అసరం అత్యాచారం: ప్రాధమిక సాక్ష్యాలున్నాయ్ -పోలీసులు

తన ఆశ్రమ పాఠశాల విద్యార్ధినిపై అసరం బాపు అత్యాచారానికి పాల్పడ్డాడనేందుకు ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని పోలీసులు ప్రకటించారు. జోధ్ పూర్ డి.సి.పి అజయ్ లాంబ ప్రకారం 16 యేళ్ళ బాలిక ఫిర్యాదుపై పోలీసులు ప్రాధమిక విచారణ పూర్తి చేశారు. అసరంపై బాలిక చేసిన ఆరోపణలు నిజమేనని వారి ప్రాధమిక విచారణలో తేలిందని

అసరం దొంగాట, పోలీసుల తొండాట

తన ఆశ్రమం నడిపే పాఠశాల విద్యార్ధినిపై అత్యాచారం జరిపాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అసరం బాపు పోలీసులకు దొరక్కుండా దొంగాట ఆడుతుంటే, ఆయన ఎక్కడ ఉన్నదీ తెలిసి కూడా పోలీసులు తొండాట ఆడుతున్నారని పత్రికలు ఆరోపిస్తున్నాయి. హిందూ మత ప్రబోధకుడు అసరం బాపుకు ఇచ్చిన ఆగస్టు 30 తేదీ గడువు ముగిసినా ఆయన అరెస్టు కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయం ప్రకటిత దేవుడికీ, సామాన్యుడికి చట్టం ఒకే విధంగా ఎందుకు పని చేయదని జర్నలిస్టులు, ఎడిటర్లు ప్రశ్నిస్తున్నారు. జోధ్…

అమెరికా నల్లజాతి ఉత్తుంగ తరంగానికి 50 యేళ్ళు -అరుదైన ఫోటోలు

“నాకొక కల ఉంది” (I have a dream) అంటూ మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ చేసిన చరిత్రాత్మక పౌర హక్కుల ప్రసంగానికి ఆగస్టు 28, 2013తో 50 యేళ్ళు నిండాయి. అమెరికా ప్రజల పౌర హక్కుల కోసం, ముఖ్యంగా నల్లజాతి ప్రజలపై అమానుష రీతిలో కొనసాగుతున్న తీవ్ర వివక్షకు వ్యతిరేకంగా ‘నల్లజాతి ఉత్తుంగ తరంగమై ఉద్యమించిన’ మార్టిన్ లూధర్ కింగ్ నల్లజాతి ప్రజలతో పాటు, తెల్లజాతి ప్రజలను కూడా సమాన స్ధాయిలో ఉత్తేజపరిచాడు. ప్రత్యేకంగా ఆగస్టు…

ఆర్చరీ ప్రపంచ కప్ గోల్డ్ మెడలిస్టును కంటతడి పెట్టించిన మీడియా

ఎలక్ట్రానిక్ మీడియా దురహంకార చేష్టలు విలువిద్యలో దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చిన యువతిని కంటతడి పెట్టించాయి. ఒక రోజంతా విమానంలో ప్రయాణించడంతో తిండి, నిద్ర లేవనీ, అర్జెంటుగా మరో విమానం ఎక్కాల్సి ఉన్నదనీ వేడుకుంటున్నా వినిపించుకోకుండా ఇంటర్వ్యూల కోసం పట్టుబట్టడంతో భారత దేశంలో అత్యున్నత ప్రతిభ కల క్రీడాకారిణిగా భావించబడుతున్న దీపికా కుమారి సున్నితంగా తిరస్కరించింది. తాము టి.విల్లో చూపించడమే గొప్పగా భావించే మీడియా విలేఖరులు దీపిక పరిస్ధితి పట్టించుకోకుండా అహంకారి అని దూషించడంతో ఆమె కన్నీటి…

మహిళా పోలీసుకే ధైర్యం లేకపోతే నాకెలా ఉంటుంది –ఫోటో జర్నలిస్టు

(ముంబై ఫోటో జర్నలిస్టుపై జరిగిన సామూహిక అత్యాచారం పట్ల టైమ్స్ ఆఫ్ ఇండియా ఫోటో జర్నలిస్టు ఉమా కదం స్పందన ఇది. ది హిందు పత్రిక దీనిని ప్రచురించింది. ఉమా కదం గత 13 యేళ్లుగా టైమ్స్ గ్రూపులోని వివిధ పత్రికలకు ఫోటో జర్నలిస్టుగా పని చేస్తున్నారు.) నేను ఫోటో జర్నలిస్టుగా నా కెరీర్ ని 2001లో ప్రారంభించాను. అప్పట్లో నగరంలో ఉన్న అతి కొద్దిమంది మహిళా ఫోటోగ్రాఫర్లలో నేను ఒకరిని. మొదటి రెండు లేదా మూడు…

