నలుగురు క్రైస్తవ యువకుల పైన దాడి చేశారని ఇండియన్ ఎక్స్^ప్రెస్, NDTV తెలిపాయి. ఈ నలుగురు క్రైస్తవ మత పుస్తకాలను ఇల్లిల్లూ తిరిగి పంచుతున్నట్లు తెలుస్తోంది. హిందూత్వ సంస్థల…

గుజరాత్ హైకోర్టు: జనం ఏం తినాలో మీరెలా నిర్ణయిస్తారు?

ప్రజల ఆహార అలవాట్లపై నిర్బంధం విధించాలని ప్రయత్నిస్తున్న హిందూత్వ పాలకులకు గుజరాత్ హై కోర్టు కాస్త గడ్డి పెట్టింది. అహ్మదాబాద్ మున్సిపాలిటీలో మాంసాహారం అమ్ముతున్న తోపుడు బండ్ల ను మునిసిపాలిటీ స్వాధీనం చేసుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపింది. ప్రజలు ఏ ఆహారం తినాలో నిర్ణయించే అధికారం పాలకులకు లేదని తేల్చి చెప్పింది. స్వాధీనం చేసుకున్న తోపుడు బండ్లను వెంటనే వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. “మీరు మాంసాహారం భుజించరు. అది మీ దృక్పధం. కానీ జనం ఏమి…

అంబేద్కర్ రచనల ప్రచురణ నిలిపివేత, సుమోటు కేసు నమోదు

మహారాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలను ప్రచురించే ప్రాజెక్టును నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మహారాష్ట్ర ప్రాంతీయ పత్రిక లోక్ సత్తా ఒక వార్త ద్వారా వెలుగులోకి తెచ్చింది. సదరు వార్తను పరిగణలోకి తీసుకున్న బొంబే హై కోర్టు, ప్రచురణ ప్రాజెక్టు నిలిపివేయడాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా సుమోటుగా డిసెంబర్ 1 న స్వీకరించింది. మరాఠీ పత్రిక లోక్ సత్తా నవంబర్ 24 తేదీన అంబేద్కర్ రచనలు, ప్రసంగాల ప్రచురణను నిలిపివేసిన…

సనాతన కుల-మత వ్యవస్ధ పునరుద్ధరణే కంగనా ప్రబోధిస్తున్న విముక్తి!

నటి కంగనా రనౌత్ తన వ్యాఖ్యలపై కొంత స్పష్టత ఇచ్చారు. తాను అన్నీ తెలిసే 1947 నాటి స్వతంత్రంపై వ్యాఖ్యానించానని తన వివరణ ద్వారా స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు తప్పయితే తన ‘పద్మ శ్రీ’ అవార్డు వెనక్కి ఇచ్చేందుకు సిద్ధం అని ప్రకటించారు. దానికి ముందు తన అనుమానాలు తీర్చాలని ఆమె కొన్ని ప్రశ్నలు సంధించారు. తన అనుమానాలకు సంతృప్తికరంగా సమాధానం ఇస్తే అవార్డు ఇచ్చేస్తానని చెప్పారు. అయితే కంగనా రనౌత్ ఇచ్చిన వివరణ మరిన్ని…

మోడి క్లీన్ చిట్: మనస్సాక్షి ఉన్న జడ్జి ఈ సాక్షాన్ని విస్మరించరు!-2

పిటిషనర్ జకీయా జాఫ్రీ తరపున సుప్రీం కోర్టు అడ్వకేట్ కపిల్ సిబాల్ వినిపిస్తున్న వాదనలు: జైదీప్ పటేల్ మొబైల్ అసలు స్వాధీనమే చేసుకోలేదు. ఆయన అనేక ఫోన్ కాల్స్ చేసి ఉంటాడు. ఆయన ఫోన్ స్వాధీనం చేసుకోకపోతే మీరు (సిట్) ఏమి పరిశోధన చేసినట్లు? 27 ఫిబ్రవరి, 2021 (గోధ్రా రైలు దహనం జరిగిన రోజు) తేదీకి ముందే బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, సంఘ్ పరివార్ సభ్యులు ఆయుధాలు, మందుగుండు నిలవ చేసుకున్నారని చెప్పే…

విచారణ చెయ్యకుండానే మోడికి క్లీన్ చిట్ -జకీయా జాఫ్రీ వాదన

గోధ్రా రైలు దహనం అనంతరం గుజరాత్ రాష్ట్ర వ్యాపితంగా ముస్లింలపై జరిగిన మారణకాండ విషయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ (సిట్) క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. క్లీన్ చిట్ పై నిరసన పిటిషన్ దాఖలు చేసిన జకీయా జాఫ్రీ తరపున అడ్వకేట్ కపిల్ సిబాల్ తన వాదనలు ఈ రోజు కొనసాగించారు. జాఫ్రీ చేసిన ఫిర్యాదుపై అనేక సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నప్పటికీ వాటిపై పరిశోధన జరపకుండానే…

