డిప్రెషన్ బాధితురాలిని కాల్చి చంపిన అమెరికా పోలీసులు -ఫోటోలు

ఆమె డిప్రెషన్ బాధితురాలు. సంవత్సరంన్నర వయసు పాపకు తల్లి. డెంటల్ హైజీన్ నిపుణురాలు. బాలింతలకు వచ్చే డిప్రెషన్ తో బాధపడుతోంది. డిప్రెషన్ వల్లనే యేమో అక్టోబర్ 3 తేదీన వాషింగ్టన్ కేపిటల్ హిల్ ఏరియాలో వేగంగా కారు నడుపుతోంది. అధ్యక్ష భవనం దరిదాపుల్లో ఇలా ఓ కారు వేగంగా వెళ్ళడంతో పోలీసుల అప్రమత్తం అయ్యారు. ఒక పోలీసు కారును పక్కకు మళ్లించి ఆపాలని కోరాడు. ఆమె ఆగలేదు. ఇక మొదలైంది వేట. పోలీసులు వీరావతారం ఎత్తారు. కారును…

పనిపిల్లను పెంపుడు కుక్కలతో కరిపించిన దుర్మార్గం!

జీవజాలంలో అత్యంత అభివృద్ధి చెందిన జాతి మనిషి. కానీ మనుషుల్లో ‘మనిషితనం’ చిక్కనవడానికి బదులు జంతు ప్రవృత్తి పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. ఢిల్లీలో వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తే మనిషి ‘నిజంగా నాగరీకుడేనా’ అన్న అనుమానం కలక్క మానదు. పని చేయించుకోడానికని ఇంటిలో ఉంచుకున్న మైనర్ బాలికను పెంపుడు కుక్కలతో ఒళ్ళంతా కరిపించిన దుర్మార్గులని ఏమనాలి? వారిని జంతువులతో కూడా పోల్చడానికి మనసొప్పడం లేదు. జంతువు, జంతువు కాబట్టి జంతువులానే ప్రవర్తిస్తుంది. కానీ మనిషిలా ప్రవర్తించలేని మనుషుల్ని జంతువుతో…

అక్కడ ప్రతీకారం అంటే ఆమెను వివస్త్రను చేయడం!

ఇది మరో భారత స్త్రీ కధ! కాదు, కాదు, మరో దళిత స్త్రీ కధ!! చాతుర్వర్ణాలలో ఆమె పుట్టిన కులం/వర్ణం లేదు గనక ఆమెను భారత స్త్రీ అనడానికి మనువాదులు ఒప్పుకుంటారో లేదో? అందుకే ఆమె భారత స్త్రీ కాదు, దళిత స్త్రీ. ఉత్తర ప్రదేశ్ లో షెడ్యూల్డ్ కులంగా గుర్తించబడిన దోబి కులానికి చెందిన ఆమె కొడుకు చేసిన (నిజానికి చెయ్యని) పాపానికి ఆమెను అగ్ర కులస్ధులు ఇంటినుండి వీధిలోకి ఈడ్చుకొచ్చి చీర, రవికె ఊడబెరికారు.…

ఆ చల్లని సముద్ర గర్భం -శ్రామికుడి నోటి పాట

ఈ పాటను నేను చాలాసార్లు విన్నాను. పాడటంలో అనుభవం ఉన్నవారి నోట విని తన్మయం చెందాను. వారిలో చాలా మంది చూసి పాడేవాళ్లు. చూడకుండా పాడితే తప్పులు పాడేవాళ్లు. కొంతమంది పాడుతూ ఉండగానే శృతి తప్పేవాళ్లు. మళ్ళీ అందుకోడానికి యాతన పడేవాళ్లు. కానీ మొదటి సారి ఈ పాటని ఒక శ్రమ జీవి నోటి నుండి వింటున్నాను. పాటలోని పదజాలం పుస్తకాల్లో మాత్రమే దొరికేది. జానపదం లాగా పల్లె పదాలు కావవి. సంస్కృత పదాలు కలిసి ఉన్న…

అమెరికా: సిక్కు డాక్టర్ పై దాడి

అమెరికాలో సిక్కు మతస్ధుల పట్ల అపోహలు కొనసాగుతున్నాయి. సిక్కుల తలపాగాను బిన్ లాడెన్ తలపాగాతో పోల్చుకుంటూ మొత్తం సిక్కులను టెర్రరిస్టులుగా భ్రమించే ధోరణి కొనసాగుతోంది. న్యూయార్క్ నగరంలో డాక్టర్ మరియు ప్రొఫెసర్ కూడా అయిన ఒక సిక్కు యువకుడిపై జరిగిన అమానుష దాడి ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తోంది. అంతర్జాతీయ మరియు ప్రజా సంబంధాల విద్యా సంస్ధ (School of International and Public Affairs) లో ప్రొఫెసర్ గా పని చేస్తున్న ప్రభుజోత్ సింగ్…