అదే ఘోరం, అదే క్రూరత్వం, ఈసారి ముంబై

డిసెంబరు 16 నాటి ఢిల్లీ అత్యాచారం విషయంలో నిందితులపై ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేగంగా పని చేస్తున్నాయో లేదో గానీ అత్యాచారాల వేగం మాత్రం కొనసాగుతూనే ఉంది. దాదాపు ఢిల్లీ బస్సు అత్యాచారం తరహాలోనే ఒక ఫోటో జర్నలిస్టు యువతి పైన ఐదుగురు మృగాళ్ళు పైశాచిక రీతిలో అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ సంఘటనలో కూడా యువతి బాయ్ ఫ్రెండ్ ని దుండగులు తీవ్రంగా కొట్టారు. బాధితురాలి శరీరంలో అంతర్గతంగా తీవ్ర గాయాలు…

అసరం బాపు అసలు రూపు ఇదీ!

అసరం బాపు గుర్తున్నాడా? గత డిసెంబర్ నెలలో నిర్భయపై అత్యాచారం జరిగిన తర్వాత వెల్లువెత్తుతున్న నిరసనల మధ్య నోరు పారేసుకున్న బాబా!. అత్యాచారంలో నిర్భయ తప్పు కూడా ఉన్నదనీ, తనపై లైంగిక దాడి చేసినవారిని ఆమె ‘అన్నా, తమ్ముడూ’ అని వేడుకుని ఉంటే వారాపనికి దిగి ఉండేవారు కాదనీ, ఆ విధంగా ఆమె గౌరవం (ఆయన ఉద్దేశ్యం శీలం అని) కాపాడబడి ఉండేదనీ కూసిన మహా ‘పురుషుడు’! అంతటితో ఆగాడా? “రెండు చేతులు కలవకుండా శబ్దం రాదు…

చైనా అద్భుతం: పాడే ఇసుక తిన్నెల్లో విరిసిన ఎడారి కమలం -ఫోటోలు

అది చైనాలోని గ్జియాంగ్ షావాన్ ఎడారి. చైనా రాజధానికి పశ్చిమంగా 350 కి.మీ దూరంలో ఉండే ఈ ఎడారి ప్రాంతం మంగోలియా సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. ఇక్కడ ఉండే ఎత్తైన ఇసుక తిన్నెలకు ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్న లక్షణమే దానిని ప్రఖ్యాత టూరిస్టు ఆకర్షణ కేంద్రంగా మార్చివేసింది. ఆ ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఇక్కడ ఇసుక తిన్నెలు పాడతాయి. అవును పాడతాయి. ఎలా పాడతాయో, ఎందుకు పాడతాయో ఇంకా తెలియదు గానీ పాడడం మాత్రం నిజం.…

దుర్గ, ఐఎఎస్: నెగ్గేది యాదవ్‌ల పంతమేనా?

అవినీతి రాజకీయ నాయకులకు, ఇసుక మాఫియాకు ఎదురొడ్డి నిలబడిన యువ ఐ.ఎ.ఎస్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ అక్రమ సస్పెన్షన్ విషయంలో తండ్రీ కొడుకులయిన యాదవ్ లిద్దరూ తమ మంకు పట్టు కొనసాగిస్తున్నారు. దుర్గాశక్తికి న్యాయం చేయాలంటూ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాసిన నేపధ్యంలో ఆమె సస్పెన్షన్ జాతీయ స్ధాయి రాజకీయ సమస్యగా ముందుకు వచ్చింది. దానితో ములాయం సింగ్ యాదవ్ తన పుత్రరత్నం తీసుకున్న చర్య సరైనదే అని ప్రకటిస్తుండగా ప్రతిపక్షాలు,…

జింబాబ్వే సిరీస్: రసూల్ బెంచికే పరిమితం, కాశ్మీర్ గరం గరం

కాశ్మీర్ నుండి మొట్టమొదటిసారిగా భారత జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికయిన ఆటగాడు పర్వేజ్ రసూల్. ఐదు మ్యాచ్ ల వన్ డే సిరీస్ లో అతన్ని ఒక్క మ్యాచ్ కూడా ఆడించకపోవడంతో కాశ్మీర్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పత్రికలు చెబుతున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లలో భారత వ్యతిరేక సెంటిమెంట్లు మరోసారి ఊపందుకోవడానికి ఇదొక సందర్భంగా మారినట్లు తెలుస్తోంది. కాశ్మీరు ప్రజల్ని ఎన్నటికీ భారత జాతీయ స్రవంతిలో కలవనివ్వరని చెప్పడానికి…