మీ దాష్టీకం యూ‌పిలో చెల్లవచ్చేమో, ఇక్కడ కాదు -యూ‌పి పోలీసుల్తో ఢిల్లీ హై కోర్టు

ఉత్తర ప్రదేశ్ పోలీసులకి ఢిల్లీ హై కోర్టు గడ్డి పెట్టింది. మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా అత్యంత అప్రజాస్వామిక చట్టం చేయడమే కాకుండా సదరు చట్టం పేరుతో విచక్షణారహితంగా వివాహితులను వారి కుటుంబ సభ్యులను అరెస్టులు చేసి జైళ్ళలో తోస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న యూ‌పి ప్రభుత్వానికి కూడా ఢిల్లీ హై కోర్టు పరోక్షంగా జ్ఞాన బోధ చేసింది. “ఇక్కడ ఢిల్లీలో మీ చర్యలు చెల్లబోవు. ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలైనా సరే చెల్లవు. ఢిల్లీ నుండి జనాన్ని…

నటి సమంతపై కురుస్తున్న మగహంకార విద్వేషం

నటి సమంత, నటుడు నాగ చైతన్య అక్కినేని ఇటీవల విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తమ ప్రైవసీకి భంగం కలిగించరాదని వారిద్దరూ ఒక ఉమ్మడి ప్రకటనలో విన్నవించుకున్నారు. తాము కొత్త జీవితం ప్రారంభిస్తున్నామని చెబుతూ అందుకు తమను ఆశీర్వదించాలని వేడుకున్నారు. వారి విన్నపంలో అర్ధం కాని అంశాలు ఏమీ లేవు. తమ ఏకాంతానికి భంగం కలిగించడం అంటే ఏమిటి అర్ధం? విడాకుల విషయంలో ఇప్పటికే బాధలో ఉన్న జంట తమ ప్రైవసీని తమకు వదిలేయండని కోరితే…

దిగొచ్చిన యూ‌కే, ఇండియాపై కోవిడ్ ఆంక్షలు తొలగింపు

ఇండియా ప్రతీకార చర్యలతో యూ‌కే దిగి వచ్చింది. వ్యాక్సిన్ డోసులు పూర్తిగా వేసుకున్న భారత ప్రయాణీకులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇండియాతో పాటు మరో 47 ఇతర దేశాలపై కూడా ఆంక్షలు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 10, సోమవారం నుండి గతంలో విధించిన నిబంధనలను భారత ప్రయాణీకులు పాటించనవసరం లేదని యూ‌కే ప్రభుత్వ ఒక ప్రకటనలో తెలిపింది. (లైవ్ మింట్, అక్టోబర్ 8) దీని ప్రకారం స్ధానికంగా ఉత్పత్తి చేసిన కోవి షీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు…

సిద్దికి కప్పన్ కేసు: చార్జ్ షీట్ లో హాస్యాస్పద కారణాలు -ఇండియన్ ఎక్స్^ప్రెస్

ద ఇండియన్ ఎక్స్^ప్రెస్ ఎడిటోరియల్  –02/10/2021 సిద్దికి  కప్పన్  అరెస్టు మరియు నిర్బంధం కొనసాగింపుకు హాస్యాస్పద కారణాలు చూపిన యూపి ఎస్‌టి‌ఎఫ్ చార్జ్ షీట్ దేశ ద్రోహం (సెడిషన్) చట్టంను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను జులై నెలలో విచారిస్తూ, ప్రభుత్వ సంస్ధలు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయడం పట్ల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ ఆందోళన వ్యక్తం చేశారు. పౌరులు స్వేచ్ఛాయుతంగా మాట్లాడే హక్కుతో పాటు వివిధ…

బ్రిటన్ పై ఇండియా ప్రతీకార చర్య

భారత దేశం బదులు తీర్చుకుంది. యూ‌కే నుండి వచ్చే యూ‌కే పౌరులు ఇండియాకు వస్తే గనక వారు తప్పనిసరిగా 10 రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్ లో ఉండే విధంగా నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు అక్టోబర్ 4 తేదీ నుండి అమలులోకి రానున్నాయి. బ్రిటన్ పౌరులు వాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా, దేశంలోకి వచ్చిన తోడనే తప్పనిసరిగా 10 రోజుల క్వారంటైన్ లో ఉండడంతో పాటు మొదట ఆర్‌టి-పి‌సి‌ఆర్ పరీక్ష చేయించుకోవాలని ఇండియా నిర్దేశించింది. అలాగే వచ్చిన…

బ్రెగ్జిట్ పై బ్యాంక్సీ టేక్ -వీధి చిత్రాలు

లండన్ కు చెందిన వీధి చిత్రాల కళాకారుడు బ్రెగ్జిట్ పై తన కళాలోచనను తాజా వీధి చిత్రం ద్వారా పంచుకున్నాడు. తన వీధి చిత్రాల ద్వారా ప్రపంచ వ్యాపితంగా అత్యంత పేరు ప్రతిష్టలు సంపాదించినప్పటికీ తానెవరో ప్రపంచానికి తెలియనివ్వని బ్యాంక్సీ ఎక్కడ గోడపై ఒక గీత గీసిన సంచలనమే. పశ్చిమ సామాజిక, సాంస్కృతిక విలువలపై విమర్శలతో ప్రారంభించి రాజకీయ విమర్శల వరకూ ప్రయాణించిన బ్యాంక్సీ వీధి చిత్రాలు సామాన్య ప్రజలకు కన్నుల పండుగ, అనామ్దాదాయకం కాగా ధనిక…