తీవ్రమైన ది హిందు, డిజిపిల వివాదం

పాత బస్తీలోని ఒక బాబాను రాష్ట్ర అత్యున్నత పోలీసు అధికారి దినేష్ రెడ్డి సందర్శించడం గురించి రాసిన వార్తపై రేగిన రగడ తీవ్రరూపం దాల్చుతోంది. పాతబస్తీలో నివసించే ముస్లిం మత బాబా హబీబ్ ముస్తఫా ఇద్రాస్ బాబాను డిజిపి దినేష్ రెడ్డి సందర్శించడం గురించి ది హిందు పత్రిక వార్త ప్రచురించగా ఈ వార్తను దురుద్దేశంతో ప్రచురించారని డిజిపి ఆరోపిస్తున్నారు. ఇతర పత్రికలన్నీ ఈ వార్తకు పెద్ద ప్రాముఖ్యత ఇవ్వకుండా లోపలి పేజీల్లో వేయగా ది హిందు…

రేపిస్టు అ(వ)సరం కోసం బాలికకు జబ్బు అంటగట్టిన జేఠ్మలాని

భారత దేశ న్యాయ వ్యవస్ధ ఎంత గబ్బు పట్టిందో రాం జెఠ్మలానీ రుజువు చేశాడు. దేశంలోనే అతి భారీ క్రిమినల్ లాయర్ గా పేరు మోసిన ఈ పెద్ద మనిషి తన రేపిస్టు క్లయింటు కోసం ఒక నిస్సహాయ పేద బాలికకు బహుశా వైద్య శాస్త్రానికి కూడా తెలియని జబ్బు అంటగట్టాడు. ఈ పేరు మోసిన క్రిమినల్ లాయర్ క్రిమినల్ డాక్టర్ గా కూడా అవతరించి అమ్మాయిల్ని ఒంటరిగా ఉండే ముసలి ముదురు పీనుగలవైపుకి ఆకర్షించే సరికొత్త…

వాషింగ్టన్ లో విచ్చలవిడి షూటింగ్, 7గురు ఆహుతి

అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. మిలట్రీ తరహా డ్రస్సులో ఉన్న ముగ్గురు వ్యక్తులు వాషింగ్టన్ డి.సిలోని నావల్ డాక్ యార్డ్ లో యధేచ్ఛగా షూటింగుకు పాల్పడ్డారని పత్రికలు తెలిపాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు పౌరులు మరణించగా కాల్పులకు దిగినవారిలో ఒకరిని పోలీసులు కాల్చి చంపారని తెలుస్తోంది. కనీసం మరో ఇద్దరు షూటర్లు ఉన్నారనీ, వారికోసం వెతుకుతున్నామని పోలీసులు చెబుతున్నారు. వెతుకుతున్నవారిలో ఒకరు తెల్లజాతి వ్యక్తి కాగా మరొకరు నల్లజాతి వ్యక్తి అని వారు తెలిపారు. కాల్పులకు…

ఐనా… … మనిషి మారలేదు -ఫోటోలు

గత మే నెలలో మూడు దేశాల ఆస్ట్రోనాట్ సిబ్బంది సాగించిన 36వ అంతర్జాతీయ విశ్వ ప్రయాణం 166 రోజుల పాటు సాగింది. అమెరికా, రష్యా, ఇటలీలకు చెందిన సిబ్బంది విజయవంతంగా ముగించిన ఈ ప్రయాణానికి ఇంకా జపాన్, కజకిస్ధాన్ లాంటి దేశాలు కూడా సహకరించడం విశేషం. ఇండియాలో కుంకుమ బొట్లతో రాకెట్ ప్రయోగం ప్రారంభం అయితే అమెరికాలో క్రైస్తవ ప్రార్ధనలతో ప్రారంభం అవుతుందని ఈ ఫోటోలు తెలియజేస్తున్నాయి. అభివృద్ధి, మూఢత్వం పెనవేసుకుపోయిన విచిత్రం ఇది. 166 రోజుల…

సమైక్యగీతిక అనబడు బిస్కెట్టు కవిత

(రచన: అవ్వారి నాగరాజు) ఈ రోజు ముఖంలో ముఖం పెట్టి అంటోంది ప్రేమించవేం ప్రియా ? “సమైక్యం” గా ఉందామని ఫ్రెండ్స్, మనకిక పాట కావాలి ఒక ధూమ్ ధాం లాగా ఒక గద్దర్ గోరటోని లాగా అన్నీ కుదిరాయి కానీ అదొక్కటే కదా ఇక- చచ్చుపుచ్చు గెంతులు గావుకేకలూ వయస్సు మళ్ళీ ఎముకలు కుళ్ళీ ఒక్కటీ ఇమడక జవజవలాడక తెర మీద ప్రణయం మాదిరి ఒక చేత యాసిడ్ సీసా మరో చేత వేట కొడవలి…