ఇసుక మాఫియా కరిగిస్తున్న ఒక ప్రభుత్వ ఆయువు -కార్టూన్

అనగనగా ఒక రాష్ట్ర ప్రభుత్వం. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక యువకుడు ముఖ్యమంత్రి. నేరాలను, నేరస్ధ మాఫియాలను తుదముట్టిస్తానని ఆయన శపధం చేసి మరీ అధికారంలోకి వచ్చాడు. ప్రజలు పాపం మాఫియాలను తుదముట్టించే రోజుకోసం ఎదురు చూస్తున్నారు. కానీ ప్రజల ఆశలు నెరవేరక పోగా విచిత్ర పరిణామాలు జరుగుతున్నాయి. మాఫియాలను తుదముట్టించే బదులుగా మాఫియాలను తుదముట్టించే నిజాయితీ అధికారులను తుదముట్టించే కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రజలు ఏదయితే ఆశించి గద్దెనెక్కించారో సరిగ్గా దానికి విరుద్ధంగా మన యువనాయకుడు వ్యవరిస్తున్నారు.…

భారత దేశంలో మహిళల వస్త్రధారణపై విమర్శలు, ఒక పరిశీలన

(ఈ వ్యాసం e-సాహిత్య పత్రిక ‘వాకిలి’ ఆగస్టు సంచికలో ప్రచురించబడింది. రచయిత్రి రమా సుందరి గారు. స్త్రీల వస్త్రధారణ గురించి తరచుగా చర్చ జరుగుతున్న నేపధ్యంలో బ్లాగ్ పాఠకులకు ఉపయోగం అన్న దృష్టితో రచయిత్రి అనుమతితో ఇక్కడ ప్రచురిస్తున్నాను.  -విశేఖర్) ఈ మధ్య కాలంలో ఎన్నడూ విననంతగా భారతదేశంలో స్త్రీలపై అత్యాచారాలు వెలుగులోకి వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గ, కుల స్త్రీలమీద ఇవి జరుగుతున్నాయి. ముక్కు పచ్చలారాని పసిపాపలు, భారతదేశ ధార్మికత మీద ఆసక్తి…

ఏది చీకటి, ఏది వెలుతురు? పాట ఒకటే చిత్రీకరణలేన్నో!

ఈ పాట రాసింది శ్రీ శ్రీ అని తెలియనివారు ఉంటారనుకోను. రాసినప్పుడు ఆయన పాటగా రాశారో, కవిత్వంగా రాశారో నాకు ఖచ్చితంగా తెలియదు. కవిత్వంగానే రాశారని నేనిన్నాళ్లూ అనుకున్నాను. ఆఫ్ కోర్స్, ఇప్పుడూ అదే అనుకుంటున్నాననుకోండి! ఈ పాటను ఒక సినిమాలోనే వాడుకున్నారని అనుకున్నా ఇన్నాళ్ళు. కానీ ఇంకా ఇతర సినిమాల్లో కూడా వాడుకున్నారని ఈ రోజు తెలిసింది. ‘ఆకలి రాజ్యం’ సినిమాలో ఈ పాటను మొదటిసారి విన్నాను, చూశాను. చాలా చిన్నప్పుడు (ఎనిమిదో తరగతిలో) ఆ…

బోస్టన్ బాంబర్ లొంగిపోయిన రక్తసిక్త క్షణాలు… -ఫోటోలు

గత ఏప్రిల్ నెలలో బోస్టన్ నగరంలో మారధాన్ పరుగు పందెం జరుగుతుండగా బాంబు పేలుళ్లు జరిగిన సంగతి ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. చెచెన్యా నుండి వలస వచ్చి అమెరికాలో స్ధిరపడిన ఇద్దరు అన్నదమ్ములు ఈ పేలుళ్లకు బాధ్యులని అమెరికా ఆ తర్వాత తేల్చింది. పేలుళ్లు జరిగిన రోజే పెద్ద సోదరుడు తామర్లేన్ జర్నాయెవ్ ను ఎఫ్.బి.ఐ పోలీసులు కాల్చి చంపేశారు. రెండు రోజుల పాటు బోస్టన్ శివార్లలోని ఎం.ఐ.టి యూనివర్సిటీ సమీపంలో ఇల్లిల్లూ గాలించిన తర్వాత ఒక…

ముస్లిం జనాభా: దురభిప్రాయాలు -2

జనాభా పెరుగుదలను ప్రభావితం చేసే కారణాలు ఏమిటి? మతానికి జనాభా వృద్ధికి సంబంధం ఉందా? మతంతో సంబంధం లేకపోతే జనాభా పెరుగుదల దేనితో సంబంధం కలిగి ఉంది? ఇవి పరిశీలించవలసిన ప్రశ్నలు. మతాన్ని ఫెర్టిలిటీతో ముడిపెడుతూ కొన్ని వాదనలు ఉన్నాయి. నిర్దిష్ట మత విశ్వాసాలు వారి జనాభా పెరుగుదలకు ప్రధాన కారణం అని వీరి వాదన. ముఖ్యంగా ముస్లింలకు ఈ కారణాన్ని ఆపాదిస్తారు. కానీ కాస్త నిదానించి పరిశోధిస్తే జనాభా పెరుగుదలలో మతం జోక్యం ప్రభావం చాలా…