నిర్భయ: నిందితులందరికీ ఉరి

నిర్భయ హంతకులు నలుగురుకి సత్వర న్యాయస్ధానం (fast-track court) ఉరిశిక్ష విధించింది. జరిగిన ఘోరం ఖచ్చితంగా అరుదయిన కేసుల్లోకెల్లా అరుదైనదేనని కనుక నిందితులకు మరణ శిక్షే సరైనదనీ న్యాయస్ధానం తీర్పు చెప్పింది. తీర్పు విన్న వెంటనే నిర్భయ తల్లిదండ్రులు, సోదరులు హర్షాతిరేకాలు ప్రకటించారు. తమ కూతురికి న్యాయం దక్కిందని చెబుతూ, తమ వెన్నంటి నిలిచిన దేశ ప్రజలకు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. తీర్పు ప్రకటించిన తర్వాత నిందితుల్లో ఒకరు ఏడుపు మొదలు పెట్టగా, ఇతరులు తమ పాపాన్ని…

ఓ సమైక్య మొగుడి ఆధిపత్యం చూసి తీరాలి -వీడియో

రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్ధితులకు ఈ వీడియో చక్కగా అద్దం పడుతోంది. సంసారంలో భార్యా, భర్తలు ఇద్దరూ సమానం అయితేనే అది సజావుగా నడుస్తుంది.  కానీ పురుషాధిక్య సమాజంలో స్త్రీ, పురుష సమానత్వం అనేక సందర్భాల్లో డొల్లగా మారిపోయింది. చట్టాలు పురుషాధిక్యతను తిరస్కరిస్తున్నట్లు చెబుతాయి. స్త్రీలపై జరిగే అన్యాయాలను అరికట్టడానికే కంకణం కట్టుకున్నట్లు బల్లలు గుద్దుతాయి. కానీ అమలు విషయంలో అదంతా నాటకం అని తేలిపోతుంది. ఆచరణలోకి వచ్చేసరికి అమలు చేయాల్సింది మళ్ళీ ఆ పురుషులే, లేదా పురుషాధిక్య…

చదువు: కొందరికి లక్షలతో, అనేకులకు వివక్షలతో…

‘అక్షర లక్షాధికారి’ అని శ్రీశ్రీకి పేరు. అక్షరాలను ఒడుపుగా పట్టుకుని, ఛందోబద్ధ పరిష్వంగాలను వదులించుకుని, లక్షలాది అక్షరాలతో యధేచ్చ ఉరికిపడే జలపాతంలా కవితా ఝరులను సృష్టించినందుకు ఆయనకు ఆ పేరు దక్కింది. ఇప్పుడు అక్షరాలతో లక్షాధికారులు అవుతున్నవారు ఎంతమందో కానీ, లక్షల రూపాయలకు అక్షరాలను అమ్ముకుంటున్నవారికి కొదవలేదు. తమ విద్యార్ధులకు ఇప్పటికీ ప్రభుత్వ బడుల్లోనే విద్యా బుద్ధులు నేర్పిస్తున్న పశ్చిమ దేశాలు మూడో ప్రపంచ దేశాల్లో మాత్రం విద్యను అమ్మి తీరాలని శాసించాయి. డంకేల్ ఒప్పందం ద్వారా,…

ఒడిషా: నీళ్ళు పట్టుకుందని దళిత మహిళను చావబాదారు

అంటరానితనం భారత దేశంలో లేనే లేదని చెప్పుకోవడానికి కొంతమందికి చాలా యిష్టం. లేదా భారత దేశంలో అంటరానితనం ఇంకా కొనసాగుతున్నదన్న నిజాన్ని ఒప్పుకోడానికి వారికి మా చెడ్డ చిన్నతనం. ఇతర మతాల లోపాలతో పోల్చుతూ హిందూమతం గొప్పతనం గురించి ఊదరగొట్టుకోవాలంటే దళితులపై సాగుతున్న అమానవీయ వివక్ష

స్టిల్ ఫోటోలో కదలిక, వేగం చూప(డ)గలమా? -ఫోటోలు

ఒక కదలికను గానీ, ఆ కదలికలోని వేగాన్నిగానీ పసిగట్టాలంటే కదిలే చిత్రాల -అనగా వీడియో- వల్లనే సాధ్యం అవుతుంది. ఒక స్టిల్ ఫోటోలో అందులోని పాత్రల కదలికను, వేగాన్నీ చూపించాడంటే ఆ ఫోటోగ్రాఫర్ కి బహుశా ఎంతో ప్రతిభ అవసరం అనుకుంటాను. ఫోటోలోని పాత్రలు కదలకుండా ఉన్నప్పటికీ అవి కదులుతున్నట్లుగా, పైగా వేగంగా కదులుతున్నట్లుగా చూపాలంటే కొన్ని మెళకువలు, మరి కొంత టెక్నాలజీ సహాయం తప్పనిసరి అవసరం కావచ్చు.